Monday, January 3, 2011

అప్పన్నను దర్శించుకున్న యువనేత

యువనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సోమవారం సాయంత్రం సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. ఆలయ ధ్వజస్తంభం వద్ద ఈవో ప్రేమ్‌కుమార్, అర్చకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామి కప్పస్థంభాన్ని ఆలింగనం చేసుకుని బేడా చుట్టూ ప్రదక్షిణం చేశారు. స్వామి అంతరాలయంలో అర్చకులు జగన్ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చనలు జరిపారు. నాలుగు వేదాలతో అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం దుశ్శాలువతో సన్మానించారు.

ఈవో.. అప్పన్న ప్రసాదం, చిత్రపటాన్ని దేవస్థానం తరపున యువనేతకు అందజేశారు. జగన్ వెంట ఎంపీ సబ్బంహరి, మాజీ ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, పాయకరావుపేట ఎమ్మెల్యే జి.బాబూరావు, ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి, టెక్నాలజీ సంస్థల మాజీ చైర్మన్ కొయ్య ప్రసాదరెడ్డి, పీలా ఉమారాణి, కార్పొరేటర్ రవిరాజు తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment