Wednesday, December 29, 2010

రైతుల మేలు కోసమే ఢిల్లీకి.. * యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

* బృందంగా వెళ్లి శరద్‌పవార్‌ను కలుస్తాం* రైతులకు మంచి ప్యాకేజీ అందించాలని కోరతాం*కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు నావంతు ప్రయత్నిస్తా

కష్టాల్లో ఉన్న రైతులకు మెరుగైన ప్యాకేజీ దక్కేవిధంగా ప్రయత్నించేందుకు ఢిల్లీ వచ్చినట్లు యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర రైతాంగ సమస్యలపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్‌పవార్‌ను కలిసి పరిస్థితి వివరించేందుకు ఆయన బుధవారం రాత్రి ఢిల్లీ చేరుకొన్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతాంగ సమస్యలను కేంద్రానికి నివేదించేందుకు ఢిల్లీ వచ్చానని చెప్పారు. అకాలవర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకొనేందుకు, కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు తనవంతు ప్రయత్నిస్తానని తెలిపారు. తన ఢిల్లీ పర్యటనలో రాజకీయాలకు తావులేదన్నారు.

రైతాంగ సమస్యలను నివేదించేందుకు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, కేంద్రమంత్రులు శరద్‌పవార్, దయానిధి మారన్‌ల అపాయింట్‌మెంట్ కోరగా.. పవార్ మాత్రమే అపాయింట్‌మెంట్ కేటాయించారని తెలిపారు. ఈ నేపథ్యంలో రైతు ప్రతినిధులు, వ్యవసాయ నిపుణులు, చేనేత కార్మికుల ప్రతినిధులు, ఇద్దరు ఎమ్మెల్యేలతోపాటు ఎంపీలు సబ్బం హరి, మేకపాటి రాజమోహన్‌రెడ్డిలతో కలిసి బృందంగా వెళ్లి శరద్‌పవార్‌ను కలవనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయనకు వినతిపత్రం సమర్పించి, రైతాంగానికి అధికసాయం అందేవిధంగా ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేయాలని కోరనున్నట్లు తెలిపారు. రైతాంగ సమస్యలపై ఇప్పటికే దీక్ష నిర్వహించారు కదా, తదుపరిస్థాయి ఒత్తిడి చర్యల్లో భాగంగా ఢిల్లీ వచ్చారా అనే ప్రశ్నకు ఆయన బదులిస్తూ... రైతులు చాలా కష్టాల్లో ఉన్నారని, వారికి ఊరట కలిగించేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని, అందుకే ఢిల్లీ వచ్చినట్లు సమాధానమిచ్చారు.

ఇప్పుడు రాజకీయాలు వద్దు...
త్వరలో ప్రకటించనున్న రాజకీయ పార్టీ పనుల్లో భాగంగా ఢిల్లీ వచ్చారా అని విలేకరులు ప్రశ్నించగా.. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, దెబ్బమీద దెబ్బపడి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని జగన్ గుర్తుచేశారు. వరదలు, తుపానులు, అకాలవర్షాలు, జల్, లైలా తుపానులు వారిని కోలుకోనివిధంగా దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రైతాంగానికి మెరుగైన ప్యాకేజీ సాధనలో భాగంగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మంచి ప్యాకేజీని అందించి రైతులను ఆదుకోవాలని కోరనున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాజకీయాలు మాట్లాడి సమస్య ప్రాధాన్యాన్ని తగ్గించుకోదలచుకోలేదని స్పష్టం చేశారు.

శ్రీకృష్ణ కమిటీ నివేదిక రానున్న నేపథ్యంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏ విధంగా స్పందిస్తారనే ప్రశ్నలపై స్పందిస్తూ... ఎవరేమన్నారో తనకు తెలియదన్నారు. రాజకీయాలపై దృష్టి మళ్లించి రైతుల సమస్య ప్రాధాన్యాన్ని తగ్గించవద్దని విజ్ఞప్తి చేశారు. రైతుల సమస్యనుంచి దృష్టి మరల్చకుండా ఉంటే బాగుంటుందని హితవు పలికారు. రైతులకు మేలు చేసేందుకు కృషి చేస్తే బాగుంటుందని.. అంతకుమించి తాను మాట్లాడబోనని చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికలో ఏముందో తనకు తెలియదని, అన్నీ మీరే చెప్తే ఎలా అని ప్రశ్నించారు. జగన్‌తోపాటు ఢిల్లీ వచ్చిన బృందంలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, రైతు సంఘాల ప్రతినిధులు నరసింహారెడ్డి, నరసింహనాయుడు ఉన్నారు.

యువనేతకు వెల్లువలా మద్దతు

జగన్‌ను కలిసిన లక్ష్మీపార్వతి, ఎమ్మెల్యేలు
క్యాంపు కార్యాలయానికి పోటెత్తిన నేతలు, అభిమానులు


 యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేయబోయే కొత్తపార్టీకి అన్ని వర్గాల నుంచీ రోజురోజుకూ మద్దతు వెల్లువలా పెరుగుతోంది. జగన్‌కు మద్దతు తెలిపేందుకు మంగళవారం ఎమ్మెల్యేలు, పలు పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు విద్యార్థులు, టీచర్లు, పారిశ్రామికవేత్తలు, ఎన్నారైలు కూడా భారీగా తరలివచ్చారు. ‘జై జగన్..!’ ‘జై జై జగన్...!’ ‘జగన్ నాయకత్వం వర్ధిలాలి’ అనే నినాదాలతో సాగర్ సొసైటీలోని యువనేత క్యాంపు కార్యాలయం మారుమోగిపోయింది! కొత్త ఏడాది సందర్భంగా పలువురు అభిమానులు రూపొందించిన క్యాలెండర్లు, సీడీల విడుదలతో జగన్ బిజీగా గడిపారు.

ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి, భద్రాచలం ఎమ్మెల్యే కుంజా సత్యవతి, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు మంగళవారం యువనేత జగన్‌మోహన్‌రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిశారు. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్‌రెడ్డి, కొల్లాపూర్ సింగిల్ విండో చైర్మన్ రాంభూపాల్ రెడ్డి, ఉండి నియోజకవర్గం బీజేపీ నేత కట్రెడ్డి సత్యనారాయణ మంగళవారం సాయంత్రం భారీ సంఖ్యలో తమ అనుచరులతో వచ్చి జగన్‌కు మద్దతు ప్రకటించారు.


మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, అనంతపురం డీసీసీ ఉపాధ్యక్షుడు జిన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు మల్లేపల్లి శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కె.అనంతరెడ్డి, డీసీసీబీ డెరైక్టర్ రవీందర్ రెడ్డి, టెక్కలి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ప్రధాన్ రాజేంద్రప్రసాద్, టీడీపీ నేత, టెక్కలి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ అన్నవరపు సూరిబాబు, మహబూబ్‌నగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వంగూరు బాలమణెమ్మ, భీమవరం ఎస్‌టీఎఫ్ అధ్యక్షుడు ఎం.వి.రామకృష్ణంరాజు, మన్ననూరు సింగిల్ విండో చైర్మన్ సుధాకర్ రెడ్డి, వంగూరు సింగిల్ విండో అధ్యక్షుడు ఎ.నరేందర్ రెడ్డి, ఇండియన్ దళిత క్రిస్టియన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షుడు పెరికె వరప్రసాద్, యునెటైడ్ ఫ్రంట్ ఫర్ దళిత క్రిస్టియన్ అధ్యక్షుడు ఎం.సాల్మన్ రాజు తదితరులు జగన్‌ను కలిసి మద్దతు తెలిపిన వారిలో ఉన్నారు.

స్టార్ సర్టిఫికెట్ ప్రదానం: అంతర్జాతీయ స్థాయి ప్రముఖుల మరణానంతరం వారి పేరిట షికాగోలోని ఇంటర్నేషనల్ స్టార్ రిజిస్టర్ ఆర్గనైజేషన్ స్టార్‌ను నమోదు చేస్తోందని ఎన్నారై వైఎస్‌ఆర్ యువసేన అధ్యక్షుడు ఎన్.మారుతి శర్మ (న్యూయార్క్) తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం కూడా ఆయన స్టార్‌ను రిజిస్టర్ చేశామన్నారు. ఈ మేరకు సంస్థ విడుదల చేసిన స్టార్ రిజిస్టర్ సర్టిఫికెట్‌ను జగన్‌కు అందజేసినట్టు తెలిపారు. వేంపల్లి నిరంజన్‌రెడ్డి రూపొందించిన 2011 డైరీని జగన్ ఆవిష్కరించారు. ‘రాజన్నె జగనన్నై ఇస్తున్న ఓదార్పు’ పేరిట కాంగ్రెస్ నేత పుత్తా ప్రతాప్‌రెడ్డి రూపొందించిన పాటల సీడీని జగన్ విడుదల చేశారు. కామెర్ల వ్యాధికి మెడిసిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పులివెందుల నియోజకవర్గం లింగాల వాసి ఎ.వెంకటరామిరెడ్డిని జగన్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

Tuesday, December 28, 2010

యువనేత వెంటే...

భారీ సంఖ్యలో నాయకులు, సర్పంచుల మద్దతు
యువనేతను కలిసిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు.. కొత్త పార్టీపై చర్చ



యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేయబోయే కొత్త పార్టీకి రోజురోజుకీ మద్దతు పెరిగిపోతోంది. జగన్‌కు మద్దతు తెలిపే నాయకులు, ప్రజలతో సాగర్ సొసైటీలోని ఆయన క్యాంపు కార్యాలయం కిటకిటలాడుతోంది. సోమవారం మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్, కరీంనగర్, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నేతలు, సర్పంచ్‌లు వచ్చి యువనేతను కలిశారు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం నుంచి సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చక్కటి వెంకటేష్‌యాదవ్ ఆధ్వర్యంలో పలువురు సర్పంచులు జగన్‌కు మద్దతు తెలిపారు. వీరిలో సర్పంచులు ఎదిరే కళమ్మ, చంద్రకళ, రాములుగౌడ్, రాయిదేవ్ ఆశన్న, దేవి ప్రియానాయక్, మాజీ సర్పంచులు రాఘవేంద్రరావు, శేఖర్‌పంతులు, కాంగ్రెస్ నేతలు వై.శ్రీనివాస్‌యాదవ్ తదితరులు ఉన్నారు. జిల్లాలో జగన్ నాయకత్వాన్ని కోరుతూ 130 మంది సర్పంచులు మద్దతు ప్రకటించారని వెంకటేష్ యాదవ్ విలేకరులకు తెలిపారు. మహానేత వైఎస్సార్ పథకాలు కొనసాగాలన్న ఉద్దేశంతోనే తామంతా యువనేతకు మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు.

ప్రజలు జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, ఇదెవ్వరూ కాదనలేని సత్యమన్నారు. ప్రజల నిర్ణయం మేరకు త్వరలోనే షాద్‌నగర్ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి కూడా యువనేత వెంటే నడుస్తారన్న ఆశాభావాన్ని నియోజకవర్గ సర్పంచ్‌లు వ్యక్తం చేశారు. వీరితోపాటు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు కె.అమృతా సాగర్, మిడకాన్‌పేట్ మాజీ సర్పంచ్ ఎల్లారెడ్డి, రంగారెడ్డి డీసీసీ ప్రధాన కార్యదర్శి మహేందర్‌రెడ్డి, ముచ్చెర్ల మాజీ సర్పంచ్ గోపాల్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు జగన్‌కు తమ సంఘీభావాన్ని తెలిపారు. కరీంనగర్ జిల్లా మెట్‌పల్లి నియోజకవర్గానికి చెందిన నందల్లి ప్రకాష్ (డీసీసీ ఉపాధ్యక్షుడు), జిల్లా దళిత దండు అధ్యక్షుడు కండె సమ్మయ్య, జడ్పీటీసీ ఆకుల లింగారెడ్డి, ఎంపీపీ పాలెపు నీల, ఎంపీటీసీలు లక్ష్మీ రాజమల్లయ్య, గోపు రాజలింగం, సుంకేటి ఆనంద్, సర్పంచ్‌లు చిన్న రాజా గౌడ్ , పాలెం రాజన్న, గంగాధర్ గౌడ్, శంకర్‌నాయక్, కొమ్ముల రాజేశ్వర్‌రెడ్డి, మెట్‌పల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల హనుమాండ్లు యాదవ్, మాజీ వైస్ చైర్మన్ యామ రాజయ్య, మార్కెటింగ్ కమిటీ డెరైక్టర్లు నూతుల రాజిరెడ్డి, సుంకటి సంజీవరెడ్డి, సీడీసీ చైర్మన్ లింగారెడ్డి యువనేతను కలుసుకుని, కొత్తపార్టీలో చేరుతామని తెలిపారు. శాప్ మాజీ చైర్మన్ రాజ్‌సింగ్ ఠాకూర్ ఆధ్వర్యంలో వీరంతా యువనేత వైఎస్ జగన్‌ను కలిశారు.

ప్రముఖులతో భేటీ: టీడీపీ ఎమ్మెల్యేలు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, వై.బాలనాగిరెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, సి.ఆదినారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఎమ్మెల్సీ వాసిరెడ్డి వరదారామారావు, మాజీ మంత్రులు పెనుమత్స సాంబశివరాజు, ఐ.రామకృష్ణం రాజు, మాజీ ఎమ్మెల్యేలు జొన్నా సూర్యనారాయణ, ఎన్.వరదరాజులురెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డి, ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశరావుతో జగన్ తన కార్యాలయంలో సమావేశమై కొత్త పార్టీపై చర్చించారు. పీసీసీ ఎస్టీసెల్ చైర్మన్ ఆంగోతు నాగూనాయక్, పీసీసీ కార్యదర్శి పోచిమిరెడ్డి మురళీధర్‌రెడ్డి, పీసీసీ ప్రచార కమిటీ సభ్యులు పుల్లారెడ్డి, కడప డీసీసీ మాజీ అధ్యక్షుడు సురేష్‌బాబు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ కార్యదర్శులు ఎన్.రవికుమార్, ఉడుముల కోటిరెడ్డి, కాంగ్రెస్ నేతలు శిల్పా చక్రపాణిరెడ్డి, కొండా రాఘవరెడ్డి, వర్దిరెడ్డి చలమారెడ్డి, సినీ నటుడు విజయచందర్‌లు యువనేతను కలుసుకున్నారు. వీరితో పాటు జగన్‌ను కలిసిన వారిలో హైదరాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బండారు మోహన్‌రెడ్డి, మల్కాజిగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ సూర్యనారాయణరెడ్డి, కంటోన్మెంట్ వైస్ చైర్మన్ జంపన ప్రతాప్, సీనియర్ కాంగ్రెస్ నేత దేవుడు, నల్లగొండ జిల్లా సీనియర్ కాంగ్రెస్ నేత గాదె నిరంజన్‌రెడ్డి, నార్కట్‌పల్లి జడ్పీటీసీ సభ్యుడు అలుగుబెల్లి రవీందర్‌రెడ్డి, సూర్యాపేట ప్యాక్స్ చైర్మన్ దామిడి రమేష్‌రెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ నేత పిట్టా రామిరెడ్డి, డీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు జిన్నా శ్రీనివాసరెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి కందారం రాజుమోహన్, వైఎస్సార్ ఆశయ సాధన సమితి అధ్యక్షుడు చేవూరు శ్రీధర్‌రెడ్డి , విజయనగరం వ్యవసాయ మార్కెటింగ్ మాజీ చైర్మన్ కాకర్లపూడి శ్రీనివాసరాజు, దంతులూరి సూర్యనారాయణరాజు, మున్సిపల్ మాజీ చైర్మన్‌లు ఎ.సూరిబాబు, మట్టా రమణారెడ్డి, సాలూరు మున్సిపల్ మాజీ చైర్మన్ గొర్లె మధుసూదనరావు, నెల్లిమర్ల జడ్పీటీసీ సభ్యుడు డి.ఎస్.ఆర్.ఆర్.రాజు, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ బట్టి జగపతి, కాంగ్రెస్ నేతలు మహ్మద్ షాకీర్, కడారి బాలకృష్ణారెడ్డి, సంగారెడ్డి సీడీసీ చైర్మన్ ప్రభుగౌడ్, న్యాయవాది పటోళ్ల శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు.


అవసరమైతే పదవులకు రాజీనామా:
ఎమ్మెల్సీ రామారావు


జగన్‌కు మద్దతుగా తమ పదవులకు రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని విజయనగరం ఎమ్మెల్సీ వాసిరెడ్డి వరద రామారావు స్పష్టం చేశారు. సోమవారం ఆయన జగన్ నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ జగన్ పార్టీ స్థాపించిన తర్వాత తాను రాజీనామా చేస్తానన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పట్ల ఉన్న అభిమానంతో తామంతా జగన్ వెంటే ఉంటామని చెప్పారు.


క్యాలెండర్ ఆవిష్కరణ: వైఎస్ చిత్రాలతో రూపొందిం చిన 2011 క్యాలెండర్లను జగన్ ఆవిష్కరించారు. బంజారాహిల్స్ సాగర్‌సొసైటీలోని క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. జగన్ సేవాదళ్, బీఎస్‌వీఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ సంస్థ తరపున బండి శ్రీనివాసరెడ్డి, బండి రాఘవేంద్రరెడ్డిలు వీటిని రూపొందించారు.

Monday, December 27, 2010

జగన్‌కు చెక్‌ ...... రాహుల్‌ వ్యూహం

jagansir
రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి మూలస్తంభాల్లాంటి యువ జన కాంగ్రెస్‌, ద్వితీయ శ్రేణికి చెందిన యువ నేతలను తన వైపు మళ్లించుకుని కాంగ్రెస్‌ పార్టీని చావుదెబ్బ తీసేందుకు జగన్‌ వేస్తున్న ఎత్తులను చిత్తు చేసేందుకు త్వరలో యువరాజు రాహుల్‌గాంధీ రాష్ట్రంపై దృష్టి సారిం చనున్నారు. ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చేందుకు ద్వితీయ శ్రేణి నేతలను తన వైపు మళ్లించుకోవడం ద్వారా.. ఎమ్మె ల్యేలు, ఎంపీలు, జడ్పీ ఛైర్మన్లను అనివార్య పరిస్థితిలో తన పార్టీలో చేరేలా జగన్‌ పన్నిన వ్యూహరచన విజయవంతం అవుతున్న నేపథ్యంలో, రాహుల్‌ రాష్ట్రంలో అడుగుపెడు తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. రాహుల్‌ జనవరి నుంచి రాష్ట్రంలో విస్తృత పర్యటనలు చేయనున్నా రు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారం పేరుతో ఆయన ఇక్కడకు రానున్నారు.

కాంగ్రెస్‌లో నెలకొన్న అనిశ్చిత రాజకీయ వాతావరణం తో దిక్కుతోచని యువ నేతలను జగన్‌ తాను ఏర్పాటు చేసిన ప్రత్యేక నెట్‌వర్క్‌ ద్వారా ఆకర్షిస్తున్నారు. మండల, నియోజకవర్గ స్థాయిలో ఉన్న యువ నేతలు, ద్వితీయ శ్రేణి నేతలను జగన్‌ వర్గీయులు వ్యక్తిగతంగా వెళ్లి వారిని బుట్టలో వేసుకుంటున్నారు. కాంగ్రెస్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, మునిసిపల్‌ ఛైర్మన్లు ఉన్నంతవరకూ మీకు భవితవ్యం ఉండదని జగన్‌ వర్గీయులు స్పష్టం చేస్తున్నారు.


అదే తమ పార్టీలో చేరితే మీ లక్ష్యం నెరవేరుతుందని, ఎన్నికల్లో పోటీకి ఆర్థికంగా కూడా ఆదుకుని, మిమ్మల్ని గెలిపించుకుంటామని భరోసా ఇస్తుండటంతో ద్వితీయ శ్రేణి నేతలు జగన్‌ వైపు వచ్చేందుకు పోటీ పడుతున్నారు. దానితోపాటు వారంతా తమ ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, మునిసిపల్‌ చైర్మన్ల వద్దకు వెళ్లి జగన్‌ వైపు వెళదామని ఒత్తిళ్లు చేస్తున్నారు. దీనితో తమ కేడర్‌ అంతా జగన్‌ వైపు వెళితే తాము ఒక్కరే కాంగ్రెస్‌లో ఉండి ఏం ప్రయోజనమన్న ఆలోచన మొదల యింది. ఈ రకంగా ప్రజాప్రతినిధులపై జగన్‌ వర్గం చేస్తున్న ఒత్తిళ్లు బాగా ప్రభావితం చేస్తున్నాయి.

rahulఈ వాతావరణం పార్టీని క్షేత్రస్థాయిలో దెబ్బతీస్తుందని గ్రహించిన సీనియర్లు ఇటీవలే రాహుల్‌గాంధీని కలిసి, రాష్ట్రంలో యువ నేతలు, ద్వితీయ స్థాయి నేతలను కాపాడుకోవాలంటే మీరు రాష్ట్రంపై దృష్టి సారించవలసిన అవసరం ఉందని స్పష్టం చేశారు. సీనియర్‌ నేత వి.హన్మంతరావు ఈ విషయంలో రాహుల్‌ రాష్ట్రానికి రావలసిన అవసరాన్ని నొక్కిచెప్పారు. ఎన్నికల సమయంలో కీలకపాత్ర పోషించడంతో పాటు, ప్రభుత్వ కార్యక్రమాలను, బహిరంగసభల విజయవంతంలో కీలకపాత్ర పోషించే యువ నేతల స్పీడుకు బ్రేకులు వేసి, వారిని పార్టీ సేవలకు వినియోగించుకోవాలని విహీచ్‌ స్పష్టం చేశారు.

దీనికి అంగీకరించిన రాహుల్‌ జనవరి నుంచి తాను రాష్ట్రంపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తానని చెప్పినట్లు తెలిసింది. ముందు.. రాష్ట్ర స్థాయిలో యువజన కాంగ్రెస్‌, ద్వితీయ శ్రేణి నేతలతో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రాంతాల వారీగా భేటీలు నిర్వహించి వారితో మమేకం కావాలని నిర్ణయించారు. తనపై ఉన్న యూత్‌ ఇమేజ్‌ను జగన్‌ వైపు వెళ్లకుండా వినియోగించుకోవాలని ఆయన భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ప్రధానంగా.. కొత్తగా ఎన్నికయిన యువ ఎమ్మెల్యేలను కట్టడి చేయాలన్న ధ్యేయంతో రాహుల్‌ రాష్ట్ర పర్యటనలు చేయనున్నారు.

గతంలో జగన్‌ హడావిడి నేపథ్యంలో.. రాష్ట్రానికి చెందిన కొందరు యువ ఎమ్మెల్యేలను ఢిల్లీకి పిలిపించుకున్న రాహుల్‌, ఈసారి క్షేత్రస్థాయిలో పనిచేసే యువ నేతలతో భేటీ అయ్యేందుకు సిద్ధమవుతుండటం ఆసక్తి కలిగిస్తోంది.తన పర్యటనల కంటే ముందే యువజన కాంగ్రెస్‌ కమిటీలను ప్రకటించాలని రాహుల్‌ భావిస్తున్నారు. జిల్లా స్థాయిలో జగన్‌ వర్గాన్ని ఎదుర్కోవడంతో పాటు, ఆయన వర్గ ప్రభావాన్ని నియంత్రించే స్థాయి ఉన్న వారికి జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ బాధ్యతలు అప్పగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఆ తర్వాత తొలిసారిగా కొన్ని కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులతో పాటు, ప్రతి కార్పొషన్‌కు ఒక డైరక్టర్‌ పదవిని యూత్‌ కాంగ్రెస్‌ నేతకు తప్పనిసరిగా ఇవ్వాలని ప్రభుత్వానికి స్పష్టం చేయనున్నారు. ఆలయ కమిటీ చైర్మన్లు, జిల్లా స్థాయిలో చైర్మన్‌ పదవులను తప్పనిసరిగా యూత్‌కే ఇవ్వాలని రాహుల్‌ ఒక విధాన నిర్ణయాన్ని ప్రవేశపెట్టనున్నారు. తన నిర్ణయాల వల్ల యువ నేతలు జగన్‌ వైపు వెళ్లకుండా పార్టీలోనే కొనసాగుతారన్నది రాహుల్‌ వ్యూహంలా కనిపిస్తోంది.

Thursday, December 23, 2010

కింకర్తవ్యం ? * పగ్గాలివ్వండి.. జగన్‌ను అణిచేస్తా

fast-end
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి ఎసరు తెచ్చేందుకు పరోక్ష ప్రయత్నాలకు తెరలేపిన జగన్‌ను అణచివేసేందుకు వ్యూహరచన చేస్తున్న సమయంలోనే.. తన పార్టీకి చెందిన 30 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు పార్లమెంటు సభ్యులు జగన్‌ విజయవాడలో నిర్వహించిన లక్ష్యదీక్షకు హాజర యిన వైనం అధిష్ఠానాన్ని ఆలోచనలో పడవేసింది.కేవలం ఏడుగురు ఎమ్మెల్యేల మెజారిటీ బలం ఉన్న కిరణ్‌కుమార్‌ ప్రభుత్వానికి ఈ 30 మంది ఎమ్మె ల్యేలు ఏ సందర్భంలోనయినా ఒకవేళ మద్దతు ఉపసంహరించుకున్నట్టయితే ప్రభుత్వం కుప్ప కూలిపోతుందన్న భయాందోళన కాంగ్రెస్‌ నాయక త్వాన్ని పట్టి పీడిస్తోంది. దీనితో జగన్‌కు మద్దతు నిస్తున్న ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసు కోవాలి? తీసుకుంటే తలెత్తనున్న పరిణామాలే మిటి? అన్న అంశాలపై అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది.

ఈ నేపథ్యంలో మరికొద్దిరోజుల్లో ఢిల్లీ నుంచి పార్టీ ప్రతినిధులుగా ఆజాద్‌, మొయిలీ రాష్ట్రానికి రానున్నారు. వారు జగన్‌కు మద్దతు నిచ్చిన ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. వారే కాకుండా, కొత్తగా ఎన్నికయిన ఎమ్మెల్యేలను కూడా పిలిపించి మాట్లాడనున్నారు. రాష్ట్రంలో పార్టీని కాపాడేందుకు రానున్న వారిద్దరూ ఎమ్మెల్యేలను ఎంతవరకూ బుజ్జగిస్తారో చూడాలి. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ గందర గోళ పరిస్థి తుల నేపథ్యంలో 30 మంది ఎమ్మెల్యేలుపార్టీని ధిక్కరించడం సాధారణ విషయమేమీ కాదని కాంగ్రెస్‌ నాయకులు స్పష్టం చేస్తున్నారు.

మంది ఎమ్మెల్యేల సంఖ్య చాలా పెద్దదేనని, ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆ సంఖ్య సరిపోయినా, సరిపోకపోయినా ప్రభుత్వం మాత్రం కచ్చితంగా సంక్షోభంలో పడేంత సంఖ్యేనని సీనియర్లు కూడా అంగీక రిస్తున్నారు. ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్‌ సమావేశాల వరకూ కిరణ్‌ కుమార్‌రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదమేమీ లేక పోయినా, 30 మంది ఎమ్మెల్యేల సంఖ్య పెరిగి పెద్దదయితే సర్కారు కష్టాల్లో పడినట్టే నంటున్నారు. ప్రధాన ప్రతిపక్షమయిన తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టినట్టయితే ఇబ్బందేనని చెబుతున్నారు. కిరణ్‌కుమార్‌ సర్కారు కూలిపోవాలని కోరుకోవడమే కాకుండా, ఎన్నికల కోసం ఎదురుచూస్తున్న జగన్‌ వర్గీయులు అవిశ్వాస తీర్మాన అవకాశాన్ని ఎట్టి పరిస్థితిలోనూ చేజార్చుకోరని విశ్లేషిస్తున్నారు. తాను సర్కారును కూల్చబోనని, తనంతట తాను కూలిపోతే ఏం చేయలేనని మొదటి నుంచీ చెబుతూవస్తోన్న జగన్‌ వ్యూహం కూడా ఇదేనంటున్నారు.

మరోవైపు.. పార్లమెంటు సభ్యులయిన సబ్బం హరి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి తాము జగన్‌ వైపే ఉంటామని విస్పష్టంగా ప్రక టించడం కూడా అధిష్ఠానాన్ని కలవరపరు స్తోంది. ఇద్దరు ఎంపీలు బాహాటంగా బయటకు వస్తే ఆ ప్రభా వం మిగిలిన ఎంపీలపైనా పడుతుందన్న ఆందోళన వ్యక్తమవు తోంది. వారిద్దరిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా తెలియక నాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది. కేంద్రంలోని యూపీఏ సర్కారు కూడా అంతం తమాత్రపు మెజారిటీతోనే కొనసాగుతున్నందున రాష్ట్రానికి చెందిన 33 మంది ఎంపీల్లో కనీసం పదిమంది వెళ్లినా ప్రమాదకరమే నన్నది నాయకత్వం అసలు ఆందోళన. జాతీయ స్థాయిలో కాంగ్రె స్‌ను దెబ్బకొట్టా లన్న లక్ష్యంతో పనిచేస్తున్న జగన్‌, రాష్ట్రానికి చెందిన ఎంపీల పైనా కన్నేసినట్లు తెలియడంతో నాయకత్వం కలవరపడుతోంది.

అందులో భాగంగానే ఆజాద్‌, మొయిలీని రాష్ట్రానికి పంపు తున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పెరుగుతున్న చిక్కుముళ్లను ఏవిధంగా విప్పాలన్న అంశంపై నాయకత్వం తలపట్టుకుంది. ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితిలో మిగిలిన రాష్ట్రాల్లో మాదిరిగా బెదిరింపు మంత్రాలు ఇక్కడ పనిచేయవన్న వాస్తవం స్పష్టమయింది. అందువల్ల సాధ్యమయినంత వరకూ బుజ్జగింపులు, తాయిలాల ఎరలతోనే సమస్యను తీవ్రతరం కాకుండా ఉండేందుకు ప్రయత్నిస్తోంది.
జగన్‌ శిబిరంలోని ప్రజాప్రతినిధులు

1 రామచంద్రారెడ్డి (రాయదుర్గం)
2  శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి)
3  మేకపాటి చంద్రశేఖరరెడ్డి (ఉదయగిరి)
4 బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు)
5 ఆళ్ల నాని (ఏలూరు)
6 అమర్‌నాధ్‌రెడ్డి (రాజం పేట)
7 శేషారెడ్డి (అనపర్తి)
8 కొండా సురేఖ (పరకాల)
9 జయసుధ (సికింద్రాబాద్‌)
10 బాబూరావు (పాయకరావు పేట)
11 గుర్నాధరెడ్డి(అనంతపురం అర్భన్‌)
12 కె.వెంకట్రామిరెడ్డి (ధర్మవరం)
13 ఆదినారాయణరెడ్డి (జమ్ములమడుగు)
14 రాజేష్‌ (చింతలపూడి)
15 బాలరాజు (పోలవరం)
16 ప్రసాదరాజు(నర్సాపురం)
17 అంజిబాబు (భీమవరం)
18 ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి(కాకినాడ)
19 రేగా కాంతారావు (పినపాక)
20 పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ (రామచంద్రాపురం)
21 కుంజా సత్యవతి (భద్రాచలం)
22 లబ్బి వెంకటస్వామి (నందికొట్కూర్‌)
23 బి.శివప్రసాదరెడ్డి (దర్శి)
24 జోగి రమేష్‌ (పెడన)
25 పేర్ని నాని (బందరు)
26 రమణమూర్తి రాజు (యలమంచిలి)
27 కమలమ్మ (బద్వేల్‌)
28 సబ్బం హరి-( ఎంపీ అనకాపల్లి)
29 మేకపాటి రాజమోహన్‌రెడ్డి
  ( నెల్లూరు - ఎంపి)
30 కొండా మురళి ( ఎమ్మెల్సీ)
31 జూపూడి ప్రభాకర్‌రావు (ఎమ్మెల్సీ)
32 పుల్ల పద్మావతి (ఎమ్మెల్సీ)
33 కృష్ణారెడ్డి (ఎమ్మెల్సీ) 
34 కాటసాని రామిరెడ్డి (బనగానపల్లె, పీఆర్పీ)
35 శోభా నాగిరెడ్డి (ఆళ్లగడ్డ, పీఆర్పీ)
36 నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి (టీడీపీ, కొవ్వూరు) 
పగ్గాలివ్వండి.. జగన్‌ను అణిచేస్తా
KVP
రాష్ట్ర కాంగ్రెస్‌లో ఇటీవలి కాలంగా జరుగుతున్న పరిణామా లు, కడప మాజీ ఎంపి జగన్‌ వ్యవహారంతో తలపట్టుకున్న నాయకత్వం ముందు ఎంపి, వైఎస్‌ ఆత్మబంధువయిన డాక్టర్‌ కేవీపీ రామచంద్రరావు ఒక ప్రతిపాదన పెట్టారు. తనకు పగ్గాలు అప్పగిస్తే, రాష్ట్ర పార్టీని గాడిలో పెడతానని, జగన్‌ పీచమణిచేస్తానని భరోసా ఇచ్చారు. అయితే, తనకు సీఎం పదవి ఇవ్వాలనిగానీ, పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని గానీ ఆయన కోరకపోయినప్పటికీ మొత్తంగా రాష్ట్ర పార్టీ పగ్గాలు తనకు అప్పగించాలని మాత్రం కోరినట్లు తెలిసింది.

పార్టీ అధి నేత్రి సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్‌పటేల్‌తో కొద్దిరోజుల క్రితం జరిగిన భేటీలో కేవీపీ ఈ ప్రతిపాదన తెచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. గతంలో తనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరిన కేవీపీ, ఆ విషయం బయటకు పొక్కడంతో తాను ఆ పదవిని కోరలేదంటూ ఖండించిన విషయం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తనకు పగ్గాలు ఇవ్వాలని అధిష్ఠానాన్ని అభ్యర్థించడం చర్చనీయాంశంగా మారింది.

పార్టీలో ఉన్నంత కాలం జగన్‌కు మద్దతుగా, పార్టీ నుంచి బయటికి వెళ్ళిన తరువాత కూడా జగన్‌ నిర్వహించే కార్య్ర మాల్లో పాల్గొంటూ పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ నేతలే ఇష్టానుసారం మాట్లాడటం, విమర్శలు చేయడం, దాంతో పార్టీని కాపాడుకునేందుకు సొంత పార్టీ నేతలే వారిపై మాటల దాడులు కొనసాగించడం, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు వంటివి మితిమీరడంతో కాంగ్రెస్‌ ప్రతిష్ట మంటగలుస్తున్నదని పటేల్‌ ఎదుట కేవీపీతో పాటు మరో ఇద్దరు ఎంపీలు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతకుముందు.. కేవీపీతో పాటు మరి కొందరు ఎంపీలు, పార్టీ సీనియర్‌ నేతలు వేర్వే రుగా వివిధ సందర్భాల్లో పార్టీ అధినేత్రి సోనియాగాంధీని, ఆమె రాజకీయ కార్యదర్శి అహ్మద్‌ పటేల్‌, కోర్‌ కమిటీ సభ్యులు కేంద్ర మంత్రులు ప్రణబ్‌ ముఖర్జీ, ఎ.కె.ఆంటోని, మరో సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్‌లను కలిసినప్పుడు రాష్ట్ర కాంగ్రెస్‌లో పరిణామాలు, నేతల తీరుపై తమ ఆందోళన వ్యక్తం చేసినట్లు ఏఐసీసీ వర్గాల సమాచారం.

అదే సమయంలో వీరందరు పార్టీలో నేతల మధ్య జరుగుతున్న అంతర్గత ఘర్షణ, ప్రకటనలు, సొంత నిర్ణయా లను పార్టీ నాయకత్వం మౌనంగా చూస్తూ ఉంటే పార్టీ మరిం త నష్టపోతుందని స్పష్టం చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటే ఆ తరువాత నేతలు వారంతట వారే దారికి వస్తార ని, దీంతో పార్టీ నాయకులు క్రమశిక్షణ ఉల్లంఘించడానికి, జగన్‌ వైపు అడుగులు వేసేందుకు భయపడే పరిస్థితి వస్తుం దని వారు విజ్ఞప్తి చేసినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.

మీరు మౌనంగా వ్యవహరిస్తున్నందు వల్ల పార్టీ నేతలు ఎవరికి తోచి న విధంగా వారు మాట్లాడుతూ పార్టీ రోజుకో కొత్త సమ స్యలు తెచ్చిపెడతారని, వీరి చర్యల వల్ల పార్టీ బలహీన పడి వచ్చే ఎన్నికల నాటికి జనానికి దూరమయ్యే ప్రమాదం ఉందని వారు అధిష్టానం వద్ద పార్టీ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన ట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. రాష్ట్ర కాంగ్రెస్‌లో తొలుత అంతర్గత విమర్శలను ఆపండి, దాని కోసం కఠినంగా వ్యవ హరిస్తే నేతలు గీత దాటే పరిస్థితి ఉండదు, ఆ తరువాత వారంతట వారే మన దారికి వస్తారు అని కేవిపి, ఆయన సన్నిహిత నేతలు పటేల్‌కు విన్నవించినట్లు తెలిసింది.

మీరే ఆ బాధ్యతలు తీసుకోండి, లేదంటే మా పై నమ్మకం ఉంటే ఆ నాకు అప్పగించండి, పార్టీపై జగన్‌ ప్రభావం పడకుండా చూసుకుంటా, వైఎస్‌ తరహాలో పార్టీని పటిష్టం చేసి, వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అధికారంలో వచ్చేలా అంతా సెట్‌రైట్‌ చేస్తానని కేవిపి ఆ సందర్భంగా పటేల్‌కు భరోసా ఇచ్చినట్లు సమాచారం.జగన్‌ ఆర్ధిక మూలాలన్నీ తనకు తెలుసునని, అతడిని ఏ విధంగా దారికి తీసుకురావాలో తనకు స్పష్టంగా తెలుసునన్న కేవీపీ ఆ వివరాలను పటేల్‌కు చెప్పిన ట్లు తెలిసింది. తనకు పూర్తి అధికారాలిచ్చి, పగ్గాలు ఇస్తే జగన్‌ను పూర్తి స్థాయిలో అణచివేస్తానని కూడా కేవీపీ భరోసా ఇచ్చారు. జగన్‌ వెంట ఉన్న ప్రధాన అనుచరులంతా ఇప్పటికీ తాను చెప్పినట్టు వింటారని, తనకు బాధ్యతలిస్తే వారందరినీ మళ్లీ పార్టీలోకి తెస్తానని హామీ కూడా ఇచ్చారు.

ఇప్పటికీ తన మనుషులు జగన్‌ వెంట ఉన్నారని, అక్కడ ఏం జరుగుతుందో తనకు తెలుసనంటూ వారి పేర్లను కూడా పటేల్‌కు వివరించినట్లు సమాచారం. అదే సమయంలో కడపలో జగన్‌ ను జీరో చేస్తా నని, రానున్న ఉప ఎన్నికల్లో కడప ఎంపీ, పులి వెందుల అసెం బ్లీ సీట్లలో కాంగ్రెస్‌ను గెలిపిస్తానని చెప్పారు. వైఎస్‌ ఉన్న ప్పుడు జరిగిన టికెట్ల పంపిణీలో తానే కీలకపాత్ర పోషించి నందున, రాష్ట్రంలో ఏ నాయకుడి బలమేమిటో తనకు అవగా హన ఉందని, అందువల్ల తనకు పగ్గాలు ఇస్తే పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకువస్తానని హామీ ఇచ్చారు.

సీఎం కిరణ్‌ కుమార్‌ వల్ల ఇవన్నీ సాధ్యం కాదని, ఆయనకు వాటిపై అంత అవగాహన లేనందున ఆ బాధ్యతలను తనకు అప్పగించాలని కేవీపీ కోరారు. అయితే, తనపై ఆరోపణలు చేసే వారికి ఢిల్లీలో ప్రాధాన్యం ఇవ్వకూడదని, గతంలో వైఎస్‌కు ఎలాంటి ప్రాధా న్యం ఇచ్చారో తనకూ అదే స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వాలని కేవీపీ ఒక దశలో షరతు విధించినట్లు తెలిసింది.అందుకు స్పందించిన అహ్మద్‌పటేల్‌ తాను ఈ ప్రతిపా దనను సోనియాగాంధీ, ప్రణబ్‌, ఆజాద్‌లతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

అయితే, అప్పటివరకూ మీ స్థాయిలో మీరు పార్టీ పటిష్ఠపర్చా లని మీ సమర్ధతేమిటో తెలిసినందున మీ సే వలను సద్వినియోగం చేసుకుంటామని పటేల్‌ చెప్పా రు. కేవీపీ తాజా ప్రతిపాదనలను పరిశీలిస్తే.. ఆయన సీఎం పదవో, పీసీసీ అధ్యక్ష పదవినో ఆశిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కిరణ్‌కుమార్‌రెడ్డిని మార్చి నెల తర్వాత మారుస్తారని విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతున్న నేప థ్యంలో కేవీపీ ఇలాంటి ప్రతిపాదనలు చేయటం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయింది. కేవీపీ బహుశా తనకు సీఎం పదవి ఇస్తే రాష్ట్రంలో పార్టీని గాడిలోకి తెచ్చి, పూర్వవైభవం తెస్తానని అహ్మద్‌పటేల్‌ ముం దు ప్రతిపాదన పెట్టి ఉండవచ్చని సీనియర్లు విశ్లేషిస్తున్నారు.
 

Tuesday, December 21, 2010

The Hero Myth


Rebel Congress MP Jaganmohan Reddy stirred up his own storm recently in Nellore. Saying his patience was running out, Jagan said the anger of YSR loyalists would erupt like a tidal wave one day. But Jagan’s rants are old hat, what made the news was the presence of ex-actress Roja and NTR’s widow Lakshmi Parvati at the town rally. The crowd was in for a liberal dose of mythology as Roja said Jagan will not be an Abhimanyu to be sacrificed but an Arjuna who will win the war. Lakshmi Parvati went a step ahead and compared him to Sri Ram. Jagan pitched in, likening his detractors to Sisupala who committed a 100 sins against Lord Krishna before he was beheaded. But evidently all that myth-making got a bit too much for Jagan, who had to be hospitalised later with severe pain in the right shoulder.

Saturday, December 18, 2010

తండ్రి 'ఆత్మ'పై తనయుడి పోరు! * మొదటి నుంచీ ఉప్పూ నిప్పు * కేవీపీకి ప్రాధాన్యంపై జగన్ గుర్రు


కేవీపీకి ప్రాధాన్యంపై జగన్ గుర్రు
కీలక సమయంలో 'చెయ్యి' ఇచ్చారని ఆగ్రహం
అధిష్ఠానం పక్షాన నిలవడంపై అసహనం
సురేఖ లేఖాస్త్రానికి ఇదే కారణం?
గుల్బర్గా వైద్య కళాశాలలో జరిగిన పరిచయం తర్వాత... 1978లో వైఎస్ మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి 2009 సెప్టెంబర్ 2వ తేదీన మృతి చెందేదాకా... కేవీపీ ఆయనతోనే ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించినా, ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నా ప్రతి దశలో వైఎస్‌తోనే కేవీపీ ఉన్నారు.

అప్పుడెప్పుడూ కేవీపీ, వైఎస్‌ల మధ్య అనుబంధం విషయంలో ఎలాంటి పొరపొచ్ఛాలూ లేవు. కానీ.. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే వివాదం మొదలైంది. అది వారిద్దరి మధ్య కాదు! పాలనలో కేవీపీ జోక్యం, ఆయనకు దక్కుతున్న ప్రాధాన్యాన్ని వైఎస్ కుటుంబ సభ్యులు... ప్రధానంగా జగన్ వ్యతిరేకించే వారని పార్టీ నేతల్లో ప్రచారం జోరుగా ఉంది.

కాంట్రాక్టుల కేటాయింపులు, కీలక పోస్టుల్లో నియామకాల విషయంలో కేవీపీతోపాటు జగన్ కూడా జోక్యం చేసుకునే వారని.. దీంతో వారిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని చెబుతున్నారు. వైఎస్ ఉన్నప్పుడే ఆర్థికపరమైన పలు లావాదేవీలకు సంబంధించి కేవీపీతో జగన్ వ్యతిరేకించేవారనే ప్రచారం సాగింది.

వైఎస్ మరణంతో...

వైఎస్ దుర్మరణం తర్వాత జరిగిన పరిణామాలు కేవీపీకీ, జగన్‌కూ మధ్య దూరాన్ని మరింత పెంచాయి. వైఎస్ వారసునిగా జగన్‌కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్, వైఎస్ భౌతిక కాయం ఉండగానే, దానికి సమీపంలోనే ఎమ్మెల్యేల సంతకాల సేకరణ జరిగింది. అత్యంత విషాదకర సమయంలో అధికారం కోసం సంతకాల సేకరణ ఏమిటంటూ అధిష్ఠానం మండిపడింది. పార్టీలో తన రాజకీయ భవిష్యత్తు సర్వనాశనం అయ్యేందుకు సంతకాల సేకరణే ప్రధాన కారణమని జగన్ భావిస్తున్నారు.

కొండా సురేఖ కూడా ఇటీవల తన లేఖలో ఇదే అంశాన్ని ప్రస్తావించారు. 'నేను, వైఎస్ ఒకే మనసు, ఒకే ఆత్మ' అని చెప్పుకున్నప్పటికీ... వైఎస్ మరణం తర్వాత కేవీపీలో ఈ వైఖరి కనిపించలేదని జగన్ వర్గం ఆక్షేపిస్తోంది. ప్రజా భద్రతా సలహా కమిటీ చైర్మన్‌గా ఉన్న కేవీపీ... వైఎస్ మరణానికి నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయకపోవడం జగన్‌ను, ఆయన వర్గాన్ని విస్మయానికి గురి చేసిందని చెబుతారు.

జగన్ ఇప్పటికీ తన తండ్రి మరణంపై తాను సందేహాలు వ్యక్తం చేస్తూ, ప్రజల్లోనే అవే సందేహాలు కలిగేలా ప్రచారం చేస్తున్నారు. 'రాష్ట్రంలో ఏ కార్యకర్త కూడా వైఎస్ ప్రమాదవశాత్తు మృతి చెందారని భావించడంలేదు. ఆయన మరణంపై సందేహాలున్నాయి' అని ఇటీవల పులివెందులలో జరిగిన సభలో పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రభుత్వపరంగా దర్యాప్తు జరిపేందుకు కేవీపీ ఎందుకు సిద్ధపడలేదని జగన్ వర్గం ప్రశ్నిస్తోంది.

పీఠం... ముడి!

వైఎస్ మృతి అనంతరం మెజారిటీ శాసనసభ్యుల మద్దతున్న తననే సీఎం కుర్చీలో కూర్చోబెడతారని జగన్ భావించారు. రఘువీరారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి సీనియర్ నేతలు కూడా జగన్‌ను సీఎం చేయకుంటే మంత్రులుగా ప్రమాణం చేయబోమని అప్పట్లో ప్రకటించారు. 'మనం కలిసి పరిపాలన చేద్దాం' అంటూ తనను కలిసి సానుభూతి ప్రకటించడానికి వచ్చిన నేతలతో జగన్ చెప్పారని, ఇదీ ఆయనలోని నమ్మకానికి నిదర్శనమని చెబుతారు. సీఎంగా తనపేరు ప్రకటించడం లాంఛనమే అని జగన్ భావించారు.

ఆ సమయంలో కేవీపీ గొంతెత్తి, జగన్ పక్షాన నిలుస్తారని పలువురు భావించారు. కానీ.. పరిస్థితి తారుమారైంది. కీలకమైన క్షణంలో కేవీపీ మౌనం జగన్‌కు ఆగ్రహం తెప్పించింది. వైఎస్ కుటుంబ సభ్యులు కూడా దీనిని జీర్ణించుకోలేకపోయారని జగన్ సన్నిహిత వర్గాలు చెబుతుంటాయి. మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తనవెంటే ఉన్న ఆ సమయంలో కేవీపీ ఒక్క మాట అని ఉంటే నేడు పరిస్థితి ఇలా ఉండేది కాదన్నది జగన్ అభిప్రాయం.

పుండుమీద కారం చల్లినట్లుగా... సీఎల్పీ నేతను ఎన్నుకునే అధికారాన్ని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కట్టబెడుతూ తీర్మానాన్ని పార్టీ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ జగన్ చేతే ప్రవేశపెట్టించారు. ఈ వ్యవహారాలన్నింటికీ కేవీపీ ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు. ఏ దశలోనూ కేవీపీ దీనిని వ్యతిరేకించకపోవడం, అధిష్ఠానాన్ని తప్పుపట్టకపోవడం జగన్‌కూ, ఆయన కుటుంబానికీ, అనుచరులకు ఆగ్రహం తెప్పించింది.

అన్నింటికంటే ముఖ్యంగా... అప్పుడు సీఎంగా ఉన్న రోశయ్యతో కేవీపీ బంధాన్ని కొనసాగించడం .. గతంలో వైఎస్ ఉన్నప్పటి లాగానే శాసనసభ సమావేశాల సమయంలో అసెంబ్లీకి రావడం, సలహాదారుగా కొనసాగడం ఆ ఆగ్రహాన్ని మరింత పెంచింది. కేవీపీ అటు అధిష్ఠానంతో, ఇటు నాటి సీఎం రోశయ్యతో సఖ్యతగా మెలగడం కూడా జగన్‌కు మింగుడు పడలేదు.

పైగా... ఎమ్మెల్యేలు తనవైపు మొగ్గు చూపకుండా కేవీపీ వారిని కట్టడి చేస్తున్నారనే అనుమానం కూడా కలిగింది. సీఎంగా రోశయ్య బాధ్యతలు నిర్వహించినంత కాలం... ఎప్పటికైనా అధిష్ఠానం దిగివచ్చి తనకు సీఎం పదవి అప్పగిస్తుందని జగన్ భావిస్తూ వచ్చారు. కానీ, అనూహ్యంగా రోశయ్యను మార్చేసి, ఆయన స్థానంలో తన సామాజిక వర్గానికే చెందిన కిరణ్‌కుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకోవడంతో... ఇక తాను కాంగ్రెస్‌లో సీఎం కావడం అసంభవమని జగన్ ఓ నిర్ణయానికి వచ్చేశారు.

ఇదే సమయంలో తన కుటుంబంలోనే చిచ్చు పెట్టేందుకు అధిష్ఠానం యత్నిస్తున్నా.. కేవీపీ నోరు విప్పకపోవడంపై జగన్‌తో పాటు ఆయన వర్గం ఆగ్రహించింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కొండా సురేఖ ద్వారా కేవీపీపై లేఖాస్త్రం సంధించినట్లు ప్రచారం జరుగుతోంది.

వేస్తారా సంకెళ్లు?

ఒకటి రెండూ కాదు... వేల కోట్ల అవినీతి! సర్వ వ్యవస్థల నాశనం! ఇన్నేళ్లుగా జరిగిందిదే! 'ఆంధ్రజ్యోతి' ఎప్పటికప్పుడు ఈ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసింది. చట్టాన్ని చుట్టంగా మార్చుకున్నన్ని రోజులు... వారూ వారూ కలిసి ఊళ్లు పంచుకున్నన్ని రోజులు దీనిపై ప్రభుత్వాలు స్పందించలేదు. రాజకీయ సమీకరణాలు మారిపోగానే కొరడా ఝళిపించడం మొదలుపెట్టారు. అప్పుడు 'ఆంధ్రజ్యోతి' రాసిన కథనాలు అక్షరసత్యాలని ఇప్పుడు ప్రభుత్వమే తన చర్యల ద్వారా అంగీకరించినట్లయింది.

ఎమ్మార్ కుంభకోణంపై సీబీఐ విచారణకు కూడా సిద్ధపడుతోంది. రహేజాదీ ఇదే పరిస్థితి. బయ్యారంలో ఇనుప నిక్షేపాల కేటాయింపును రద్దు చేసింది. వైఎస్ పుత్రుడి కంపెనీలపై ఐటీ దాడులు జరిపేందుకు రంగం సిద్ధమవుతోంది. ఔటర్ రింగ్ రోడ్డులో అక్రమాలు జరిగినట్లు హైకోర్టు తీర్పుతో స్పష్టమైంది. సెజ్‌ల పేరిట జరిగింది భూ పందేరమేనని తేలిపోయింది. ఈ కుంభకోణాల్లో కోట్లకొద్దీ ప్రజాధనం కొందరు పెద్దల ఖాతాల్లోకి చేరుకుంది.

ఇప్పుడు... ప్రభుత్వం ఏం చేస్తుంది? మెక్కిన సొమ్మును కక్కిస్తుందా? అవినీతి పరులకు సంకెళ్లు వేస్తుందా?... వారి మధ్య మళ్లీ సఖ్యత కుదిరితే, వాళ్లు లోపాయికారీ ఒప్పందానికి వస్తే మొత్తం అవినీతిని కప్పేస్తారు! ఇప్పుడే సర్కారును పౌర సమాజం ప్రశ్నించాలి. 'మేమున్నాం... నిలదీస్తాం' అని అనుక్షణం గుర్తు చేయాలి.
click here

Friday, December 17, 2010

జనం సొమ్ముతో జగన్ పండగ, ఆరేళ్లలో అందనంత ఎత్తుకు

 

జనం సొమ్ముతో జగన్ పండగ, ఆరేళ్లలో అందనంత ఎత్తుకు
తండ్రి అధికారమే ఆధారం
కంపెనీల మూలాలన్నీ అనుమానాస్పదం
అక్రమ మార్గాల్లో పెట్టుబడులు
ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన వాటాలు
అప్పుడు అధికార వ్యవస్థ గప్‌చుప్
ఇప్పుడు అవే వ్యవస్థల గర్జనలు

అదో చిన్న మొక్క... అడుగులోపు ఎత్తు, చిన్న చిన్న ఆకులు, సన్నని కాండం... అదీ దాని స్వరూపం! ఆరేళ్లలో దాని రూపురేఖలే మారిపోయాయి. ఆ చిన్న మొక్క అంతకంతకు విజృంభించింది. ఊడలు దిగింది. ఎకరాలకు ఎకరాలు ఆక్రమించింది. కళ్లు మూసి తెరిచేంతలో మహా వటవృక్షంగా ఎదిగిపోయింది. ఇది ఎలా సాధ్యమని అడిగిన వారిని చూసి ప్రస్తుత సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు ఫక్కున నవ్వారు. మీకేం తెలియదు పొమ్మన్నారు. వ్యాపార నైపుణ్యం అంటే ఇదేనని, కార్పొరేట్ మహత్యం ఇలాగే ఉంటుందని తెగ వాదించారు. ముఖ్యమంత్రి పదవి అనే తల్లి వేరు వల్లే ఆ మొక్క అలా వయసుకు మించి ఎదిగిందనే వాస్తవం తెలిసీ మిన్నకున్నారు. అదే కాంగ్రెస్ నేతలు పరిస్థితులు మారేసరికి ఇప్పుడు ఆ మహా వృక్షంపై యుద్ధం ప్రకటించారు. నువ్వెలా ఎదిగావో మాకు తెలుసంటూ గోల చేస్తున్నారు. దానిని పెకలించలేక ప్రయాస పడుతున్నారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ కుమారుడైన జగన్మోహన్‌రెడ్డి కథ ఇది.

  2003-04 సంవత్సరంలో వైఎస్ జగన్ చెల్లించిన ఆదాయపు పన్ను కేవలం రూ.60 వేలు. 2009-10 సంవత్సరంలో ఆయన చెల్లించిన అడ్వాన్స్ ట్యాక్స్ ఏకంగా రూ.84 కోట్లు. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆయన ఎలా ఎదిగిపోయారో, ఎంతగా చెలరేగిపోయారో చెప్పడానికి ఇంతకంటే మరో నిదర్శనం అవసరం లేదు. అధికారంలోకి రాక మునుపు ఇంటిని సైతం అమ్మకానికి పెట్టాల్సినంత ఆర్థిక దుస్థితి వైఎస్‌ది. పీఠం ఎక్కిన తర్వాత ఆయన ఓ మహా ప్రబల ధన శక్తిగా ఎదిగిపోయారు. అంతేకాదు... సీఎం అయిన తొలినాళ్ల నుంచే తన అధికార సోపానాల మీదుగా సుపుత్రుడి ఎదుగుదలకు యథా శక్తి శ్రమించారు. సండూర్ పవర్ అనే అతి చిన్న కంపెనీతో ప్రారంభమైన జగన్ వ్యాపారం... వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక శాఖోపశాఖలుగా విస్తరించింది. కార్మెల్ ఆసియా, జనని ఇన్‌ఫ్రా, జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, క్లాసిక్ రియాల్టీ, షలోమ్ ఇన్‌ఫ్రా, ఇన్‌స్పైర్ హోటల్స్, సిలికాన్ బిల్డర్స్ ఇలా అనేక కంపెనీలు పుట్టుకొచ్చాయి.

ఈ కంపెనీల పుట్టు పూర్వోత్తరాలపై 'ఆంధ్రజ్యోతి' పక్కా ఆధారాలతో సహా అనేక ప్రత్యేక కథనాలు ప్రచురించింది. అప్పట్లో వైఎస్ చెప్పిందే వేదంగా భావించిన కాంగ్రెస్ నేతలంతా ఈ కథనాలను దునుమాడిన వారే. ఇప్పుడు అదే కాంగ్రెస్ నేతలు జగన్ కంపెనీల పుట్టుక వెనుక రహస్యం తమకు తెలుసంటూ విమర్శిస్తున్నారు. 'అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి?' అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతెందుకు... జగన్ పత్రికపై విపక్ష నేత చంద్రబాబు చేసిన విమర్శలపై అప్పటి ప్రభుత్వ చీఫ్ విప్, ఇప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.

"చంద్రబాబు సాక్షి పత్రికపై విమర్శలు చేయడం మానుకోకుంటే ప్రజలే బుద్ధి చెబుతారు. భవిష్యత్తులో సాక్షి ఎదుగుదల బాగా ఉంటుందనే ప్రముఖ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి'' అని కిరణ్ కుమార్ 2008 ఏప్రిల్ 6న జగన్ పత్రికను అడ్డగోలుగా వెనకేసుకొచ్చారు. ఇదీ పరిస్థితి! జగన్ సమైక్యవాదం వినిపించగానే... తెలంగాణ నేతలకు 'సాక్షి' చేదెక్కింది. జగన్ టీవీ చానల్ సోనియాపై వ్యతిరేక కథనం ప్రసారం చేసేసరికి... మొత్తం కాంగ్రెస్ నేతలకు కంపరం పుట్టుకొచ్చింది. ఇప్పుడు... జగన్ కంపెనీల మీద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుంచి ఆదాయపు పన్ను శాఖ వరకు అన్నీ కన్నేశాయి. కాంగ్రెస్‌కు కానీ, కేంద్రంలోని కాంగ్రెస్ పెద్దలకుగానీ... జగన్ అక్రమాలు ఇప్పుడు మాత్రమే తెలిసినవి కావు! ఎప్పుడో తెలుసు! అవసరం వచ్చింది కాబట్టి, ఇద్దరి మధ్య చెడింది కాబట్టి... ఇప్పుడు రకరకాల అస్త్రాలు తీస్తున్నారు!

దశ దిశలా విస్తరణ...

గనులు, స్టీలు, సిమెంట్, మీడియా, విద్యుత్తు... ఇలా ఆరేళ్లలో జగన్ అడుగుపెట్టని రంగమంటూ లేదు. అయితే, ఆయన పెట్టిన కంపెనీల మూలాలన్నీ అనుమానాస్పదమే, అక్రమమే! అన్నింటికంటే ముఖ్యంగా... జగన్ సొంత ప్రసార సాధనమైన 'సాక్షి' గురించే చెప్పుకోవాలి. తన సొంత మీడియా కోసం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ చీటికి మాటికీ 'ఆ రెండు పత్రికలు' అంటూ విరుచుకుపడేవారు. 'కాంగ్రెస్' కోసం ఒక పత్రిక అవసరమనే భావన కల్పించారు. కుమారుడి ద్వారానే పత్రికను ప్రారంభింపచేశారు. అదికూడా... భారీ స్థాయిలో! ఇతర పత్రికలను నిర్మూలించడమే లక్ష్యంగా అది పుట్టుకొచ్చింది. వచ్చీ రాగానే 'ఇతర పత్రికలు కూడా రూ.2 కే విక్రయించాలి' అంటూ 'గొంతెమ్మ' కోర్కెల ఉద్యమం మొదలుపెట్టారు. నిజమే... ఆయన సొమ్మేం పోయింది! ఆయన ఉచితంగా అయినా పేపర్ పంచి పెట్టగలరు. ఎందుకంటే... రూ.500 కోట్ల విలువైన పత్రికలో జగన్ పైసా కూడా పెట్టుబడి పెట్టలేదు.

సండూర్ పవర్‌తో మొదలుపెట్టి... దానికి అనుబంధంగా కొన్ని కంపెనీలు, మరిన్ని పిల్ల కంపెనీలను పుట్టించి, వాణిజ్య నిపుణులకు సైతం అంతుపట్టని రీతిలో జగతి పబ్లికేషన్స్‌లోకి పెట్టుబడులు ప్రవహింప చేశారు. ఈ క్రమంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితులను అడ్డగోలుగా ఉల్లంఘించి... జగతి పబ్లికేషన్స్‌కు మారిషస్ నుంచి అక్రమమార్గంలో డబ్బులు తెప్పించారు. 'మా కంపెనీలో విదేశీ పెట్టుబడులు లేవు' అంటూ ఆర్ఎన్ఐకి తప్పుడు సమాచారం అందించారు. సెబీ నిషేధించిన కంపెనీలకూ జగతి పబ్లికేషన్స్ షేర్లు కేటాయించడం మరో అక్రమార్కం. అంతేకాదు... చరిత్ర మొత్తం అనుమానాస్పదమే అయిన 12 పశ్చిమ బెంగాల్ కంపెనీలు కూడా జగతిలో పెట్టుబడులు పెట్టాయి. అందులోనూ, రూ.9.31 లక్షల సంచిత నష్టం మూటగట్టుకుని, 2007-08లో కేవలం 77,855 రూపాయల లాభం ఆర్జించిన కంపెనీలు... జగతిలో ఏకంగా 41.57 కోట్లు పెట్టుబడిగా పెట్టినట్లు చూపించారు. ఇదంతా 'జగన్ మాయ'లో భాగమే! ఇలాంటి అక్రమాల పుత్రికకు ముఖ్యమంత్రి వైఎస్ 'అధికారికంగా' ఆర్థిక పరిపుష్టి కలిగించారు. నిబంధనలు సడలించి మరీ కోట్ల విలువైన ప్రభుత్వ ప్రకటనలను గుప్పించారు.

అంతా అడ్డగోలు...

వైఎస్ తనయుడు జగన్ ఏర్పాటు చేసిన భారతి సిమెంట్స్ (అప్పట్లో రఘురాం సిమెంట్స్) ఆవిర్భావమే ఒక 'అద్భుతం!' ఈ సంస్థలో ప్రమోటర్ల (జగన్ కుటుంబం) వాటా ఒక్క ఏడాదిలోనే రూ.45 కోట్ల నుంచి రూ.6500 కోట్లకు పెరిగింది. ఇది భారత సిమెంట్ రంగం చరిత్రలోనే ఒక రికార్డు. ఇక జగన్ కంపెనీలకు 'తల్లి లాంటిదైన' సండూర్ పవర్‌ది మరో చరిత్ర! 22 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యమున్న ఈ విద్యుత్తు ప్లాంటు విలువ రూ.1300 కోట్లుగా చూపారు. పది రూపాయల షేరును రూ.675కు విక్రయించారు. అందులో 21 లక్షల షేర్లను నిమ్మగడ్డ ప్రసాద్ (మ్యాటిక్స్) కొన్నారు. మరో 82 లక్షల షేర్లను బినామీ కంపెనీలకు విక్రయించి రూ.702 కోట్లు అక్రమంగా సమీకరించారు.

ఆ సొమ్ముతోనే జగన్ బంతాట ఆడటం మొదలుపెట్టారు. జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించడం, అలా పెట్టుబడులు పెట్టిన వారికి ప్రభుత్వపరంగా లబ్ధి చేకూర్చడం వైఎస్ అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. అంటే... జనం సొమ్ముతో పండగ చేసుకున్నారన్న మాట! ఇలా జగన్ కంపెనీల లోతుపాతులపై 'ఆంధ్రజ్యోతి' జగన్ నాటకం, జగతి కిలాడీలు శీర్షికన వరుస కథనాలను ప్రచురించింది. 'ఈ దేశంలో వ్యవస్థలు సక్రమంగా నడిస్తే... జగతి పబ్లికేషన్స్‌కు వెంటనే తాళాలు పడతాయి!' అని కంపెనీ, మీడియా వ్యవహారాలపై అవగాహన ఉన్న నిపుణుడొకరు తెలిపారు. కానీ... అప్పటి వ్యవస్థలన్నీ వైఎస్ చేతుల్లోనే ఉన్నాయి. ఇప్పుడు అదే వ్యవస్థలు జగన్‌పై గురి పెడుతున్నాయి. ఇది... కాల మహిమ! జనం మౌన ప్రేక్షకులుగా చూస్తూ ఉన్నన్నాళ్లూ ఈ 'మహిమలు' జరుగుతూనే ఉంటాయి.


******************************************************************************
ఎంత ఎదిగి పోయావయ్యా!

2004లో...
జగన్ వార్షిక ఆదాయం రూ.10 లక్షలు
స్థిరాస్తుల విలువ రూ.36 లక్షలు
వివిధ కంపెనీల్లో పెట్టిన పెట్టుబడులు రూ. 19 కోట్లు

2006లో...

జగన్ ఆదాయం రూ.40 కోట్లు
2010లో...
జగన్ కట్టిన అడ్వాన్స్ ట్యాక్స్: రూ.84 కోట్లు

Wednesday, December 15, 2010

కాంగ్రెస్‌లో జగన్‌ కార్డు

Jagan-sirr
‘మమ్మీ.. నాకు చాక్లెట్‌ ఇవ్వకపోతే నీ పార్టీ నుంచి డాడీ పార్టీలోకి వెళతా’- చిన్నపిల్లలు తమ చిన్న చిన్న డిమాండ్ల కోసం తలిదండ్రులను బ్లాక్‌మెయిల్‌ చేసే సహజ ధోరణి ఇది. ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఉంది. కాకపోతే ఇక్కడ చిన్నపిల్లల బదులు పెద్దలయిన ఎమ్మెల్యేలే బెదిరింపులకు పాల్పడుతున్నారు. తేడా అదే. ఇప్పటివరకూ తమకు ప్రాధాన్యం ఇవ్వని నాయకత్వం ఇప్పుడు జగన్‌ వ్యవహారంతో బుజ్జగిస్తున్న వైనాన్ని ఎమ్మెల్యేలు, నేతలు చక్కగా వినియోగించుకుంటున్నారు. జగన్‌ పేరు చెప్పి ఏకంగా పార్టీనే బెదిరించే పరిస్థితి ఏర్పడింది. తమకు ప్రాధాన్యం ఇవ్వకపోతే జగన్‌ వైపు దూకేస్తామని చెప్పకనే చెబుతున్నారు. జేసీ దివాకర్‌రెడ్డి వంటి మరికొంతమంది స్థితప్రజ్ఞులు ‘జగన్‌ చేతిలో మంత్రదండం ఉందం’టూ పార్టీపై ఒత్తిడి చేసే పరోక్ష వ్యూహంతో కథ నడుపుతున్నారు.

వందేళ్లకుపైబడిన చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో రాను రాను దయనీయస్థాయికి దిగజారుతోంది. ఢిల్లీ నుంచి కంటిచూపుతో రాష్ట్ర రాజకీయాలను శాసించిన నాయకత్వానికి, ఇప్పుడు ఒక జూనియర్‌ ఎమ్మెల్యేను కూడా బ్రతిమిలాడుకోవలసి దుస్థితి దాపురించింది. ప్రధానంగా.. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కిరణ్‌కుమార్‌ ఈ విషయంలో నానా అగచాట్లు ఎదుర్కొంటున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు జగన్‌ వైపు వెళ్లకుండా బుజ్జగించడానికే ఆయన సమయం సరిపోయేలా కనిపిస్తోంది. ఎమ్మెల్యేలను పిలిచి జగన్‌ పార్టీలో చేరవద్దని, మీకు మంచి భవిష్యత్తు ఉందంటూ బుజ్జగించవలసి వస్తోంది.

ఈ పరిస్థితిని ఎమ్మెల్యేలు, సీనియర్‌ నాయకులు చక్కగా సద్వినియోగం చేసుకుంటూ, అధిష్ఠానంపై మరింత పట్టుబిగించేందుకు ఎవరి ఎత్తుగడలో వారున్నారు. తమకు ప్రాధాన్యం ఇవ్వాలని, తమ జిల్లాలో మరొకరికి ప్రాధాన్యం ఇస్తే సహించేదిలేదని సీఎంకు నేరుగానే హెచ్చరిస్తున్నారు. ఇంతవరకూ తమకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదని, నియోజకవర్గంలో అధికారులు తాము సూచించిన పనులు కూడా చేయడం లేదని, ఈ పరిస్థితి కొనసాగితే కష్టమని నిష్ఠూరాలాడుతున్నారు. తమను జగన్‌ పార్టీలో చేరమని కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నారన్న మరో బాంబు పేల్చి చల్లగా బయటకు వస్తున్నారు.

పేర్ని నాని అయితే, తాను 2014 వరకూ మనసు చంపుకుని పార్టీలో ఉంటానని నిర్మొహమాటంగా చెప్పారు. వనపర్తి ఎమ్మెల్యే శేషారెడ్డి తనకు ప్రజలే అధిష్ఠానమని, ప్రజలు, కార్యకర్తలు తనను జగన్‌ వెంటే ఉండమని చెబుతున్నారని, ఓదార్పు యాత్రలో పాల్గొంటామని సీఎం ముఖం మీదే చెప్పారు. నిజానికి ఎమ్మెల్యేలు-సీనియర్‌ నాయకులు చాలాకాలం నుంచి కార్పొరేషన్‌ పదవులపై కన్నేశారు. వివిధ కారణాల వల్ల అది వైఎస్‌ హయాం నుంచీ వాయిదా పడుతూ వస్తోంది. రోశయ్య హయాంలో కొన్ని కార్పొరేషన్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇప్పుడు వాటిని సాధించుకునేందుకు ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు అధిష్ఠానంపై ‘జగన్‌ త ంత్రాన్ని’ ప్రయోగిస్తున్నారు. కార్పొరేషన్‌ పదవులు ఇవ్వకపోతే పార్టీలో ఉండేది లేదన్న పరోక్ష సంకేతాలు పంపిస్తున్నారు.

అధిష్ఠానం ఎదుర్కొంటున్న ఇబ్బందిని దృష్టిలో ఉంచు కుని, తమ లక్ష్యసాధన కోసం పార్టీ నాయకత్వాన్ని బెదిరిం చే స్థాయికి వెళ్లారు. ఇన్నాళ్లూ అనామకులుగా ఉన్న తమ కు జగన్‌ పుణ్యాన పార్టీలో ప్రాధాన్యం పెరిగిందని, స్వ యంగా ముఖ్యమంత్రే ఫోన్లు చేసి బుజ్జగించేదాకా వచ్చా రంటున్నారు. ఈవిధంగానయినా తమకు పార్టీలో ప్రాధాన్యం పెరిగిందని గ్రహించిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ధైర్యంగా ఎదిరించే స్థాయికి ఎదిగారు.జగన్‌ పేరు అడ్డుపెట్టుకుంటే రెండురకాలుగా లాభపడ వచ్చన్నది వారి వ్యూహం. ప్రభుత్వం లొంగివచ్చి పదవు లిస్తే మూడేళ్లూ హాయిగా ఉండవచ్చు. లేకపోతే జగన్‌ శిబిరం నుంచి ఆఫర్లు ఉండనే ఉన్నాయి. ఇప్పట్లో పార్టీకి రాజీనామా చేయకపోయినా ఫర్వాలేదు. అందరి మాదిరి గా పార్టీలోనే ఉంటూ, జగన్‌ అనుకూల స్వరం వినిపిం చినా నష్టమేమీలేదన్న రెండంచల వ్యూహంలో ఉన్నారు.

Friday, December 10, 2010

అన్నదాతను విస్మరిస్తే అథోగతే * ప్రభుత్వానికి జగన్ హెచ్చరిక

గుంటూరు జిల్లాలో వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరామర్శ

 ఏడాది కాలంగా తుపాన్లు, వరదలు అన్నదాతను దెబ్బ మీద దెబ్బ తీస్తున్నాయని, ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం రైతు మీద ఎందుకు ప్రేమ చూపలేకపోతోందని యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. దీనిని మామూలు పరిస్థితిగా చూడకూడదని, రైతు కన్నీరు రాష్ట్రానికే అరిష్టమని, ఆ కన్నీరు తుడిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇటీవలి వర్షాలకు అతాలకుతలమైన ప్రాంతాల్లో రైతులను పరామర్శించేందుకు శుక్రవారం ఆయన గుంటూరు జిల్లాలోని తెనాలి ప్రాంతంలో పర్యటించారు. ప్రకృతి విలయతాండవానికి కకావికలమైన అన్నదాతలను పరామర్శించి వారి కష్టనష్టాలు అడిగి తెలుసుకున్నారు. వేలకు వేలు అప్పులు తెచ్చి పండించిన పంట చేతికొచ్చే సమయంలో నీటిపాలైందంటూ కన్నీరుమున్నీరవుతున్న రైతును చూసి ఆయన చలించిపోయారు.

రాత్రి 9.10 గంటల సమయంలో అమృతలూరులో రైతులనుద్దేశించి మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఒక్క రైతునూ ప్రభుత్వం ఆదుకోవాల్సిందే. బాధిత రైతుకు తక్షణ సాయంగా ఐదు వేల రూపాయలు ఇవ్వాల్సిందే. ఇన్‌పుట్ సబ్సిడీ రెట్టింపు చేయాల్సిందే.. రబీకి ఉచితంగా విత్తనాలు, ఎరువులు ఇవ్వాల్సిందే.. ధాన్యం తడిచినా, రంగు మారినా కొనాల్సిందే. రుణాలపై వడ్డీ మాఫీ చేసి ఓ సంవత్సరం పాటు అడగకుండా మారటోరియం విధించాల్సిందే. కౌలు రైతుల పరిస్థితి చూసి నాకు చాలా బాధేసింది. వారు బ్యాంకుకు వెళితే కనీసం రుణం కూడా ఇవ్వరు. వారిని ఆదుకోడానికి ఒక ప్రత్యేక మార్గనిర్దేశకం తీసుకురావాల్సిందే. ఇవన్నీ రైతులు నన్నడిగినవే. ఇవన్నీ చేయకపోతే.. రైతులను విస్మరిస్తే ఈ ప్రభుత్వం రోజులు లెక్కపెట్టుకోవాల్సిందే. 2014 ఇంకెంతో దూరం లేదు. మరో మూడేళ్లే. రైతు పక్షపాతిగా ప్రభుత్వం లేకపోతే ఏ ప్రభుత్వమూ నిలబడదు’’ అని ఆయన సర్కారును హెచ్చరించారు.

ఇలాంటి పరిస్థితుల్లో వస్తాననుకోలేదు..

పర్యటనలో ముందుగా చుండూరు మండలం చిన్నపరిమి రైతులను యువనేత పరామర్శించారు. స్వాగతం పలికేం దుకు భారీగా వచ్చిన జనాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘ఈరోజు ఈ గ్రామానికి ఇలాంటి పరిస్థితుల్లో వస్తానని నేను కలలో కూడా అనుకోలేదు. నాన్న బతికున్న రోజుల్లో ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు. రైతు కంట కన్నీరు చూడకూడదు.. రైతు కంట కన్నీరు చూస్తే రాష్ట్రానికి అరిష్టం అని చెప్పేవారు. సంవత్సర కాలంగా వరుసగా వరుస నష్టాలు చవిచూస్తున్నారు. ఒకసారీ కృష్ణా ఉప్పొంగింది. రబీలో లైలా, మొన్న జల్, ఈరోజు మళ్లీ వాయుగుండం.. రైతులు ప్రతిసారీ అప్పుతెచ్చి వ్యవసాయం చేస్తున్నారు. ఖరీఫ్ నుంచి రబీకి.. రబీ నుంచి ఖరీఫ్‌కు.. ఇలా ప్రతిసారి దెబ్బమీద దెబ్బపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతు ఏవిధంగా అప్పులు తీర్చగలడని నేను అడుగుతున్నా.. ’ అని ప్రశ్నించారు.

ప్రధాని హామీ ఇచ్చినా..

‘కృష్ణా పొంగినప్పుడు సాక్షాత్తూ ప్రధానమంత్రే వచ్చి వెయ్యి కోట్ల రూపాయల సాయం ప్రకటించారు. ఒకసారి *500 కోట్లు ఇచ్చారు. మరోసారి *150 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. ఆ దెబ్బ సరిపోలేదని మళ్లీ లైలా తుపాను దెబ్బతీసింది. ఆనాడు ఇస్తామన్న ఇన్‌పుట్ సబ్సిడీ ఇంకా అందకముందే జల్ తుపాన్ దెబ్బతీసింది. జల్ తుపాన్ నష్టాలు లెక్కకట్టే కార్యక్రమం పూర్తికానేలేదు. మళ్లీ దెబ్బ. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నది ప్రత్యేక పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిస్థితిని గుర్తించాలని నేను వేడుకుంటున్నా. రైతును కాపాడే ప్రతి కార్యక్రమం చేపట్టాలని మీ అందరి సమక్షంలో అడుగుతున్నా. నాకు బాగా గుర్తుంది.. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉన్నప్పుడు తాను రైతుల పక్షపాతినని చెప్పి ముఖ్యమంత్రిగా ఉచిత విద్యుత్తుపైనే తొలి సంతకం చేశారు. రైతు ఏనాడూ కన్నీరు పెట్టకూడదని తలచారు. కన్నీరు రాకుండా చూశారు. రైతులందరికీ రుణమాఫీ ఇచ్చినప్పుడు ఆ పథకం అందరికీ అందట్లేదని భావించి.. అందని వారికి *5 వేలు ఆర్థిక సాయం అందించారు...’ అని గుర్తు చేశారు.

*5 వేల సాయంతోపాటు వడ్డీ మాఫీ చేయండి

‘ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. తుపాను బా ధిత రైతుకు *5 వేల తక్షణ సాయం ప్రకటించాలి. రుణాలు కట్టలేని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. వరుసగా దెబ్బమీద దెబ్బపడుతోంది. ఈపరిస్థితుల్లో రుణాలు రీషెడ్యూలు చేసి వడ్డీ మాఫీ చేయాలి..’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ‘తిరగాల్సిన గ్రామాలు ఉన్నాయి.. ఒక్కమాట చెబుతున్నా.. నేను ఇక్కడ రైతులను ఓదార్చడానికి నేనొస్తే.. మీ ప్రేమ ఆప్యాయతలతో నన్ను ఓదారుస్తున్నారు. మీ ప్రేమాభిమానాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతున్నా..’ అంటూ చిన్నపరిమిలో సెలవుతీసుకున్నారు.

అండగా నేనున్నా.. మంచిరోజులొస్తాయి..
పెదరావూరులో పొలాలను పరిశీలించి బాధిత రైతుల్ని పరామర్శించే క్రమంలో జగ్గడిగుంటపాలేనికి చెందిన కలవకొల్లు వాణి జగన్‌తో మాట్లాడుతూ.. తాను మూడెకరాల వరి మాగాణి సాగుచేశానని, వర్షాలకు పంటమొత్తం నీటిపాలైందని కన్నీరు పెట్టుకుంది. ఎకరా కౌలు సాగు కోసం *20 వేలకుపైగా పెట్టుబడి పెట్టానని ఇప్పుడు చేతికొచ్చిన పంటంతా నీటిపాలైందని ఆమె వాపోయింది. జగన్ ఆమెను ఓదారుస్తూ.. ‘అమ్మా.. పంటనష్టం గురించి దిగులుచెందకండి.. వచ్చేవన్నీ మంచి రోజులే.. మీకు అండగా నేనుంటా.. రైతు కన్నీటిని ప్రభుత్వం అర్థం చేసుకుంటుంది. లేదంటే ఒత్తిడి చేసైనా మిమ్మల్ని ఆదుకునేందుకు నేనున్నా..’ అంటూ భరోసా ఇచ్చారు. పెదరావూరుకు చెందిన మహిళా రైతులు చేవూరి జ్యోతి, ఏకశిరి గాయత్రి, పొన్నం అన్నపూర్ణలు యువనేతతో మాట్లాడుతూ.. వరుసగా ఏడాది కాలంగా తమకు పంటలేసినప్పుడల్లా దెబ్బమీద దెబ్బ తగులుతోందని, తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో దిక్కుతోచడం లేదని జగన్‌కు వివరించారు. అప్పులిచ్చిన బ్యాంకులు, ప్రైవేటు వడ్డీవ్యాపారులు ఒత్తిడి చేసే పరిస్థితులు వస్తే భయపడొద్దని జగన్ వారికి ధైర్యం చెప్పారు. రైతు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని అన్నారు.

జగన్ వెంట మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ అంబటి రాంబాబు, గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జంగా కృష్ణమూర్తి, మర్రెడ్డి వెంకట శివరామకృష్ణారెడ్డి, సినీ నటుడు విజయచందర్ తదితరులున్నారు.

చెమ్మగిల్లిన జగన్
చుండూరు మండలం చినపరిమిలో రైతులు ఒక్కొక్కరుగా తమ బాధలను జగన్‌కు వివరిస్తున్న సమయాన ఆయన ఓ నిమిషంపాటు మౌనంగా పంట నష్టపోయిన పొలాలవైపే చూస్తూ చలించిపోయారు. చెమ్మగిల్లిన కళ్లను తుడుచుకుంటూ రైతులతో మాట్లాడారు. ‘రైతు బాగుకోసం ఆనాడు నాన్నగారు వైఎస్ ఎంతగా తపించేవారో, అలాగే నేనూ మీ అందరికీ అండగా ఉంటాను..’ అంటూ ధైర్యం చెప్పారు.

అన్నా.. మీరు సీఎం అయితే చాలన్నా..
‘రాజును బట్టి రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మేము మంచిగున్నామన్నా..ఎవరెవరో ముఖ్యమంత్రులుగా చేసి మమ్మల్ని కాపాడలేరన్నా..మీరు సీఎం అయితేనే రైతులకు న్యాయం చేయగలుగుతారన్నా...’ అంటూ తనను పరామర్శించేందుకు వచ్చిన జగన్‌మోహనరెడ్డి వద్ద చినపరిమికి చెందిన ఆలూరి బుజ్జిబాబు తన ఆకాంక్షను వెల్లడించారు. తాను ఐదెకరాలు సాగుచేసి నష్టపోయినట్టు చెప్పారు.
జనసంద్రాలైన నల్లగొండ, మిర్యాలగూడ, పిడుగురాళ,్ల నడికుడి,
సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి స్టేషన్లు
ఇసుకేస్తే రాలని తెనాలి.. రైలు దిగి స్టేషన్ బయటికొచ్చేందుకే 40 నిమిషాలు..
అక్కడి నుంచి తెనాలి పట్టణం దాటడానికి గంట
మధ్యాహ్నం 2.30కు చేరాల్సిన గ్రామానికి ఆరింటికిగానీ చేరలేనంతలా జనాభిమానం


ఒక్కో స్టేషన్‌లో ఆరు వేల నుంచి 10 వేల మంది అభిమానులు. రైల్వే స్టేషనా.. లేక బహిరంగ సభా.. అన్నట్లు పోటెత్తారు. ఎక్కడి జనం..! ఏమి అభిమానం..! ఎవరినోట విన్నా ఇదే మాట. టీవీల్లో స్వాగత దృశ్యాలు చూస్తున్నవారికీ అదే ఆశ్చర్యం. యువనేత జగన్‌మోహనరెడ్డి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో వస్తున్నారని తెలిసి ఎవరికి వారు పరుగులు తీశారు. ఆయా స్టేషన్ల చుట్టుపక్కల నుంచే కాకుండా సమీప ప్రాంతాల నుంచి బస్సులు, జీపులు, కార్లల్లో తండోపతండాలుగా తరలివచ్చారు. సికింద్రాబాద్ నుంచి గుంటూరు జిల్లా తెనాలి మధ్య ఉన్న అన్ని స్టేషన్లలోనూ జగన్ రైలు ఎప్పుడొస్తుంది? ఇంకా ఎంత సమయం పడుతుంది? అన్న ప్రశ్నలే వినిపించాయి. అభిమాన సందోహంతో స్టేషన్లు మరో మనిషి పట్టడానికి వీల్లేనంతగా కిక్కిరిసిపోయాయి. ఎట్టకేలకు వారు ఎదురుచూస్తున్న రైలు రావడం, అందులో యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూడ్డంతో జగన్నినాదాలు మిన్నంటాయి. యువనేత దిగాల్సిన తెనాలి స్టేషన్‌లో ఈ అన్ని స్టేషన్లనూ మించిన అభిమాన తాకిడి దర్శనమిచ్చింది. ఇక్కడ స్టేషన్ బయటకు వచ్చేందుకే ఆయనకు 40 నిమిషాలు పట్టింది. అక్కడి నుంచి పట్టణం దాటడానికి గంట పట్టిందంటే జన తాకిడిని అర్థం చేసుకోవచ్చు.

నలిగిపోయిన యువనేత

తెనాలి స్టేషన్‌లో కరచాలనం చేయడానికి ఉత్సాహం చూపుతున్న వారిని నియంత్రించడానికి తగినంత భద్రతా సిబ్బంది లేకపోవడంతో విపరీతంగా తోపులాటలు జరిగాయి. దీంతో వారిమధ్య నలిగిపోయిన జగన్ ఒకదశలో పడిపోయే పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం 1.50 గంటలకు రైలు దిగిన ఆయన 2.30కు గానీ స్టేషన్ నుంచి బయటకు రాలేకపోయారు. తెనాలి స్టేషన్ నుంచి పట్టణం బయటకు రావడానికే గంట సమయం తీసుకుంది. ఇక జగన్ పర్యటించిన తెనాలి ప్రాంతంలో పొలాల వెంబడి దారులన్నీ అభిమానులతో కిక్కిరిసిపోయాయి. షెడ్యూలు ప్రకారం మధ్యాహ్నం రెండు గంటలకు చేరుకోవాల్సిన తొలి పర్యటన గ్రామం చేరేసరికి సాయంత్రం ఆరైంది. జగన్ వెంట సికింద్రాబాద్ నుంచి మాజీ మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ అంబటి రాంబాబు, టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి తరలివచ్చారు. పిడుగురాళ్లలో గుంటూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ లేళ్ల అప్పిరెడ్డి వారికి తోడయ్యారు.

అడుగడుగునా.. జనహోరే

గుంటూరు జిల్లాలో ఇటీవలి వర్షాల వల్ల దెబ్బతిన్న రైతులను పరామర్శించేందుకు వచ్చిన యువనేత జగన్‌మోహన్‌రెడ్డి తొలిరోజు పర్యటన ఆద్యంతం ఆలస్యంగా సాగింది. ఉదయం 7.10 గంటలకు సికింద్రాబాద్‌లో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరిన జగన్‌కు రామన్నపేట, నల్లగొండ స్టేషన్లలో అభిమానులు జై జగన్ నినాదాలతో స్వాగతం పలికారు. మిర్యాలగూడ స్టేషన్‌లో అనూహ్యంగా జనం తరలిరావడంతో జగన్నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. గుంటూరు జిల్లా సరిహద్దుల్లోని నడికుడి స్టేషన్ జనసంద్రంగా మారింది. స్టాప్ లేని బెల్లంకొండ తదితర స్టేషన్లలో సైతం జనం వేచి ఉండి.. నినాదాలతో హోరెత్తించారు. పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు స్టేషన్లకు జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇక తెనాలి రైల్వే స్టేషన్‌లో జగన్‌కు అపూర్వ స్వాగతం లభించింది. స్టేషన్ మొత్తం జనంతో కిక్కిరిసిపోయింది. ఇసకేస్తే రాలదనిపిం చింది. తెనాలి వీధుల్లో అడుగడుగునా అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. పాఠశాల విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు దారిపొడవునా బారులు తీరారు. మహిళలు బంతి, గులాబీలతో పూలవర్షం కురిపించారు. జగన్‌కు మంగళహారతులు పట్టి స్వాగతం పలికారు.

బురద నిండిన పొలాల్లో..

జగన్ తెనాలి నుంచి నేరుగా చుండూరు మండలం చినపరిమి గ్రామానికి చెందిన పొలాలకు చేరుకున్నారు. అయితే అక్కడికి కూడా అభిమానులు వచ్చి చుట్టుముట్టడంతో బాధిత రైతులను పరామర్శించేందుకు జగన్ చాలా ఇబ్బందులు పడ్డారు. భద్రతావిభాగంలోని రోప్ పార్టీ సిబ్బంది చేతులెత్తేశారు. ఓర్పుతో జగన్ అభిమానులను దాటుకొని పొలాల్లోకి సాగారు. బురద పొలంలో మోకాళ్ల వరకు దిగబడ్డా లెక్కచేయకుండా వెళ్లి రైతులతో మాట్లాడారు. ఎంత పెట్టుబడి పెట్టారు? ఏమేరకు నష్టపోయారు? ఎలాంటి సాయం కావాలి? వంటి విషయాలు అడిగారు. తుపాను వల్ల నష్టపోయిన కౌలు రైతులతోనూ మాట్లాడారు. నీటిలో మునిగి.. మురిగిపోయి ఉన్న వరి పనలను చూసి జగన్ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. అయితే అభిమానుల ఉత్సాహం, నినాదాల మధ్య రైతులతో సరిగ్గా మాట్లాడలేకపోయారు. దారివ్వాలని పదే పదే విన్నవించుకున్నా ఫలితం లేకుండాపోయింది. చినపరిమికి చెందిన ఏడుగురు రైతుల పొలాలకు వెళ్లి వారితో మాట్లాడారు. షెడ్యూలు ప్రకారం మధ్యాహ్నం రెండు గంటలకు చినపరిమి చేరుకోవాల్సి ఉండగా.. గ్రామం చేరేసరికి సాయంత్రం ఆరైంది. జగన్ గ్రామం దాటి మరో గ్రామానికి వె ళ్లేసరికి ముప్పావుగంట నుంచి గంట వరకు పట్టింది.

రైతును పట్టించుకోకపోతే పోయేకాలమే

చినపరిమి నుంచి పెదపరిమి చేరేసరి ఏడయ్యింది. అక్కడి నుంచి కూచినపూడి, పెదపూడిల మీదుగా అమృతలూరు చేరేసరికి రాత్రి 8.30 అయ్యింది. ఇక్కడ బాప్టిస్టు చర్చిలో ప్రార్థనల అనంతరం చర్చి బయటకు వచ్చి పావుగంటపైనే ప్రసంగించారు. అనంతరం గోవాడ రామాలయంలో పూజలుచేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేశారు. 11 గంటలకు చెరుకుపల్లిలో అంబద్కేర్ విగ్రహానికి పూలదండ వేసి రైతులనుద్దేశించి ప్రసంగించారు. అన్నంపెట్టే రైతును పట్టించుకోకపోతే ఈ ప్రభుత్వానికి పోయేకాలమేనని హెచ్చరించారు. గ్రామాల్లో రైతులు.. ‘ఆనాడు రాజన్న.. నేడు జగనన్న..’ అంటూ నినాదాలివ్వడం విశేషం.

‘కాంగ్రెస్, టీడీపీలను మట్టి కరిపిస్తారు..’

జగన్ కేవలం రైతులను పరామర్శించేందుకే వచ్చారని.. మరోసారి వచ్చి రాజకీయాలు మాట్లాడతారని.. కాంగ్రెస్, టీడీపీలను మట్టి కరిపిస్తారని ఏపీఐఐసీ మాజీ చైర్మన్ అంబటి రాంబాబు పేర్కొన్నారు. చినపరిమిలో జగన్ రాకకు ముందు ఆయన ప్రసంగించారు. పదవుల కోసం జగన్‌ను వదిలివెళ్లిన వారిని చూసి పైనున్న వైఎస్ బాధపడ్డా.. ప్రజల ఆదరణ చూసి తప్పక ఆనందిస్తారన్నారు.

టీచర్ ఇంట్లో బస

పరామర్శల పర్యటన ఆలస్యం కావటంతో జగన్ శుక్రవారం రాత్రి చెరుకుపల్లిలో బస చేశారు. షెడ్యూల్ ప్రకారం సాయంత్రమే రేపల్లె చేరుకుని పెనుమూడి మీదుగా కృష్ణాజిల్లాకు వెళ్లాలని నిర్ణయించారు. అనూహ్యమైన ప్రజా స్పందన కారణంగా పర్యటన ఆలస్యమవుతూ రాత్రి 11 గంటలకు చెరుకుపల్లి చేరుకుంది. దీంతో రాత్రికి అక్కడే మద్ది వెంకటేశ్వర్లు అనే ఉపాధ్యాయుడు ఇంట్లో బస చేశారు. యువనేత శనివారం చెరుకుపల్లి, భట్టిప్రోలు, రేపల్లె మండలాల్లో పర్యటిస్తారు. మరో రోజు పర్యటించయినా షెడ్యూలు పూర్తిచేస్తారు.

ఇక యుద్ధమే ! కేవీపీ ఓ బ్రోకర్, అవినీతి పరుడు.... పాపాల భైరవుడు కేవీపీనే - కొండా సురేఖ లేఖాస్త్రం

Archary-target
వైఎస్‌ ఆత్మబంధువు, రాజ్య సభ సభ్యుడయిన డాక్టర్‌ కేవీపీ రామచంద్రరావు - వైఎస్‌ తన యుడు జగన్‌ మధ్య ఇక యుద్ధం జరగనుందా? తాజాగా జగన్‌ వీర విధేయురాలయిన ఎమ్మెల్యే కొండా సురేఖ ఎంపీ కేవీపీ అక్రమ ఆస్తులపై సీబీఐ విచారణకు డిమాండ్‌ చేయటం పరిశీలిస్తే ఈ అనుమానం నిజమనిపించక మానదు. మొన్నటి వరకూ కేవీపీ మార్గదర్శకత్వం లోనే నడిచిన కొండా.. హటాత్తుగా ఆయనపైనే పేల్చిన ఈ ‘అవినీతి బాంబు’ కాంగ్రెస్‌లో కలకలం సృష్టిస్తోంది. కేవీపీ తనకు నష్టం జరిగే పరిస్థితి వస్తే చివరకు అటు అధిష్ఠానాన్ని, ఇటు జగన్‌నూ ఇరికిస్తారన్న ప్రచారం మొదలయింది. ఒకవేళ నిజంగానే సీబీఐ కేవీపీ ఆస్తులపై విచారణ జరిపిస్తే ఆయన పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలపై పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

ఇప్పటివరకూ కేవీపీ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలని ఒక్క టీడీపీ మాత్రమే డిమాండ్‌ చేయగా, ఇప్పుడు కొండా సురేఖ కూడా అదే దారి పట్టడం చూస్తే, కేవీపీ క్రమంగా కష్టాల్లో పడుతున్నారన్న వాదనకు బలం చేకూరుతోంది. రాష్ట్రంలో వైఎస్‌ హయాంలో జరిగిన ఎమ్మార్‌, రహేజా వంటి భారీ అక్రమాలతో పాటు, అస్మదీయులకు ఇరిగేషన్‌, విద్యుత్‌ ప్రాజెక్టులు, భారీ రోడ్డు కాంట్రాక్టులు, సెజ్‌ల కేటాయింపు వ్యవహారాల్లో కేవీపీ మూలవిరాట్టన్న చర్చలు రాజకీయ పార్టీల నుంచి- సామాన్య జనంలోనూ చాలాకాలం నుంచి చర్చనీయాం శంగా మారిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో వైఎస్‌ జగన్‌ వర్గమే కేవీపీ ఆస్తులన్నీ అక్రమంగా సంపాదించినవేనని, వాటిపై స్వయంగా కేవీపీయే సీబీఐ విచారణ కోరాలంటూ డిమాండ్‌ చేయడం బట్టి ఇక జగన్‌ - కేవీపీ మధ్య యుద్ధానికి తెరలేచినట్టేనన్నది తేలిపోయింది. ఇద్దరి అక్రమ సంపా దన, ఆర్ధిక మూలాల వివరాలు ఒకరికొకరికి తెలియ డంతో ఇక వారిద్దరి వ్యవహారం ఆసక్తికరంగా మారింది. దీనితో ఇప్పటివరకూ వారిద్దరి మధ్య జరుగుతున్న ముసుగులో గుద్దులాటకు శాశ్వతంగా తెరపడి నట్టయింది. కేవీపీపై సీబీఐ విచారణకు ఆదేశిస్తే ఆయన దాదాపు ఒంటరి అవుతారన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి మాదిరిగా తాను చెబితే వినే ఆప్త మిత్రుడు లేకపోవడం, మిగిలిన ఎంపీల మాదిరిగా జనంలో బలం లేని ఎంపీ కావడం, ఇప్పటి వరకూ తెరవెనుక చక్రం తిప్పి, మంత్రాంగం నడపడమే తప్ప, నేరుగా సమస్యను ఎదుర్కొనే ధైర్యం ప్రదర్శించక పోవడం వంటి సమస్యలు ఆయనకు ప్రతిబంధకంగా పరిణమించాయి. పైగా.. వైఎస్‌ అధికారంలో ఉండగా, వైఎస్‌ ప్రత్యర్థులను ఆర్థికంగా, రాజకీయంగాఅణచివేయడంలో కేవీపీ చూపిన అత్యుత్సాహమే ఇప్పుడు ఆయన్ని ఒంటరిని చేసింది.

అధికారాన్ని వినియోగించుకుని ప్రత్యర్థులను, చివరకు మీడియాను కూడా భయపెట్టి, సమాచారశాఖ ద్వారా వారందరినీ తన చుట్టూ తిప్పుకుని, విభజన తెచ్చి పెత్తనం చెలాయించిన కేవీపీ ఇప్పుడు ‘ఎవరూ రక్షించలేనంత’ సమస్యలో కూరుకుపోయారు. కేవీపీ అక్రమ ఆస్తులపై సీబీఐ విచారణ జరిగితే ఆయన వ్యవహారశైలి, స్పందన ఎలా ఉంటుందన్న అంశంపై పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోన్న అభిప్రాయాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. అక్రమ సంపాదన రుజవయి, తాను పీకల్లోతు కష్టాల్లో ఉంటే అప్పుడు ఆయన ఈ వ్యవహారంలో అధిష్ఠానాన్ని కూడా ఇరికించడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది.

వైఎస్‌ జీవించిన సమయంలో జరిగిన ఆర్థిక లావాదేవీలలో ఢిల్లీ నాయకత్వానికీ వాటాలున్నాయని, వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలకు ఇక్కడ నుంచే నిధులు వెళ్లాయని పెదవి విప్పితే పార్టీ పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ విషయంలో ఆయన పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పేరు చెబుతారా? ఆమె రాజకీయ కార్యదర్శి అహ్మద్‌ పటేల్‌ పేరు చెబుతారా? లేక కోశాధికారి మోతీలాల్‌ వోరా పేరు తెరపైకి తెస్తారా? అన్న ప్రశ్నలు సొంత పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. అదే సమయంలో జగన్‌కు సంబంధించిన అక్రమ ఆస్తుల చిట్టాను కూడా విప్పడానికి కేవీపీ జంకరని చెబుతున్నారు. జగన్‌కు చెందిన మీడియా సంస్థల్లో వచ్చిన పెట్టుబడులు, వారికి ఏవిధంగా లబ్ధి జరిగింది? మారిషస్‌, దుబాయ్‌ నుంచి వచ్చిన పెట్టుబడులెంత? ఇరిగేషన్‌ కంపెనీల్లో జగన్‌ వాటాలెంత? ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ, బ్రహ్మణీ స్టీల్స్‌లో జగన్‌ బినామీ వాటాలెంత వంటి లెక్కలను కేవీపీ వెలుగులోకి తీసుకురావడం ఖాయమంటున్నారు.

నిజానికి, జగన్‌ వద్ద కూడా కేవీపీ అక్రమ ఆస్తుల చిట్టా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నారు. ఒక్క మన రాష్ట్రంలోనే కాకుండా దుబాయ్‌తో పాటు.. వివిధ రాష్ట్రాల్లో బినామీ పేర్లు, ఆయన కొడుకు, వియ్యంకుడు, మిత్రుల పేర్లతో ఉన్న వ్యాపారాలు, ఇక్కడ బినామీ పేర్లతో ఉన్న ఇరిగేషన్‌-పవర్‌ ప్రాజెక్టుల వివరాలన్నీ జగన్‌ వద్ద ఉన్నాయని ఆయన సన్నిహితులు బాహాటంగానే చెబుతున్నారు. అదేవిధంగా ఢిల్లీ కేంద్రంగా జరిగే వ్యాపారాల వివరాలు కూడా జగన్‌ వద్ద ఉన్నాయంటున్నారు. వాటిని సీబీఐ విచారణ సమయంలో అందచేస్తారని, అదీ సాధ్యం కాకపోతే ప్రతిపక్షాలకు లీక్‌ చేస్తారంటున్నారు.

కేవీపీ ఓ బ్రోకర్ - కొండా సురేఖ లేఖాస్త్రం
జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారు
పొన్నాలతో కలిసి కోట్లు దండుకున్నారు
ఆయన సలహాలన్నీ దోపిడీకే
పనికిరాని వాడిని వైయస్ పైకి తెచ్చారు
ఆయన నిర్లక్ష్యం వల్లే వైయస్‌మరణం
సంతకాలు సేకరించింది ఆయనే
ఆస్తులపై సీబిఐ విచారణకు సిద్ధం కావాలి

 వైఎస్ ఆత్మ బంధువు, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుపై జగన్ వర్గం నాయకురాలు కొండా సురేఖ మండిపడ్డారు. ఆయనను ఒక బ్రోకర్‌గా అభివర్ణించారు. 'జలయజ్ఞంలో దోపిడీ నుంచి వైఎస్ మరణం దాకా..' అన్ని పాపాలకూ ఆయనే బాధ్యుడని నిందించారు. వైఎస్ అవినీతిపరుడంటూ నిందలు వేస్తున్నా కేవీపీ మౌనం వహించడానికి అసలు కారణం... పదవీ కాంక్షేనని తేల్చి చెప్పారు. "వైఎస్ మరణించాక జగనే సంతకాలు సేకరించారని దుష్ప్రచారం జరుగుతోంటే ఎందుకు ఖండించడంలేదు? జగన్‌ను సీఎం చేయాలని సంతకాల సేకరణ చేపట్టి, తద్వారా జగన్‌ను అప్రతిష్ఠ పాలు చేశారు. ఆ విషయాన్ని ఎందుకు ధైర్యంగాఒప్పుకోలేదు?'' అని కేవీపీని ప్రశ్నించారు. "శ్రీ కేవీపీ రామచంద్ర రావు గారికి...' అని సంభోదిస్తూ ఆయనకు నాలుగు పేజీల బహిరంగ లేఖ రాశారు. అందులో... అనేక సూటి ప్రశ్నలు సంధించారు. సురేఖ లేఖ సారాంశమిది...

"వైఎస్ మరణానంతరం మీ ప్రవర్తనను చూసి వైఎస్ ఆత్మ 'ఇలాంటి బ్రోకర్ నా స్నేహితుడా?' అని క్షోభిస్తుంది. ఎందుకూ పనికి రాని వాడివైన మీ చదువుకు ఆర్థిక సహాయం చేసి అందలం ఎక్కిస్తే, కనీస నైతిక విలువలు లేకుండా ప్రవర్తించడం ఏ విధంగా సబబు? కనీసం చదివిన డాక్టర్ వృత్తికి పనికిరాని మీకు, ఏనాడైనా వార్డు సభ్యుడిగా కూడా గెలవలేని మీకు కేబినెట్ స్థాయి ప్రభుత్వ సలహాదారు పదవి ఇవ్వడం వైఎస్ చేసిన ఏకైక పొరపాటు. వైఎస్ మృతి అనంతరం ఈ 15 నెలల కాలంలో వారి కుటుంబ సభ్యులపై వస్తున్న ఆరోపణలకు ఒక్క దానికైనా ఎందుకు స్పందించడం లేదు. ఈ మౌనం అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికేనా?

వైఎస్ చేపట్టిన జలయజ్ఞాన్ని మీరు ధనయజ్ఞంగా మార్చారు. పొన్నాల లక్ష్మయ్యతో కుమ్మక్కై ఎన్నో కంపెనీలకు ఎక్సెస్ టెండర్లు ఇప్పించి ప్రజల సొమ్మును దోచుకున్నారు. అసలు ప్రభుత్వ సలహాదారుడిగా మీ నిర్వాకం ఏమిటో అందరికీ తెలిసిందే! మీ సలహాలతో కాంట్రాక్టులు ఇప్పించి, తద్వారా ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించారో ప్రజలు అర్థం చేసుకున్నారు. మీ సలహాలన్నీ ప్రజాధనాన్ని దోచుకునేందుకు ఉపయోగపడ్డాయి. నమ్మిన వారికి ప్రాణాన్ని సైతం ఇచ్చేసే వైఎస్ బలహీనతను సొమ్ము చేసుకొని జలయజ్ఞానికి తూట్లు పొడిచారు.

దివంగత నేత కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలవాల్సిన మీరు పదవులను కాపాడుకునేందుకే కక్కుర్తి పడ్డారు. అధిష్ఠానానికి దగ్గర కావాలని కుటిల నీతితో ప్రాణస్నేహితుని కుటుంబాన్ని చీల్చడానికి ఎత్తువేసింది నిజం కాదా? వైఎస్ వివేకానంద రెడ్డి ఢిల్లీకి వెళ్లేముందు మీ ఇంట్లో చర్చలు జరపడం వాస్తవం కాదా? వైఎస్ సతీమణి విజయలక్ష్మి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఇంటికి వెళ్లి పరామర్శించాల్సింది పోయి, ఢిల్లీలో ఉండి మీ పదవి కాపాడుకునే ప్రయత్నం చేసుకున్నారు. అధిష్ఠానం వద్ద వైఎస్ కుటుంబాన్ని బూచిగా చూపించి పదవులు, డబ్బు సంపాదించేందుకు కొత్త ముఖ్యమంత్రి దగ్గర సైతం గిరికీలు కొడుతున్నారు. ముఖ్యమంత్రులు మారినా, మీ పదవులకు ఢోకా లేకపోవడం చూస్తేనే మీ వ్యక్తిత్వం ఏమిటో తేలిపోతోంది. ముఖ్యమంత్రిగా రోశయ్య ఉన్న కాలంలోనూ తప్పుడు సలహాలు ఇస్తూ మరోసారి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు.

మీ స్వార్థం కోసం తప్ప కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవ ఏమాత్రం లేదు. కనీసం వార్డు మెంబర్‌గానైనా గెలిచారా? ప్రజలతో కనీస సంబంధాలు ఉన్నాయా? బడా కాంట్రాక్టర్లు, రాజకీయ దళారులు, పైరవీకారులు తప్ప సామాన్య ప్రజలు, కార్యకర్తలు మీ దగ్గరకు రాగలరా? వైఎస్ కోసం ప్రాణమిచ్చే కార్యకర్తలను, నాయకులను ఏనాడైనా రక్షించే ప్రయత్నం చేశారా? కొండా మురళీధర్‌రావు, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలాంటి వారికి గన్‌మెన్లను తగ్గించడమే భద్రతా సలహాదారునిగా మీరు చేసే పనా? అసలు ప్రజా భద్రతా కమిటీ అధ్యక్షుడిగా భద్రత కల్పించడంలో నిర్లక్ష్యం చేయడం వల్లనే వైఎస్ మృతి చెందారన్నది నిజం కాదా? వైఎస్‌ది ప్రమాదం కాదు, హత్య అని తెలుస్తోంది. ఈ విషయంలో ప్రజలకు స్పష్టమైన వివరణ అవసరం మీకు లేదా?

మీకు నిజాయితీ ఉంటే నైతిక విలువలకు కట్టుబడి ఉంటే సీబీఐ విచారణకు సిద్ధం కావాలి. వైఎస్ ముఖ్యమంత్రి కాకముందు మీ ఆస్తి ఎంత? ప్రస్తుతం ఆస్తి ఎంత? జలయజ్ఞంలో నువ్వు దోచుకున్నదెంత? మంత్రి పొన్నాల వాటా ఎంత? ఈ వివరాలు అన్నీ తెలియాలంటే మీరే స్వయంగా సీబీఐ విచారణను కోరుకోవాలి.'' కేవీపీ పనులు వైఎస్‌కు తెలియదు

"వైఎస్ చేసే పనులు కేవీపీకి తెలుసు. కానీ, కేవీపీ చేసే పనులు వైఎస్‌కు తెలియదు'' అని కొండా సురేఖ పేర్కొన్నారు. తన లేఖపై 'ఏబీఎన్-ఆంధ్రజ్యోతి' చానల్ నిర్వహించిన చర్చలో ఆమె పాల్గొన్నారు. "వైఎస్ అవినీతిపరుడుకారని, వాటికి కేవీపీయే బాధ్యత వహించి ఆయనే సమాధానం చెప్పాలనే ఈ లేఖ రాశాను'' అని కొండా సురేఖ పేర్కొన్నారు. వైఎస్ ఉన్నప్పటికీ, ఇప్పటికీ కేవీపీ ప్రవర్తనలో చాలా తేడా ఉందన్నారు. ఆయన నిజ స్వరూపాన్ని బయటపెట్టడానికే లేఖ రాశాని తెలిపారు. "30 ఏళ్ల రాజకీయ జీవితంలో వైఎస్‌కు అండదండగా ఉన్న కేవీపీ.. ఈ 15 నెలల్లో ఆయన కుటుంబానికి చేసిందేమిటో ఆత్మ విమర్శ చేసుకోవాలి'' అని సూచించారు. "సలహదారులందరి రాజీనామాలను ఆమోదించి కేవీపీ రాజీనామా మాత్రం పెండింగ్‌లో పెట్టారు. అప్పటి నుంచి కేవీపీ ఢిల్లీలోనే మకాం వేసి పనులు చక్కబెడుతున్నారు. కిరణ్ హయాంలోనూ ఆయన హవా నడుస్తోంది'' అని సురేఖ ఓ ప్రశ్నకు బదులిచ్చారు. వైఎస్ వివేకానంద రెడ్డికి పదవి ఇవ్వడం వెనుక కేవీపీ హస్తం ఉందని నూటికి నూరుపాళ్లు నమ్ముతున్నామన్నారు.

కేవీపీని ఉద్దేశించి రాసిన బహిరంగ లేఖలోని అభిప్రాయాలన్నీ తన వ్యక్తిగతమేనని కొండా సురేఖ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. "ఈ లేఖతో వైఎస్ జగన్‌కు సంబంధం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిని ఖండిస్తున్నాను'' అని తెలిపారు.

పాపాల భైరవుడు కేవీపీనే
బ్రోకర్, అవినీతి పరుడు..
కొండా సురేఖ లేఖాస్త్రం
తీవ్ర విమర్శలు గుప్పించిన యువనేత వర్గం
విపక్షాల చేతికి అస్త్రాలు
ఇన్నాళ్ల ఆరోపణలకు బలం
వైయస్‌కు తెలియకుండా కేవీపీ అవినీతి సాధ్యమా?

ఆత్మకు తెలియకుండా శరీరం ఏ పనైనా చేయగలదా?
అంతరాత్మ కళ్లకు గంతలు కట్టడం ఆత్మకు సాధ్యమవుతుందా?
'శరీరాలు వేరైనా ఆత్మ ఒక్కటే' అయినప్పుడు... ఒకే ఆత్మలోని సగ భాగం మరో సగాన్ని మోసం చేయగలదా? ఒక సగానికి సోకిన అవినీతి మరో సగానికి తాకకుండా ఉంటుందా?


కేవీపీ రామచంద్రరావుపై మాజీ ఎంపీ జగన్ వర్గంలోని ముఖ్య నాయకురాలు కొండా సురేఖ సంధించిన లేఖాస్త్రాన్ని చూస్తే ఈ ప్రశ్నలు తలెత్తక మానవు! అటు విపక్షాలు, ఇటు కాంగ్రెస్‌లోని వైఎస్ వ్యతిరేకులు ఇప్పటికే ఈ ప్రశ్నలను సంధిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే... వీరికి జగన్ వర్గమే 'కొండా సురేఖ లేఖ' రూపంలో కొత్త అస్త్రాలను అందించింది. అటు కాంగ్రెస్, ఇటు జగన్ వర్గం దీంతో ఒకరి గోత్రాలను ఒకరు బయటపెట్టుకునే ప్రక్రియ మొదలైంది. వైఎస్ అవినీతిపైనా, కేవీపీ పాత్రపైనా విపక్షాలు ఇన్నాళ్లుగా అనేక ఆరోపణలు చేశాయి.

మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్‌లోని సీనియర్లు సైతం వైఎస్ అవినీతిపై విమర్శలు గుప్పించసాగారు. ఈ విమర్శలపై కేవీపీ స్పందించడం లేదంటూ కొండా సురేఖ ఆక్రోశం వ్యక్తం చేస్తూ... ఆయనపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. 'కేవీపీ ఒక బ్రోకర్. ప్రాజెక్టుల అంచనాలు పెంచాడు. జలయజ్ఞంలో కోట్లు దోచుకున్నాడు' అంటూ పాపాలన్నీ కేవీపీవే అని పేర్కొన్నారు. ఇవే ఆరోపణలను గతంలో విపక్షాలు చేశాయి. ఆ తర్వాత కాంగ్రెస్ నేతలే చేశారు. ఇప్పుడు జగన్ వర్గీయులూ చేస్తున్నారు. అంటే.... ఆ ఆరోపణలన్నీ అక్షర సత్యాలే అని అంగీకరించినట్లేనా?

వైఎస్, కేవీపీలది అవినాభావ సంబంధం. గుల్బర్గాలో మెడిసిన్ చదువుకున్న రోజుల్లో ఏర్పడిన బంధం వైఎస్ మరణించేదాకా కొనసాగింది! వైఎస్ తెల్లవారగానే చేసే మొదటి ఫోన్ కాల్ కేవీపీకే! ప్రతి రోజూ మధ్యాహ్నం కలిసి భోజనం చేసేది కేవీపీతోనే! ఇలా కొన్ని దశాబ్దాలపాటు జరిగినట్లు చెబుతారు. 'మా శరీరాలు వేరైనా, ఆత్మ ఒక్కటే' అని వైఎస్ స్వయంగా పేర్కొనే వారు. ఎవరైనా, ఏదైనా పనిమీద వచ్చినప్పుడు, వారు చెప్పిందంతా విన్న తర్వాత 'కేవీపీని కలవండి!' అని వైఎస్ చెప్పేవారని అందరికీ తెలుసు. వైఎస్ తెర ముందు కనిపిస్తే... తెర వెనుక చక్రం తిప్పింది కేవీపీ అని చాలామంది చెబుతారు. ఇప్పుడు... అదే కేవీపీని అని కొండా సురేఖ బ్రోకర్ అని తిట్టిపోశారు. అదే నిజమైతే... కేవీపీ ఎవరి తరఫున బ్రోకర్‌గిరీ చేశారు? అని ప్రశ్నించేందుకు అటు కాంగ్రెస్, ఇటు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. అందలం ఎక్కించిందెవరు?:

ఎమ్మార్ కుంభకోణం, రహేజా గోల్‌మాల్, జలయజ్ఞం, భూ కేటాయింపులు, ఔటర్ రింగ్ రోడ్డు, సెజ్‌లు... ఇలా వైఎస్ హయాంలో వచ్చిన అవినీతి ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. ప్రతి వ్యవహారంలో వైఎస్‌తోపాటు కేవీపీపైనా విపక్షాలు వేలెత్తి చూపాయి. ఇప్పుడు జగన్ వర్గం కేవీపీని మాత్రమే వేలెత్తి చూపిస్తోంది. వెరసి... విపక్షాల ఆరోపణల్లో సగభాగాన్ని జగన్ వర్గమే బలపరిచినట్లయింది. కేవీపీ, వైఎస్‌ల మధ్య సాన్నిహిత్యాన్ని బట్టి చూస్తే... మిగిలిన సగం ఆరోపణలూ నిజమని అంగీకరించినట్లే! హైదరాబాద్‌కు మకాం మార్చిన తొలినాళ్లలో... వైఎస్, కేవీపీ కుటుంబాలు ఒకే ఇంట్లో ఉండేవి. వైఎస్ పీసీసీ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వహించినప్పుడు కేవీపీ అంతా తానై నడిపించారు.

పాదయాత్ర సమయంలో నడిచింది వైఎస్ అయినా, ఇది విజయవంతం కావడానికి పక్కా వ్యూహం రచించి నడిపించింది మాత్రం కేవీపీ అని చెబుతారు. వ్యక్తిగత మిత్రడైన కేవీపీని అధికారిక కార్యకలాపాల్లో భాగస్వామిని చేసింది వైఎస్సే. ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోకుండా, ఆయనను ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. రాజ్యసభ సభ్యత్వం ఇప్పించారు. ఆ తర్వాత 'ప్రజా భద్రతా కమిటీ' చైర్మన్‌గా క్యాబినెట్ హోదా కల్పించారు. వ్యక్తిగతంగా, అధికారికంగా వైఎస్, కేవీపీలు అంతగా కలిసిపోయారు. అలాంటిది... వైఎస్‌కు తెలియకుండా, కేవీపీ మాత్రమే అవినీతికి పాల్పడ్డారని సురేఖ ఆరోపించడం హాస్యాస్పదమవుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, నమ్మితే ప్రాణాలిచ్చే వైఎస్ బలహీనతనే కేవీపీ సొమ్ము చేసుకున్నారన్నది జగన్ వర్గం వాదన!

సురేఖ లేవనెత్తిన ప్రశ్నలెన్నో: 'బడా కాంట్రాక్టర్లు, రాజకీయ దళారీలు, పైరవీకారులు తప్ప సామాన్య ప్రజలు మీ దగ్గరకు రాగలరా?' అని కొండా సురేఖ ప్రశ్నించారు. అదే నిజమైతే... కేవీపీకి అంత చనువు ఇచ్చి, ఆయన మాట చెల్లుబాటయ్యేలా చేసింది వైఎస్సే కదా అనే ప్రశ్న తలెత్తుతుంది. 'వైఎస్ ముఖ్యమంత్రి కాకముందు కేవీపీకి ఉన్న ఆస్తి ఎంత? ప్రస్తుతం ఆయనకున్న ఆస్తులు ఎన్ని?' అని కూడా సురేఖ తన లేఖలో ప్రశ్నించారు. దాదాపు ఇదే ప్రశ్నను విపక్షాలు, కాంగ్రెస్ నేతలు కూడా జగన్‌ను చాలాకాలంగా అడుగుతున్నాయి. 'వైఎస్ ముఖ్యమంత్రి కాకముందు జగన్ ఆస్తులెన్ని? ఇప్పుడు ఎన్ని?' అని నిలదీస్తున్నాయి. ఇక... జలయజ్ఞంలో కేవీపీ దోచుకున్నదెంత? మంత్రి పొన్నాల వాటా ఎంత? అని కొండా సురేఖ నిలదీశారు.

ఈపీసీలో అక్రమాలు జరిగాయని, అంచనాలు అడ్డగోలుగా పెంచారని, జలయజ్ఞంలో దోపిడీ జరుగుతోందని విపక్షాలు ఏళ్ల తరబడి నెత్తీ నోరు బాదుకున్నాయి. ఈ ఆరోణలను వైఎస్ పూచిక పుల్లతో సమానంగా తీసేస్తూ వచ్చారు. చివరగా... ఈ వివరాలన్నీ బయటపడాలంటే కేవీపీ స్వయంగా సీబీఐ విచారణను కోరుకోవాలని కొండా సురేఖ డిమాండ్ చేశారు. ఆయన నిజంగానే సీబీఐ విచారణ కోరితే, ప్రభుత్వం అందుకు సరేనంటే... 'వైఎస్ పాత్రను మాత్రం విస్మరించి, కేవలం కేవీపీ అవినీతిపై విచారణ జరపడం సాధ్యమేనా?

ఎందుకింత ఆక్రోశం: వైఎస్ మరణం తర్వాత కేవీపీ వ్యవహార శైలిపై జగన్ వర్గం నేతలు ఏమాత్రం సంతృప్తిగా లేరు. అధిష్ఠానానికీ, జగన్‌కూ మధ్య పెరుగుతున్న అంతరాన్ని తగ్గించాల్సింది పోయి... కేవీపీ అప్పటి సీఎం రోశయ్యకు సన్నిహితంగా మెలిగారన్నది వీరి ఆక్షేపణ. ఇప్పుడు కొత్త సీఎం కిరణ్ కుమార్ రెడ్డితోనూ కేవీసీ సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నారని భావిస్తున్నారు. జగన్ వైపు మొగ్గు చూపుతున్న ఎమ్మెల్యేలను కేవీపీ కట్టడి చేస్తున్నారని, మంత్రివర్గ కూర్పులోనూ కీలక పాత్ర పోషించారని పేర్కొంటున్నారు.

జగన్‌కు కేవీపీ పూర్తి మద్దతు ప్రకటించినట్లయితే... ఎమ్మెల్యేలు కిరణ్ నియామకాన్ని వ్యతిరేకించేవారని, ప్రభుత్వం కూలిపోయేదని వాదిస్తున్నారు. "వైఎస్ వల్ల ఇంత పైకి వచ్చిన కేవీపీ... వైఎస్ మరణానంతరం కష్టమైనా, నష్టమైనా జగన్‌తోనే ఉండాలి. ఆయన అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు'' అని జగన్ వర్గం ఆగ్రహిస్తోంది. ఈ ఆగ్రహమే సురేఖ లేఖ రూపంలో బయటపడినట్లు తెలుస్తోంది.

click here
జగన్‌కు క్లీన్‌చిట్‌ ఇమేజ్‌ కోసమే
YS-Jagan-sir
రాష్ట్రంలో ఆరేళ్లపాటు తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి కుడిభజంగా, ఆత్మబంధువుగా వ్యవహరించి, తీరా తాను కష్టాల్లో చిక్కుకుంటే పట్టించుకోకుండా సొంత రాజకీయ భవితవ్యం కోసం కాంగ్రెస్‌ చూరు పట్టుకుని వేళ్లాడుతున్న కేవీపీ రామచంద్రరావుపై జగన్‌ శిబిరం ఊహించని విధంగా దాడి ప్రారంభించింది. జగన్‌కు వీర విధేయు రాలయిన ఎమ్మెల్యే కొండా సురేఖ తాజాగా కేవీపీపై సం ధించిన లేఖాస్త్రంలోని ఆరోపణలు, విమర్శలు, దూషణలు పరిశీలిస్తే.. కేవీపీ భుజంపై తుపాకీ పెట్టి, కాంగ్రెస్‌ను పేల్చే ఎత్తుగడ స్పష్టమవుతోంది. వైఎస్‌ హయాంలో జరిగిన అవినీతి మొత్తానికి కేవీపీనే బాధ్యుడు కాబట్టి, దానికి వైఎస్‌ వారసుడయిన జగన్‌కు ఎలాంటి సంబంధం లేదని చెప్పి, ‘జగన్‌ పరిశుద్ధుడ’న్న ఇమేజ్‌ ఇచ్చే బ్రహ్మాండమైన వ్యూహానికి జగన్‌ వర్గం తెరలేపినట్లు కనిపిస్తోంది.

వరంగల్‌ జిల్లా పరకాల ఎమ్మెల్యే, జగన్‌ విధేయురాల యిన కొండా సురేఖ తాజాగా రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుపై సంధించిన ఆరోపణాస్త్రాలు జగన్‌పై భవిష్యత్తులో ఎదురయ్యే అవినీతి ఆరోపణల నుంచి రక్షిం చి, ఆయనపై ఇప్పటికే ఉన్న ‘అవినీతి సంపాదన’ మకిలిని తొలగించేందుకు వేసిన ఎత్తుగడగా స్పష్టమవుతోంది. వైఎస్‌ సీఎం కాకముందు పెద్దగా ఆస్తులు లేని జగన్‌.. తండ్రి సీఎం అయిన తర్వాత లక్షకోట్లకు పడగలెత్తి, మీడి యా, పరిశ్రమలు స్థాపించారంటూ టీడీపీ ఇప్పటివరకూ ఆరోపిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే.

జగన్‌ పార్టీ స్థాపనకు సిద్ధమవుతున్నందున, భవిష్యత్తులో టీడీపీ ఇదే అవినీతి సంపాదనను మరింత విస్తృతంగా ప్రచారం చేస్తే జగన్‌ ప్రతిష్ఠ దెబ్బతిని ప్రజల్లో దోషిగా నిలబడవలసి వ స్తుందన్న ముందు చూపుతోనే జగన్‌ వర్గం కేవీపీని తెరపైకి తెచ్చింది. ఆయనపై అవినీతి ఆరోపణాస్త్రాలు చేయడం ద్వారా, నాటి మకిలిని ఆయనకే అంటించి, తాను మాత్రం పునీతుడిగా బయటకురావాలన్న వ్యూహం స్పష్టంగా అర్థమవుతోంది. నిజానికి... జగన్‌-కేవీపీ మధ్య చాలాకా లం నుంచి మనస్పర్థలు ఉన్నాయి. పార్టీకి విధేయుడిగా ఉండి లక్ష్యాన్ని సాధించుకోవాలన్నది కేవీపీ సలహా.

తనను అణచివేస్తున్న పార్టీలో కొనసాగడం అవివేకమన్నది జగన్‌ వాదన. ఇలా వారిద్దరూ చాలాకాలం నుంచీ విబేధాలతోనే గడిపారు. ఇటీవల కేవీపీ బెంగుళూరుకు వెళ్లి జగన్‌తో భేటీ అయిన సందర్భంగా.. కేవీపీని తన పార్టీలోకి రావ లసిందిగా అభ్యర్థించారు. దానిని కేవీపీ తిరస్కరించి, నీవే పద్ధతి మార్చుకుని పార్టీలో కొనసాగాలని కేవీపీ సూచిం చగా, జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేసి నీ ఇష్టం వచ్చినట్లు చేసు కోమంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది. అదీకాకుండా.. వారిద్దరి మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలు కూడా వివాదానికి ఒక ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

వైఎస్‌ మృతి చెందిన తర్వాత.. అంతకుముందు వరకూ వివిధ కాంట్రాక్టులు, కేటాయింపులు, ఒప్పందాలకు సంబంధించిన పంపకాల ‘లెక్కల్లో’ తేడా రావడం కూడా వారిద్దరి మధ్య గొడవలకు ప్రధాన కారణమన్న ప్రచారం జరుగుతోంది. తన తండ్రి వల్ల వచ్చిన వాటిని కొడుకునైన తనకు ఇవ్వాలని జగన్‌ పట్టుపడుతుండటం, ఆ లెక్కలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, వాటిని ఎప్పుడో క్లియర్‌ చేశానని కేవీపీ జవాబు ఇచ్చిన క్రమంలో వారిద్దరి మధ్య దూరం పెరిగినట్లు పార్టీ వర్గాల్లో బాహాటంగానే ప్రచారం జరుగుతోంది.

ఇక ఎట్టి పరిస్థితిలో కేవీపీ తన పార్టీలోకి రారని నిర్ధా రించుకున్న జగన్‌ వర్గం ఆయన భుజంపై తుపాకి పెట్టి కాంగ్రెస్‌ పార్టీని పేల్చడంద్వారా జగన్‌ను సచ్ఛీలుడిని చేసేం దుకే జగన్‌ సురేఖ ద్వారా లేఖ రాయించినట్లు కనిపిస్తోంది. జగన్‌ అనుమతి లేకుండా సురేఖ ఇంత సాహసం చేస్తా రనుకోవడం అవివేకమవుతుంది. కేవీపీ ఒకవేళ జగన్‌కు దన్నుగా నిలిస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం కుప్పకూలేదని, అలా కాకుండా ఆయన అక్కడే ఉండటంతో పాటు.. జగన్‌ వైపు వచ్చే ఎమ్మెల్యేలను అధిష్ఠానం ఆదేశాలతో కట్టడి చేసి, సోనియాకు విధేయత చాటుకోవడం జగన్‌ శిబిరాన్ని ఆగ్రహానికి గురిచేసింది.

వైఎస్‌ సోదరుడు వివేకానంద రెడ్డిని అధిష్ఠానం వద్దకు తీసుకువెళ్లి, ఆయనను ప్రోత్సహించడం ద్వారా కుటుం బాన్ని చీల్చి, కుటుంబ ప్రతిష్ఠను మంటగలిపి, జగన్‌ బలాన్ని మానసికంగా దెబ్బకొట్టేందుకు ప్రయత్నించిన కేవీపీపై అవినీతి ఆరోపణాస్త్రాలు సంధించడం ద్వారా.. ఆయనను అటు పార్టీకి ఇటు తనను నమ్ముకున్న వారికి కాకుండా చేయాలన్న వ్యూహం కూడా సురేఖ లేఖలో స్పష్టమవుతోంది. ఇదే అంశంపై వివేకా ఢిల్లీకి వెళ్లిన రోజే ‘చక్రం తిప్పిన కేవీపీ’ అన్న శీర్షికతో సూర్యలో వార్తా కథనం వెలువడిన విషయం తెలిసిందే.

కేవీపీపై ఇప్పటికే వేల కోట్ల రూపాయల అవినీతి ఆరో పణలు ఉన్నందున, అవన్నీ వైఎస్‌తో కలిసే సంపాదిం చారని, అందులో ఇద్దరికీ వాటాలున్నయని పార్టీలు, ప్రజలు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఆ మరక జగన్‌కు అంటకుండా ముందుగానే దానిని చెరిపేసి, వాటితో జగన్‌కు ఎలాంటి సంబంధం లేదని, కేవీపీనే వైఎస్‌ను మాయచేసి డబ్బు సంపాదించారంటూ కొత్త వాదనను తెరపైకి తెచ్చేందుకు జగన్‌ వర్గం ప్రయత్నాలు ప్రారంభిం చినట్లు ఆ లేఖ చెప్పకనే చెబుతోంది.

ఆ అవినీతి సంపాద నంతా ఒక్క కేవీపీకే అంటగట్టడం ద్వారా, అలాంటి అవినీతి-అక్రమ సంపాదనకు వైఎస్‌ గానీ, ఆయన వారసుడయిన జగన్‌కు గానీ ఎలాంటి సంబంధం లేదంటూ కేవీపీని దోషిగా నిలబెట్టడమే జగన్‌ వర్గం అసలు లక్ష్యంగా స్పష్టమవుతోంది. దానితోపాటు, జిల్లాలో తన ప్రత్యర్థి అయిన టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు వెలమ అయినందున, అదే కులానికి చెందిన కేవీపీ ఆయనను రక్షించి, ఎర్రబెల్లి ఆర్థిక-రాజకీయ ప్రయోజనాలను కాపాడటంలో కేవీపీ సహకరించారని, రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు ఎర్రబెల్లి హవా సాగడానికి కారణం కేవీపీయే కారణమన్న ఆగ్రహంతో ఉను సురేఖ ఆ కోపాన్ని ఈవిధంగా ప్రదర్శించారంటున్నారు.

జనంలోకి జగన్‌ * రైతులకు జగన్ పరామర్శ

సొంత పార్టీ స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్న వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తన ఉన్నతికి కేవలం తండ్రి పేరు వినియోగించు కోవడం ఒక్కటే కాకుండా, తనకు తాను ప్రజానాయకుడిగా ఎదిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆ మేరకు ఆయన కార్యాచరణ రూపొందించుకుంటున్నారు.జగన్‌ నెల్లూరు జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వహిస్తుండగా, రాష్ట్రంలో జల్‌ తుపాను సంభవించింది. ఆ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి, రైతు లకు బాసటగా నిలిచారు. అయితే, జగన్మోహన్‌రెడ్డి మాత్రం ఓదార్పు యాత్రకే పరిమితమయ్యారు. జల్‌ తుపాను వల్ల నెల్లూరు-ప్రకాశం జిల్లాలు కూడా దెబ్బతిన్నప్పటికీ, అక్కడే ఉన్న జగన్‌.. పంట నష్టపోయిన రైతులను పరామర్శించటం గానీ, వారిని సానుభూతి ప్రకటించటం గానీ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

దానిని పరిగణనలోకి తీసుకున్న జగన్‌.. గత రెండు రోజుల నుంచి రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు నష్టపోతున్న రైతాంగాన్ని పరామర్శించి, వారికి బాసటగా నిలవాలని నిర్ణయించుకున్నారు. ఆ ప్రకారం.. ఆయన శు్ర వారం జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో రైలుమార్గం ద్వారా గుంటూరు-కృష్ణా జిల్లాలలో పర్యటించేందుకు సిద్ధమవుతు న్నారు. ఆ మేరకు ఆయా జిల్లాల నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నా రు. ఇప్పటివరకూ కేవలం తండ్రి పేరు చెప్పుకుని ప్రచారం చేసుకోవడం వల్ల సొంతగా ఎలాంటి బలం లేదని, తండ్రి పేరు- ఫొటో లేకపోతే తప్ప మనుగడ లేదన్న తప్పుడు సంకేతాలు వెళితే, భవిష్యత్తులో తాను నాయకుడిగా ఎదగడం కష్టమని గ్రహించిన జగన్‌.. ఆమేరకు తన తండ్రి పేరు వినియోగించుకోవడంతో పాటు, స్వయంగా తాను జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

అందుకే ఆయన రైతులను పరామర్శించేందుకు రైతుబాట పట్టనున్నట్లు కనిపిస్తోంది. వైఎస్‌ రైతు కష్టాలను తెలుసుకునేందుకు పాదయాత్రలతో పాటు, తరచూ జనంలోకి వెళ్లిన విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న జగన్‌.. తాను కూడా తండ్రి బాట పట్టకుండా, కేవలం ఆయన పేరును మాత్రమే వాడుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని భావించారు. దానితో ఇకపై తరచూ సమస్యలు తెలుసుకునేందుకు జనంలోకి వెళ్లాలని తీర్మానించుకు న్నట్లు కనిపిస్తోంది.
 వర్షబాధిత ప్రాంతాలైన గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నేడు, రేపు పర్యటన

నేటి ఉదయం ‘జన్మభూమి’ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరనున్న యువనేత
గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనేడు, రేపు జగన్ పర్యటన

చేతికొచ్చిన పంట కళ్ల ముందే నీళ్ల పాలవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతాంగాన్ని పరామర్శించి, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నడుం బిగించారు. శుక్ర, శనివారాల్లో ఆయన గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పర్యటించనున్నారు. వివిధ గ్రామాల్లో ధ్వంసమైన పంట పొలాలను పరిశీలించనున్నారు. జగన్ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.

శుక్రవారం పర్యటన వివరాలు

ఉదయం 7.10 గంటలకు హైదరాబాద్ నుంచి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో బయలుదే రతారు.
మధ్యాహ్నం 12.25 గంటలకు గుంటూరు జిల్లా తెనాలికి చేరుకుంటారు.
చుండూరు మండలం చినపరిమిలో వరి పొలాలను సందర్శిస్తారు.
అమృతలూరు మండలం కూచిపూడి గ్రామంలోని పంట పొలాలను పరిశీలిస్తారు.
పెదపూడి రైతులను పరామర్శిస్తారు.
అమృతలూరు మండల కేంద్రంలో, గోవాడ ప్రాంతాల్లో పర్యటిస్తారు.
చెరుకుపల్లి మండలం గుళ్లపల్లి, పొన్నపల్లి, నడింపల్లి, గూడవల్లి, కనగాల ప్రాంతాల్లో పంటనష్టాన్ని పరిశీలిస్తారు.
భట్టిప్రోలు మండలం శివంగులపాలెం వెళ్లి ఆ తరువాత భట్టిప్రోలు చేరుకుంటారు.
భట్టిప్రోలు మండలం వేమవరం, సూరేపల్లి, కోనేటిపురం ప్రాంతాలను సందర్శిస్తారు
రేపల్లె మండలం కారుమూరు, పెదవరికూటివారిపాలెం, పేటేరు ప్రాంతాల్లో పర్యటిస్తారు.
అక్కడినుంచి రేపల్లెకు చేరుకుంటారు.
రాత్రికి కృష్ణా జిల్లా అవనిగడ్డలో బసచేస్తారు.

శనివారం పర్యటించే ప్రాంతాలు

అవనిగడ్డ నుంచి బయలుదేరి బందలాయి చెరువు, వేకనూరు ప్రాంతాల్లో పర్యటిస్తారు.
నాగాయలంక మండలం తుంగలవారిపాలెం, వక్కపట్లవారిపాలెంలను సందర్శిస్తారు.
కోడూరు మండలం పోటుమీద, మందపాకల, లింగారెడ్డిపాలెం, కోడూరు, కృష్ణాపురం, జయపురం, మాచవరం, కొత్తపేట ప్రాంతాల్లో పర్యటిస్తారు.
అవనిగడ్డ మండలం అవనిగడ్డ, పులిగడ్డల్లో పొలాలను పరిశీలిస్తారు.
మోపిదేవి మండలం మోపిదేవి, పెదప్రోలు, కొత్తవానిపాలెం వెళతారు.
చల్లపల్లి మండలం చల్లపల్లి, లక్ష్మీపురం, లంకపల్లి, మాజేరు, జీలకరగ్రండిలో పంట నష్టాన్ని చూస్తారు.

బందరు మండలం గుండుపాలెం, రుద్రవరం, మచిలీపట్నం మీదుగా ఎస్‌ఎన్ గొల్లపాలెం, సీతారామపురం గ్రామాలకు చేరుకుని పంటలను పరిశీలిస్తారు. అక్కడి రైతులను పరామర్శిస్తారు.

అదేరోజు రాత్రి విజయవాడ నుంచి రైలులో బయలుదేరి హైదరాబాద్‌కు చేరుకుంటారు.

ఇది రైతాంగానికి కష్టకాలమని, వారంతా విషాదంలో మునిగి ఉన్నారని.. వారిని పరామర్శించి ధైర్యం చెప్పేందుకు జగన్‌మోహన్‌రెడ్డి వస్తున్నందున ఏ విధమైన ఆర్భాటాలకు తావివ్వరాదని సీనియర్ నేత, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ అంబటి రాంబాబు విజ్ఞప్తి చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి అభిమానులకు, నాయకులకు, కార్యకర్తలకు ఈ మేరకు మరీమరీ విన్నపం చేస్తున్నామని చెప్పారు. నాట్లు వేసినప్పటి నుంచి చివరివరకు రైతన్నలు వానలతో ఎన్నో కష్టనష్టాలకోర్చుకున్నారని, చివరకు ఎంతో కొంత చేతికి వస్తుందని ఎదురుచూస్తున్న సమయంలో మళ్లీ విరుచుకుపడిన వర్షాలు రైతుల్ని కోలుకోకుండా చేశాయని రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

మూడేళ్లు కష్టాలకు ఓర్చుకుంటే 2014 తర్వాత 30 ఏళ్లు.. స్వర్ణ పాలన ... * యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

జగన్ ఉద్ఘాటన
ఈ మూడేళ్లూ కష్టాలకోర్చుకోవాలి
ఆ తర్వాత వందేళ్లు మహానేతను మరిచిపోకుండా చేస్తా
ఆ మహానేత మరణంపై ఎన్నో అనుమానాలున్నాయి..ఒక్కటీ నివృత్తి కాలేదు
నాన్న కోసం ప్రాణాలు విడిచిన వారి కుటుంబాలను ఇంకా ఓదార్చాల్సి ఉంది
మన పార్టీ జెండా మోసే ప్రతిఒక్కరూ మనతో ఉంటారు.
మూడేళ్ల తర్వాత స్వ ర్ణపాలన * మూడేళ్లు కష్టాలకోర్చుకుంటే ఆ తర్వాత 30 ఏళ్లు స్వర్ణ పాలన అందిస్తానని యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు.
నేను రాష్ట్రంవైపు నడవాలంటే పులివెందులవాసుల ఆదరాభిమానాలుకావాలి
పులివెందుల, చక్రాయపేట మండలాల కార్యకర్తలతో జగన్‌మోహన్‌రెడ్డి భేటీ
మూడేళ్లు కష్టాలకోర్చుకుంటే ఆ తర్వాత 30 ఏళ్లు స్వర్ణ పాలన అందిస్తానని యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. పార్టీ వెంట ఎవరుంటారని భయపడాల్సిన అవసరం లేదని, మన పార్టీ జెండా మోసే ప్రతి ఒక్కరూ మనతోనే ఉంటారని.. మోయలేని వారు వెళ్లిపోతారని అన్నారు. పులివెందులలోని వైఎస్‌ఆర్ ఆడిటోరియంలో బుధవారం పులివెందుల, చక్రాయపేట మండలాల కార్యకర్తలు, నేతలతో ఆయన సమావేశమయ్యారు.

తన వెంట నడిచేవారు మూడేళ్లు కష్టాలకు ఓర్చుకుంటే 2014 తర్వాత 30 ఏళ్లు.. వైఎస్ రాజశేఖరరెడ్డి అందించిన స్వర్ణపాలనను మళ్లీ చూస్తారని కార్యకర్తల హర్షధ్వానాల మధ్య జగన్ చెప్పారు. తర్వాత 100 ఏళ్లు ప్రజలు మరిచిపోకుండా వైఎస్‌కు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం కల్పిస్తానని అన్నారు. మహానేత మరణించిన సంఘటనపై అనేక అనుమానాలున్నాయని, ఏ ఒక్క అనుమానం ఇంతవరకు తీర్చలేదని, ఎవరినీ దోషిగా చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాన్న మరణించటాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలను ఓదార్చడమే నేరమైపోయిందన్నారు. నల్లకాలువ సభలో ఇచ్చిన మాట ప్రకారమే ముందుకు నడిచానన్నారు.

తాను, అమ్మ విజయమ్మ ఆత్మగౌరవం చంపుకుని అడిగినా సోనియాగాంధీ ఓదార్పుయాత్రకు అంగీకరించలేదని చెప్పారు. అయినప్పటికీ సచ్ఛీలతను, వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడానికి కష్టాలబా టలోనే నడవడానికి నిర్ణయించుకున్నానని వివరించారు. తర్వాత అడుగడుగునా తనను, తన కుటుంబాన్ని అవమానించారని తెలిపారు. కాంగ్రెస్‌లో ఉండి మాట్లాడితే క్రమశిక్షణ గల కార్యకర్తను కానని అన్నీ ఓర్చుకున్నట్లు చెప్పారు. చివరకు కుటుంబాన్ని చీల్చేందుకు కూడా సిద్ధపడ్డారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి రెండుసార్లు ప్రధాని కుర్చీలో కూర్చొనే అవకాశం ఎవరి వల్ల వచ్చింది?’ అని యువనేత ప్రశ్నిస్తుండగానే, కార్యకర్తలు పెద్దపెట్టున ‘వైఎస్ రాజశేఖరరెడ్డి’ అంటూ కేకలు వేశారు. అటువంటి రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని చీల్చే నీచ రాజకీయాలకు కూడా ఒడిగట్టారని జగన్ ఆవేదనగా మాట్లాడుతుంటే సమావేశంలో మౌనం రాజ్యమేలింది. అనేకమంది మహిళలు కంట తడి పెట్టడం కన్పించింది. కాంగ్రెస్‌లోనే ఉన్నా తన ఇంటిపై, సాక్షి పత్రికపై పోలీసులతో దాడులు చేయించారని చెప్పారు. నీచ రాజకీయాల వెనుక సోనియాగాంధీ ఉన్నారని తెలిసి ఎంతో బాధపడ్డానని తెలిపారు. ‘ఏది మాట్లాడినా క్రమశిక్షణ తప్పినట్లవుతుందనుకున్నాను. బయటకు వచ్చాను. మరో 45 రోజుల్లో ఇడుపులపాయలో నాన్న సమాధి సాక్షిగా మన పార్టీ, మనజెండా వస్తుంది’ అని జగన్ సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఉప ఎన్నికలు సెమీఫైనల్స్ అంటూ 2014లో జరగబోయే ఎన్నికల్ని ఫైనల్స్‌గా అభివర్ణించారు. ‘నేను రాష్ట్రం వైపు నడవాలంటే పులివెందులవాసుల ఆదరాభిమానాలు కావాలి. నాన్నను ఏ విధంగా ఆదరించారో, అనురాగంతో అభిమానించి రాష్ట్రంవైపు పంపారో, ఆ ప్రేమ ఆప్యాయతలతో ఆశీర్వదించి పంపండి’ అని విజ్ఞప్తి చేశారు.

పాపకు విజయలక్ష్మిగా నామకరణం

వేముల మండలం భూమయ్యగారిపల్లెకు చెందిన ప్రకాష్‌రెడ్డి, లక్ష్మి దంపతుల కుమార్తెకు విజయలక్ష్మి అని జగన్ పేరు పెట్టారు. బుధవారం వారు యువనేతను కలిసి తమ పాపకు నామకరణం చేయాలని కోరడంతో ఆయన పేరు పెట్టారు.

జగన్ పార్టీకి రూ. 1.11 లక్షల విరాళం

జగన్ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించడంతో తమవంతు విరాళాలు అందించేందుకు దాతలు ముందుకొస్తున్నారు. బుధవా రం పులివెందుల మండల మాజీ ఉపాధ్యక్షుడు ఎం.పుష్పనాథరెడ్డి పార్టీ ఫండ్ కింద రూ.1.11 లక్షల విరాళాన్ని చెక్కు రూపంలో యువనేతకు అందజేశారు. కార్యక్రమంలో ఈసీ గంగిరెడ్డితోపాటు వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి తదితరులున్నారు. ఎంపీ పదవికి, కాంగ్రెస్‌కు రాజీనామా చేశాక ఈనెల 1న ఇడుపులపాయకు వచ్చిన జగన్‌కు పెండ్లిమర్రి మండలం కొండూరు గ్రామ మాజీసర్పంచ్ చింతకుంట నాగిరెడ్డి రూ.10,305 తొలి విరాళంగా అందించడం తెలిసిందే.

45 రోజుల్లో మన పార్టీ ..... మూడేళ్లు ఓర్చుకుంటే 30 ఏళ్లు వైఎస్ సువర్ణ పాలన అందిస్తా... : జగన్

ఇడుపులపాయలో నాన్న సమాధి సాక్షిగా ఆవిర్భవిస్తుంది....
కడప, పులివెందుల ఉప ఎన్నికలు సెమీ ఫైనల్స్.. 2014 ఎన్నికలు ఫైనల్స్
మూడేళ్లు ఓర్చుకుంటే 30 ఏళ్లు వైఎస్ సువర్ణ పాలన అందిస్తా...
మన జెండా పైనే వచ్చే ఉప ఎన్నికల్లో పోటీ
ఇది విలువలు, విశ్వసనీయత, తెలుగింటి ఆత్మగౌరవానికి...
కుళ్లు, కుతంత్రాలకు మధ్య పోటీ కాంగ్రెస్‌లో ఎన్నో అవమానాలకు గురిచేశారు

కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమైన మహానేత కుటుంబాన్ని చీల్చేందుకు తెగించారు

నీచ రాజకీయాలకు పాల్పడ్డారు
ఆత్మగౌరవం చంపుకోలేకబయటకు వచ్చేశా
పులివెందుల నియోజకవర్గ కార్యకర్తలతో వైఎస్ జగన్ భేటీ


‘మరో 45 నుంచి 60 రోజుల్లో మన పార్టీ వస్తుంది. ఇడుపులపాయలో నాన్న సమాధి సాక్షిగా ఇది ఆవిర్భవిస్తుంది. మన పార్టీ జెండాపైనే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తాం. ఈ ఎన్నికలు సెమీ ఫైనల్స్. 2014 ఎన్నికలు ఫైనల్స్’ అని యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ‘నాతోపాటు నడిచే వారికి మూడేళ్లు కష్టాలుంటాయి. మూడేళ్లు ఓపికపడితే వైఎస్ సువర్ణరాజ్యాన్ని 30 ఏళ్లు అందిస్తా. మీరు నాన్నను దీవించినట్లే నన్ను దీవించాలి.. మీ అభిమానం, ఆప్యాయత, అనురాగాలు ఉప్పెనలా పొంగాలి’ అని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. జగన్ మంగళవారం కడప జిల్లా పులివెందులలోని వైఎస్‌ఆర్ ఆడిటోరియంలో నియోజకవర్గ కార్యకర్తలతో మండలాలవారీగా సమావేశమయ్యారు. ఉదయం సింహాద్రిపురం, తొండూరు, మధ్యాహ్నం లింగాల, సాయంత్రం వేముల మండలాల నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. నల్లకాలువ సభలో ఇచ్చిన మాట మేరకు తాను ఓదార్పుయాత్ర చేపట్టడం, కాంగ్రెస్ అధిష్టానం వద్దనడం, రకరకాల ఆటంకాలు కల్పించడం, పార్టీకి రాజీనామా చేసే పరిస్థితులు కల్పించడం..చివరకు కాంగ్రెస్ పార్టీ ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో అధికారంలోకి రావడానికి కారణమైన మహానేత కుటుంబంలోనే చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించడాన్ని వివరిస్తూ జగన్ ఆద్యంతం ఉద్వేగభరితంగా మాట్లాడారు.

‘నల్లకాలువ సంతాప సభకు లక్షలాదిమంది గుండెబరువుతో తరలి వచ్చారు. నాన్న మరణాన్ని భరించలేక ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మరెంతోమంది ఆవేదనతో రోజుల తరబడి అన్నం మానేసి చనిపోయారు. అప్పుడనిపించింది. నాన్న నా ఒక్కడి మనిషే కాదు. రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో ఉన్నాడని. నాకు పెద్ద కుటుంబాన్ని ఇచ్చిపోయాడని. ఆ నల్లకాలువ సభలో నేను మాటిచ్చాను. నాన్న కోసం చనిపోయిన వారి ఇళ్ల తలుపులు తట్టి వారి కుటుంబాన్ని ఓదార్చి వారికి అండగా ఉంటానని. కానీ అధిష్టానం ఓదార్పు వద్దంది. నేను, భర్త చనిపోయిన బాధలోనూ ఆత్మగౌరవం చంపుకుని అమ్మ.. సోనియా గారి వద్దకెళ్లి ఒప్పించేందుకు ప్రయత్నించాం. అయినా ఆమె మనసు కరగ లేదు. జిల్లాకో సభ పెట్టి అందరినీ అక్కడికి పిలిచి సహాయం చేయమన్నారు. అసలు నాన్న కోసం చనిపోయిన కుటుంబాలు నా సహాయం ఏమైనా అడిగాయా? లేదే?

నాన్న చెప్పినట్లే నడుచుకున్నా..

ఎవరైనా చనిపోతే వారింటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించడం.. వారి కష్టసుఖాలు పంచుకోవడం తెలుగింటి సంప్రదాయం. నాన్న కోసం చనిపోయినవారు నా ఆత్మబంధువులని మనసావాచా నమ్మా. అందుకే ముందడుగు వేశా. అప్పుడు కూడా బాగా ఆలోచించా. అప్పుడు నాకు నాన్న నేర్పిన మాట గుర్తొచ్చింది. ‘మాట ఇస్తే కష్టమైనా, నష్టమైనా మడమ తిప్పకుండా ముందుకుపోవాలని. ఎన్నాళ్లు బతికామన్నది ముఖ్యం కాదు.. బతికినన్నాళ్లూ ఎలా బతికామన్నది ముఖ్యమని’. నాన్న చెప్పిన మాట ప్రకారం ఆ బాటలోనే ముందుకు వెళ్లా. యాత్రను సోనియాగారు వద్దన్నప్పుడు నా ముందున్నది రెండే మార్గాలు. సోనియాగాంధీ చెప్పినట్లు..ఇచ్చిన మాటను మరిచి ఆత్మగౌరవం చంపుకుని రాజకీయ భవిష్యత్తు చూసుకోవడం ఒకటైతే.. నాన్న చనిపోయారనే బాధతో గుండె పగిలిన వారి కుటుంబాల వద్దకు వెళ్లి నేనున్నానని ఓదార్చడం, సచ్ఛీలతను, వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడం రెండవది. నేను రెండవ బాటనే ఎంచుకున్నాను. అదే నేరమైంది. నాకు తోడుగా నిలిచినవారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కష్టనష్టాలకు గురిచేశారు. ఓదార్పులో పాల్గొనకుండా ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు. సీఎంలతో, మంత్రులతో చెప్పించారు. వైఎస్ కోసం చనిపోయినవారు, వారి కుటుంబాలు ఓట్లేస్తేనే కదా.. మీరు గెలిచింది అని నేను ఎమ్మెల్యేలను కూడా అడిగా.

అడుగడుగునా అవమానించారు..

అడుగడుగునా నన్ను, నా కుటుంబాన్ని అవమానించారు. నా ఇంటిపై, సాక్షిపై పోలీసులతో దాడులు చేయించారు. సొంత పార్టీ వారినే ఉసిగొలిపారు. బీజేపీయో, టీడీపీనో అలా చేస్తే నేను రోడ్డెక్కి ధర్నా చేసేవాడిని. సొంత పార్టీవారే చేస్తే ఎవరికి చెప్పుకోవాలి. అన్నీ సహించా. చివరకు రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న పిల్లవాడిని అడిగినా రేపోమాపో జగన్‌ను పార్టీ నుంచి బయటకు పంపిస్తారు అని సమాధానం చెప్పేలా చేశారు. మా కుటుంబాన్ని కూడా చీల్చే కుట్రకు పాల్పడ్డారు. ఎవరి కుటుంబాన్ని వారు చీల్చాలనుకుంది? కాంగ్రెస్ కష్టాల్లో ఉన్నప్పుడు అనారోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా, మండుటెండలో వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన మహానేత వైఎస్ కుటుంబాన్ని. పేదల సంక్షేమం కోసం దేశంలో మరెక్కడాలేని విధంగా వినూత్నరీతిలో పథకాలు చేపట్టి రాష్ట్రంలో రెండోసారి పార్టీని అధికారంలోకి తేవడంతో పాటు 33 మంది ఎంపీలను పార్లమెంటుకు పంపి కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడటానికి ప్రధాన కారణమైన వ్యక్తి కుటుంబాన్ని. అమ్మ సోనియా అపాయింట్‌మెంట్ అడిగితే నెలరోజులు తర్వాత ఇచ్చారు. చిన్నాన్నను ఢిల్లీకి పిలిచి రెండురోజుల్లోనే అపాయింట్‌మెంట్ ఇచ్చారు. కుటుంబాన్ని చీల్చేందుకు ప్రయత్నించారు. అప్పుడనిపించింది. రాజకీయాల కోసం వీరు ఎంతకైనా తెగిస్తారని.. వెన్నుపోటు పొడవడానికి కూడా వెనుకాడరని.

విలువలు లేనిచోట ఇమడటం నావల్ల కాదనిపించింది...

కనీస మానవత్వం, విలువలు లేని చోట ఇమడటం నావల్ల కాదనిపించింది. రాజీనామా చేశా. ఈ ప్రత్యేక పరిస్థితులలో రాష్ట్రంతో పాటు దేశం చూపు ఉప ఎన్నికలపై ఉంది. మరో 45-60 రోజుల్లో ఇడుపులపాయలో నాన్న సమాధి సాక్షిగా మన పార్టీ వస్తుంది. మనజెండా మీదే ఎన్నికలకు వెళతాం. ఒక మంచి ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్రం దశ, దిశ ఎలా మార్చవచ్చో చేసి చూపించిన మహానేత వైఎస్సార్. రామ రాజ్యం నేను చూడలేదు కానీ.. రాజశేఖరుని సువర్ణ రాజ్యం చూశా. వైఎస్ రాజ్యం ఎలా ఉండేదో ఆదినారాయణరెడ్డి లాంటి ఎమ్మెల్యేలు కొందరు చెప్పారు. నాతోపాటు నడిచే వారికి మూడేళ్లు కష్టాలుంటాయి. కానీ మీరు మూడేళ్లు ఓపికపడితే వైఎస్ సువర్ణరాజ్యాన్ని 30 ఏళ్లు అందిస్తా. కాంగ్రెస్ పార్టీ పక్కకెళ్లి పోతుంది. కాంగ్రెస్ పార్టీ ఎంత నీచమైన రాజకీయాలైనా చేయవచ్చు. చిన్నాన్నను పావుగా వాడుకునే కుతంత్రాలకు కూడా దిగొచ్చు. ఇప్పుడు జరగబోయే ఉప ఎన్నికలు సెమీ ఫైనల్స్. 2014లో జరగబోయే ఎన్నికలు ఫైనల్స్. ఈ ఎన్నికల్లో ఒకవైపు సచ్ఛీలత, విలువలు, విశ్వసనీయత, తెలుగింటి ఆత్మగౌరవం నిలబడితే.. మరోవైపు కుళ్లూకుతంత్రం, కుటిల రాజకీయాలు పోటీ పడబోతున్నాయి.

మీ ఆప్యాయత, అనురాగాలు
ఈ పులివెందుల బిడ్డపై ఉప్పొంగాలి



దేవుని దయ, నాన్న ఆశీస్సులు, మీ ఆదరాభిమానాలే నన్ను రాష్ట్రం వైపు నడిపిస్తాయి. నాన్న కోసం ప్రాణాలు విడిచిన వారి కుటుంబాలెన్నిటినో ఇంకా ఓదార్చాల్సి ఉంది. నేను రాష్ట్రంవైపు చూస్తున్నప్పుడు, జిల్లాల్లో ఉన్నప్పుడు అమ్మ విజయమ్మ పులివెందులలో ఉంటారు. నేను ఎక్కడ ఉన్నా నా గుండె పులివెందులలోనే ఉంటుంది. అక్కగా, మహానేత సతీమణిగా, పేదల ఆడపడుచుగా నియోజకవర్గవాసులు అమ్మను ఆదరించాలి. మీకు ఏ సమస్య వచ్చినా చిన్నాన్న వైఎస్ భాస్కర్‌రెడ్డి, మామ గంగిరెడ్డి లాంటి వారుంటారు. నాన్నను ఏ విధంగా ఆదరించి ఉన్నత స్థాయికి పంపారో, అదే ప్రేమ.. ఆప్యాయతలు ఉప్పెనలా ఈ పులివెందుల బిడ్డపై పొంగాలి. నన్ను దీవించాలి. ప్రతి ఇంటి మీద మన పార్టీ జెండా ఎగరాలి. నన్ను ఆశీర్వదించి పంపండి.’ అని జగన్‌మోహన్‌రెడ్డి వినమ్రంగా కార్యకర్తల హర్షధ్వానాల మధ్య చేతులెత్తి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశాల్లో వైఎస్‌ఆర్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు కె సురేష్‌బాబు, జెడ్పీ చైర్‌పర్సన్ జ్యోతిరెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, డాక్టర్ ఈసీ గంగిరెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాలుగు మండలాల నుంచి వేలాది మంది కార్యకర్తలు, గ్రామ నాయకులు తరలివచ్చారు.
టార్గెట్‌ - 2014 ?
Jagan-srii
సొంత పార్టీ స్థాపనకు రంగం సిద్ధం చేసు కుంటున్న జగన్‌ పరుగెత్తి పాలుతాగకుండా, నిలబడి నీళ్లుతాగేలా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర రాజ కీయాల్లో పాతుకుపోవాలంటే తాత్కాలిక ఆరాటం కాకుండా, సుదీర్ఘ లక్ష్యం అవసరమని గ్రహించిన జగన్‌, ఆ మేరకు తన రాజకీయ భవితవ్యాన్ని ఇప్పటినుంచే జాగ్రత్తగా ఆచితూచి చక్కదిద్దుకుంటున్నారు. మంగళ వారం తన అనుచరులతో ఏర్పాటుచేసిన సమావేశంలో జగన్‌ ప్రసంగాన్ని నిశితంగా పరిశీలిస్తే.. ఆయన రాజకీయ భవిష్యద్దర్శనమేమిటన్నది స్పష్టమవుతుంది.

మరో రెండు నెలల్లో సొంత పార్టీ స్థాపనకు రంగం సిద్ధం చేసుకుంటున్న జగన్‌ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఎక్కడా తొందరపడుతున్నట్లు కాకుండా, దీర్ఘకాలిక లక్ష్యం, వ్యూహంతో ముందుకు వెళ్లనున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ మేరకు ఆయన తన బాడీలాంగ్వేజ్‌, స్టైల్‌ను కూడా మార్చుకున్నట్లు కనిపిం చింది. గతంలో తండ్రి వైఎస్‌ మాదిరిగా ప్రతిదానికీ దీర్ఘాలు తీస్తూ, ఆయనను అనుకరించిన జగన్‌, నేటి సమావేశంలో మాత్రం ఆర్థ్రత, ఆవేదన, హందాతనాన్ని కలగలిపి ప్రసంగం చేయటం ప్రస్తావనార్హం. తనపై సాధ్యమయినంత ఎక్కువ సానుభూతి మిగిలించుకునే రీతిలో ఆయన ప్రసంగం కొనసాగింది.

ఇక.. కాంగ్రెస్‌ సర్కారును కూల్చే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదన్న విషయాన్ని జగన్‌ మరోసారి స్పష్టం చేశారు. దీనిపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. ప్రభుత్వం తనంతట తాను కూలిపోతే అందుకు తన బాధ్యత లేదని, తాను మాత్రం అధికారం కోసం వెంప ర్లాడటం లేదని, తనకు ఓ సుదీర్ఘమైన రాజకీయ లక్ష్యం ఉందని పరోక్షంగా స్పష్టం చేశారు. అదే సమయంలో ఎమ్మెల్యేలలో తిరుగుబాటు వచ్చి ప్రభుత్వం పడిపోతుం దన్న అంచనా కూడా లేకపొలేదు. 2014లో జరిగే ఎన్నికల్లో తన పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందన్న విశ్వాసం, ధీమా ఆయన మాటల్లో స్పష్టమయింది.

మూడేళ్లు కష్టాలుంటాయని, ఆ తర్వాత వందేళ్లు సుఖంగా ఉండవచ్చని చేసిన వ్యాఖ్యలు.. మూడేళ్ల వరకూ తనను నమ్ముకుని ఉన్న వారంతా సుఖాలు త్యాగం చేయడంతోపాటు, ప్రభుత్వం నుంచి ఎదురయ్యే కష్టాలను ఎదుర్కొని, తనకు అండగా నిలవాలని జగన్‌ తన వర్గీ యులకు చెప్పకనే చెప్పారు.అంటే ప్రభుత్వం తతపై, తన అనుచరవర్గంపైక సాధింపులకు దిగుతుందని జగన్‌ ముందుగానే ఊహించి, ఆ మేరకు తన అనుచరులను మానసికంగా సిద్ధం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

ఎమ్మెల్యేలను చీల్చి, ఆ తర్వాత ప్రభుత్వాన్ని పడగొట్టడం ద్వారా తాను ఇప్పటికిప్పుడు సీఎం కావాలన్న తొందర తనకేమీ లేదని జగన్‌ విస్పష్టమైన సంకేతాలిచ్చి, వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి, సంస్థాగ తంగా కాంగ్రెస్‌ నాయకత్వానికి ఊరట కలిగించారు. అయితే, పార్టీ స్థాపించిన తర్వాత తనుమద్దతుదారు లయిన ఎమ్మెల్యేలు తన గూటిలోకి వస్తే.. అప్పుడు జరిగే సంక్షోభంలో ప్రభుత్వం పతనమవుతే దానికి తన బాధ్యత లేద న్న సంకేతాలు కూడా జగన్‌ సందేశంలో లేకపోలేదు.

ముందు సంస్థాగతంగా పార్టీని పటిష్ఠం చేసుకుని, క్షేత్ర స్థాయిలో పార్టీని విస్తరించడం ద్వారా.. కాంగ్రెస్‌, టీడీపీ లకు ధీటుగా ఎన్నికల యుద్ధరంగంలో నిలవాలన్న లక్ష్యం తోనే జగన్‌ ఎక్కడా తొందరపడకుండా నిర్ణయాలు తీసు కుంటున్నారు. ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘకాలం కొనసాగాలని నిర్ణయిం చుకున్నందున తన అడుగులు, నిర్ణయాలు, వ్యవహారశైలి కూడా వ్యూహాత్మకంగా, తొందరపాటులేకుండా ఉండా లని భావిస్తున్నారు. జగన్‌ తన ప్రతర్థిగా కాంగ్రెస్‌ పార్టీనే ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. ప్రధానంగా ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ.. కాంగ్రెస్‌ పార్టీని రెండుసార్లు ప్రాణా లొడ్డి అధికారంలోకి తెచ్చిన తన తండ్రి వైఎస్‌ కుటుంబాన్ని చీల్చేందుకు ప్రయత్నించారన్న ప్రచారం ద్వారా ఆమెపై ఇప్పటివరకూ మహిళలో ఉన్న సానుకూలతను చెరిపివేసి, దానిస్థానంలో వ్యతిరేక ముద్రను ప్రతిష్ఠింపచేయాలన్నదే జగన్‌ అసలు వ్యూహంలా కనిపిస్తోంది.