Friday, January 28, 2011

వైఎస్ అడుగులు...


పోలవరంతోపాటు ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా: జగన్ డిమాండ్
7న ప్రారంభం కానున్న యువనేత పాదయాత్ర... 9న పోలవరంలో బహిరంగ సభ

మెట్ట ప్రాంతాల్లోనూ పాదయాత్ర చేపట్టాలని అభ్యర్థనలు.. ఈ నేపథ్యంలో ఆదివారం ఖరారు కానున్న షెడ్యూలు... వివరాలు వెల్లడించిన మాజీ మంత్రి బోస్


 బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరంతోపాటు ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా కల్పించాలన్న డిమాండ్‌తో వచ్చేనెల 7 నుంచి యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర నిర్వహించనున్నారని మాజీ మంత్రి, రామచంద్రపురం ఎమ్మెల్యే పిల్లి సుభాష్‌చంద్రబోస్ వెల్లడించారు. శుక్రవారం ఇక్కడి సీఆర్సీ ఓల్డేజ్ హోమ్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యువనేత పాదయాత్ర షెడ్యూల్ వివరించారు. యాత్ర 7న రావులపాలెంలో ప్రారంభమవుతుందని, 9వ తేదీన పోలవరంలో ముగుస్తుందని, అనంతరం అక్కడ బహిరంగ సభ జరుగుతుందని బోస్ వివరించారు. 70 కిలోమీటర్ల మేర మూడ్రోజులపాటు ఈ పాదయాత్ర సాగుతుందన్నారు. అయితే ఈ ప్రాజెక్టు వల్ల మెట్ట ప్రాంతాలకు అధిక ప్రయోజనం కలుగనున్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో కూడా పాదయాత్ర జరపాలని అభ్యర్థనలు వస్తున్నాయని అన్నారు. దీనిపై చర్చించేందుకు ఆదివారం ముఖ్యులతో సమావేశమై యాత్ర తాలూకు తుది షెడ్యూలు ఖరారు చేస్తామని సుభాష్ చంద్రబోస్ శుక్రవారం రాత్రి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, కృష్ణా డెల్టా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలకు మేలు జరుగుతుందని బోస్ పేర్కొన్నారు.


ఉభయ గోదావరి జిల్లాల్లోని 10.20 లక్షల ఎకరాలు సాగులోకి రావడంతోపాటు వైఎస్‌ఆర్ హయాంలో ప్రారంభించిన ఎల్లంపల్లి, దుమ్ముగూడెం తదితర ఏడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు అవసరైమైన 69 టీఎంసీల నీరు అందుతుందన్నారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ధవళేశ్వరం బ్యారేజ్‌కు 78 టీఎంసీల ఇన్‌ఫ్లో వస్తుందన్నారు. పోలవరం పూర్తి కాకుంటే ఉభయ గోదావరి జిల్లాల రైతులకు మొదటి పంట కూడా పండించుకోలేని ప్రమాదం పొంచి ఉందని బోస్ తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజ్ పరిధిలో సాగుభూమి పూర్తిగా వినియోగంలోకి రావాలంటే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను నిర్మించాల్సిందిగా సర్ ఆర్థర్ కాటన్ గతంలోనే సూచించారని బోస్ గుర్తు చేశారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న దివంగత నేత వైఎస్ పోలవరానికి శ్రీకారం చుట్టారన్నారు. ఆయన హయాంలో పూర్తయిన 35 శాతం పనులు తప్ప పోలవరం ప్రాజెక్టు ముందుకు సాగడం లేదని బోస్ విమర్శించారు. వివిధ శాఖలకు చెందిన 17 రకాల అనుమతులతోపాటు ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ అనుమతి ఉన్నా పోలవరానికి జాతీయ హోదా ప్రకటించకుండా కేంద్రం నిరంకుశత్వంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. వైఎస్ బతికుండగా ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో ముంపు సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అవగాహన చేసుకున్నా, కేంద్రం రోజుకో కొర్రీ వేస్తూ కాలయాపన చేస్తోందన్నారు.


పోలవరం పూర్తయితే ఐదు జిల్లాల్లో సుమారు 22.70 లక్షల ఎకరాలకు సమృద్ధిగా సాగునీరు అందుతుందని, 80 టీఎంసీల నీరు కృష్ణాకు మళ్లించే అవకాశం ఉంటుందని బోస్ వివరించారు. దీంతో కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరించడంతో పాటు శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా రాయలసీమ, తెలంగాణకు మరింత నీరు అందించవచ్చని తెలిపారు. అంతేకాకుండా 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, 520 గ్రామాలకు తాగునీటి అవసరాలు, ఏలేరు ఆయకట్టుకు పుష్కలంగా నీరు వంటి ఎన్నో ప్రయోజనాలున్నాయన్నారు. పోలవరానికి జాతీయ హోదా కల్పిస్తే ఐదేళ్లలో ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ ఇందుకోసం నడుం బిగించాలని బోస్ పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్టు ప్రారంభ సమయంలో పుష్కర ఎత్తిపోతల పథకం అవసరం లేదని ఎందరో నిపుణులు సూచించినా వైఎస్.. వెనుకడుగు వేయలేదన్నారు. మరో రూ. 168 కోట్లు మంజూరు చేస్తే పుష్కర పనులు పూర్తయ్యే అవకాశం ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఉభయ గోదావరి జిల్లాల రైతుల ఆందోళనను గుర్తించిన జగన్ పాదయాత్ర చే యాలన్న నిర్ణయం తీసుకున్నారని, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ పాదయాత్రలో పాల్గొని యువనేతకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, వెదిరేశ్వరం సర్పంచ్ బొక్కా వెంకటలక్ష్మి,రావులపాలెం నీటి సంఘం అధ్యక్షుడు గొలుగూరి మునిరెడ్డి, రావులపాలెం కాంగ్రెస్ మైనార్టీసెల్ అధ్యక్షుడు మన్యం భాను, సీఆర్‌సీ అధ్యక్షుడు మల్లిడి కనికిరెడ్డి, సీఆర్‌సీ మెంబర్ కర్రి సత్తిరెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోపెల్ల మల్లి, సీఆర్‌సీ మాజీ అధ్యక్షుడు ద్వారంపూడి వెంకటరెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి కముజు సత్యనారాయణ, ఆర్‌వీవీ సత్యనారాయణచౌదరి, నీరజారాణి తదితరులు పాల్గొన్నారు.

Wednesday, January 26, 2011

‘' విశ్వాసానికి '’ దమ్ముందా?


సీఎంకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సవాల్

* విశ్వాస పరీక్షకు తక్షణం తేదీ నిర్ణయించాలి...* అవిశ్వాస తీర్మానం విషయంలో చంద్రబాబు, కిరణ్ కుమ్మక్కయ్యారు* వైఎస్ ప్రతిష్టను దిగజార్చజూడటం విజ్ఞత కాదు... * సీఎంతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఆయన బొమ్మతోనే గెలిచారు* వైఎస్ వల్లే గెలిచాం, అందుకే జగన్ వెంట... లేదంటే ప్రజలు క్షమించరు: పిల్లి* వైఎస్ చెమటోడ్చి తెచ్చిన ప్రభుత్వాన్ని పడగొట్టాలని యువనేతకు లేదు... మమ్మల్ని రెచ్చగొడితే ఏం జరుగుతుందో చెప్పలేం* వైఎస్ బొమ్మతో గెలిచినవారు రాజీనామాలు చేస్తే మేమూ రాజీనామాలకు సిద్ధం* జగన్‌పై ఆరోపణలతో పోయేది సీఎం ప్రతిష్టే
రాజీనామాలు చేయాలని తమను కోరుతున్న ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే తక్షణం శాసనసభ విశ్వాసాన్ని కోరాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సవాల్ విసిరారు. విశ్వాస పరీక్షకు వెంటనే తేదీ నిర్ణయించాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు జి.బాబూరావు, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడుతున్న కిరణ్ వ్యవహారశైలిపై వారు నిప్పులు చెరిగారు. తన తండ్రి కష్టపడి అధికారంలోకి తెచ్చిన ప్రభుత్వాన్ని పడగొట్టాలని గానీ, అస్థిర పర్చాలని గానీ యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఏ కోశానా లేదన్నారు. కానీ తమను రెచ్చగొడితే భవిష్యత్తులో ఏం జరుగుతుందో మాత్రం చెప్పజాలమని హెచ్చరించారు.

‘‘మేం వైఎస్ విధేయులం. ఆయన వల్లే, ఆయన ప్రతిష్ట వల్లే, ఆయన సంక్షేమ కార్యక్రమాల వల్లే గెలిచాం. అందులో ఎలాంటి అనుమానమూ లేదు. ఇంకా చెప్పాలంటే వైఎస్ బొమ్మతోనే గెలిచాం. అందుకే ప్రజా ఉద్యమాల్లో జగన్ వెంట ఉంటున్నాం. ఈ సమయంలో జగన్ వెంట ఉండకపోతే ప్రజలు మమ్మల్ని క్షమించరు’’ అని సుభాష్‌చంద్రబోస్ అన్నారు. తామే గాక కిరణ్‌తో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా వైఎస్ పేరు చెప్పే, ఆయన బొమ్మతోనే గెలిచారని స్పష్టం చేశారు. వారంతా రాజీనామాలు
చేస్తే తామూ అందుకు సిద్ధమేనన్నారు. రాజీనామా చేసి మళ్లీ పోటీ చేద్దామని సవాలు విసిరారు. వైఎస్ పేరు చెప్పకుండా గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నారేమో చెప్పాలని ప్రశ్నించారు. ‘‘రాష్ట్రంలో అథఃపాతాళంలో ఉన్న కాంగ్రెస్‌ను చెమటోడ్చి రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన ఘనత వైఎస్‌దే. మేమంతా కాంగ్రెస్ హస్తం గుర్తుతో ఎమ్మెల్యేలుగా ఎన్నికైనా దాని వెనక ఉన్న కృషి మాత్రం వైఎస్‌దే. అందుకే ఆయన అభిమానులుగా జగన్‌ను బలపరుస్తున్నాం’’ అని ఒక ప్రశ్నకు బోస్ బదులిచ్చారు. దేశమంతటా పేరు, ప్రాచుర్యం పొందిన వైఎస్‌కు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అపాయింట్‌మెంట్ తానే ఇప్పించానని కిరణ్ చెప్పుకోవడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు.

‘‘ఎమ్మెల్యే, మంత్రిగా, ఎంపీగా పని చేసిన ఓటమి ఎరగని నేత వైఎస్. దేశంలో అందరికీ తెలిసిన ఆయనకు రాష్టప్రతి, ప్రధాని అపాయింట్‌మెంట్ కోసం మరొకరితో సిఫార్సు చేయించుకునే అగత్యం ఎప్పుడూ ఏర్పడలేదు. ఇక వైఎస్ తననేదో అనైతికమైన పని చేయమంటే తాను చేయలేదన్నట్టు కిరణ్ దుష్ర్పచారం చేస్తున్నారు, ఇదెంతవరకు సబబు?’’ అని ప్రశ్నించారు. ఇలా మాట్లాడటం ఆయనకు విజ్ఞత అనిపించుకోదని హితవు చెప్పారు. ‘‘రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయిన వైఎస్‌కు స్పీకర్ చేసిపెట్టగలిగే అనైతికమైన పని ఏముంటుంది? జీవించి లేని వ్యక్తి గురించి ఇలా మాట్లాడటం తగునా?’’ అని సూటిగా ప్రశ్నించారు.

జగన్‌ను తానేదో హత్య కేసు నుంచి కాపాడినట్టుగా కిరణ్ చెప్పుకోవడం తగదంటూ చురకలు వేశారు. ‘‘అవాస్తవాలని తెలిసి కూడా విపక్షాలు కొన్నిసార్లు అసెంబ్లీలో అధికార పక్షంపై ఆరోపణలు చేస్తుంటాయి. వాటికి బదులివ్వడం, సభా నాయకుని తరఫున మాట్లాడ్డం చీఫ్ విప్‌గా కిరణ్ ధర్మం. అంతమాత్రాన, ఏదో తానే వాదించి హత్య కేసు నుంచి జగన్‌ను రక్షించినట్టుగా మాట్లాడటం ఏమాత్రం సబబుగా లేదు’’ అన్నారు. ‘‘వైఎస్, ఆయన కుమారుడిపై కిరణ్ వ్యాఖ్యలకు వైఎస్ అభిమానులుగా మేం బాధపడుతున్నాం. రాష్ట్రంలోని లక్షలాది మంది వైఎస్ అభిమానులు కూడా కలత చెందుతున్నారు. జగన్ ప్రతిష్టను దెబ్బ తీసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. కానీ ప్రజా సమస్యలపై పార్టీని వీడి మరీ పోరాడుతున్న ఆయన ప్రతిష్టకు కించిత్ కూడా భంగం కలగదు. అలాంటి ఆరోపణలు చేయడం వల్ల సీఎం ప్రతిష్టే తగ్గుతుందని హితవు చెప్పారు.

తాము సంయమనంతో మౌనం పాటిస్తున్నా సీఎం రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారని బాబూరావు తీవ్రంగా ఆగ్రహించారు. ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. రెచ్చగొడితే ప్రభుత్వాన్ని కూలుస్తారా అని ప్రశ్నించగా, అనవసరంగా తమను ఎగదోస్తే మాత్రం ప్రభుత్వం ఉంటుందో, కూలుతుందో చెప్పలేమన్నారు. తమను రాజీనామాలు కోరుతున్నారు కనుకనే విశ్వాస పరీక్షకు డిమాండ్ చేస్తున్నామని స్పష్టం చేశారు.

కిరణ్, బాబు కుమ్మక్కు: బాలినేని
నైతికత గురించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి, పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవిని పిలిపించి ఆయనను అక్కున చేర్చుకోవాలని చూడటం అనైతికం కాదా అని బాలినేని నిలదీశారు. కిరణ్ సీఎం కాగానే కాంగ్రెస్‌లోని 156 మంది ఎమ్మెల్యేలను కాదని చిరంజీవికి ఉప ముఖ్యమంత్రి, మంత్రి పదవులు ఇవ్వజూపడం సరైందేనా అని ప్రశ్నించారు. జగన్ సీఎం కావాలంటూ సంతకాలు చేయించడం సరైందేనా అని ప్రశ్నించగా, ఆ వ్యవహారంతో యువనేతకు ఏ మాత్రం సంబంధం లేదని బాలినేని బదులిచ్చారు. ఎవరో కొందరు వ్యక్తిగతంగా అలా సంతకాలు చేయించారని చెప్పారు. అవిశ్వాస తీర్మానం విషయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, కిరణ్ కుమ్మక్కయ్యారన్నారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతామని జగన్ రైతుల కోసం లక్ష్య దీక్ష చేయడానికి ముందు చెప్పిన బాబు ఇప్పుడా ఊసే ఎందుకు ఎత్తడం లేదని సూటిగా ప్రశ్నించారు. బాబు అలా అనలేదని ఒక విలేకరి అనగా, తన వద్ద పత్రికా క్లిప్పింగులున్నాయని బాలినేని బదులిచ్చారు.

వైఎస్ వల్లే మీరు సీఎం, మంత్రులు: మేకపాటి
తాము సోనియా బొమ్మతో ఎన్నికల్లో గెలవలేదని, వైఎస్ శ్రమతోనే గెలిచామని మేకపాటి చంద్రశేఖరరెడ్డి అన్నారు. వైఎస్ కష్టపడి పాదయాత్ర చేసి కాంగ్రెస్‌కు వైభవం ప్రసాదించారని, ఇపుడు లేరు గనుక ఆయనపై నిందలు వేయడం తగదని అన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి, మంత్రులంతా వైఎస్ కష్టం కారణంగానే అలా కొనసాగుతున్నారని గుర్తుంచుకుంటే మంచిదన్నారు.

దమ్ముంటే ‘విశ్వాసం’ పెట్టండి
కడప మాజీ ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శిబిరానికి చెందిన ఎమ్మెల్యేలు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై ఎదురు దాడి ప్రారంభించారు. నాలుగు రోజులుగా జగన్‌పై, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విష యంలో కిరణ్‌ చేస్తున్న వ్యాఖ్యలకు జగన్‌ వర్గానికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు (వీరిలో ఇద్దరు మాజీ మంత్రులు) పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, బాలినేని శ్రీనివాసులు రెడ్డి, మేక పాటి చంద్రశేఖర్‌రెడ్డి, బాబురావు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు ధీటుగానే జవాబిచ్చారు. దమ్ముంటే అసెం బ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి మీ బలాన్ని నిరూ పిం చుకోవాలని బహిరంగ సవాలు విసిరారు. తొలుత సాగర్‌ సొసైటీలోని జగన్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడి యా సమావేశాన్ని చివరి క్షణంలో వీరు అసెంబ్లీ మీడియా పాయింట్‌కు మార్చి సీఎంకు, కాంగ్రెస్‌ నాయకత్వానికి తమ గళం వినిపించారు.

సీఎం హర్ట్‌ చేశారు: పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌
నాలుగైదు రోజుల నుంచి చూస్తున్నాం. వైఎస్‌, జగన్‌ పై ిసీఎం నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. లక్షలాది మంది వైఎస్‌ అభిమానులు హర్ట్‌ అయ్యేలా మాట్లాడుతున్నారు. అందుకోసమే మేము మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. పీవీతో వైఎస్‌కు అపాయింట్‌ మెంట్‌ ఇప్పిం చారని, అనైతికమైన దేదో అడిగితే నిరాకరించినట్లు సీఎం చెప్పడం ఎంత వరకు సబబు?. వైఎస్‌ ఓటమి ఎరుగని నాయకుడు. ప్రజలతో మంచి సంబంధాలున్న నేత. రాజ కీయ అనుభవం ఉన్న వ్యక్తి. జాతీయ నాయకులు కూడా ఆయనకు తెలిసిన వాళ్ళే. అలాంటి నాయకుడు కిరణ్‌ను అనైతికమైంది ఏదో అడిగారనడం, పీవీతో అపాయిం ట్‌మెంట్‌ అడిగారనడం లో అర్ధం లేదు.

politican 

వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడే చీఫ్‌ విప్‌గా ఉన్న కిరణ్‌ను స్పీకర్‌గా చేశారు. వైఎస్‌ లాంటి నేతకు అనైతికమైన పనేముంటుంది?. వైఎస్‌ లేని సమయంలో ఇలా మాట్లాడటం విజ్ఞత అని పించుకోదా. అసెంబ్లీలో ఉన్న అందరు ఎమ్మెల్యేలు, మేము వైఎస్‌ పేరు లేకుండా గెలిచామని చెప్పుకోగలుగు తారా? జగన్‌ కూడా ప్రజా సమస్యలపైనే పోరాడు తున్నారు. ఇలాంటి సమయంలో మేము ఆయన వెంట ఉండకుంటే ప్రజలు మనల్ని క్షమించరు. సీఎం మా రాజీ నామాలు అడుగుతున్నారు. వైఎస్‌ ఫోటోల వల్ల గెలిచిన వారు తొలుత రాజీనామాలు చేసి ముందుకు రావాలని మేము అడుగుతున్నాం. వైఎస్‌ ఫోటో, అతని కార్యక్రమాల వల్లే కిరణ్‌కుమార్‌రెడ్డితో సహా మేమందరం గెలిచా మనడంలో సందేహం లేదు.

రాజీనామా చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటే మేము కూడా సిద్ధమే. ఒక హత్య కేసులో జగన్‌ను రక్షించానని సిఎం చెప్పడం ఎంత వరకు సబబు. దానిపై సిబిఐ విచారణ కూడా జరిగింది. సాధా రణంగా అసెంబ్లీలో ప్రతిపక్షాలు వివిధ రకాల ఆరోపణలు చేస్తుంటారు. దాన్ని చీఫ్‌విప్‌గా డిఫైన్‌ చేయాల్సిన బాధ్యత ఆ రోజు కిరణ్‌పై ఉంది. ఇప్పుడు జగన్‌ పార్టీని వదిలేసి ప్రజా సమస్యలపై పోరాడుతుంటే ఆయన ప్రతిష్టను దెబ్బ తీయడం సరికాదు. జగన్‌ రాజీనామా చేసిన రోజే చెప్పారు. ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశ్యం లేదని. మేము కూడా ఆయన్ని ఫాలో అవుతున్నాం. ప్రభుత్వం పడి పోతుందా? లేదా అనేది కాలమే చెబుతుంది. సీఎంను తొలుత విశ్వాస తీర్మానం పెట్టమనండి. అప్పుడు ఏం చేయాలో మేము చూస్తాం.

రెచ్చగొడుతున్నారు: మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి
మేము సైలెంట్‌గా ఉంటే మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ప్రజలకు తెలుసు. వైఎస్‌ వల్లే మేము రెండు మార్లు అధికారంలో వచ్చాం. చేతకాని వారు ఏదేదో మాట్లాడుతున్నారు.

సమాధానం అవిశ్వాస తీర్మానమే: బాబురావు
ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే ఏం జరుగు తుందో తెలుస్తుంది. అప్పుడు వైఎస్‌ ప్రాముఖ్యత ఏమిటో తెలిసొస్తుంది. మాకు ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఆలోచన లేదు. కాని సీఎం రాజీనామాలు అడిగారు. కాబట్టి అన్నిం టికి సమాధానం అవిశ్వాసతీర్మానమే.

సోనియా పిలిచినా వెళ్ళం: బాలినేని శ్రీనివాసులురెడ్డి
ఈ రోజు కొందరు నైతికత గురించి మాట్లాడుతున్నారు. జగన్‌ రాజీనామా చేయక ముందే పార్టీ అధిష్ఠానం చిరం జీవిని పిలిపించి మాట్లాడటం నైతికతనా? వైఎస్‌ కూడా ఆ రోజు పార్టీలో కలువాలని పిఆర్పీని అడిగారు తప్ప మంత్రి వర్గంలో చేరాలని ఏనాడు కోరలేదు. వైఎస్‌ మర ణానంతరం జగన్‌ను సీఎం చేయడానికి పీఆర్పీ మద్దతు కోరిన విషయం గాని, సంతకాలు సేకరించిన విషయం గాని జగన్‌కు తెలియదు. కాంగ్రెస్‌తో ఎట్టి పరిస్థితుల్లో కలిసే ప్రసక్తే లేదు. జగన్‌ ఆదేశాల ప్రకారమే నడుస్తాం. ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు ఎందుకు చేయాలి? మా నాయకుడే వద్దన్నాడు.

మెజారిటీ నిరూపించుకోండి: ఎమ్మెల్సీ, జూపూడి
ఈ లేఖతో సీఎంను ఛాలెంజ్‌ చేస్తున్నాం. దమ్ముంటే అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలి. సీఎం డబుల్‌ రోల్‌ ప్లే చేస్తున్నారు. జగన్‌ను దెబ్బతీయడానికి కుట్ర చేస్తున్నారు.

సీఎంపై విమర్శిస్తూ 14 పాయింట్లతో జగన్‌ వర్గం ఎమ్మెల్యేలు తయారు చేసిన లేఖ
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గారు గత మూడు, నాలుగు రోజులుగా ఉద్దేశ్యపూర్వకంగా, కుట్రపూరిత మైన దిగజారుడు రాజకీయాలకు తెరతీస్తూ, బద్ధ శత్రు వు టీడీపీతో కుమ్మకై్క వైఎస్‌ఆర్‌ వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చడానికి దురాలోచనలు చేస్తున్నారు.

వైఎస్‌ఆర్‌ కుటుంబం కాంగ్రెస్‌కి రుణపడి ఉందని.వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి పీవీ నరసింహరావుతో తానే అపాయింట్‌మెంట్‌ ఇప్పించినట్లుగా... ప్రకటించుకు న్నారు.వైఎస్‌ మిమ్మల్ని అనైతికమైన పని అడిగినట్లు గా, మీరు దానిని నిరాకరించినట్లుగా మీరు చేసిన విష పూరితమైన ప్రకటన వెనుక మీ ద్రోహచింతన, దుర్భు ద్ది బయటపడింది.2009 ఎన్నికల తరువాత కాంగ్రెస్‌ లెచిస్లేటర్‌ పార్టీ ఏకగ్రీవంగా వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఎన్నుకోవ టం రాష్ట్ర ప్రజలందరికి తెలుసు. జగన్‌ మోహన్‌రెడ్డిపై ప్రతిపక్షంతో కుమ్మకై్క ఒక హత్య కేసులో ముద్దాయిలుగా చిత్రీకరించి, ఆ హత్య కేసు నుండి బయటపడేయడానికి 60 రోజులు శ్రమిం చి శాసన సభలో ధీటుగా సమాధానం చెప్పినట్లుగా నీచాతినీచమైన ప్రకటన చేసి మీరు అసంబద్ధమైన నాట కీయతను ప్రదర్శించారు.

తొమ్మిది కోట్ల తెలుగు ప్రజల ఆరాధ్యదైవమైన వైఎస్‌ ఆర్‌ గారి కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి నిబద్ధతతో, విశ్వసనీయతతో, ఆత్మగౌరవంతో రాజకీయాల్లోకి వచ్చారు గనుక మేము ఆయనతో ఉన్నామే గాని, పదవీ వ్యామోహంగానీ, మోసపూరిత రాజకీయాలు గానీ మాకు లేవు.

ప్రజల పక్షాన పోరాడుతున్న ఏకైక నాయకుడు జగన్‌ మోహన్‌రెడ్డి కనుక ఆయన పట్ల గౌరవంతో ఆయన వెంటవున్నాం.ఈ ప్రభుత్వాన్ని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గెలిపించి ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశ్యం తనకు లేదని జగన్‌గారు పదే పదే చెబుతున్నారు. గను క మేము రాజీనామాలు చేయకుండా మా నాయకుని వెంట అండగా ఉన్నాం. ఆయన దీక్ష, దక్షలతో ప్రజా సమస్యల పట్ల పోరాడుతున్న విదానం మన రాష్ట్ర ప్రజ లందరూ హర్షిస్తున్న విషయం అందరికి తెలుసు. ‘నైతికత’ గురించి మీరు పదే పదే మాట్లాడటం.. దయ్యం వేదం వల్లించినట్లుగా ఉంది.వైఎస్‌ఆర్‌ మరణం తరువాత 153 మంది శాసన సభ్యులు జగన్‌ మోహన్‌రెడ్డిని సిఎం కావాలని పదే పదే వారి మనోగతాన్ని వ్యక్తీకరించారు.

మీరు జగన్‌ గురించి, ఆయన వెనుక ఉన్న శాసన సభ్యుల గురించి గత నాలుగు రోజులుగా ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చుకుని మమ్మల్ని దమ్ముంటే రాజీనామాలు చేయాలని మేక పోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.నీతి, నీజాయితీ, నైతికత అనేవి మీలో ఏ మాత్రం ఉన్నా మీరు శాసన సభలో మీపై విశ్వాస తీర్మానంపెట్టి మీ బలాన్ని నిరూపించుకోవాలని మీకు మేము సవాలు చేస్తున్నాం.
మీకు దమ్ముంటే ఈ ప్రతిపాదనకు మీరు నిలబడండి.

పరారే.. పరారే * 
సర్కారుపై రోజూ తీవ్ర విమర్శలు చేసే ‘దేశం’ స్వరం ఎందుకు మారింది?

* అవిశ్వాస తీర్మానం అంటే మాట మార్చి ఎందుకు పారిపోతోంది?
* కాంగ్రెస్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ కుదిరినందుకే!

నిన్న..
రైతు, ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న సర్కారు దిగిపోవాలి

నేడు..
కాంగ్రెస్ ప్రజావ్యతిరేక విధానాలు అవలంబించినప్పుడే అవిశ్వాస తీర్మానం


‘‘కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడితే అవిశ్వాసం పెడతాం.. సంఖ్యాబలం లేనందున ప్రభుత్వాన్ని దిగిపొమ్మని కోరబోం’’ అన్నది తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు బుధవారం అన్న మాట. అంటే.. ప్రభుత్వ విధానాలపై టీడీపీ అధినేత చంద్రబాబు సహా నేతలందరూ నిన్నమొన్నటి దాకా చేపట్టిన దీక్షలు, ధర్నాలు అన్నీ నాటకాలేనా? ఒకవేళ ఆ దీక్షలు, ధర్నాలు నిజమైనవే అయితే.. అవిశ్వాసం పెట్టటానికి అభ్యంతరం ఏమిటి? నిన్నటిదాకా ప్రజా వ్యతిరేకంగా నడుస్తున్నట్లు ఆ పార్టీయే ఎండగట్టిన ఇదే సర్కారు.. ఇప్పుడు అకస్మాత్తుగా సజావుగానే పనిచేస్తున్నట్లు కనిపించటానికి కారణం.. కాంగ్రెస్‌తో మ్యాచ్ ఫిక్సింగేనని స్పష్టమవుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందంటూ ధర్నాలు, దీక్షలు చేపట్టి.. ప్రజల సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం దిగిపోవాలని డిమాండ్ల మీద డిమాండ్లు చేసిన టీడీపీ నేతలు.. ఇప్పుడు మైనారిటీలో పడిన రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టే విషయానికి వచ్చేసరికి.. మాట దాట వేసి పారిపోతున్నారు. కారణం.. యువనేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభంజనానికి భయపడి అధికార పార్టీ - ప్రతిపక్ష పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవటమేనని తేటతెల్లమవుతోంది.

మరోవైపు.. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే ధైర్యం టీడీపీకి లేదని తాజాగా రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ సైతం పేర్కొన్నారు. గాలి, బొత్స వ్యాఖ్యలపై బీజేపీ నేత ఒకరు స్పందిస్తూ.. మ్యాచ్ ఫిక్సింగ్ గురించి తాము గత వారం రోజులుగా చెప్తున్న విషయం నిజమని తేలిందని పేర్కొన్నారు. ‘మైనారిటీలో పడిన ప్రభుత్వాన్ని దిగిపోవాల్సిందిగా కోరలేమని ప్రతిపక్షం అంటే.. టీడీపీ, కాంగ్రెస్‌లు అవగాహనకు వచ్చాయన్న అర్థమే వస్తుంది కదా’ అని ఆయన వ్యాఖ్యానించారు. లేదంటే.. ప్రభుత్వం మైనారిటీలో పడినపుడు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ.. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలన్న కనీస బాధ్యతను ఎందుకు విస్మరిస్తోందని ప్రశ్నించారు. నిత్యం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఏం చేస్తున్నారు? వారి పార్టీ పరిస్థితి ఏమిటి? అని పార్టీ నేతలతో వాకబు చేసే చంద్రబాబు.. తాను ప్రతిపక్ష నేతనన్న విషయం మరచిపోయినట్లున్నారని ఆ నాయకుడు ఎద్దేవా చేశారు.

పరోక్షంగా కాంగ్రెస్‌కే లాభం...
ఇదిలావుంటే.. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టే అంశం గురించి పార్టీలో మాట్లాడటానికి కూడా టీడీపీ నేతలు జంకుతున్నారు. ఏం మాట్లాడితే అధినేత నుంచి ఎలాంటి స్పందన వస్తుందో తెలియక నోరు విప్పటానికి భయపడుతున్నారు. అవిశ్వాస తీర్మానం విషయంలో తమ పార్టీలో సందిగ్ధ పరిస్థితి ఉన్న మాట వాస్తవమేనని ఎన్‌టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీడీపీ నాయకుడొకరు అంగీరించారు. అవతలి పక్షం సవాళ్లు విసురుతున్నా స్పందించకపోవటం వల్ల కాంగ్రెస్, టీడీపీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయన్న ఆరోపణలకు బలం చేకూర్చినట్లు అవుతోందని ఆ పార్టీ ఉత్తరాంధ్ర సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు.

పార్టీకి కేవలం 46 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉన్నప్పటికీ 2008లో గొప్పలకు పోయి వైఎస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన సందర్భాన్ని గుర్తుచేస్తూ.. ప్రభుత్వం మైనారిటీలో పడిందని స్పష్టంగా తెలిసినా నిర్ణయం తీసుకోలేకపోతున్నామని ఆ నేత నిర్వేదం వ్యక్తం చేశారు. ఇలాంటి వైఖరుల వల్ల కింది స్థాయిలో పార్టీ కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీసిన వారమవుతున్నామన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యాయన్న అభిప్రాయం కనుక జనంలోకి వెళితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నచోట టీడీపీ బలహీనపడుతుందని.. కాంగ్రెస్‌కు పరోక్షంగా లాభం చేకూర్చిన వారం అవుతామని కూడా పార్టీలో చర్చ సాగుతోంది.
 జనమంతా అటుకాదా ?
jagan-sab
రాష్ట్రంలో జగన్‌ ప్రభంజనం చివరకు చప్పున చల్లారు తుందా? ఆయన చిరంజీవికి ఎక్కువ, చంద్రబాబుకు తక్కువగా మారతారా? ‘సూర్య’ సర్వేలో పాఠకుల స్పం దన పరిశీలిస్తే ఈ అనుమానాలకు నిజమనే సమాధానమే వచ్చింది. జగన్‌ ప్రభంజనం అంతా కేవలం కాంగ్రెస్‌ను చావుదెబ్బ తీయడానికి, రాష్ట్రంలో కాంగ్రెస్‌ను సర్వనా శనం చేయడానికే పరిమితం అవుతారన్న వాస్తవం వెల్లడయింది. అయినప్పటికీ.. జగన్‌ బలాన్ని తక్కువగా అంచనా వేయలేమని, ఆయన పార్టీ సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీతో పోటీపడుతుందని, ఇమేజ్‌ విష యంలో జగన్‌, బాబుతో పోటీ పడుతున్నారన్న విష యం కూడా స్పష్టమయింది.‘సూర్య’ నిర్వహించిన సర్వేలో జగన్‌ పార్టీ వల్ల కాంగ్రెస్‌ దెబ్బతింటుందని 71 వేల మంది పాఠ కులు అభిప్రాయపడగా, టీడీపీ నష్టపోతుందని 18 వేల మంది, టీఆర్‌ఎస్‌ నష్టపోతుందని 16వేల మంది పాఠకులు అభిప్రాయపడటం గమనార్హం. దీనితో కాంగ్రెస్‌ పతనాన్ని జగన్‌ శాసించబోతున్నారని తేలిపోయింది.

అదేవిధంగా ఇమేజ్‌ విషయంలో కూడా జగన్‌ కాంగ్రెస్‌ నేతలను వెనక్కినెట్టి, బాబుతో పోటీ పడుతున్నట్లు స్పష్టమ యింది. జనాకర్షణ, ఇమేజ్‌ విషయంలో జగన్‌ రెండవ వరసలో ఉన్నారు. ఈ విషయంలో చంద్రబాబునాయుడు వైపు 47 వేల మంది పాఠకులు మొగ్గు చూపగా, జగన్‌ను 24 వేల మంది పాఠకులు సమర్థించారు. అంటే.. సీమాంధ్రలో జగన్‌ రెండ వ శక్తిగా ఆవిర్భవించబోతు న్నట్లు స్పష్టమవుతోంది. ‘సూర్య’ సర్వేను విశ్లేషిస్తే.. జగన్‌ కేవలం కాంగ్రెస్‌ పార్టీని రాష్ట్రంలో అధికారం నుంచి గెంటివేసేందుకు మాత్రమే పనికివస్తారు తప్ప, సొంతంగా అధికారపీఠం ఎక్కేంత స్థాయి లేదని తేలిపో యింది.

జగన్‌ ఓదార్పు యాత్రల హడావిడి వల్ల కాంగ్రెస్‌ లో మాత్రమే చీలికలు వచ్చి, ఆ పార్టీ క్యాడర్‌లో గందర గోళం పెరిగి అది జగన్‌కు లాభిస్తుందని అర్ధమవుతోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన కిందిస్థాయి క్యాడర్‌ కూడా కొంతమంది జగన్‌ వైపే అవకాశం ఉందని సర్వే చెబు తోంది. ఈ విషయంలో టీడీపీ నాయకత్వం ఎంత ధీమాతో ఉన్నప్పటికీ, కిందిస్థాయి నాయకులు, పార్టీలో అవకాశాలు ఉండవని నిర్థారించుకునే ద్వితీయ శ్రేణి నేతలు మాత్రం కచ్చితంగా జగన్‌ గడప తొక్కుతారని కనిపిస్తూనే ఉంది.

కానీ.. జగన్‌ హడావిడి మీడియా హైప్‌ తప్ప మరొకటి కాదన్న అభిప్రాయం జనంలో ఉన్నట్లు సర్వే ద్వారా స్పష్ట మవుతోంది. చానళ్లలో స్లాట్లు కొనుగోలు ద్వారా మీడి యాలో జగన్‌కు జనాదరణ ఉందని చూపించడం, కాంగ్రెస్‌- టీడీపీకి చెందిన ద్వితీయశ్రేణి నేతలను కొనుగోలు చేస్తున్నారన్న భావన సామాన్య జనంలో నెల కొంది. పైగా, జగన్‌ వెంట దాదాపు అన్ని గ్రామాల్లోనూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే కనిపిస్తుండటంతో, ఆయన వెంట కేవలం రెడ్లు తప్ప, మిగిలిన కులాలకు చెందిన వారు ఉండరన్న భావన బలపడుతోంది. అదీకా కుండా, జగన్‌ పార్టీలో చే రాలంటూ గ్రామాల్లో ఆయన వర్గీయులు ఇతరులను భయభ్రాంతులను చేయటం, పనిలేకుండా తిరిగే యువకులే ఎక్కువగా ఉండటం కూడా ఆయనపై ఇప్పటినుంచే వ్యతిరేకత పెరుగుతోంది.

దానికితోడు, జగన్‌ అక్రమ సంపాదనపై యువకులు, విద్యాధికులు, మహిళలు వ్యతిరేకతతో ఉన్నట్లు కనిపి స్తోంది. టాటా, బిర్లా, అంబానీల వంటి పారిశ్రామికవేత్త లు ఈ స్థాయికి చేరేందుకు కొన్ని దశాబ్దాలుకష్టపడితే.. జగన్‌కు మాత్రం కేవలం ఐదేళ్లే పట్టడం వెనుక అవినీతి, అక్రమ సంపాదనే కారణమన్న అభిప్రాయం వారిలో నెల కొంది. సీఎం కాకపోతేనే జగన్‌ లక్ష కోట్లు సంపాదిస్తే, ఇక సీఎం అయితే రాష్ట్రాన్ని ఇంకా ఏ స్ధాయిలో దోచు కుంటారోనన్న భావన వారిలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. అదేవిధంగా జగన్‌కు అర్బన్‌ ప్రాంతంలో పెద్దగా పట్టు లేదని, విద్యావంతులు, ఉద్యోగులు ఆయనను అంగీక రించడం లేదని సర్వేలో స్పందించిన వారి వివరాలు తెలియచేస్తున్నాయి.

ఇక జగన్‌.. చిరంజీవి కంటే అతి పెద్ద శక్తిగా అవతరిం చనున్నారని సర్వేలో తేలింది. గతంలో చిరంజీవి పార్టీ పెట్టిన తర్వాత జగన్‌ సభల కంటే జనం ఎక్కువగా వచ్చా రు. కానీ ప్రణాళిక, వ్యూహరచన, ఎత్తుగడ లేకపోవడం తో పీఆర్పీ బొక్కబోర్లా పడి.. అధికారంలోకి వస్తుందన్న ప్రజారాజ్యం కేవలం 18 సీట్లకే పరిమితమయింది. ఇప్పుడు జగన్‌ అంతకంటే పెద్ద శక్తిగా మారనున్నారు. జగన్‌కు అంగ-అర్ధబలం ఉన్న నేతలు, కాంగ్రెస్‌కు చెందిన ద్వితీయ శ్రేణి నేతలు, డబ్బు విరజిమ్మే స్తొమత ఉండటంతో ప్రజారాజ్యం కంటే జగన్‌ పార్టీ పెద్ద శక్తిగా అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

 
సబ్బంపై జగన్‌ సీరియస్‌
sabbam-hari 
కాంగ్రెస్‌-జగన్‌ మధ్య సయోధ్య ప్రయత్నాలు జరుగు తుంటే ఆ విషయం తెలిసిన మఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సయోధ్య వాతావరణాన్ని చెడగొడుతున్నారని జగన్‌ వర్గీ యుడిగా ముద్ర పడిన అనకాపల్లి కాంగ్రెస్‌ ఎంపీ సబ్బం హరి చేసిన వ్యాఖ్యలపై జగన్‌ వర్గం మండిపడుతోంది. సబ్బం హరి తన అపరిపక్వత రాజకీయ చర్యతో చివరకు జగన్‌ పరువు తీశారంటున్నారు. స్వయంగా జగన్‌ కూడా సబ్బం చేసిన వ్యాఖ్యలు తన ప్రతిష్ఠను మంటకలిపేలా ఉన్నాయని తన సహచరుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

తాను ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలను దెబ్బతీసిన కాంగ్రెస్‌ను భ్రష్ఠు పట్టించాలన్న కసితో సొంత పార్టీ పెట్టేందుకు పరుగులు పెడుతున్న జగన్‌ను నైతికంగా దెబ్బతీసేలా వ్యాఖ్యానించిన కాంగ్రెస్‌ ఎంపీ సబ్బం హరిపై జగన్‌ వర్గీయులు విరుచుకుపడుతున్నారు. మాట మార్చడం, మడమ తిప్పడం తన తండ్రి తనకు నేర్పలేదని ఒకవైపు జగన్‌ ఖండితంగా చెబుతున్నారు. ఆయన అను చరుడిగా ముద్రపడిన సబ్బం మాత్రం కాంగ్రెస్‌ - జగన్‌ మధ్య సయోధ్య ప్రయత్నాలు ప్రారంభమవుతే, సీఎం కిరణ్‌ దానిని చెడగొడుతున్నారంటూ తాజాగా చేసిన వ్యాఖ్యలు జగన్‌ పరువును మంటగలిపేలా ఉన్నాయని జగన్‌ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సబ్బంవ్యాఖ్యల వల్ల.. జగన్‌ పైకి కాంగ్రెస్‌తో పోరాడుతూనే, దొడ్డిదారిలో తిరిగి అదే పార్టీతో సయోధ్యకు ప్రయత్నిస్తున్నారన్న భావన కల్పించారని జగన్‌ వ ర్గీయులు మండిపడుతున్నారు. దీనివల్ల ఇప్పటివరకూ ప్రజల్లో జగన్‌పై ఉన్న హీరోవర్షిప్‌ పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా యువతలో ఒకరకమైన వ్యతిరేకభావన కల్పించారంటున్నారు. మడమ తిప్పని వీరుడిగా, సోనియాగాంధీనే ఎదిరించి పార్టీ నుంచి బయటకు వచ్చిన ధీరుడిగా సంపాదించుకున్న ఇమేజ్‌ అంతా సబ్బం హరి వ్యాఖ్యలతో కొట్టుకుపోయి, చివరకు జగన్‌ కూడా పదవులు-ఉనికి చాటుకునేందుకేందుకు ప్రయత్నించే ఒక సాధారణ రాజకీయ నాయకుడి మాదిరిగానే ముద్రపడటాన్ని ఆయన అనుచరులు సహించలేకపోతున్నారు. అసలు జగన్‌-కాంగ్రెస్‌ మధ్య సయోధ్య జరుగుతోందని సబ్బం హరికి ఎవరు చెప్పారని జగన్‌ అనుచరులు ప్రశ్నిస్తున్నారు.

చివరకు.. జగన్‌ కూడా సబ్బం చేసిన వ్యాఖ్యలపై తన అనుచరుల వద్ద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తన రాజకీయ జీవితాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్‌ను అంతం చేసేందుకు తాను అన్నింటికీ తెగించి పార్టీ స్థాపించే యత్నాల్లో ఉంటే, తన మద్దతుదారుడయిన సబ్బం హరి మాత్రం అందుకు విరుద్ధంగా తనకు-కాంగ్రెస్‌కు మధ్య సయోధ్య ప్రయత్నాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించడం వల్ల తన ఇమేజ్‌ దెబ్బతిందని జగన్‌ కూడా అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. హరి వ్యవహారశైలి ఇప్పటివరకూ తాను సంపాదించుకున్న కీర్తి-ప్రతిష్ఠను మంటగలిపాయని మండిపడినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌కు భయపడుతున్నందువల్లే తాను ఆ పార్టీ నాయకత్వంతో సయోధ్య కుదుర్చునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం, భావన క్షేత్రస్థాయిలో విస్తృతమవుతే ఇక తాను పార్టీ పెట్టినా ఫలితం ఉండదని జగన్‌ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనివల్ల ప్రజలు తనను వీరుడిగా కాకుండా పిరికివాడుగా భావించే ప్రమాదం ఉందన్న ఆందోళన కూడా ఆయనలో లేకపోలేదు. ఈ కారణాల వల్లే సబ్బం తీరుపై జగన్‌ కలత చెందుతున్నారు.

జగన్‌ అనుచ రులయితే సబ్బం తీరుపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ప్రణబ్‌-ఆంటోనీ వంటి సీనియర్లతో చర్చలు జరిపేంత స్థాయి సబ్బం హరికి ఉందా అని ప్రశ్నిస్తున్నారు. మీడియాను ఆకర్షించి, కాంగ్రెస్‌లో తన ప్రాధాన్యం పెంచుకునే ఎత్తుగడ తప్ప సబ్బం హరికి ఢిల్లీలో అంత సీన్‌ లేదంటున్నారు. అసలు సబ్బం.. జగన్‌ పెట్టే పార్టీలో చేరతారా లేదా అన్నది కూడా సందేహమేనంటున్నారు. జగన్‌ విశాఖ ఓదార్పు యాత్రకు ముందు జగన్‌ పార్టీ పెట్టిన తర్వాత తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. మళ్లీ ఇప్పుడు జగన్‌ పార్టీ పెట్టిన తర్వాత, ఆ విధానాలు తనకు నచ్చితేనే పార్టీలో చేరతానని మాట మార్చడాన్ని జగన్‌ వర్గీయులు గుర్తు చేస్తున్నారు.

చివరకు అసలు సబ్బం హరి జగన్‌ పార్టీలో చేరకుండా కాంగ్రెస్‌లోనే ఉండిపోయినా ఆశ్చర్యపడవలసిన పనిలేదని విశాఖ జిల్లా నేతలు జోస్యం చెబుతున్నారు. కాగా, జగన్‌-కాంగ్రెస్‌ మధ్య సయోధ్య యత్నాలపై వ్యాఖ్యానించిన సబ్బం హరిపై మంత్రి బాలరాజు విశాఖ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ద్రోణంరాజు శ్రీనివాస్‌, తైనాల విజయకుమార్‌, విజయప్రసాద్‌ విరుచుకుపడ్డారు. సబ్బం హరి స్థాయి ఏమిటని ప్రశ్నించారు. వారిద్దరి మధ్య సయోధ్య కుదిర్చే స్థాయి హరికి లేదన్నారు. ‘వారి వద్దకు వెళ్లడానికి ఈయన స్థాయేమిటి? జాతీయ స్థాయి నేతగా ఊహించుకుని, ప్రచారం చేసుకుంటున్నాడు.

ఒక వేళ వెళ్లినా వారి గుమ్మం కూడా ఎక్కే పరిస్థితి కూడా ఉండదు. నీతి నియమాలు వదిలి అవకాశ రాజకీయాలు చేస్తున్నాడు. రాజీనామా చేసి ఏ ఇతర పార్టీ నుంచయినా పోటీ చేసి గెలవాల’ని సవాల్‌ చేశారు. కాంగ్రెస్‌లో ఉంటూ సోనియా, కిరణ్‌, కాంగ్రెస్‌ను విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎమ్మెల్యే విజయకుమార్‌ మరో అడుగు ముందుకేసి ‘సబ్బం హరి కాంగ్రెస్‌లో కాకుండా మరే ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌ గుర్తు లేకుండా పోటీ చేసి గెలిస్తే గుండు చేసుకుని ఏడాదిపాటు తిరుగుతా’నని సవాల్‌ చేశారు.
రాజీ వార్తలు అవాస్తవం
అనకాపల్లి ఎంపీ సబ్బం హరి స్పష్టీకరణ
* సీఎం, టీడీపీ, ఓ పత్రికాధిపతి కుట్రలో భాగమే ఆ వార్తలు
* కాంగ్రెస్‌తో జగన్ రాజీ ప్రసక్తేలేదు
* ఓదార్పును చులకన చేసినప్పుడే
* ఆ పార్టీని మర్చిపోయారు
* త్వరలోనే కొత్తపార్టీ ఆవిర్భావం
* వైఎస్ సంక్షేమ పథకాల అమలే లక్ష్యం

యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కాంగ్రెస్ అధిష్టానం రాయబారం నడుపుతోందని తాను అన్నట్టుగా వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి స్పష్టంచేశారు. కాంగ్రెస్ అధిష్టానం జగన్‌తో రాజీకి ప్రయత్నిస్తుందన్న చర్చను గాని, ఆ ఊహను గాని జగన్‌తోపాటు ఆయన అనుచరులెవ్వరూ భరించే స్థితిలో లేరనే తాను చెప్పినట్లు బుధవారం వివరించారు. తన వ్యాఖ్యలను గోరంతలు కొండంతలు చేసి చూపిస్తున్నారని ఆరోపించారు. తన వ్యాఖ్యలను జగన్‌కు ఇబ్బంది కలిగించేలా ఆపాదించడం, లేనిపోనివి ప్రచారం చేయడం మంచిది కాదని హితవు పలికారు. తన తండ్రి కోసం చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించాలన్న మంచి ఉద్దేశంతో చేపట్టిన ఓదార్పుయాత్రను చులకన చేసినప్పుడే జగన్ కాంగ్రెస్ పార్టీ గురించి మర్చిపోయారని ఆయన చెప్పారు.

త్వరలోనే పార్టీ
కాంగ్రెస్ పార్టీ నడవడిక నచ్చక, ఆ పార్టీలో ఉండలేక తెగతెంపులు చేసుకుని జగన్ తన ఎంపీ పదవికి రాజీనామా చేశారని సబ్బం చెప్పారు. అనంతరం అకుంఠిత దీక్షతో రాష్ట్రంలో గ్రామగ్రామాన రాత్రింబవళ్లు తిరుగుతున్నారని తెలిపారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను మళ్లీ అమలు చేయడం కోసం త్వరలోనే పార్టీ పెట్టబోతున్నానని ప్రకటించారని చెప్పారు. పార్టీ ఏర్పాటుకు అవసరమైన ఏర్పాట్లలో ఉన్న తరుణంలో కాంగ్రెస్ అధిష్టానం జగన్‌తో రాయబారం నడుపుతోందని, ఆయన పదవి కోసం రాజీ పడుతున్నారని ఊహాగానాలు రావడం శోచనీయమన్నారు.

జగన్‌ను ఎదుర్కొనే సత్తాలేని సీఎంకు టీడీపీ, ఓ పత్రికాధిపతి మిత్రపక్షంగా కనిపిస్తున్నారని, అందరూ ఏకమై ఓ స్టోరీ కింద ప్లాన్ చేశారని విమర్శించారు. అసెంబ్లీలో అవిశ్వాసం పెట్టలేక, ఎన్నికలకు వెళ్లలేక ఇలాంటి దుష్ర్పచారాలకు దిగడం శోచనీయమని దుయ్యబట్టారు. కిరణ్‌కుమార్‌రెడ్డిని దివంగతనేత వైఎస్ స్పీకరుగా నియమించినప్పుడు ప్రతిపక్షనాయకుడిగా ఉన్న చంద్రబాబునాయుడు వ్యవహరించిన తీరు అందరికీ తెలిసిందేనన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా సీఎంతో పాటు ప్రతిపక్షనేత కూడా వెళ్లి స్పీకర్‌ను ఆయన సీట్లో కూర్చోబెట్టడం సాంప్రదాయంగా వస్తోంద ని, కానీ చంద్రబాబు అందుకు భిన్నంగా వ్యవహరించారని గుర్తుచేశారు.

మార్చిలో జగన్ పార్టీ!
ఎన్నికల సంఘం ఆమోదంలో జాప్యమే కారణం

 వైఎస్ జగన్ రాజకీయ పార్టీ స్థాపన మరికొంత కాలం ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి వచ్చే నెల రెండో వారం తర్వాత జగన్ తన కొత్త పార్టీని ప్రకటిస్తారని భావించారు. ఇప్పటికే వైఎస్ఆర్ పార్టీ, రాజన్న రాజ్యం అనే పేర్లతో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు వైఎస్ తోడల్లుడు వైవీ సుబ్బారెడ్డి దరఖాస్తులు అందించారు. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో జగన్ పేరిట నమోదైన దరఖాస్తులపై ఈసీ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతున్నదని జగన్ వర్గం ఎమ్మెల్యేలు చెబుతున్నారు.

అందువల్ల.. మార్చి మొదటి వారంలో సీఈసీ ఆమోదం తెలిపే అవకాశం ఉందని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి వివరించారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ మార్చిలో జగన్ పార్టీని స్థాపిస్తారన్నారు. కాగా, వైఎస్ఆర్ పార్టీ, రాజన్న రాజ్యం పేర్లలో వైఎస్ఆర్ పార్టీ పేరుకే ప్రాధాన్యం ఇస్తున్నామని, ఎన్నికల సంఘం దేనిని ఆమోదిస్తుందో చూడాలని మరో మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు.

Tuesday, January 25, 2011

జగన్‌ సరెం‘డర్‌’ ! ‘దేశం’, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్!

Jagan-sad
కాంగ్రెస్‌ పార్టీతో సయోధ్యకు జగన్‌ ప్రయత్ని స్తున్నారా? వారిద్దరూ ఇప్పటికే ఒక అవగా హనతో వ్యూహాత్మకంగా పనిచేస్తున్నారా? కేసులు, బెదిరింపులకు జగన్‌ తాళలేక అధిష్ఠానానికి సరెండర్‌ కానున్నారా? ఆ మేరకు జగన్‌ మరికొద్దిరోజుల తర్వాత కాంగ్రెస్‌ గూటిలో ఒదిగిపోనున్నారా? ప్రస్తుతం జగన్‌ ఓదార్పు పర్యటనలు భవిష్యత్తులో కోస్తాలో టీడీపీని ఎదగ నీయకుండా చేస్తున్న ఎత్తుగడలో భాగమా? జగన్‌-కాంగ్రెస్‌ పార్టీ మధ్య సయోధ్య కుదురుతుందన్న భయంతోనే ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి జగన్‌పై హటాత్తుగా ఎదురుదాడి తీవ్రత పెంచారా? ఈ పరిణామాల నేపథ్యంలో అసలు జ గన్‌ పార్టీ పెడతారా? లేక పార్టీ స్థాపించి, శరద్‌పవార్‌ మాదిరిగా కాంగ్రెస్‌తో కలసి పని చేస్తారా?...జగన్‌కు అత్యం సన్నిహితుడయిన అనకా పల్లి కాంగ్రెస్‌ పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి తాజాగా చేసిన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో ఈ అను మానాలకు తెరలేచింది.

కాంగ్రెస్‌ పార్టీ జగన్‌తో సయోధ్య కుదుర్చుకునే వాతా వరణం ఉండగా, దానిని చెడగొట్టేందుకు ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారన్న సబ్బం హరి వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీలో సంచలనానికి, సరికొత్త చర్చకు దారితీశాయి. జగన్‌ను తిరిగి కాంగ్రెస్‌లో తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగు తున్న సమయంలో సీఎం వ్యాఖ్యలు సరైనవి కావని సబ్బం హరి అసంతృప్తి వ్యక్తం చేశారు. జగన్‌ పక్కనే ఉంటూ ఆయనకు గట్టి మద్దతుదారుగా వ్యవహరిస్తున్న సబ్బం హరి ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని తేలిగ్గా కొట్టివేయలేమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జగన్‌ ఎత్తుగడలు, ఆలోచనల్లో భాగస్వామి అయిన సబ్బం హరి, ఎలాంటి దాపరికం లేకుండాకాంగ్రెస్‌ పార్టీ జగన్‌తో సయోధ్యకు ప్రయత్నిస్తోందన్న వ్యాఖ్యల్లో నిజం ఉండి తీరుతుందని పార్టీ వర్గాలు కూడా వ్యాఖ్యానిస్తున్నాయి.

అయితే, కాంగ్రెస్‌ జగన్‌తో సయోధ్యకు ప్రయత్నిస్తోందన్న దానికన్నా జగనే కాంగ్రెస్‌కు సరెండరయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రస్తుతం ఆయన ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితిని బట్టి అర్థం చేసుకోవలసి ఉంటుందని కాంగ్రెస్‌ సీనియర్లు చెబుతున్నారు.జగన్‌ కూడా సయోధ్యకు సుముఖంగానే ఉన్నారన్న భావన సబ్బం మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. జగన్‌- కాంగ్రెస్‌ సయోధ్య ప్రయత్నాలు జరుగుతుంటే సీఎం కిరణ్‌ దానిని చెడగొడుతున్నారని జగన్‌ వర్గీయుడయిన సబ్బం చెప్పారంటే.. జగన్‌ కూడా సయోధ్యకు సిద్ధంగానే ఉన్నారన్న వాస్తవం స్పష్టమవుతోందని విశ్లేషిస్తున్నారు. ‘ఒక వ్యక్తి తమ మధ్య సయోధ్య కుదురే సమయంలో అవతల వ్యక్తి వచ్చి దానిని చెడగొడుతు న్నారని ఆరోపించారంటే, ఇవతల వ్యక్తికి కూడా ఎదుటివారితో సయోధ్య కుదుర్చు కోవాలన్న కోరిక ఉన్నట్లే లెక్క. లేకపోతే మధ్యలో వచ్చిన వ్యక్తిని చెడగొడుతున్నారంటూ విమర్శించవలసిన పనిలేద’ని ఒక సీనియర్‌ నేత విశ్లేషించారు. ఒకరకంగా సబ్బం వ్యాఖ్యలు ఆయన ఆవేదన, ఆందోళనను సూచిస్తున్నాయంటున్నారు.

జగన్‌కు సంబంధించిన ఆస్తులు, అనుచరులపై కేసులు, ఆయనకు సన్నిహితుడైన గాలి జనార్దన్‌రెడ్డికి చెందిన ఓఎంసీ గనులు సీజ్‌ చేయాలన్న సిఫార్సులు, తాజాగా సాక్షి పెట్టుబడులపై హైకోర్టు నోటీసుల వ్యవహారం అంతా జగన్‌ను లొంగదీసుకునే రాజకీయ ఎత్తగడగానే భావిస్తున్నారు. ఈ క్రమంలో తాను పార్టీ పెడితే ఇంకా తనపై, తన మద్దతుదారులపై వేధింపులు పెరుగుతాయన్న ఆందోళన జగన్‌లో లేకపోలేదంటు న్నారు. రాజశేఖరరెడ్డి మాదిరిగా వాటిని రాజకీయంగా ఎదుర్కొనే శక్తి, నేర్పు, వ్యూహం జగన్‌కు లేనందున, అధిష్ఠానంతో శత్రుత్వం పెట్టుకోవడం వల్ల నష్టమే తప్ప లాభం లేదని జగన్‌ ఇప్పటికే గ్రహించారని చెబుతున్నారు.

ప్రధానంగా.. వ్యాపారస్తుడైన జగన్‌ కేంద్రంతో శత్రుత్వం తెచ్చుకుని ఆర్థికంగా నష్టపోవడానికి సిద్ధపడరని ఆయన అనుచరులు సైతం చెబుతున్నారు. తన సంపదను రక్షించుకునేందుకయినా ఆయన కాంగ్రెస్‌తో సయోధ్య కుదుర్చుకోవడం ఖాయమని జోస్యం చెబుతున్నారు. కాంగ్రెస్‌తో సయోధ్య వాతావార ణాన్ని కిరణ్‌ చెడగొడుతున్నా రని సబ్బం చేసిన వ్యాఖ్యను బట్టి.. జగన్‌ కాంగ్రెస్‌తో రాజీకి సిద్ధంగా ఉన్నారని స్పష్టమవుతూనే ఉంది. అటు మంత్రి శంకర్‌రావు కూడా జగన్‌ మళ్లీ కాంగ్రెస్‌ తలుపు తడతారని జోస్యం చెప్పారు. చిన్నాయన వైఎస్‌ వివేకానందరెడ్డి కూడా జగన్‌ మళ్లీ కాంగ్రెస్‌ పార్టీలోకి వస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. వీటిని కొట్టిపారేసే అంశాలు కావంటున్నారు.

అయితే, నిజంగా కాంగ్రెస్‌తో సయోధ్య వాతావరణం ఉంటే మరి జగన్‌ పార్టీ పెడతారా లేదా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఇప్పటికే మన పార్టీ వస్తోందని, మూడేళ్లు కష్టపడితే ఆ తర్వాత సుఖపడవచ్చని జగన్‌ స్వయంగా చెప్పారు. ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాననీ ప్ర టించారు. ఫిబ్రవరిలో పార్టీ పెడతారంటూ ఎంపీ మేకపాటి, అంబటి రాంబాబు ఇప్పటికే ప్రకటించారు. జిల్లాల్లో ఓదార్పు యాత్రలు, ఇతర పార్టీల నేతలను ఆకర్షించేందుకు ఇప్పటికే కోట్లాది రూపాయలు కుమ్మరించారన్న ప్రచారం జరుగుతోంది. మరి కాంగ్రెస్‌తో సయోధ్య కుదిరితే జగన్‌ పార్టీ స్థాపన యత్నాన్ని విరమించుకుంటారా అన్న ప్రశ్నలూ వినిపిస్తున్నాయి.

జగన్‌ మనస్తత్వం తెలిసిన ఆయన వర్గీయులు మాత్రం జగన్‌ రాజకీయ పార్టీ స్థాపించడం ఖాయమని, చెప్పింది చేయడం ఆయన నైజమని గుర్తు చేస్తున్నారు. అయితే, పార్టీ స్థాపించిన తర్వాత కాంగ్రెస్‌కు దగ్గరయి, మహారాష్టల్రో ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ మాదిరిగా కాంగ్రెస్‌తో కలసి పనిచేసే అవకాశాలుంటాయని వివరిస్తున్నాయి. ఆలోగా, కోస్తాలో తెలుగుదేశం పార్టీని బలహీనం చేసేందుకు జగన్‌ ప్రయత్నించవచ్చని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌-జగన్‌ పార్టీ కలసి పనిచేసినా ఆశ్చర్యపడవలసిన అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఆ విధంగా జరిగినా జగన్‌ కాంగ్రెస్‌కు సరెండర్‌ అయినట్లేనని స్పష్టం చేస్తున్నారు.

ఇదిలాఉండగా.. జగన్‌-కాంగ్రెస్‌ మధ్య సయోధ్య వాతావరణం మొదలయిందన్న వాస్తవం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి సైతం తెలుసనని సబ్బం హరి వ్యాఖ్యలో స్పష్టమవుతోంది. ఇటీవలి కాలంలో ప్రణబ్‌-ఆంటోనీ-మొయిలీని తరచూ కలుస్తున్న సబ్బం హరి ఇలాంటి వ్యాఖ్యలు ఊరకనే చేసి ఉండరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఆ విషయం ముఖ్యమంత్రికి సైతం తెలుసునని హరి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కిరణ్‌ హటాత్తుగా జగన్‌పై ఎదురుదాడి చేయడం, జగన్‌ను నైతికంగా-మానసికంగా దెబ్బతీసే ప్రకటనలు చేస్తుండటంతో సయోధ్య వాతావరణం దెబ్బతింటోందని సబ్బం ఆందోళన చెందుతున్నట్లు ఆయన మాటలు చెప్పకనే చెబుతున్నాయి.

కిరణ్‌ హటాత్తుగా జగన్‌పై ఎదురుదాడి చేస్తుండటంతో సయోధ్య వాతావరణం చెడి పోయి జగన్‌ ఎక్కడ కాంగ్రెస్‌కు కాకుండా పోతారేమోనన్న భయాందోళన హరి మాట ల్లో కనిపిస్తోంది. జగన్‌ను కాంగ్రెస్‌లోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని స్వయం గా సబ్బంహరి ప్రకటించినందున, దానిని నిజమని భావించక తప్పదంటున్నారు. హరి మాటలు నిజమయితే.. జగన్‌ను తిరిగి పార్టీలోకి రాకుండా కిరణ్‌ అడ్డుకునేందుకు పావులు కదుపుతున్నారని భావించవలసి వస్తోంది.

sabbam-hari2 

జగన్‌ తిరిగి పార్టీలోకి వస్తే అది తన భవితవ్యానికే ప్రమాదమన్న ముందు జాగ్రత్తతోనే కిరణ్‌ జగన్‌పై మాటల దాడి చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. జగన్‌ పార్టీ గడప తొక్కితే తన పదవికే ఎసరు వస్తుందని కిరణ్‌ భావించడం సహజమంటున్నారు. సీఎం పదవి చేపట్టిన తర్వాత ఎప్పుడూ జగన్‌ ప్రస్తావన తీసుకురాని కిరణ్‌, హటాత్తుగా తన ఢిల్లీ పర్యటన నుంచి మాటల దాడి ప్రారంభించారంటే.. జగన్‌ను మళ్లీ పార్టీ గడపతొక్కకుండా చేసే వ్యూహంలో భాగమేనని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

జగన్‌కు, కాంగ్రెస్‌ పార్టీకిమధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు జరుగుతుండగా వాటిని చెడగొట్టడానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. జగన్‌పై సీఎం చేసిన వ్యాఖ్యలు సరైనవి కావు. ఆయన నోరు పారేసుకుంటే చరిత్ర విప్పాల్సి ఉంటుంది
- సబ్బం హరి, అనకాపల్లి ఎంపీ

జగన్ వర్సెస్ కిరణ్
కత్తులు నూరుతున్న టీడీపీ, టీఆర్ఎస్
రసపట్టులో మాట.. రాజకీయం ఆట

యువనేత వర్గంపై కిరణ్ 'మైండ్ గేమ్'
ప్యూహాత్మకంగానే పరిటాల కేసు ప్రస్తావన
కిరణ్ '60 రోజుల కష్టం'పై టీడీపీ ధ్వజం
ముఖ్యమంత్రి కూడా నేరస్తుడే: చంద్రబాబు
సీబీఐ విచారణ జరిపించాలి: యనమల
ముఖ్యమంత్రిపైనా కేసు పెట్టాలి: పయ్యావుల
ఈ కష్టం దోషులను రక్షించేందుకే: దాడి
మా పోరాటం ఫలిస్తోంది: రేవంత్
ఇంటర్‌పోల్‌తో ఆరా తీయాలి: దేవినేని ఉమ
జగన్, కిరణ్‌లపై విచారణ: టీఆర్ఎస్ నేత హరీశ్
కిరణ్ మాటలపై జగన్ వర్గం ఎదురు దాడి
ప్రమాదం గురించి ముందే తెలుసా: జూపూడి
సంప్రదింపులు ఆపేందుకే ఆరోపణలు: సబ్బం హరి
హైదరాబాద్, జనవరి 25 : 'ఆట' మొదలైంది! రాజకీయ చదరంగం రసకందాయంలో పడింది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఈ ఆటలో పోటీ పడుతున్నాయి. ఒకరిని ఒకరు ఇరుకున పెట్టేందుకు... పాత పాపాలను తవ్వి పోసేందుకు... అందరూ అస్త్రాలు పట్టుకుని బయలుదేరారు. ఎవరి మాటలను వారి మెడకే చుట్టేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఆరేళ్లు అధికారంతో ఆటాడుకున్న మాజీ ఎంపీ వైఎస్ జగన్‌పై కాంగ్రెస్, టీడీపీలతోపాటు టీఆర్ఎస్ కూడా కత్తులు దూస్తోంది. జగన్ మీడియాలో పెట్టుబడులు పెట్టిన వారికి జారీ చేసిన నోటీసులే వీరికి అస్త్రాలుగా మారాయి. 'ఓ ఖూనీ కేసులో జగన్‌ను అసెంబ్లీలో కాపాడేందుకు 60 రోజులు అధ్యయనం చేశాను' అని ప్రకటిస్తూ... ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 'మైండ్ గేమ్'కు శ్రీకారం చుట్టారు.

బహుశా... 'పరిటాల రవి హత్య కేసులో నువ్వో నిందితుడివి. చేసిన మేలు మరిచిన కృతఘ్నుడివి' అని జగన్‌కు చెప్పడమే ముఖ్యమంత్రి అంతరంగం కావొచ్చు. అంతేకాదు... వైఎస్ తనకొక పని చెప్పారని, అది అనైతికమని తాను చెప్పానని, ఆ కారణంగానే తాను 'సెప్టెంబర్ 2'న వైఎస్‌తోపాటు హెలికాప్టర్‌లో రచ్చబండకు వెళ్లలేదని కూడా చెప్పారు. తద్వారా... తాను నైతికతకు కట్టుబడి ఉన్న వ్యక్తిని అనే సంకేతాలు పంపారు. స్పీకర్‌గా ఉన్న తన చేత అనైతిక ప్రకటనలు చేయించేందుకు వైఎస్ ప్రయత్నించారని చెప్పకనే చెప్పారు.

అయితే... ఇవే ప్రకటనలు అటు తెలుగుదేశం, ఇటు జగన్ వర్గం నేతలకు అస్త్రాలుగా మారాయి. 'చీఫ్ విప్‌గా ఉన్న కిరణ్ ఒక ముద్దాయిని కాపాడారు' అంటూ తెలుగుదేశం మండిపడగా... వైఎస్ ప్రమాదం వెనుక ఉన్న అనుమానాలకు కిరణ్ ప్రకటన బలం చేకూరుస్తోందని జగన్ వర్గం నేతలు పేర్కొన్నారు. పరిటాల హత్య, వైఎస్ దుర్మరణం... ఈ రెండు కేసుల్లో సీబీఐ కిరణ్‌ను కూడా ప్రశ్నించాలని డిమాండ్ చేశారు.

ఈ అంశాలను పక్కన పెడితే... అధికారమే రక్షణ కవచంగా జగన్ అడ్డగోలుగా సాగించిన అక్రమాలు ఇప్పుడు మరింత తేటతెల్లమవుతున్నాయి. వీటిపై కాంగ్రెస్, టీడీపీలు గురిపెట్టాయి. "వైఎస్ అధికారంలోకి వచ్చింది మొదలు... అవిశ్రాంతంగా చేసిన దోపిడీ న్యాయ దేవత సాక్షిగా బట్టబయలు కానుంది'' అని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మంత్రికాక మునుపు, ఎమ్మెల్యే హోదాలో శంకర్ రావు రాసిన లేఖలను హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించడంతో 'జగన్ ఆస్తుల తుట్టె' మరోమారు కదిలింది.

దీనిపై శంకర్‌రావు మంగళవారం మీడియాతో మాట్లాడారు. 'అధికార దుర్వినియోగంతోనే జగన్ సొంత మీడియాను ఏర్పాటు చేసుకున్నారు' అని తెలిపారు. "వైఎస్ చచ్చి బతికారు. లేకపోతే, అవినీతి ఆరోపణలు పెరిగి అనునిత్యం చచ్చేవారు... అని ఒక పెద్దాయన గతంలో అన్నారు. జగన్ అవినీతిపై వాస్తవాలు బహిర్గతమయ్యేందుకే హైకోర్టుకు లేఖ రాశాను'' అని తెలిపారు. ఇక జగన్ మీడియాతోపాటు, ఆయన అక్రమ ఆస్తులకు సంబంధించిన వివరాలన్నీ తన వద్ద ఉన్నాయని... దీనిపై సీబీఐ విచారణ జరపాలని మరో మంతి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు.

డబ్బుకు ప్రాధాన్యమిచ్చే జగన్ ముఖ్యమంత్రి అయితే... ఇక రాష్ట్రమే ఉండకపోవచ్చునని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఆందోళన వ్యక్తం చేశారు. 'సాక్షి' అక్రమార్జనతోనే పుట్టిందని.. జగన్ వర్గానికి సిగ్గూ లజ్జా లేవని ఎంపీ మధుయాష్కీ విరుచుకుపడ్డారు. మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో నేతల మధ్య చర్చ మొత్తం జగన్ ఆస్తుల చుట్టూ తిరిగింది. "అప్పట్లో మేం వైఎస్ మాటను జవదాటలేని పరిస్థితి ఉండేది.

పత్రికల్లో అవినీతి బాగోతాల గురించి కథనాలు వచ్చినా స్పందించలేని స్థితి. వైఎస్ మరణం తర్వాత కూడా జగన్‌పై విమర్శలు చేసేందుకు వెనుకాడాం. కానీ, నిజం నిప్పులాంటిది. ఏదో ఒకరూపంలో బయటకు వస్తుంది'' అని ఒక ఎమ్మెల్యే పేర్కొన్నారు. అధికారమనే ఉల్లిపొర తొలగిపోవడం, రాజకీయ పరిస్థితులు మారడంతో జగన్ అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని... ఇప్పుడు ప్రభుత్వం కూడా వాటిని కప్పి పుచ్చలేదని అంటున్నారు.

మరో పోరాటం...

వైఎస్ ఉండగా... ఆయన అవినీతిపై అవిశ్రాంతంగా చేసిన పోరాటానికి ఇప్పుడు ఫలితం లభిస్తోందని ఆనందిస్తోంది. అటు కిరణ్‌పై, ఇటు జగన్‌పై అస్త్రాలు సంధిస్తోంది. పరిటాల కేసులో నిందితులను కాపాడటంలో తాను చొరవ చూపినట్లు ముఖ్యమంత్రి అంగీకరించడం సిగ్గుచేటని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. నేరస్తులను కాపాడిన సీఎం కూడా నేరస్తుడే అన్నారు. జగన్ మీడియాలో పెట్టుబడులపై హైకోర్టు స్వీకరించిన రిట్ పిటిషన్‌లో తెలుగుదేశం సైతం ఇంప్లీడ్‌గా చేరాలని టీడీపీ భావిస్తోంది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తెలిపారు.

పరిటాల హత్యపై సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో... సీబీఐ పునర్‌విచారణ జరపాలని డిమాండ్ చేశారు. "జగన్‌ను వెనుకేసుకు రావడానికి 60 రోజులు కష్టపడ్డామని చెప్పడమంటే... హత్యానేరాలను ప్రోత్సహించడమే. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని కేసు నమోదు చేయాలి'' అని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు. "చీఫ్ విప్ పదవిలో ఉండి నేరస్తులను రక్షించడం చట్ట విరుద్ధం కాదా? వాస్తవాలను దాచేందుకే 60 రోజులు కష్టపడ్డారా?'' అని ఎమ్మెల్సీ దాడి వీరభద్రరావు ప్రశ్నించారు. వైఎస్ కుటుంబం సంపాదించిన అవినీతి సొమ్ముఉన ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు.

జగన్ అవినీతిపై ఆరేళ్లుగా తాము చేస్తున్న పోరాటానికి ఫలితం లభిస్తోందని మరో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. జగన్ ఆస్తులపై ఇంటర్‌పోల్ సహాయంతో ఆరా తీయాలని, వైఎస్ హయాంలో లక్ష కోట్ల అవినీతి జరిగినట్లు తాము ఆధారాలతో సహా బయటపెట్టామని ఎమ్మెల్యే దేవినేని ఉమా మహేశ్వరరావు చెప్పారు. టీఆర్ఎస్ నేత హరీశ్ రావు అటు జగన్, ఇటు కిరణ్‌లపై ఎక్కుపెట్టారు. హత్యానేరం నుంచి జగన్‌ను కాపాడినట్లు ముఖ్యమంత్రి స్వయంగా ఒప్పుకొన్నందున... హైకోర్టు దీనిని సుమోటోగా తీసుకుని కిరణ్, జగన్‌లపై విచారణ జరపాలన్నారు.

కిరణ్ మైండ్ గేమ్

విచ్చలవిడిగా చెలరేగిపోతున్న జగన్ వర్గాన్ని ఆత్మ రక్షణలోకి నెట్టేందుకు ముఖ్యమంత్రి కిరణ్ 'మైండ్‌గేమ్' మొదలుపెట్టినట్లు భావిస్తున్నారు. పరిటాల రవి హత్య కేసును, 2009 సెప్టెంబర్ 2న రచ్చబండకు వెళ్లేముందు వైఎస్ ఒక అనైతిక పని తనకు చెప్పారనడం వంటి అంశాలను ఆయన బహిరంగంగా ప్రస్తావించడం సంచలనం సృష్టించింది. సాధారణంగా కిరణ్ నోరు జారరని... విశాఖలో కార్యకర్తల సమావేశంలో ఆయన వ్యూహాత్మకంగానే మాట్లాడారని అంటున్నారు.

పరిటాల రవి హత్య కేసులో జగన్‌పై అనుమానాలున్నాయని చెప్పడం ఒక ఎత్తయితే... వైఎస్ తన చేత అనైతిక పనులు చేయించాలని చూశారని చెప్పడం మరో ఎత్తు. విషయం లోతుల్లోకి వెళ్లకుండానే చెప్పాల్సింది చెప్పి, తన చతురత ప్రదర్శించినట్లు కాంగ్రెస్ నేతలు విశ్లేషిస్తున్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటన నాటి నుంచి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వైఖరిలో మార్పు స్పష్టంగా కన్పిస్తోందని వారంటున్నారు. అయితే... ఇందులో వ్యూహాత్మకమేమీ లేదని, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకే తాను అలా మాట్లాడానని కిరణ్ తన సన్నిహితులతో చెబుతున్నట్లు సమాచారం.

జగన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తుతున్నారు. ఇదే స్ఫూర్తితో ఆయన వర్గీయులూ సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ... కాంగ్రెస్ వైపు నుంచి ఆ స్థాయిలో ఎదురు దాడి కనిపించడంలేదు. ముఖ్యమంత్రి కిరణ్ నుంచి కూడా స్పందన లేకపోవడంతో కార్యకర్తల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి.

"జగన్‌ను, ఆయన వర్గాన్ని ఏ స్థాయిలో ఎదుర్కోవాలో, అసలు ఎదుర్కోవాలో వద్దో అనే అయోమయం కూడా ఉంది. దీనిని తొలగించి, ఎదురుదాడికి సిద్ధం చేయడమే నా ఉద్దేశం'' అని కిరణ్ చెబుతున్నట్లు సమాచారం. ఇకపై... సమయం, సందర్భం వచ్చిన ప్రతిసారీ వైఎస్‌కు తామే సన్నిహితులమని, జగన్ కంటే తమకే ఆయన అధిక ప్రాధాన్యమిచ్చే వారని, ఆయన రాజకీయ వారసులం తామేనని చాటి చెప్పనున్నట్లు తెలుస్తోంది.

జగన్ వర్గం ఫైర్

హెలికాప్టర్ ప్రమాదం గురించి కిరణ్ ఏ ఉద్దేశంతో ప్రస్తావించినప్పటికీ... జగన్ వర్గం మాత్రం ఇదే ప్రకటనను తమకు అస్త్రంగా మార్చుకుంటోంది. 'వైఎస్ మరణించనున్నట్లు తెలిసే... కిరణ్ తన ప్రయాణాన్ని చివరి నిమిషంలో వాయిదా వేసుకున్నారా?' అని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు ప్రశ్నించారు. పరిటాల హత్య కేసు గురించి ప్రస్తావించడం కిరణ్ అభద్రతా భావానికి నిదర్శనమన్నారు.

అంబటి రాంబాబు కూడా హెలికాప్టర్ ప్రమాదంపై ఇదే సందేహాలు వ్యక్తం చేశారు. సీబీఐ కిరణ్‌ను కూడా ప్రశ్నించాలన్నారు. పరిటాల కేసులో జగన్‌ను నిందితుడిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇక ఎంపీ సబ్బం హరి సంచలన ఆరోపణలు చేశారు. స్పీకర్‌గా ఉండగానే ముఖ్యమంత్రి పదవి కోసం కిరణ్ చేసిన ప్రయత్నాలను బట్టబయలు చేస్తామని హెచ్చరించారు. జగన్‌తో అధిష్ఠానం జరుపుతున్న సంప్రదింపులను అడ్డుకునేందుకే... వైఎస్ కుటుంబంపై కిరణ్ ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. 
Click Here!
 కాంగ్రెస్‌ది నీచ రాజకీయం
రెండుసార్లు కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చిన వైఎస్ కుటుంబాన్ని చీల్చడానికి కాంగ్రెస్ పార్టీ వెనుకాడలేదు.
పులివెందులలో వైఎస్ జగన్ ధ్వజం
హామీల అమలేదని అడిగితే ఇప్పుడు ఎన్నికలు లేవంటోంది
మహానేత భార్యపై ఆయన తమ్ముడినే పోటీకి దించుతోంది
సొంతగడ్డపై జగన్‌కు పల్లెపల్లెనా వెల్లువెత్తిన అభిమానం
నానమ్మ జయమ్మకు యువనేత నివాళి

‘రెండుసార్లు కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చిన వైఎస్ కుటుంబాన్ని చీల్చడానికి కాంగ్రెస్ పార్టీ వెనుకాడలేదు. అంతటితో సంతోషించకుండా, ఆ మహానేత సతీమణిపై ఆయన తమ్ముడినే పోటీ పెట్టించే నీచ రాజకీయానికి కాంగ్రెస్ దిగింది. ప్రతి అక్కా, ప్రతి చెల్లీ.. ఓటు వేసే ముందు ఈ నీచ రాజకీయాలను గుర్తించండి’ అంటూ యువనేత వైఎస్ జగన్ తన సొంతగడ్డ పులివెందుల ప్రజలకు పిలుపునిచ్చారు. ‘వైఎస్ హామీ ఇచ్చిన 30 కిలోల బియ్యం, 9 గంటల ఉచిత విద్యుత్‌ను ఎందుకు అమలు చేయలేదని ఈ కాంగ్రెస్‌ను ప్రశ్నిస్తే, ఇప్పుడు ఎన్నికలు లేవు కదా, ఎన్నికలు దగ్గర పడిన తర్వాత ఇస్తాం’ అంటోందని కాంగ్రెస్ అవకాశవాదాన్ని ఎత్తిపొడిచారు. యువనేత మంగళవారం ఉదయం పులివెందులకు చేరుకున్నారు. నానమ్మ జయమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె సమాధి వద్ద నివాళులు అర్పించారు. విగ్రహానికి పూలమాల వేశారు. వైఎస్‌ఆర్ ఆడిటోరియంలో ఫాదర్ల సమక్షంలో ప్రార్థనల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం వరకు తనను కలిసేందుకు వచ్చిన వారిని విడివిడిగా కలిసి మాట్లాడారు. అనంతరం తొండూరు మండలంలోని గంగాదేవిపల్లె, ఉడవగండ్ల, ఇనగలూరు, అగడూరు గ్రామాల్లో యువనేత పర్యటించారు. గంగాదేవిపల్లె, అగడూరు గ్రామాల్లో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. వైఎస్ అమలుచేసిన సంక్షేమ పథకాలను గుర్తుచేస్తూ.. ఆయన చేసిన ప్రసంగం వారిని ఉత్తేజితులను చేసింది. రాష్ట్రంలోని ప్రతి పేదకూ లబ్ధి చేకూరేలా సంక్షేమ పథకాలు అమలుచేసి వైఎస్ జనం గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు.

పల్లెపల్లెనా కురిసిన అభిమానం


తొండూరు మండలంలో యువనేత పర్యటించిన గంగాదేవిపల్లె, ఉడవగండ్ల, ఇనగలూరు, అగడూరు గ్రామాల్లో గ్రామస్థులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. డప్పులు, బాణసంచాలతో ఘనస్వాగతం పలికారు. ఊళ్లోకి ప్రవేశించగానే అక్కడి నుంచి డప్పుల మోతలతో, బాణసంచా కాల్పులతో ఊరేగింపుతో గ్రామంలోకి తీసుకెళ్లారు. వృద్ధులు, మహిళలు, యువకులు ఆయనను చూసేందుకు అమితాసక్తి చూపారు.


చర్నాకోల పట్టి: ఇనగలూరు గ్రామానికి చేరే ముందు జగన్‌ను వాహనం నుంచి దిగాలని గ్రామస్థులు ఒత్తిడి చేశారు. తాము అలంకరించి తెచ్చిన కోడెడ్ల బండిలో ఆయన్నుఎక్కించారు. యువనేత చర్నాకోల పట్టి, మరో చేత పగ్గాలు పట్టి కోడెలను పరుగెత్తించారు. బండి వెంట యువకులు ఈలలు, కేకలు వేస్తూ అనుసరించారు. ప్రధాన రహదారి నుంచి గ్రామంలోకి ప్రవేశించేంత వరకు యువనేత ఇలా ఎద్దుల బండిలో చర్నాకోల తిప్పుతూ రావడం గ్రామస్తులను అబ్బురపరిచింది. అగడూరులోనూ గ్రామస్థుల కోరిక మేరకు ఆయన ఎడ్లబండి తోలారు.

Click Here!

 ఔను.. వీళ్లిద్దరూ ఇష్టపడ్డారు
‘దేశం’, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్!
* బలం లేదని తెలిసినా గతంలో అవిశ్వాస తీర్మానం
* ఇప్పుడు అవకాశమున్నా ముందుకు రాని టీడీపీ
* ఇతర విపక్షాలు బాధ్యతలు గుర్తుచేస్తున్నా పట్టించుకోని వైనం
* జగన్‌కు లభిస్తున్న ప్రజాస్పందనతో అధికార, ప్రతిపక్ష పార్టీల్లో వణుకు
* ఎన్నికలంటూ వస్తే పరాజయం తప్పదనే ఇరుపార్టీల్లో భయం
* అందుకే శత్రుత్వాలను సైతం పక్కనబెట్టి యువనేతను ఎదుర్కొనేందుకు కుట్రలు
* సాక్షిలో పెట్టుబడులపై ఆరోపణలు, హైకోర్టుకు లేఖలు అందులో భాగమే
* పార్టీల ప్రయోజనాలకన్నా జగన్‌ను దెబ్బతీయడమే లక్ష్యం

ఇంతటి అవకాశవాద రాజకీయాలను ఎన్నడూ చూడలేదు... నిన్నటివరకు కత్తులు దూసుకున్న వారే నేడు చాటుగా కౌగిలించుకుంటున్నారు... రాజకీయ శత్రుత్వాన్ని మరచి ఏకమవుతున్నారు... వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీల ప్రయోజనాలను సైతం పణంగా పెడుతున్నారు... జనబలం ఉన్న నేతను నేరుగా ఎదుర్కొనే చేవలేక కుయుక్తులు పన్నుతున్నారు... ప్రత్యర్థులమన్న సోయికూడా మరచి కుట్రలు చేస్తున్నారు... రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ చూడని రాజకీయాలివి... ఇవీ రాష్ట్రంలోని ఆయా రాజకీయ పార్టీల్లోని పలువురు నేతల ప్రైవేటు సంభాషణల్లో వినిపిస్తున్న వ్యాఖ్యలు. రాష్ట్రంలో ప్రభుత్వానికి ఎప్పుడేం గండం వస్తుందోననే భయంతో ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవిని ఢిల్లీ పిలిపించుకుని మంతనాలు జరిపిన రోజునుంచి రాష్ట్ర రాజకీయాల ముఖచిత్రం మారిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఒక్కడిని, ఒకే ఒక్కడిని ఎదుర్కొనేందుకు తమ శత్రుత్వాలను సైతం పక్కనబెట్టి, అందరూ కలిసి కుట్రలు చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. జగన్‌కు ప్రజల నుంచి పెద్దఎత్తున మద్దతు లభిస్తున్న నేపథ్యంలో... ఎన్నికలంటూ వస్తే గెలవలేమన్న భయంతోనే అధికార, ప్రతిపక్ష నేతలు ఒక అవగాహనకు వచ్చి ఉంటారని ఇరు పార్టీల నేతల ప్రైవేటు సంభాషణల్లో వినిపిస్తోంది. సాక్షి పత్రికలో పెట్టుబడులకు సంబంధించి రాజశేఖరరెడ్డి ఉన్నకాలంలోనే అసెంబ్లీలోనూ, బయటా విస్తృతమైన చర్చ జరిగినా నోరుమెదపని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఆరోపణలు చేయడంలో ఆంతర్యం కూడా అదేనంటున్నారు. జగన్ ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలంటూ హైకోర్టుకు లేఖలు రాయడంకూడా కుట్రలో ఒక భాగమేనని వారు ఆరోపిస్తున్నారు.


అధికార ప్రతిపక్షం

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం తర్వాత ముఖ్యమంత్రి స్థానాన్ని అధిష్టించిన కె.రోశయ్య ప్రభుత్వం పట్ల సానుకూల వైఖరిని ప్రదర్శించడంపట్ల అప్పట్లో టీడీపీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమైంది. తాజా పరిస్థితుల్లో కూడా తిరిగి అదే బాటలో నడుస్తుండటం ఆ పార్టీ నేతల కు అంతుచిక్కడం లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జగన్ దీక్షల్లో పాల్గొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం మైనారిటీలో పడిందని ఎత్తిచూపుతూ పలు రాజకీయ పార్టీలు టీడీపీకి బాధ్యతలను గుర్తుచేస్తున్నప్పటికీ ఆ పార్టీ నాయకత్వంలో కదలిక లేదు. ఈ విషయంలో టీడీపీ స్పందించకపోవడం వెనుక మతలబు ఉందని బీజేపీ గత కొద్దిరోజులుగా ఆరోపణలు చేస్తూనే ఉంది. మీ ప్రభుత్వాన్ని మేం కాపాడుతాం, మా ప్రయోజనాలను మీరు కాపాడాలంటూ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తెరవెనుక ఒప్పందం కుదిరిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా ఇటీవలి కాలంలో జగన్ నిర్వహించిన లక్ష్య దీక్ష, జల దీక్ష, జన దీక్షలకు వస్తున్న స్పందన చూసిన తర్వాత అధికార, ప్రతిపక్ష నేతల వ్యవహార శైలిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. అందుకే ఒకే జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత ఎన్.చంద్రబాబు నాయుడు ఇన్నాళ్ల తమ వైరాన్ని సైతం మరచి, ఉమ్మడి శత్రువు అయిన జగన్‌మోహన్‌రెడ్డిని టార్గెట్ చేసుకుని కలిసి పనిచేస్తున్నారని విశ్లేషిస్తున్నారు.


కిరణ్‌తో బాబు దోస్తీ?

దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉన్న కాలంలో అవకాశం ఉన్న ప్రతి సందర్భంలోనూ ఒంటికాలి మీద లేచే ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు, ఆ తర్వాత ఆచితూచి వ్యవహరించడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని రాజకీయ విశ్లేషకుల అంచనా. ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఏర్పడితే మీరు మద్దతునిస్తారా? అని రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో కొందరు విలేకరులు చంద్రబాబును ప్రశ్నించినప్పుడు ఆయన నవ్వి ఊరుకున్నారే తప్ప సూటిగా సమాధానం చెప్పలేదు. తెలుగువాడి ఆత్మగౌరవం నినాదంతో, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఏర్పాటైన తమ పార్టీ ఎప్పటికీ కాంగ్రెస్‌కు మద్దతునిచ్చే ప్రసక్తేలేదని స్పష్టంగా చెప్పాల్సిన చంద్రబాబు చిరునవ్వులు చిందించడంలో ఆంతర్యమేమిటని అప్పట్లోనే ఆ పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబుల మధ్య అంతర్గతంగా ఒక అవగాహన కుదిరిందా? అన్న అనుమానాలు ఆ పార్టీల్లోనే వ్యక్తమవుతున్నాయి.

ఎందుకంటే జగన్‌కు మద్దతునిస్తున్న ఎమ్మెల్యేల విషయంలో తొందరపాటు చర్యలేవీ ఉండవని పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ప్రకటించినా, ముఖ్యమంత్రి మాత్రం జగన్ వెంట వెళుతున్న ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రికున్న ధైర్యం ఏమిటి? ప్రభుత్వం పడిపోకుండా టీడీపీ కాపాడుతుందనే కదా అని పీసీసీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. జగన్ వెంట ఎమ్మెల్యేలు వెళుతున్న నేపథ్యంలో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడదామని ఇటీవలి కాలంలో కోస్తా, రాయలసీమకు చెందిన ఇద్దరు నాయకులు సూచించినప్పటికీ, అధినేత తమనెందుకు వారించారో వారికి మొదట్లో అర్థం కాలేదు. అయితే ఆ తర్వాత చంద్రబాబు రాజకీయ మర్మాన్ని వివరించడంతో వారు కూడా సర్దుకుపోయారని పార్టీ వర్గాలు చెప్పాయి.



టీడీపీ నేతల నోట సీఎం పాట

సాధారణంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య అగ్గి భగ్గుమంటుంటుంది. కానీ రాష్ట్రంలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రతిపక్ష టీడీపీ నేతలు ముఖ్యమంత్రి పాడిన పాటనే పాడుతున్నారు. సీఎం నాలుగు రోజుల కిందట ఢిల్లీ పర్యటన సందర్భంగా తొలిసారి అధికారిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి జగన్ వెంట నడుస్తున్న ఎమ్మెల్యేలు రాజీనామా చేసి పోటీ చేయాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే హైదరాబాద్‌లో టీడీపీ అధికార ప్రతినిధి విలేకరుల సమావేశం పెట్టి అదే డిమాండ్‌ను మరింత గట్టిగా వినిపించారు. అలాగే సోమవారం ప్రారంభమైన రచ్చబండ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ ఒక ఎమ్మెల్యే హత్య కేసుకు సంబంధించి తాను జగన్‌కు ఏదో సహాయం చేసినట్టు చెప్పారు. అదేరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ జగన్‌ను ఆ కేసులోంచి తప్పించారంటూ ఆరోపించారు.

ఈ రకంగా అధికార, ప్రతిపక్ష నేతలు కూడబలుక్కుని మాట్లాడుతున్నట్టుగా ఉందని ఆ పార్టీల నేతలే అంటున్నారు. లేదంటే జగన్ వెంట వెళుతున్న ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా తన ప్రభుత్వానికి ఏం ఢోకా లేదన్న భరోసా కిరణ్‌కుమార్‌రెడ్డికి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన అలా ఎందుకు మాట్లాడారు? కాంగ్రెస్‌లోని తెలంగాణకు చెందిన ఒక సీనియర్ నాయకుడు తెలంగాణ అంశాన్ని పక్కనపెట్టి మరీ జగన్‌పై ఎందుకు దుమ్మెత్తిపోస్తున్నారు? ఇప్పుడు కాంగ్రెస్‌లో రాజశేఖరరెడ్డి లేరు కాబట్టి ఆ పార్టీకి మద్దతునివ్వాలని నిర్ణయించామని పీఆర్పీ నాయకుడు కోటగిరి విద్యాధరరావు చెప్పడంలోని అర్థమేమిటి? తెరవెనుక పరస్పర అవగాహన కుదిరింది కాబట్టే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని ట్రస్ట్ భవన్‌లో ఉండే ఒక నాయకుడు చెప్పారు.


46 మంది ఉన్నప్పుడే పెట్టాం...

2008లో పార్టీకి కేవలం 46 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నప్పుడు, గెలవలేమని తెలిసినా వైఎస్ మంత్రివర్గంపై శాసనసభలో అవిశ్వాస తీర్మానం పెట్టాం... ఇప్పుడు పెట్టడానికి ఎందుకు సంశయం? ఆనాడు మంత్రివర్గం విశ్వాసం కోల్పోయిందంటూ అవిశ్వాస తీర్మాన నోటీసుపై చంద్రబాబు మొదటి సంతకం చేశారు... ఇప్పుడు ఇంతటి అవకాశంలోనూ ఆయన మౌనంగా ఉంటున్నారంటే సీఎంతో ఏదో ఒప్పందం కుదిరే ఉంటుందని టీడీపీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వ్యవహారాలన్నీ సోనియాగాంధీ సూచనల మేరకే జరుగుతున్నాయని పీసీసీ నాయకుడొకరు చెబుతున్నారు. జగన్‌ను టార్గెట్ చేసుకుని మిత్రపక్షాలు, శత్రుపక్షాలు అన్న తేడా లేకుండా నాయకులంతా కలిసికట్టుగా పనిచేస్తున్నారని కాంగ్రెస్ పెద్ద నాయకుడొకరు మంగళవారం సీఎల్పీ వద్ద తన మనసులోని మాటను బయటపెట్టారు. 
Click Here!
  సుమోటోగా స్వీకరిస్తే చాలా లేఖలొస్తాయ్!
  హైకోర్టు కొత్త సంప్రదాయానికి తెరతీసింది: సబ్బం హరి
* ఇలాగైతే ఇక ప్రతి ఒక్కరి మీదా లేఖలు వెల్లువెత్తుతాయి* రేపు ఎవరైనా సీఎంపై లేఖరాస్తే కోర్టు సుమోటోగా స్వీకరిస్తుందా?* నెహ్రూ నుంచి మన్మోహన్ వరకూ అందరిపైనా ఆరోపణలు వచ్చాయి * వీరెవరిపైనా సుమోటోగా కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవు * కాంగ్రెస్ సొంత సంస్థ అనుకునే సీబీఐ చేత జగన్‌పై దర్యాప్తు చేయించొచ్చు కదా... అందుకు జగన్ కూడా సహకరిస్తారు..* వైఎస్సార్‌ను సీఎం కిరణ్ చులకన చేస్తూ మాట్లాడటం తగదు... ఆయనను స్పీకర్‌ను చేసింది వైఎస్సేనన్న సంగతి మరువరాదు* దీనిపై త్వరలో ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధిష్టాన వర్గంతో మాట్లాడతా

శంకర్‌రావు లేఖను సుమోటోగా స్వీకరిస్తూ హైకోర్టు కొత్త సంప్రదాయానికి తెర తీసిందని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి వ్యాఖ్యానించా రు. యువనేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన కంపెనీల్లో పెట్టుబడులుపెట్టిన సంస్థలకు హైకోర్టు నోటీసులివ్వటంపై ఆయన మంగళవారం విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు. ‘‘హైకోర్టుకు తాను లేఖ రాయలేదని మంత్రి శంకర్‌రావు చెప్పటంతో విషయం చర్చనీయాంశమైంది. మూడు నెలల కిందట మీడియాకు ఇచ్చిన లేఖపై హైకోర్టు స్పందించిందని ఆయన చెప్తున్నారు. గతంలో ఎప్పుడూ ఇలా రాజకీయ నాయకుల వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన దాఖలాల్లేవు’’ అని హరి పేర్కొన్నారు. అసెంబ్లీలో కూడా ఇలాంటి ఆరోపణలు పరస్పరం చేసుకోవటం సర్వసాధారణమన్నారు.

‘‘ప్రతి రోజూ మీడియాలో ఎవరో ఒక ప్రజాప్రతినిధిపై ఆరోపణలు వస్తూనే ఉంటాయి. దేశ ప్రథమ ప్రధాని నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీలతో పాటు.. చివరికి దేశమంతా సత్యవంతుడని చెప్పే ప్రస్తుత ప్రధాని మన్మోహన్‌పై కూడా 2జీ స్పెక్ట్రం అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. వీరెవరిపైనా కోర్టులు సుమోటోగా కేసు నమోదు చేసిన దాఖలాల్లేవు. రేపు నేను కానీ, మరెవరైనా కానీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై లేఖ రాస్తే హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేస్తుందా?’’ అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి లేఖలను సుమోటోగా తీసుకుంటే భవిష్యత్తులో ప్రతి ఒక్కరిపైనా ఔనా? కాదా? అంటూ కోర్టులకు లేఖలు రాసే ప్రమాదముందన్నారు. సీబీఐ వ్యవస్థ కాంగ్రెస్ సొంత సంస్థగా విపక్షాలన్నీ వ్యాఖ్యానిస్తున్నాయని, అలాంటి సీబీఐతోనే జగన్‌పై విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయొచ్చుకదా అని ప్రశ్నించారు. దీనిని జగన్ కూడా స్వాగతిస్తారని పేర్కొన్నారు.

స్పీకర్‌ను చేసింది వైఎస్సేనని మరవరాదు..
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డికి రాజకీయ వారసులమని చెప్పుకుంటూ, ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ముఖ్యమంత్రి మాట్లాడటం తగదని సబ్బం అన్నారు. ఒకసారి వారసుల మంటారని, మరోసారి ఆయనపైనే ఆరోపణలతో అభాండాలు వేస్తు న్నారని విమర్శించారు. వైఎస్సార్ ఉత్తముడనో.. లేదా అవినీతిపరుడనో ఏదో ఒక వ్యాఖ్యకు కట్టుబడి ఉండాలన్నారు. స్పీకర్‌గా విధులు ప్రారంభించే కార్యక్రమానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు హాజరుకాకున్నా వైఎస్ స్వయంగా తోడ్కొనివెళ్లి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారనే విషయం కిరణ్ మర్చిపోవటం శోచనీయమన్నారు. వైఎస్సార్‌కు మాజీ ప్రధాని పీవీతో అపాయింట్‌మెంట్ ఇప్పించానన్న కిరణ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. దీనిపై వచ్చే నెల 7న ఢిల్లీ వెళ్లి ప్రణబ్, మొయిలీ తదితర కాంగ్రెస్ అధిష్టాన వర్గం నేతలతో మాట్లాడనున్నట్లు తెలిపారు.

ప్రస్తుత గందరగోళ పరిస్థితుల దృష్ట్యా గత 15-20 రోజుల నుంచి అధిష్టానం జగన్‌తో సంధి ప్రయత్నాలు చేస్తోందని పేర్కొన్నారు. కొద్ది రోజుల్లో విషయం తేటతెల్లమవుతుందని వెల్లడించారు. ఇలాంటి సమయంలో కిరణ్ వ్యాఖ్యలు అనుమానాలకు దారితీస్తున్నాయన్నారు. క్యాబినెట్లో ఒకరిద్దరు మంత్రులు కూడా వైఎస్సార్, జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడటం వెనుక సీఎం హస్తముందేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా వైఎస్సార్‌పై సీఎం వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగానా? లేదా అధిష్టానం ఆదేశాల మేరకే చేస్తున్నారా అన్న సందేహం కూడా నెలకొందన్నారు.

కాంగ్రెస్ చాలా మందిని చాలా రాష్ట్రాల్లో సీఎంలను చేసిందని, వారెవరికీ వైఎస్సార్‌కు వచ్చినంత గుర్తింపు రాలేదన్న విషయాన్ని గుర్తించాలని హితవుపలికారు. తనను విప్‌గా, స్పీకర్‌గా చేసిన వైఎస్సార్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేయటం కిరణ్‌కు తగదని, అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నారు. చంద్రబాబులా వెన్నుపోటుదారుగా మిగలకూడదనే 2014 వరకు ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం లేదని జగన్ స్పష్టం చేశారన్నారు. అయినా కావాలనే దమ్ముంటే రాజీనామా చేయండంటూ బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు.
Click Here!

సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై అంబటి రాంబాబు నిప్పులు
* వైఎస్, జగన్‌లపై కిరణ్ వ్యాఖ్యలు దిగజారుడుతనానికి నిదర్శనం * ‘రచ్చబండ’ను వైఎస్ కుటుంబాన్ని కించపరిచేందుకు ఉపయోగిస్తున్నారు * సీఎం కుటుంబంపై ఆరోపణలు వచ్చినపుడు చీఫ్ విప్‌గానే కిరణ్ జవాబు * ఆ ఆరోపణలపై సమాధానం చెప్పటానికి ఆరు నిమిషాలు చాలు * సీఎం గొప్పలు చెప్పుకుంటూ వైఎస్‌ను కించపరిచే దుస్సాహసం చేస్తున్నారు * ఆయన మాటలను బట్టి వైఎస్ మరణంపై కొత్త అనుమానాలు వస్తున్నాయి * సీబీఐ కిరణ్‌ను విచారించిందా? లేకపోతే కేసును మళ్లీ విచారించాల్సిందే * పీవీతో వైఎస్‌కు అపాయింట్‌మెంట్ ఇప్పించాననటం కిరణ్ పిట్టలదొర కథ * ఆయన తీరు చూస్తే టీడీపీతో కుమ్మక్కయి ‘ఫీడ్’ ఇస్తున్నట్లు తెలుస్తోంది

‘కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునన్... ’ అన్న చందంగా ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహార శైలి ఉందని.. యువనేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మద్దతుదారుడు అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలి రోజు రచ్చబండ పర్యటనలో సీఎం కిరణ్ చేసిన వ్యాఖ్యలు పై పద్యాన్ని అక్షరాలా తలపిస్తున్నాయని అన్నారు. రచ్చబండ కార్యక్రమాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి వినియోగించకుండా దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డినీ ఆయన కుటుంబీకులను కించపరిచేందుకు ఉపయోగించటం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌లో జగన్ క్యాంపు కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యేలు గోనె ప్రకాశరావు, బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ ఎస్.ఎ.రెహ్మాన్, కిసాన్ కాంగ్రెస్ మాజీ కార్యదర్శి గట్టు రామచంద్రరావులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. సీఎం కిరణ్ గొప్పలు చెప్పుకోవటంపై తీవ్రంగా మండి పడ్డారు. ఓ హత్య కేసులో జగన్ ముద్దాయి అయినట్లూ, ఆయనను తానే రక్షించినట్లూ కిరణ్ చెప్పుకోవటం ఆయన దిగజారుడుతనానికీ, చౌకబారు మాటలకూ నిదర్శనమని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుమారుడు కనుకనే ఆయనపై కుట్రబుద్ధితో టీడీపీ ఈ ఆరోపణలు చేసింది. అవి అసెంబ్లీలో చర్చకు వచ్చినపుడు చీఫ్ విప్‌గా మీరు (కిరణ్) ఉన్నారు కనుక, సభా నాయకుడి(వైఎస్) పైనా, ఆయన కుటుంబీకులపైనా ఆరోపణలు వచ్చినపుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద, అప్పటి మంత్రుల మీదా ఉంది. చీఫ్ విప్‌గా అది మీ ధర్మం, అదే మీరూ చేశారు. అంత మాత్రాన మీరేమైనా కాపాడే ప్రభువులనుకుంటున్నారా?’’ అని అంబటి ధ్వజమెత్తారు.

‘‘మీపై (కిరణ్‌పై) వైఎస్‌కు ఎంతో నమ్మకం ఉండబట్టే ఆరోపణల విషయమై ఏమీ చెప్పలేదని అంటున్నారు. ఆ రోజు వైఎస్ నిన్నెందుకు అడగలేదూ అంటే ఆయనకు స్పష్టంగా తెలుసు ఇది తనపైనా తన కుటుంబీకులపైనా రాజకీయంగా చేసిన కుట్రపూరిత ఆరోపణ అని, అది గాలికి తేలిపోయే ఆరోపణా అని తెలుసు.. అందుకే వైఎస్ దీన్ని చాలా చిన్న విషయంగా తీసుకున్నారు. నువ్వు 60 రోజులు కష్టపడి అసెంబ్లీలో మాట్లాడానని చెప్పుకుంటున్నావు. అది అవాస్తవం, ఇది చాలా చిన్న ఆరోపణ, సమాధానం చెప్పటానికి ఆరు నిమిషాలు కూడా శ్రమించాల్సిన అవసరం లేదు’’ అని రాంబాబు తేల్చి చెప్పారు. ‘‘అయినా మీరేం చేశారు? దోషిని, నిర్దోషి అని రుజువు చేశారా? లేక నిర్దోషిని నిర్దోషి అని రుజువు చేశారా?’’ అని ప్రశ్నించారు. ‘‘మీరు చెప్పేదే కనుక నిజమైతే ఒక దోషిని నిర్దోషిగా రుజువు చేసినందుకు ముఖ్యమంత్రి పీఠంపై ఒక్క నిమిషం కూడా కొనసాగటానికి అనర్హుడివి, తక్షణం దిగి పోవాలి’’ అని సవాల్ విసిరారు.

టీడీపీ ఇలాంటి కుట్రపూరితమైన ఆరోపణ చేయగానే ఏ మాత్రం వెనుకాడకుండా సీబీఐ విచారణకు ఆదేశించారనీ, ఈ కేసులో జగన్‌కూ, మరో మంత్రికీ ఎలాంటి సంబంధమూ లేదనీ తేల్చిందనీ అంబటి గుర్తు చేశారు. వైఎస్ మృతి చెందిన రోజు హెలికాప్టర్‌లో తాను కూడా బయలుదేరాల్సి ఉన్నప్పటికీ చివరి నిమిషంలో వైఎస్ ఏదో పని చెబితే అది సంప్రదాయ విరుద్ధమైనది కనుక తాను చేయనందు వల్ల వెళ్ల లేకపోయాననీ కిరణ్ చెప్పటం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని రాంబాబు అన్నారు. ‘‘వైఎస్ మీకు ఏం చెప్పారో, వివరణ ఇవ్వటానికి ఆయన ప్రస్తుతం లేరు, ఇలాంటి మాటలు మాట్లాడి మీ (కిరణ్) గొప్పతనాన్ని చెప్పుకునే తాపత్రయపడుతూ వైఎస్‌ను కించపరిచే దుస్సాహసానికి ఒడిగడుతున్నారు’’ అని ఆయన విమర్శించారు.

‘‘ముఖ్యమంత్రి చెప్పిన మాటలను బట్టి ఆయనే తనపై అనుమానాలను రేకెత్తిస్తున్నారు.. వైఎస్ మృతిపై విచారణ జరిపిన సీబీఐ బృందం అసలు కిరణ్‌ను విచారించిందా? విచారించకపోతే అది అసంపూర్తిగా ముగిసినట్లే అని అభిప్రాయపడుతున్నా’’ అని అంబటి పేర్కొన్నారు. కిరణ్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో వైఎస్ మృతి కేసుపై పునర్విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్‌తో 30 ఏళ్లు కలిసి పనిచేసినట్లుగా సీఎం చెప్పుకోవటం అంతా అబద్ధం అని అంబటి ఆక్షేపించారు. ‘‘1999 వరకూ కిరణ్‌కుమార్‌రెడ్డి వైఎస్ వ్యతిరేక శిబిరంలో ఉన్న మాట వాస్తవం కాదా?’’ అని ఆయన సూటిగా ప్రశ్నించారు.

పిట్టలదొర కథలు...
అప్పటి ప్రధానమంత్రి పి.వి.నరసింహారావుతో వైఎస్‌కు తానే అపాయింట్‌మెంట్ ఇప్పించినట్లుగా కిరణ్ పిట్టల దొర కథలు చెబుతున్నారని అంబటి ఎద్దేవా చేశారు. ‘‘మన రాష్ట్రానికి చెందిన పీవీకి వైఎస్ ఎవరో తెలియని పరిస్థితి ఉంటుందంటే నమ్మాలా? అప్పటికే ఆయన పెద్ద ఎత్తున శాసనసభ్యుల్లోనూ, ఎంపీల్లోనూ బలం కలిగిన నాయకుడనే విషయం ఎవరికి తెలియదు?’’ అని రాంబాబు ప్రశ్నించారు. తాను వైఎస్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగిన నాయకుడిననీ, ఆయనతో పాటు 1,400 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసినవాడిననీ, తనలాంటి వారు కిరణ్ చెప్పే మాటలు నమ్మరనీ, ఇలాంటివి ఆయన ఇంకెవరైనా అమాయకుల ముందు చెప్పుకుని సంతృప్తి చెందాలనీ ఎద్దేవా చేశారు. వైఎస్ కోసం టీడీపీతో వైరం తెచ్చుకున్నట్లుగా కిరణ్ చెప్పుకోవటం సిగ్గు చేటన్నారు. ‘‘అంటే నువ్వు కాంగ్రెస్‌లో ఉంటూ టీడీపీతో అంతకు ముందు మిత్రత్వంతో ఉండే వాడివా? వైఎస్ వారసుడిగా చెప్పుకోవటానికి ఓవైపు తాపత్రయపడుతూ మరో వైపు ఇలా మాట్లాడతావా?’’ అని అంబటి ప్రశ్నించారు.

ఇంత కంటే నీతిమాలిన వ్యాఖ్యలు, కుట్రపూరిత, చౌకబారు మాటలు ఇక ఉండవన్నారు. ‘‘నీకు ముఖ్యమంత్రి స్థాయి లేదని మాకు తెలుసు, ఆ పదవికి పనికిరావని ప్రజలూ తెలుసుకున్నారు. కానీ నీ మాటలనుబట్టి ఇపుడు నీకూ తెలిసి వచ్చిందనుకుంటున్నాను’’ అని కిరణ్‌ను ఉద్దేశించి అంబటి వ్యాఖ్యానించారు. వైఎస్‌నూ, ఆయన కుటుంబీకులనూ కించపరిచేందుకు కిరణ్ చేస్తున్న యత్నం చూస్తే ఆయన టీడీపీతో కుమ్మక్కు అయినట్లుగా తెలిసిపోతోందన్నారు. జగన్‌కు వ్యతిరేకంగా టీడీపీ నాయకులకు కావాల్సిన ఫీడ్ (సమాచారాన్ని)ను ముఖ్యమంత్రే అందజేస్తున్నట్లు ఉందని ఆయన ఆరోపించారు. కిరణ్ చేసిన వ్యాఖ్యలను పట్టుకుని ఇక టీడీపీ వారు కూడా పసలేని ఆరోపణలే చేస్తారని ఆయన అన్నారు.

అవి నోటీసులే.. తీర్పు కాదు!

‘సాక్షిలో పెట్టుబడులపై హైకోర్టు నోటీసులు ఇవ్వటం, కిరణ్ ఇలా మాట్లాడటం వెనుక రాజకీయ కుట్ర ఏమైనా ఉందని భావిస్తున్నారా?’ అని ఓ విలేకరి ప్రశ్నించినపుడు ‘‘ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంగా పరిగణించి కోర్టు జారీ చేసిన నోటీసులపై మేమేమీ వ్యాఖ్యానించం. నోటీసులకు జగన్ తరఫున సమాధానాలు ఇస్తారు. న్యాయ పోరాటం చేస్తారు. అయినా కోర్టు జారీ చేసింది నోటీసులే కదా! మాజీ ముఖ్యమంత్రి రోశయ్యకు కూడా ఏసీబీ కోర్టు నుంచి నోటీసులు వచ్చాయి కదా! కోర్టు ఇచ్చిందేమీ తీర్పు కాదు కదా’’ అని అంబటి సమాధానమిచ్చారు. అత్యంత ప్రజాదరణగలిగిన నాయకుడైన జగన్‌ను అన్ని వైపుల నుంచీ ముట్టడించటానికి పద్మవ్యూహం పన్నుతున్నారనీ, కాంగ్రెస్ అధిష్టానవర్గం కూడా అందుకు ప్రయత్నిస్తూ ఉండవచ్చనీ అంబటి జవాబిచ్చారు. ‘‘కానీ జగన్‌ను ఎవరూ ఏమీ చెయ్యలేరు... చెయ్యలేరు... చెయ్యలేరు...’’ అని ఆయన స్పష్టంచేశారు.

నాటి మృతులకు ఆర్థిక సాయం ఏమైంది ?
వై.ఎస్.రాజశేఖరరెడ్డి మృతిని జీర్ణించుకోలేక తనువు చాలించిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తానని ఏఐసీసీ ప్రకటించి నాలుగు నెలలు దాటుతున్నా ఆ ఊసే ఎందుకు ఎత్తటం లేదని అంబటి ప్రశ్నించారు. వైఎస్‌పై ప్రజలకు ఎంత అభిమానం ఉందో సోనియా, మన్మోహన్‌సింగ్‌కు కూడా అంతే అభిమానం ఉందని కిరణ్ చెప్పటం నిజమే అయితే.. ఆ మృతుల కుటుంబాలను ఎందుకు ఇంత వరకూ ఆదుకోవటం లేదని ఆయన నిలదీశారు.

జగన్‌కు హైకోర్టు నోటీసులు


జగన్ మీడియాకు హైకోర్టు ఝలక్
విచారణ ఎందుకు జరపొద్దు?
మూడు వారాల్లో బదులివ్వండి
పెట్టుబడుల మాయపై హైకోర్టు ఆరా

శంకర్‌రావు లేఖపై సుమోటోగా విచారణ
జగన్, ఇతర పెట్టుబడిదారులకు నోటీసులు
సీబీఐ డైరెక్టర్, ఆరుగురు అధికారులు సహా మొత్తం 52 మందికి శ్రీముఖాలు
హైకోర్టుకు శంకర్‌రావు రెండు లేఖలు
అనుబంధ పత్రాలతో 80 పేజీల రెండో లేఖ
జగన్ మీడియాలోకి వెల్లువెత్తిన పెట్టుబడుల మూలాలపై హైకోర్టు దృష్టి సారించింది. అక్రమాల ఆరోపణలపై ఎందుకు విచారణ నిర్వహించకూడదని ప్రశ్నించింది. మూడు వారాల్లో జవాబు చెప్పాలని ఆదేశించింది. 'సాక్షి' చైర్మన్ వైఎస్ జగన్‌తోపాటు ఇందులో పెట్టుబడులు పెట్టిన వారికి, ఏడుగురు అధికారులకు... మొత్తం 52 మందికి జస్టిస్ వి.ఈశ్వరయ్య, జస్టిస్ సూరి అప్పారావులతో కూడిన ధర్మాసనం సోమవారం నోటీసులు జారీ చేసింది. మంత్రి శంకర్‌రావు గతంలో రాసిన లేఖనే సుమోటోగా హైకోర్టు విచారణకు స్వీకరించింది.

"జగన్‌కు చెందిన సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ చానల్‌లో పెట్టుబడుల వెనుక పలు అక్రమాలు ఉన్నాయి. అధికార దుర్వినియోగం జరిగింది. పలు సంస్థలకు భూములు, గనులు, కాంట్రాక్టులు అక్రమంగా కట్టబెట్టి... వారి చేత మీడియాలో పెట్టుబడులు పెట్టించారు. అసాధారణ ప్రీమియంతో షేర్లు కొనిపించారు. మనీ లాండరింగ్‌తో సలు అక్రమాలకు పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన రికార్డులను కోర్టు పరిశీలించి, విచారణ జరిపితే వాస్తవాలు వెలుగు చూస్తాయి. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలి'' అని శంకర్ రావు కోరారు.

ఈ లేఖను సోమవారం హైకోర్టు డబ్ల్యుపీ 794/2011 కింద సుమోటోగా విచారణకు స్వీకరించింది. 'పిటిషనర్ లేవనెత్తిన అంశాలపై ఎందుకు విచారణకు ఆదేశించరాదో మూడు వారాల్లోగా (వచ్చేనెల 14వ తేదీలోగా) చెప్పండి' అని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. సీబీఐ, విజిలెన్స్ డైరెక్టర్‌లతోపాటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోం మంత్రిత్వశాఖ కార్యదర్శి... ఇలా ఏడుగురు అధికారులను కూడా ప్రతివాదులుగా చేర్చింది.

ఇంకా, జగన్‌కు, ఆయన మీడియాలో పెట్టుబడులు పెట్టిన వారికీ నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న వారిలో ప్రధానంగా... ఇండియా సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్, పెన్నా సిమెంట్స్ అధిపతులు ఉన్నారు. సందేశ్ ల్యాబ్స్, పీవీపీ బిజినెస్ వెంచర్స్, క్యూబాయిడ్ రియల్టర్స్, మ్యాంట్లే రియల్టర్స్, మెటాఫర్ రియల్ ఎస్టేట్స్, పీవీపీ బిజినెస్ టవర్స్, జీ2 కార్పొరెట్ సర్వీసెస్, సుగుణి కన్‌స్ట్రక్షన్స్, ఆల్ఫా విల్లాస్, ఆల్ఫా అవెన్యూస్, బీటా అవెన్యూస్, గిల్ క్రిస్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ కంపెనీలకూ నోటీసులు అందాయి.

ఇందిరా టెలివిజన్, జగతి పబ్లికేషన్స్, క్యారామెల్, ఆస్రా హోల్డింగ్స్, జనని ఇన్‌ఫ్రాస్ట్రక్ఛర్స్, భగవత్ సన్నిధి ఎస్టేట్స్, క్లాసిక్ రియల్టీ, భారతి సిమెంట్స్, సిలికాన్ బిల్డర్స్, కేప్‌స్టోన్ ఇన్‌ఫ్రా, పులివెందుల పాలిమర్స్, హరీష్ ఇన్‌ఫ్రా, ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ ప్రైజెస్, కాంతి కండక్టర్స్, సందేశ్ ల్యాబ్స్, స్వగృహ హోటల్స్, జూబ్లీ మీడియా, ఈఆర్ఈఎస్ ప్రాజెక్ట్స్, సంస్థలతోపాటు, బి.పురుషోత్తమ నాయుడు, ఎం. శ్రీనివాసరెడ్డి, జి. శ్రీనివాసరాజు, ఎ.కె. దండమూడి, కె. శ్రీనివాస నాయుడు, అజయ్ గారపాటి, మాధవ్ రామచంద్రన్, జి. అనంతసేనా రెడ్డి, కె. ప్రసాద్ రెడ్డి, డి. సరోజినమ్మ, డి. శ్రీనివాసులు రెడ్డి తదితరులను ప్రతివాదులుగా చేర్చారు. 'సాక్షి'లో పెట్టుబడులపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ), ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే కేంద్రానికి నివేదికలు సమర్పించినట్లు సమాచారం. ఇప్పుడు రాష్ట్ర హైకోర్టు కూడా దీనిపై దృష్టి సారించడం విశేషం.
Click Here!
జగన్‌కు హైకోర్టు నోటీసులు
Jagan-single 
ఎట్టకేలకు వై.ఎస్‌ జగన్‌ అక్రమాస్తులపై హైకోర్టు కదిలింది. అయి దు సంవత్సరాలుగా ప్రతిపక్ష పార్టీలు, పలు ఆరోపణలు సంధించినా ప్రభుత్వం ఆ దిశలో ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో కాం గ్రెస్‌కు చెందిన సీనియర్‌ నాయకుడు శంకర్‌ రావు (ప్రస్తుతమంత్రి) లేఖకు హైకోర్టు స్పందిం చింది. లేఖలోని సారాంశాలను క్షుణ్ణ ంగా పరి శీలించి సుమోటోగా కేసు స్వీకరించి ప్రతివాదు లకు, ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తనయుడు మాజీ ఎంపీ వై.ఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, అతడికి సంబంధించిన అక్రమ ఆస్తులు కూడబెట్టిన వ్యవహారంపై సీబీఐ చేత విచారణ జరిపించాలని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి శంకర్‌రావు రాసిన లేఖను రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరించింది. కొన్ని నెలలుగా జగన్‌ ఆస్తులపై పలువురు అమా త్యులు బహిరంగంగా వ్యాఖ్యానించిన నేప థ్యంలో హైకోర్టు ఈ అంశాన్ని సీరియస్‌గానే తీసుకుంది. సోమవారం హైకోర్టు న్యాయ మూర్తులు జస్టిస్‌ వి.ఈశ్వరయ్య, జస్టిస్‌ సూరి అప్పారావులతో కూడిన ధర్మాసనం ప్రతివాదు లకు నోటీసులు జారీచేసింది. ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం, సీబీఐ, విజిలెన్స్‌ అధికారులతో పాటు మాజీ ఎంపీ వై.ఎస్‌. జగన్‌మెహన్‌రెడ్డి, జగతి పబ్లికేషన్స్‌ లిమిటెడ్‌, ఇందిరా టెలివిజన్‌ లిమిటెడ్‌లతో పాటు 52 సంస్థలకు నోటీసులు జారీచేసింది.

మూడు వారాల్లోగా వీటిపై స్పందించాలని ధర్మాసనం ప్రతివాదులను ఆదేశిం చింది. జగన్‌ అక్రమ ఆస్తుల రికార్డులను తెప్పించుకుని సమగ్రంగా దర్యాప్తు చేయాలని శంకర్‌రావు తనలేఖలో కోరారు. అధికార దుర్వినియోగం, భూ కేటాయింపులు గనులు, లీజుల ద్వారా అక్రమంగా ఆస్తులు పొందడం వంటి వ్యవహారాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని శంకర్‌రావు కోరారు. జగన్‌ కంపెనీలోని పెట్టుబడులను మనీ ల్యాండ్‌ రింగ్‌ విధానం ద్వారా మళ్ళించారు. 2004 నుంచి వై.ఎస్‌. జగన్‌ తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో అధికార దుర్వినియోగానికి పాల్పడి కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించారు.

సీఎం హోదాలో తన తండ్రి అధికారాలను అడ్డం పెట్టుకుని కార్పోరేట్‌ సంస్థలు, వ్యక్తులు, బంధువులకు గనులు కేటాయించడం ద్వారా, లైసెన్సులు మంజూరు చేయడం ద్వారా భారీగా ముడుపులు స్వీకరించారు. 2004 మార్చి నాటికి 11 లక్షల ఆస్తులు కలిగిన వ్యక్తి ప్రస్తుతం 43వేల కోట్లకు అధిపతిగా ఉన్నాడని విశ్వసనీయ సమాచారం. అవినీతి కార్యకలాపాలతో కూడబెట్టిన నల్లధనాన్ని వివిధ కంపెనీల ద్వారా పెట్టుబడులు పెట్టించి వైట్‌మనీగా మార్చారు. సండ్రూస్‌పవర్‌, జగతి పబ్లికేషన్స్‌, ఇందిరా టెలివిజన్‌, దాల్మియా హాసియా హోల్డింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా నల్లధనాన్ని వైట్‌మనీగా మార్చారు. బంధువులు, స్నేహితుల బినామీ పేర్లతో 90 శాతం పెట్టుబడులు పెట్టారు.

వివిధ వ్యక్తులు, సంస్థలతో ముందే ఒప్పందం కుదుర్చుకుని తన తండ్రి వై.ఎస్‌.ఆర్‌ ద్వారా లబ్ది పొందిన కార్పోరేట్‌ సంస్థలు, వ్యక్తులు జగన్‌ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టాయి. హెటిరో గ్రూప్‌, ఇండియా సిమెంట్స్‌, దాల్మియా సిమెంట్స్‌, పొట్లూరి వరప్రసాద్‌, నిమ్మగడ్డ ప్రసాద్‌, పెన్నా గ్రూప్‌, ల్యాంకో గ్రూప్‌, సజ్జల గ్రూప్‌, వి.పురుషోత్తమ్‌నాయుడు, రమణారెడ్డి, నాగిరెడ్డిలతో పాటు పలువురు 400 రూపాయల నుంచి 11 వందల రూపాయల అధిక ప్రీమియంతో షేర్లు కొని భారతీ సిమెంట్‌ కార్పోరేషన్‌, జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెట్టారు. కొంతకాలం తర్వాత వారి వాటాలను జగన్‌ తన సంస్థల పేరుతో బదిలీచేశాడు.

హవాలా, మనీల్యాండ్‌ రింగ్‌ ద్వారా మారిషస్‌కు నిధులు తరలించి జగన్‌ కంపెనీలు అధిక ప్రీమియంతో పెట్టుబడులు పెట్టారు. 2ఐ క్యాపిటల్‌, ప్యూరీ ఎమర్జింగ్‌ కంపెనీ, జగన్‌, సండూర్‌ పవర్‌ కంపెనీ లిమిటెడ్‌, 61 రూపాయల ప్రీమియంతో 125 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిన కంపెనీలు ఒక్క ప్రతినిధి బోర్డులో తమ ప్రతినిధులను నియమించలేదు. జగన్‌ వ్యక్తిగత ఆడిటర్‌ వి.ఎస్‌. రెడ్డి కంపెనీ బోర్డులో విదేశీ ప్రతినిధిగా వ్యవహరించారు. సండూర్‌ కంపెనీలో తమకు చెందిన 83.20 లక్షల వాటాలను స్నేహితుల కంపెనీలకు 15.60 కోట్ల రూపాయలకు బదిలీ చేశారు.

ఇలా వచ్చిన మొత్తాన్ని భారతీ సిమెంట్స్‌, ఇందిరా టీవీ, జగతి పబ్లికేషన్స్‌ లలో పెట్టుబడులు పెట్టేలా మనీ ల్యాండ్‌రింగ్‌ ద్వారా విదేశాల్లోని తన స్నేహితులకు నిధులు సమకూర్చి అవే నిధులను విదేశీ కంపెనీల రూపంలో ఆ మొత్తాన్ని కానుకగా స్వీకరించి పన్ను ఎగ్గొట్టారు. 2003-04లో 52 లక్షల విదేశీల కరెన్సీ స్వీకరించి వాటికి పన్ను చెల్లించలేదు. హవాలా ద్వారా ఎక్కువ ప్రీమియం కోసం పెట్టుబడులు పెట్టేలా చేశారు. దేశవ్యాప్తంగా చిన్న కంపెనీల ద్వారా 106 కోట్లు జగతి పబ్లికేషన్స్‌లో వాటాలు కొనేలా చేశారు.

ఇవన్నీ కాగితాల్లోని కంపెనీలే అదే విధంగా చెనై్న, హైదరాబాద్‌ కేంద్రంగా నడుస్తున్న కంపెనీలు జగన్‌ కంపెనీలో 105 కోట్లు పెట్టుబడులు పెట్టాయి. వీటిల్లో సండూర్‌ పవర్‌, కార్మిల్‌ ఏసియా హోల్డింగ్‌ ఉన్నాయి. అయితే ఆ కంపెనీలకు ఆ పాటి సామర్థ్యం ఏమాత్రం లేదు. సున్నపురాయి నిక్షేపాలకు చెందిన సి.రామచంద్రయ్య నుంచి రఘురామ్‌ సిమెంట్స్‌ (భారతీ సిమెంట్స్‌) స్వాధీనం చేసుకున్నారు. అలాగే 30 కోట్ల ఆదాయం ఉన్న బెంగళూరుకు చెందిన మంత్రి డెవలపర్స్‌ నుంచి క్లాసిక్‌ రియాల్టీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను పొందారు.

నోటీసులు జారీచేసిన సంస్థలు, ప్రతినిధులు: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోంశాఖ అధికారులు, సీబీఐ డైరెక్టర్‌తో పాటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి, ఎపీఐఐసీ ఎండీ, రెవెన్యూ శాఖ కార్యదర్శి ఉన్నారు. నోటీసులు అందుకున్న సంస్థల్లో ఇందిరా సిమెంట్స్‌, దాల్మియా సిమెంట్స్‌, భారతీ సిమెంట్స్‌, లాంకో, సజ్జల, ఓఎంసీ సంస్థల ఛైర్మన్లు, పెన్నా సిమెంట్స్‌, ఇండియా సిమెంట్స్‌, సందేశ్‌ల్యాబ్స్‌, టీవీపీ బిజినెస్‌ వెంచర్స్‌, మోటాఫోర్‌ రియల్టర్స్‌, జీటూ కార్పోరేట్‌ సర్వీసెస్‌, సుగమ్‌ కన్‌స్ట్రక్షన్స్‌, ఇందిరా టెలివిజన్‌, జగతి పబ్లికేషన్స్‌, కార్మియల్‌ ఆస్రా హోల్డింగ్స్‌ తదితరులు ఉన్నాయి.

 Click Here!
‘బాబు అండ్ కో’తో చేతులు కలిపి యువనేతపై విషం
కాంగ్రెస్ కోరస్
* జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక బురదజల్లే కుట్ర
* వైఎస్ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేసే కుతంత్రంలో కాంగ్రెస్ అధిష్టానం తలమునకలు
* టీడీపీ, ఈనాడు, దాని తోకపత్రిక ఆరోపణలను నెత్తికెత్తుకుంటున్న కాంగ్రెస్ నేతలు
* ఒక్క ఆధారం కూడా లేని ఆరోపణలతో హైకోర్టుకు లేఖ రాసిన మంత్రి శంకర్‌రావు
* ఈ ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణను కోరవచ్చు కదా?.. అందుకు  

* సోనియా నేతృత్వంలోని యూపీఏ సర్కారు ఆదేశించవచ్చు కదా?
* అవేమీ చేయకుండా.. హైకోర్టుకు లేఖ రాయటం కుట్రలో భాగం కాదా?


కాంగ్రెస్ మార్కు కుటిల నీతి మరోమారు రాష్ట్రంలో తెరపైకి వచ్చింది. దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుటుంబంపై విషం చిమ్మి అభాసుపాలు చేసే కుట్రకు అధికార కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. లేనిపోని ఆరోపణలతో వైఎస్ కుటుంబంపై బురద చల్లటమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపింది. సాక్షి ఆవిర్భావంతో మీడియాలో తమ గుత్తాధిపత్యానికి గండి పడిందన్న ఆక్రోశంతో ఎల్లో మీడియా చేస్తున్న తప్పుడు ఆరోపణలను నెత్తికెత్తుకుంది. వైఎస్ మరణించాక.. ఆయన కుమారుడు, యువనేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని ఒంటరిని చేసేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ అధిష్టానం.. వైఎస్ కుటుంబాన్ని కూడా చీల్చేందుకు ప్రయత్నించింది. వైఎస్ సోదరుడు, జగన్ చిన్నాన్న వై.ఎస్.వివేకానందరెడ్డికి మంత్రి పదవి ఆశచూపి తమవైపు లాక్కుంది. కానీ.. ఇవేవీ యువనేత జగన్‌ను ఒంటరిని చేయలేకపోగా ఆయన పట్ల కోట్లాది మంది ప్రజాభిమానం వెల్లువలా పెల్లుబుకుతుండటంతో.. బెంబేలెత్తిన కాంగ్రెస్ కుతంత్రాలకు తెరతీసింది. ప్రజా నాయకుడిగా ఆవిర్భవించిన జగన్‌ను రాజకీయంగా ప్రత్యక్షంగా ఎదుర్కోవటం చేతకాక.. పరోక్షంగా ఆయనను అప్రతిష్టపాలు చేసేందుకు కుయుక్తులు పన్నుతోంది.

మహానేత వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఏనాడూ సచివాలయంలో అడుగుపెట్టని జగన్‌పై.. ‘ఎల్లో సిండికేట్’ ఆరోపణలనే కాంగ్రెస్ ఎక్కుపెట్టింది. యువనేతను లక్ష్యంగా చేసుకుని పుంఖానుపంఖాలుగా అసత్య కథనాలను వండి వార్చిన ఈనాడు దినపత్రిక.. జగన్ అధికారిక కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు కానీ, సీఎం క్యాంపు కార్యాలయంలో ఉన్నట్లు కానీ ఒక్క ఆధారాన్నీ ప్రజల ముందు ఉంచలేకపోయింది. అలాంటి ఆరోపణలే ఆలంబనగా.. రాష్ట్ర చేనేత శాఖ మంత్రి పి.శంకరరావు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను యువనేత జగన్‌కు ముడిపెడుతూ.. సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ చానల్, భారతీ సిమెంట్ సంస్థలకు సంబంధించిన పెట్టుబడులు అక్రమమంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. గత మూడేళ్లుగా ఈనాడు, దాని తోకపత్రిక రాస్తున్న అసత్య కథనాలను ఆసరా చేసుకుని ఏ ఆధారాలూ లేకుండా ఆ లేఖలో ఆరోపణలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీ, ఈనాడు, దాని తోకపత్రిక రాసిన అనేకానేక ఆరోపణలకు సాక్షి మూడు సార్లు బదులిచ్చింది. ఆయా కంపెనీల్లో పెట్టుబడులను విశదీకరించింది. ఎటొచ్చీ అధికార పక్షానికి చెందిన మంత్రి శంకరరావు ఎల్లో సిండికేట్ ఆరోపణల ఆధారంగా హైకోర్టుకు లేఖ రాయటమే ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

పరిశ్రమలు స్థాపించటమే తప్పా?
సాక్షి తెలుగు దినపత్రిక, సాక్షి టీవీ, భారతీ సిమెంట్ సంస్థలను ఏర్పాటు చేసే నాటికి జగన్ కనీసం ఎంపీ కూడా కాదు కదా! వైఎస్సార్ ముఖ్యమంత్రి కాకమునుపే 2002 లోనే యువనేత జగన్ కర్ణాటకలో సాండూరు పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి కుమారుడు అయినంత మాత్రాన పరిశ్రమలు ఏర్పాటు చేసుకోకూడదా? తనకు తెలిసిన కొద్ది మంది పారిశ్రామికవేత్తలతో కలిసి ఆయన సాక్షి దినపత్రిక, టెలివిజన్, భారతీ సిమెంట్ సంస్థలను స్థాపించటం తప్పెలా అవుతుంది? రాష్ట్రానికి చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెడితే అది అక్రమమవుతుందా? ఈ పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధం ఏమిటి? ఓ పరిశ్రమ ఏర్పాటుకు భూమి కేటాయించటమన్నది, ఆ పరిశ్రమకు ప్రోత్సాహకాలు ఇవ్వటమన్నది రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయంపైన ఆధారపడి ఉంటుంది.

పైగా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వటం, వందలాది మందికి ఉపాధి కల్పించే సంస్థలకు భూములు కేటాయించడమన్నది రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే జరిగిందా? గతంలో ఎల్లో సిండికేట్, ఇప్పుడు అధికార పార్టీలో కొందరు ఆరోపణలు చేస్తున్నదే నిజమైతే.. రాష్ట్రానికి, రాష్ట్ర విద్యార్థులకు ఏ మాత్రం ఉపయోగం లేని ఇండియన్ బిజినెస్ స్కూల్‌కు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అధికారంలో ఉండగా భూమి కేటాయించటం తప్పే కదా! హైటెక్ సిటీ పేరుతో ఎల్ అండ్ టీ, రహేజా వంటి కంపెనీలకు చంద్రబాబు వందలాది ఎకరాల భూమిని కేటాయించటం అంతకంటే పెద్ద తప్పు కదా! దిక్కూమొక్కు లేని ఐఎంజీ అనే సంస్థకు రెండు వేల ఎకరాల భూమిని కట్టబెట్టటం ఏ కోవలోకి వస్తుంది? ఇప్పుడు నానా యాగీ చేస్తున్న రామోజీరావు అప్పట్లో తన పత్రిక ద్వారా వీటిపై ఎందుకు ఒక్క కథనం కూడా రాయలేదు?

ఎల్లో సిండికేట్ ఆరోపణలే ఆలంబనగా...
వైఎస్సార్ మరణంతో ఆయన కుటుంబాన్ని ఏకాకి చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ పడరాని పాట్లు పడింది. చివరకు ఆయన కుటుంబంలో చిచ్చుపెట్టింది. వైఎస్ కుమారుడు జగన్‌ను పార్టీ నుంచి బయటకు వెళ్లే పరిస్థితులు కల్పించిన కాంగ్రెస్ అధిష్టానం.. జగన్ చిన్నాన్న వై.ఎస్.వివేకానందరెడ్డికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించింది. వివేకాను ఢిల్లీకి పిలిపించుకుని పావులు కదిపి జగన్‌ను ఒంటరి చేసి పార్టీ నుంచి గెంటేయాలని చూసింది. కాంగ్రెస్ అధిష్టానం అంతరంగాన్ని గుర్తించిన యువనేత జగన్, ఆయన తల్లి విజయలక్ష్మి తమ పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు.

ఇక జగన్ పని అయిపోయినట్లేనని భావించిన కాంగ్రెస్ అధిష్టానం జగన్‌ను ఒంటరి చేయటానికి తాము చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలుసుకోవటానికి ఎంతో కాలం పట్టలేదు. కాంగ్రెస్‌ను వదిలిన జగన్‌కు జనం బ్రహ్మరథం పట్టారు. ఆయన ఒంటరి కాదని, ఆయనతో తామున్నామని కోట్లాది మంది సంఘీభావం ప్రకటించారు. ఎంతో మంది ఎమ్మెల్యేలు ఆయన వెంట నడుస్తున్నారు. ఇది జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీ, యువనేతకు ఇబ్బందులు సృష్టించటానికి కుట్రలు ప్రారంభించింది. రాజకీయంగా ఆయనను ఎదుర్కొనే ధైర్యం లేక ఎల్లో సిండికేట్‌తో చేతులు కలిపింది. ఇంతకాలం ఎల్లో సిండికేట్ చేసిన ఆరోపణలనే ఆధారం చేసుకుని ఆయన్ను అప్రతిష్టపాలు చేసేందుకు పావులు కదుపుతోంది. దానిలో భాగంగానే వైఎస్సార్ హయాంలో మంత్రి పదవులు రాక అల్లాడుతున్న డి.ఎల్.రవీంద్రారెడ్డి, శంకరరావు వంటి ఎమ్మెల్యేలను రంగంలోకి దించింది.

ఢిల్లీ అండదండలతో వారు వైఎస్ కుటుంబంపై చెలరేగిపోయారు. అక్రమాస్తులు అంటూ ఆరోపణలు గుప్పించారు. ఎల్లో సిండికేట్‌తో విస్తృతంగా కథనాలు రాయించారు. ప్రతిఫలంగానే కాంగ్రెస్ అధిష్టానం ఈ ఇద్దరికీ రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించింది. వైఎస్ కుటుంబాన్ని అభాసుపాలు చేయటానికి కాంగ్రెస్ అధిష్టానం కుట్ర చేస్తోందనటానికి ఇది నిదర్శనం కాదా? ఇప్పుడు శంకరరావు అవే ఆరోపణలతో హైకోర్టుకు లేఖ రాయటం కూడా ఈ కుట్రలో భాగమేనన్న విషయం ప్రజలకు తెలియనిదా?!

Sunday, January 23, 2011

ధరల పాలనకు చరమ గీతం * పేదోడి గోడు పట్టని ప్రభుత్వంపై ‘జన దీక్ష’లో జగన్ ధ్వజం

* పేదల గురించి ఆలోచించే తీరిక కూడా కేంద్రానికి, రాష్ట్రానికి లేదు
* ఆరు నెలల్లో ఏడుసార్లు పెట్రోలు రేట్లు పెంచారు... వాటి దెబ్బకు నిత్యావసరాల ధరలూ కొండెక్కాయి
* మార్కెట్‌కెళితే కూరగాయలు షాక్ కొడుతున్నాయి
* ఇలా రేట్లు పెరుగుతూ పోతే సామాన్యుడు ఎలా బతకాలి?
* పాలకులకు కుర్చీలను కాపాడుకోడానికే సమయం సరిపోతోంది
* బాబు, నేటి కాంగ్రెస్.. దొందూ దొందే
* బాబు ఆర్టీసీ చార్జీలు, కరెంటు చార్జీలు ఎడాపెడా పెంచారు
* పన్నుల మీద పన్నులు వేసి ఇప్పుడు ట్యాక్సుల గురించి మాట్లాడుతున్నారు
* అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా మనిషి ఎప్పుడైనా ఒకే మాట మాట్లాడాలి

అప్పటి చంద్రబాబు పాలన అయినా.. ఇప్పుడున్న కాంగ్రెస్ పాలన అయినా దొందూ దొందేనని, వీరికి ఒక మాట అన్నా.. విశ్వసనీయత అన్నా.. అర్థం తెలియదని యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. పేదల గురించి ఆలోచించే తీరిక అటు కేంద్రానికి గానీ, ఇటు రాష్ట్ర పాలకులకు గానీ లేదని ఆవేదన వ్యక్తంచేశారు. పాలకులకు కుర్చీని కాపాడుకునేందుకే సమయం సరిపోతోందని, ప్రజల బాధలను పట్టించుకోవట్లేదని ఎద్దేవా చేశారు. ఇలాంటి అధ్వాన పరిస్థితిలో రాష్ట్రం ప్రయాణం చేస్తున్నందున, ప్రజలు, ప్రతి పేదవాడు కూడా కాంగ్రెస్ పాలనను సాగనంపాలని చేతులు జోడించి ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. గ్యాస్ బిడ్డింగ్‌లో పాల్గొనకుండా చంద్రబాబు భావి రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. శనివారం విశాఖ సాగర తీరాన పెట్రో ధరలు, నిత్యావసర ధరల పెరుగుదలపై జగన్ ‘జన దీక్ష’ పేరుతో ధర్నా చేశారు. లక్ష మందికిపైగా పాల్గొన్న ఈ ధర్నాలో ఆయన కేంద్ర రాష్ట్ర పాలకులపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రసంగం ఆయన మాటల్లోనే..
కుర్చీ గురించే తప్ప వారికి వేరే ఆలోచన లేదు..
‘పెరుగుతున్న పెట్రో ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే.. వాటికి కళ్లెం వేయాలంటూ ఇక్కడ కూర్చున్న లక్షలాది మంది గొంతులు ఒక్కటై మాట్లాడాయి.. ఈ గోడును అక్కడ కేంద్రాన్ని, ఇక్కడ ఈ రాష్ట్రాన్ని ఏలుతున్న పెద్దలు ఒక్కసారి వినండని కోరుతున్నా.. ఈరోజు కూరగాయల మార్కెట్‌కు వెళితే కూరగాయలు షాక్ కొడుతున్నాయి. పెట్రోలు, డీజిల్ మీద పెంచే ప్రతి రూపాయి కూడా కూరగాయలు, నిత్యావసర వస్తువుల మీద ప్రభావం చూపుతాయన్న సంగతి పక్కనబెట్టి 6 నెలల్లో ఏడుసార్లు పెట్రోలు, డీజిల్ పెంచుతూ పోతుంటే.. 20 నెలల్లో 20 సార్లు పెరుగుతూ పోతుంటే ఎలా బతకాలని సామాన్యుడు అడుగుతున్నాడు. ఇవాళ మార్కెట్లో మునగకాయ ఒక్కటి 8 రూపాయలు. చిక్కుడు కిలో రూ.40. చింతపండు కిలో 90. గత ఏడాది జనవరికి.. ఇప్పటికి తేడా చూడండి. ఉల్లి కిలో రూ.10 నుంచి 50కు పెరిగింది. వెల్లుల్లి రూ.80 నుంచి 280కి పెరిగింది. కందిపప్పు రూ.60 నుంచి 70కి, మినప్పప్పు రూ.60 నుంచి 80కి, ధనియాలు రూ.70 నుంచి 84కు, వేరుశనగ నూనె రూ.55 నుంచి 78కి పెరిగింది. సబ్బం హరి అంటున్నారు నిన్న.. గతంలో పిడికిట్లో డబ్బులు తీసుకెళ్లి సంచిలో కూరగాయలు తెచ్చుకుంటే.. ఇప్పుడు సంచిలో డబ్బులు తీసుకెళ్లి పిడికిట్లో కూరగాయలు తెచ్చుకునే పరిస్థితి వచ్చిందని అంటున్నారు. అటు కేంద్రం గానీ, ఇటు రాష్ట్రంగానీ ఎక్కడా పేదవాడి గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఏ ఒక్కరూ ఆలోచన చేయట్లేదు. ఎంతసేపూ వాళ్ల వాళ్ల కుర్చీ గురించి తప్ప ఇంకోటి ఆలోచించడం లేదు.’
బాబు ఘనత ఇదీ..
‘చంద్రబాబునాయుడు గారు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి 1995 సెప్టెంబర్‌లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గద్దెనెక్కిన 10 నెలల్లోనే.. ఆ సమయంలో తాను మద్దతునిచ్చిన అటు యునెటైడ్ ఫ్రంట్, ఇటు ఎన్డీఏ ప్రభుత్వాల హయాంలో డీజిల్ ధరను ఏడు రూపాయల నుంచి రూ.22కు పెంచారు. పెట్రోలు రూ.21 నుంచి 34కు పెంచారు. కానీ చంద్రబాబునాయుడుకు వాటి పెరుగుదలను ఆపాలని ఏమాత్రం ధ్యాసలేదు. కనీసం రాష్ట్రంలోనైనా చంద్రబాబు ఏమైనా చేశాడా? అంటే ఆర్టీసీ చార్జీలు మూడుసార్లు పెంచారు. కరెంటు చార్జీలు నాలుగుసార్లు పెంచారు. 1995-96లో కరెంటు చార్జీలు 18 శాతం పెరగగా, 1996-97లో 32 శాతం, 1998-99లో 10 శాతం, 2000 సంవత్సరంలో 15 శాతం.. మొత్తంగా ఐదేళ్లలో కరెంటు చార్జీలు 100 శాతం పెరిగాయి. గ్యాస్ ధర రూ.150 ఉంటే రూ.300కు తీసుకెళ్లాడు.’
మనిషి ఎప్పుడైనా ఒకే మాట మాట్లాడాలి..
‘చంద్రబాబు ఈవేళ పన్నుల గురించి మాట్లాడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికార పక్షంలో ఉన్నా మనిషి అనే వాడు ఒక్క రకంగానే ఉండాలి. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు పెట్రోలుపై 18 శాతం ఉన్న అమ్మకపు పన్ను 32.55 శాతానికి పెంచాడు. డీజిల్‌పై 12 శాతం ఉన్న పన్ను 21.33 శాతానికి తీసుకెళ్లాడు. గ్యాస్‌పై 10 శాతం పన్ను వేశాడు. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలు పన్నులు వేసి అధికారం పోయిన తరువాత వేరే రకంగా మాట్లాడడమంటే ప్రజలను మోసం చేయడమే.’

గ్యాస్ బిడ్డింగ్‌లో లేకుండా ద్రోహం చేశారు..
‘చంద్రబాబు అన్నింటికన్నా పెద్ద తప్పు చేసిందేంటంటే.. ఆయన చక్రం తిప్పుతున్న సమయంలోనే కృష్ణా, గోదావరి గ్యాస్‌ను ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు.. గ్యాస్‌పై హక్కుల కోసమని చెప్పి కనీసం ఆంధ్రప్రదేశ్ తరఫున బిడ్డింగ్‌లో కూడా పాల్గొనలేదు. గుజరాత్ ప్రభుత్వం బిడ్డింగ్ వేస్తే అదే గ్యాస్ గుజరాత్ వరకు పోతోంది. కానీ మన రాష్ట్రంలో ఉన్న అక్కాచెల్లెళ్లకు ఆ గ్యాస్ దక్కడం లేదు. భావి రాష్ట్రానికి చంద్రబాబు చేసిన ద్రోహం ఇది. బిడ్డింగ్‌లో పాల్గొనకపోవడం తీవ్రమైన అన్యాయం. అది జరిగి ఉంటే ఇవాళ గ్యాస్ మనకు రూ.100కో రూ.200కో అందుబాటులో ఉండేది. వైఎస్ రాజశేఖరరెడ్డి పరిపాలనకు వచ్చాక.. ఈ గ్యాస్ మనదీ అని, మనకు, మన అక్కాచెల్లెళ్లకు న్యాయం జరగాలని తలచి ఆ గ్యాస్ టెండర్లలో ఆంధ్రప్రదేశ్ కూడా కచ్చితంగా పాల్గొనేలా చేశారు.’
అధ్వాన స్థితిలో రాష్ట్ర ప్రయాణం..
‘మహానేత వైఎస్ మన మధ్య నుంచి దూరమయ్యాక ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ పాలనలో వెంటనే ఆర్టీసీ చార్జీలు 23 శాతం పెంచారు. కరెంటు చార్జీలు వాణిజ్య అవసరాలకు 28 పైసల నుంచి 40 పైసల వరకూ పెంచారు. గ్యాస్ ధర రూ.300లకంటే పెరగకుండా వైఎస్ తొక్కిపెడితే.. ఇప్పుడు తాను చనిపోయాక ఇవాళ గ్యాస్ రూ.343 చేశారు. ఒక్కసారి ఆలోచించండి. అప్పటి చంద్రబాబు పాలన అయినా.. ఇప్పుడున్న కాంగ్రెస్ పాలన దొందూ దొందే. ఒక్కరికీ ఒక మాట అన్నా.. విశ్వసనీయత అన్నా.. అర్థం తెలియదు. ఇలాంటి అధ్వాన పరిస్థితిలో రాష్ట్రం ప్రయాణం చేస్తోంది. ప్రజలు, ప్రతి పేదవాడు కూడా కాంగ్రెస్ పాలనను సాగనంపాలని చేతులు జోడించి ప్రార్థిస్తున్నా.’

ఇప్పటికైనా కళ్లు తెరవాలి..
‘లక్షలాది గొంతులు ఒక్కటై ధరలకు కళ్లెం వేయాలని ఏడెనిమిది గంటలుగా కనీసం మంచినీళ్లు కూడా తాగకుండా దీక్ష చేస్తున్నారు. ప్రతి సోదరుడికి, స్నేహితుడికి, ఇక్కడున్న ప్రతి ఒక్కరికీ చేతులు జోడించి శిరస్సు వంచి పేరుపేరునా కృతజ్ఞతలు చెబుతున్నా.. ఇప్పటికైనా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరవాలని ఆకాశంవైపు చూస్తూ దేవుణ్ని ప్రార్థిస్తున్నా.’

ఆయిల్ కంపెనీలకు నష్టాలెక్కడ?

‘ఒకవైపు అంటారు.. పెట్రోలు ధరలు పెంచక తప్పడం లేదు అని. ఎందుకంటే ఆయిల్ సంస్థలు ఇప్పటికే నష్టాల్లో ఉన్నందున పెంచక తప్పదని పాలకులు చెబుతున్నారు. కానీ దేశంలో ఉన్న 13 చమురు సంస్థల లాభాలు చూడండి. 2006-07లో రూ. 33,204 కోట్లు, 2007-08లో రూ. 29,041 కోట్లు, 2008-09లో రూ. 26,730 కోట్లు, 2009-10లో రూ. 37,319 కోట్లు లాభం గడించాయి. అంటే ఐదేళ్లలో మొత్తం రూ.1,26,292 కోట్ల మేర ఈ చమురు కంపెనీలు లాభాలు గడించాయి. మరి ఈ కారణం ఎందుకు చెబుతున్నట్టు?.’

పొరుగు దేశాల్లో రేటు సగమే..
‘పెట్రోలు ధర నేపాల్‌లో లీటరుకు రూ. 39.24, శ్రీలంకలో రూ. 21, పాకిస్థాన్‌లో రూ. 35.97, బంగ్లాదేశ్‌లో రూ. 29.43 మాత్రమే. ఇవి పక్క దేశాల రేట్లు. ఒక పక్క ఆయిల్ కంపెనీల పేరు చెప్పి ఆరు నెలల్లో ఏడు సార్లు పెంచితే ఎక్కడికి పోవాలి పేదవాడు?’

వైఎస్ పాలనలో ఎలా ఉంది?

‘దివంగత నేత వైఎస్ పాలన గురించి కూడా చెప్పుకుందాం. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్‌లపై రూ. 50 పెంచితే.. మన అక్కాచెల్లెళ్లపై భారం పడుతుందని, వారికి కష్టం కలగకూడదని.. ఆ పెరిగిన భారం రాష్టమ్రే భరిస్తుందని వైఎస్ ప్రకటించి అమలుచేశారు. చంద్రబాబునాయుడు గ్యాస్‌పై పన్ను నిర్ణయాలు తీసుకున్నప్పుడు చమురు ధర 23 డాలర్లు ఉంది. కానీ వైఎస్ ’50 సబ్సిడీ భారాన్ని భరించినప్పుడు చమురు ధర 145 డాలర్లు ఉంది. పైగా వైఎస్ గ్యాస్‌పై ఉన్న పన్నును 10 శాతం నుంచి 4 శాతానికి తగ్గించారు. ఐదేళ్లలో ఆర్టీసీ చార్జీ ఒక్కరూపాయి కూడా పెంచలేదు. కరెంటు చార్జీలు ఒక్క రూపాయి కూడా పెంచలేదు.’

ఉద్యోగులను చర్చలకూ పిలవరా..?

‘ఉద్యోగులు మూడు రోజులుగా ధర్నాలు, సమ్మెలు చేస్తున్నారు. ఈ పెరుగుతున్న ధరలు ఆ ఉద్యోగులనూ వేధించేవే. ఆ ఉద్యోగులను పిలిచి.. మీ సమస్యలేంటి అని అడిగి.. న్యాయమైన కోర్కెలు ఉంటే పరిష్కరిద్దామని కనీసం చర్చలకు కూడా పిలవని పరిస్థితి ఉందంటే చాలా బాధగా ఉంది. దివంగత నేత వైఎస్ ఉన్నప్పుడు ఏ ఉద్యోగీ వీధిన పడే పరిస్థితి లేదు. ఇప్పుడు ఉద్యోగి పరిస్థితి దయనీయంగా ఉంది.’
సాగరం.. జనసాగరం .... విశాఖలో జన దీక్షకు కెరటాల్లా పోటెత్తిన జనం
* ధరల మంటలపై నిరసన జ్వాల
* ఉదయం నుంచి సాయంత్రం వరకు చమటలు కక్కే ఎండనూ లెక్కచేయని జనం
* లక్షన్నరకుపైగా హాజరైనా తోపులాటలకు తావులేకుండా ధర్నా నిర్వహణ

ఓ పక్క సాగరం.. మరోపక్క జన సాగరం.. యువనేత కోసం పోటీ పడి పోటెత్తాయి. అభిమాన జనం హోరు ముందు సాగరుని హోరు చిన్నబోయింది. పెరిగిన పెట్రోల్, నిత్యావసర సరకుల ధరలకు నిరసనగా జగన్ చేపట్టిన జన దీక్షకు మునుపెన్నడూ లేనంతగా వచ్చిన జనం, వారి జగన్నినాదాలతో విశాఖ ఆర్‌కే బీచ్ తీరం శనివారం దద్దరిల్లింది. ఇదేదో డబ్బులిచ్చి జనాన్ని తెచ్చి గంటో రెండు గంటలో నిర్వహించే బహిరంగ సభ కాదు. ధరల పెరుగుదలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా మొక్కవోని దీక్షతో ఆరేడు గంటలపాటు లక్షన్నరకుపైగా జనం చేసిన ధర్నా. ఒక్కో వాన నీటి చుక్కా వరదై, అది నదిగా మారి సంద్రమైన తీరులా.. విశాఖ సాగర తీరాన జన సముద్రం చేసిన సత్యాగ్రహం.

ఉదయం 9 నుంచే జనప్రవాహం
ఉదయం తొమ్మిది గంటల నుంచి విశాఖ ఆర్కేబీచ్ నిండడం మొదలైంది. అలా మధ్యాహ్నం పన్నెండయ్యే సరికి సాగరాన్ని జనసంద్రం కమ్మేసింది. సాయంత్రం అయిదు గంటల వరకూ ఆ ప్రవాహం అలాగే కొనసాగింది. విశాఖ నగర చరిత్రలో నభూతో నభవిష్యతి అన్న చందంగా దీక్షాప్రాంగణం కిక్కిరిసిపోయింది. నిర్వాహకులు బీచ్‌రోడ్డుపై చాలా దూరం కార్పెట్లను ఏర్పాట్లు చేశారు. అయితే అవన్నీ ఏ మూలకూ చాలకపోవడంతో నడిరోడ్డుపైనే కూర్చుని తమ అభిమానాన్ని చాటుకున్నారు. మామూలు రోజుల్లో అయితే సాగరతీరంలో సముద్రుడి అందాలకు ముగ్ధులవుతారు. శనివారం మాత్రం యువనేత ధ్యాసలో సంద్రాన్ని పట్టించుకోవడం మానేశారు.

యువనేత మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో దీక్షా వేదికపైకి వచ్చారు. అప్పటిదాకా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానుల్లో ఒక్కసారిగా హర్షాతిరేకాలతో జేజేలు పలికారు. జగన్ జిందాబాద్, యువనేత జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. వాస్తవానికి జగన్ ఇంకా ముందే ఇక్కడికి రావాల్సి ఉంది. అయితే ఉదయం 10 గంటలకు జగన్ ఎమ్మెల్యే బాబూరావు ఇంటి నుంచి ధర్నాకు బయలుదేరినా మధ్యలో నార్త్ ఎక్స్‌టెన్షన్‌లోని అభయాంజనేయ స్వామి గుడిలో దర్శనం, సంపత్ వినాయగర్ ఆలయంలో పూజలు, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో, పాత వాల్తేరులో దివంగత నేత విగ్రహావిష్కరణలు చేయడంతో అనుకున్న సమయానికంటే ధర్నా స్థలానికి ఆలస్యంగా వచ్చారు. 12.15 గంటలకు ధర్నా వేదికపై కూర్చున్నారు.

దీక్షమీదే ధ్యాస
జగన్ వచ్చే సమయానికి బీచ్‌రోడ్డు కిలోమీటరు పొడవునా కిక్కిరిసిపోయింది. సాయంత్రం ఐదున్నర వరకు మొక్కవోని దీక్షలో జనం నిమగ్నమయ్యారు. ఎరట్రి ఎండలో, చెమటలు కక్కుతున్నా.. దాహం వేస్తున్నా.. బీచ్ వాతావరణంలో తీవ్రమైన ఆకలి వేస్తున్నా.. చూపంతా జగన్ మీదే. ధ్యాసంతా దీక్ష మీదే. దీక్ష ప్రాంగణంలో లక్షకుపైగా జనంలో సగం మంది కూర్చుంటే సగం మంది నిల్చునే ఉన్నారు. దీక్షకు వచ్చీపోయే జనప్రవాహంతో కలిపి ఈ ధర్నాకు లక్షన్నర మందిదాకా హాజరయ్యారని అంచనా. వేదికకు సమాంతరంగా సాగర తీరాన రామకృష్ణ బీచ్ వద్ద రోడ్డంతా కిలోమీటరు వరకు జనంతో కిక్కిరిసిపోయింది. జగన్ సాయంత్రం నాలుగ్గంటలకు ప్రసంగిస్తారని నిర్వాహకులు ప్రకటించారు. సభకు వచ్చిన ప్రముఖుల ప్రసంగాలు పూర్తయ్యే సరికి సాయంత్రం నాలుగున్నర గంటలయింది. జనం మండుటెండను సైతం లెక్కచేయకుండా ఓపికతో, క్రమశిక్షణతో వేచి వున్నారు.

అందరి ప్రసంగాలు పూర్తయ్యాక జగన్ ప్రసంగానికి ఉపక్రమించేసరికి జనంలో ఒకటే ఉత్సాహం. జగన్ సాయంత్రం సరిగ్గా ఐదు గంటలకు 20 నిమిషాల పాటు ప్రసంగించారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు పన్నుల మీద పన్నులు వేసి, చార్జీలు మీద చార్జీలు పెంచి జనం నడ్డివిరిచిన తీరును జగన్ వివరిస్తుంటే జనం ఆసక్తిగా, శ్రద్ధగా వినడం కనిపించింది. ఇంకాసేపు మాట్లాడితే బాగుండునని జనం ఒకింత నిరాశ వ్యక్తంచేయడం కూడా వినిపించింది. మధ్యమధ్యలో కాబోయే సీఎం జగన్ అంటూ జనం రెట్టించిన ఉత్సాహంతో నినాదాలు చేశారు. భానుడు పడమర దిక్కులో అస్తమిస్తున్న సమయంలో ఉదయం నుంచి మొదలైన జనదీక్షను యువనేత ముగించారు.

ఆకట్టుకున్న నేతల ప్రసంగాలు
జగన్ ప్రసంగానికి ముందు వేదికపై నేతలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, కొణతాల రామకృష్ణ, సబ్బం హరి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, లక్ష్మీపార్వతి, కొండా సురేఖ, రోజా, పుల్లా పద్మావతి, రెహమాన్, పలువురు ఎమ్మెల్యేలు చేసిన ప్రసంగాలు జనాన్ని ఆకట్టుకున్నాయి. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి తన ప్రసంగంతో జనంలో ఆలోచన రేకెత్తించి ఆకట్టుకున్నారు. తన అల్లుడు చంద్రబాబు దొంగల్లుడు అంటూ చలోక్తులు విసిరారు. ధరలపై మాట్లాడే బాబు.. తన హెరిటేజ్‌లో ఎందుకు అడ్డగోలు ధరలతో అమ్ముతున్నారని ప్రశ్నించారు. ధరలు ఎంత పెరిగాయి? పొరుగు దేశాల్లో పెట్రోలు ధరలు ఎంత తక్కువగా ఉన్నాయి తదితర వివరాలతో లోతైన ప్రసంగంతో సినీనటి రోజా ఆకట్టుకున్నారు.

వైఎస్ చేపట్టిన పథకాలు కాంగ్రెస్ కార్యక్రమాలు అని చెప్పుకోవడానికి ప్రస్తుత పాలకులు ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే కొండా సురేఖ చేసిన ప్రసంగానికి జనం జేజేలు పలికారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అతిపెద్ద ధర్నా ఇదేనని టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్‌రెడ్డి చెబుతున్నప్పుడు జనం హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. వక్తలు దివంగత నేత పేరు ప్రస్తావించినప్పుడు జనం కేరింతలు సముద్ర హోరును తలపించాయి. తర్వాత జగన్ ఎప్పుడెప్పుడు మాట్లాడతారా అంటూ ఎదురుచూస్తూ క్రమశిక్షణ గల సైనికుల్లా దీక్ష కొనసాగించారు.

జన దీక్షకు పలువురు ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్సీలతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచీ పదుల సంఖ్యలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, నేతలు హాజరయ్యారు. తరలి వచ్చిన అభిమాన జనం జగనన్నా, నీకు మేమంతా అండగా ఉంటామన్నా అంటూ నినదించారు. ఒకపక్క దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, మరోపక్క జననేత జగన్‌ల భారీ ఫ్లెక్సీలను, కటౌట్లను కిలోమీటర్ల మేర సముద్రం చెంతనే ఏర్పాటు చేశారు.
 
నాడు వైఎస్‌ను సోనియా పరామర్శించలేదు *      2003 పాదయాత్ర ఘటనను గుర్తు చేసుకున్న కొణతాల
 
 ఎన్నికల్లో మహానేత వైఎస్సార్ ముఖం చూసే జనం ఓట్లేశారని, సోనియాను చూసి కాదని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అన్నారు. శనివారం ‘జనదీక్ష’ వేదికపై ఆయన మాట్లాడుతూ.. 2004, 2009 ఎన్నికల్లో గత్యంతరం లేని పరిస్థితుల్లోనే అధిష్టానం వైఎస్‌ను ముఖ్యమంత్రిని చేసింది తప్ప.. ఆయనపై అభిమానంతో కాదని చెప్పారు. ‘2003లో వైఎస్ పాదయాత్ర చేసినప్పుడు రాజమండ్రిలో అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలో ఒడిశా పర్యటనకు వెళ్తున్న సోనియాగాంధీ విశాఖ విమానాశ్రయంలో ట్రాన్సిట్ హాల్టు చేశారు. ఆ సందర్భంలో వైఎస్‌ను ఫోన్లో పరామర్శించాలని నేను కోరగా.. ఆమె అందుకు నిరాకరించారు. నేనేమైనా ఆయన్ను పాదయాత్ర చేయమన్నానా? ఆయనిష్టం. దాని పర్యవసానం ఆయనే అనుభవిస్తాడు. నేను మాట్లాడనన్నారు. ఆ మాటలకు తీవ్ర మనోవేదనకు గురైన నేను ఆ రోజు నుంచి సోనియాను కలవడం మానేశాను. దీనికి మాజీ సీఎం రోశయ్యే సాక్షి’ అని నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు.

ఇలాంటి నేతలకా మనం అండగా ఉండాల్సిందని ప్రశ్నించారు. ‘నాడు భారత జాతీయ కాంగ్రెస్ నుంచి విడిపోయి ఇందిరా కాంగ్రెస్ పెట్టడం తప్పయితే.. నేడు జగన్ పార్టీ పెట్టడం కూడా తప్పవుతుంది. త్వరలో జగన్ పెట్టబోయే పార్టీయే అసలైన కాంగ్రెస్. ప్రస్తుత కాంగ్రెస్ ఇందిరా కాంగ్రెస్ కాదు... ఇటాలియన్ కాంగ్రెస్. ఇటాలియన్ కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలపండి. త్వరలో పెట్టబోయే వైఎస్సార్ పార్టీకి పట్టం కట్టండి. ఆంధ్రుల ఆత్మాభిమానం దెబ్బతింటుంటే చూస్తూ ఊరుకోమని చాటి చెప్పండి’ అని కోరారు. అధిష్టానం ఆశీస్సుల మేరకు వైఎస్ రెండుసార్లు సీఎం అయ్యారంటూ చేసిన ప్రకటన సిగ్గుచేటన్నారు. ‘కిరణ్‌కుమార్ రెడ్డికి సీఎం పదవినిచ్చారంటే అది జగన్‌కు భయపడేనని గుర్తుంచుకోవాలి. సీఎం ఎప్పుడూ జగన్ ఫొటో పెట్టుకోవాలి. సోనియా భజన చేసి దొడ్డిదారిన సీఎం అయ్యారు. సోనియాకు దాసోహమంటే జగన్ ఎప్పుడో సీఎం అయ్యేవారు’ అని తెలిపారు.
 
మేం రెడీ... మీరు రెడీనా? రాజీనామాలపై ముఖ్యమంత్రికి జగన్ వర్గం నేతల ప్రతిసవాల్
 
* ఏ క్షణాన్నైనా ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధమని ప్రకటన* మీరు సోనియా, మేం వైఎస్సార్ బొమ్మ పెట్టుకుని ఎన్నికలకు వెళ్దాం... ఎవరేంటో అప్పుడు ప్రజలే తేలుస్తారు* కాంగ్రెస్‌కు వైఎస్ కుటుంబం రుణపడి ఉండాలన్న సీఎం వ్యాఖ్యలపైనా మండిపాటు* కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన మహానేతకు కాంగ్రెస్సే రుణపడి ఉండాలని వెల్లడి

యువనేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు రాజీనామా చేసి, మళ్లీ గెలవాలంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన సవాలుకు జగన్‌కు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు దీటుగా స్పందించారు. తాము ఏ క్షణాన్నైనా రాజీనామాకు సిద్ధమని, మీరు కూడా సిద్ధమేనా అంటూ ప్రతిసవాల్ విసిరారు. రాష్ట్రంలో మహానేత వైఎస్సార్ వల్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, కాదనే నేతలు రాజీనామా చేసి, సోనియా బొమ్మతో ఎన్నికల్లో నిలవాలని.. తాము వైఎస్ బొమ్మతో ఎన్నికల్లోకి వెళ్తామని చెప్పారు. జగన్‌తో ఉండటమే నైతికత అని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు వైఎస్ కుటుంబం రుణపడి ఉండాలన్న సీఎం వ్యాఖ్యలపైనా వారు మండిపడ్డారు. నిజానికి, కాంగ్రెస్సే వైఎస్‌కు, ఆయన కుటుంబానికి రుణపడి ఉండాలని పేర్కొన్నారు. శనివారం ‘జన దీక్ష’ వేదికపై ఆయా నేతలు ఏమన్నారంటే..

కాంగ్రెస్సే వైఎస్‌కు రుణపడి ఉండాలి
కాంగ్రెస్‌కు వైఎస్ కుటుంబం రుణపడి ఉండాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారట. నిజానికి రాష్ట్రంలో గాని, కేంద్రంలో గాని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిందంటే అది వైఎస్ వల్లే. ఈ మాట కేంద్రమంత్రి ప్రణబ్ ముఖర్జీయే స్వయంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 33 ఎంపీ సీట్లను ఇవ్వడం వల్ల ఈ రోజు నేను కేంద్రమంతిగా ఉన్నానని ఆయన చెప్పారు. కేవలం వైఎస్ వల్లే ఇన్ని సీట్లు వచ్చాయి. అందువల్లే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అందుకు కాంగ్రెస్సే వైఎస్‌కు, ఆయన కుటుంబానికి రుణపడి ఉండాలి. 2009 ఎన్నికలయ్యాకే జగన్ పార్లమెంటు సెంట్రల్ హాలులో పరిచయమయ్యారు. అంతకు ముందు పరిచయం లేదు. కొందరు హద్దులు మీరి మాట్లాడుతున్నారు.

కాంగ్రెస్ ఎంపీగా ఉన్నందున నేను గొంతులో గరళం పెట్టుకుని ఉండాల్సి వస్తోంది. నిజం మాట్లాడితే వారిలో చాలామంది మిగలరు. 8 నెలలుగా ఒకే మాట చెబుతున్నాను. జగన్ ఒక శక్తి. కాంగ్రెస్ ఆయనను వదులుకుంటే ఏం జరుగుతుందో చెప్పాను. ఇప్పుడదే జరగబోతోంది. అన్ని వయసులు, తెగలు, మతాల వారూ జగన్‌కు బ్రహ్మరథం పడ్తున్నారు. ఓదార్పుయాత్రలో అన్ని చోట్లా.. బాబూ నువ్వు సీఎం కావాలి. సీఎం అయితేనే మా కష్టాలు తీరతాయి. నువ్వు కాకపోతే మరెవ్వరూ మమ్మల్ని పట్టించుకోరు అని అంటున్నారు. అలసట ఎరుగకుండా.. ఒకట్రెండు పండ్లు మినహా ఏమీ తినకుండా రోజుల తరబడి రేయింబవళ్లు యువనేత ఓదార్పుయాత్ర నిర్వహిస్తున్నారంటే ఆశ్చరం కలుగుతోంది. జగన్ యువతకు ఓ చిహ్నం. జనదీక్షతోనైనా ధరలు తగ్గించే దిశగా ప్రభుత్వం దిగి రావాలి.
- సబ్బం హరి, అనకాపల్లి ఎంపీ

మీది మైనార్టీ ప్రభుత్వం కాదా...?
జగన్‌ను వేధించి, మనోవేదనకు గురిచేశారు. పార్టీ నుంచి బయటకు వెళ్లేలా చేశారు. వైఎస్ మరణానంతరం ఆయన్ను సీఎం చేయాలని 150 మంది ఎమ్మెల్యేలతో సంతకాలు చేయించారు. తర్వాత దానినీ వక్రీకరించారు. జగన్‌ను కాదని రోశయ్యను సీఎం చేశారు. ఏడాది తర్వాత ఆయన్ను మార్చి కిరణ్‌కుమార్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు. వైఎస్ పుణ్యాన రాష్ట్రంలో అధికారం వస్తే ఆయన మరణించాక వేరే వారికి సీఎం పదవులను కట్టబెట్టారు. ఇప్పుడు వారంతా నైతిక విలువల గురించి మాట్లాడుతున్నారు. నైతిక విలువలకు నిర్వచనం చెప్పగలరా? గుట్టుగా ఉండకుండా రచ్చ చేసుకుంటున్నారు. రేపోమాపో పడిపోయే స్థితిలో ఉన్నారు. మీది మైనార్టీ ప్రభుత్వం కాదా? నాయకత్వ లోపం వల్లే రాష్ట్రంలో దుర్భర పరిస్థితులేర్పడ్డాయి. వైఎస్ వుంటే రాష్ట్రంలో ఈ పరిస్థితులొచ్చేవి కావు. రేపటి తరానికి ఓ గొప్ప నాయకుడు (జగన్) దొరికాడు. ప్రాంతాలకతీతంగా తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడటానికి పూనుకున్నాడు. రాష్ట్రంలోనే కాదు దేశ రాజకీయాలనే శాసించబోతున్నాడు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేలు జరుగుతుందని ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుంటే వారి బతుకును దుర్భరం చేశారు.
- మేకపాటి రాజమోహన్‌రెడ్డి, నెల్లూరు ఎంపీ

దమ్ముంటే మళ్లీ పోటీ చేసి గెలవాలి
పూర్వం వారసుల్లేని రాజు మరణిస్తే ఏనుగుకు పూలదండను అందించి వీధుల్లోకి వదిలేవారు. అది ఎవరి మెడలో దండ వేస్తే వారికే రాజ్యాధికారం. అధిష్టానం అనే ఏనుగు వేసిన దండతో సీఎం అయిన కిరణ్ కుమార్‌రెడ్డికి నైతిక విలువల గురించి మాట్లాడే హక్కు లేదు. దమ్ముంటే మళ్లీ పోటీ చేసి గెలవాలి. ధరల పెరుగుదలతో సామాన్యులు ఎదుర్కొంటున్న కష్టాలపై స్పందిస్తూ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యమించారు. మేం పార్టీ పెట్టాక కూడా ప్రజా సమస్యలపై ఉద్యమాలు కొనసాగుతాయి.
- అంబటి రాంబాబు, పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి

35 మందీ రాజీనామాకు సిద్ధం..
జగన్ వెంట 35 మంది ఎమ్మెల్యేలం ఉన్నాం. ఏ క్షణాన్నైనా రాజీనామాకు సిద్ధమే. వైఎస్సార్ బొమ్మతో గెలిచిన ఆ నేతలకు మాట్లాడే అర్హత లేదు. మీరు కూడా రాజీనామా చేసి రండి. ప్రజలు ఏం తీర్పిస్తారో చూద్దాం. వైఎస్సార్‌కు ప్రజల బాధలు తెలుసు. ప్రజలకు భారమయ్యే ఏ చర్యనూ ఆయన ఉపేక్షించేవారు కాదు. ఇప్పుడు నేతలు ఢిల్లీలో ఊకదంపుడు సమావేశాలు పెట్టడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు.
- బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి

రాహుల్, సోనియాను చూసి ఓట్లేయలేదు..
ప్రజలే జగన్‌ను ముఖ్యమంత్రిని చేస్తారు. జగన్‌కు వేరే అధిష్టానం లేదు. ప్రజలే ఆయనకు అధిష్టానం. వైఎస్ పథకాలను రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అంతో ఇంతో అనుభవించారు. సొంతంగా పట్టుమని పది ఓట్లులేని కొందరు పెద్దలు కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించారు. వైఎస్సార్ పట్ల ప్రజలకు అమితమైన ప్రేమ ఉంది. సోనియమ్మ, రాహుల్‌ను చూసి రాష్ట్ర ప్రజలు ఓట్లేయలేదు. వైఎస్సార్ బొమ్మతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాదనే నేతలు రాజీనామా చేసి సోనియా బొమ్మతో పోటీ చేయండి.. మేం వైఎస్సార్ బొమ్మపెట్టుకుని ప్రజల్లోకి వెళతాం. దేవాలయాల్లో దేవుడు.. ప్రజల గుండెల్లో వైఎస్సార్ ఎప్పటికీ నిలిచే ఉంటారు.
- మేకపాటి చంద్రశేఖరరెడ్డి, నెల్లూరు ఎమ్మెల్యే

ఈ ప్రభుత్వం వైఎస్సార్ పెట్టిన భిక్ష..
ఈ ప్రభుత్వం దివంగత వైఎస్ పెట్టిన భిక్ష. నాన్న తెచ్చిన ప్రభుత్వాన్ని కూల్చొద్దన్న జగన్ మాట మేరకు నేను రాజీనామా చేయలేదు. ఆయన సరేనంటే ఈ క్షణమే రాజీనామా చేసి, ఫ్యాక్స్ ద్వారా ప్రభుత్వానికి పంపుతా. నైతిక విలువలు గురించే మాట్లాడే సీఎం తన అనుయాయులతో రాజీనామా చేయించి, ఎన్నికలకు వెళ్లాలి. ప్రజలు ఎవరికి పట్టం కడతారో తేలిపోతుంది. పేదలు ధరాఘాతంతో తల్లడిల్లుతోంటే ఈ ప్రభుత్వం నీరోలా వ్యవహరిస్తోంది.
- గొల్ల బాబూరావు, పాయకరావుపేట ఎమ్మెల్యే

జగన్ వెంట ఉండటమే నైతికత..
ఈ ప్రభుత్వం పూర్తి కాలం కొనసాగేది అనుమానమే. నిత్యావసరాలు, పెట్రో మంటతో ప్రజల పరిస్థితి దుర్భరంగా మారింది. దివంగత నేత వైఎస్సార్‌లా ఎవరూ పేద, బడుగు, బలహీన వర్గాలపై దృష్టి పెట్టింది లేదు. 30 మంది ఎస్సీలు ఎమ్మెల్యేలు కావడం వైఎస్సార్ చలవే. ఆయన వారసుడు జగన్ వెంట ఉండటమే నైతికత. ఆయన ఊ అంటే ఈ క్షణాన్నైనా రాజీనామా చేసేందుకు సిద్ధమే.
- కమలమ్మ, బద్వేలు ఎమ్మెల్యే
 

కోతికి మల్లెపువ్వు.. కిరణ్‌కు సీఎం పీఠం
 కోతి చేతికి మల్లెపువ్వు నిస్తే ఏం చేయాలో తెలియక నలిపి పారేసిందట. మంత్రిగా కూడా పనిచేయకుండానే ముఖ్యమంత్రి పదవి కొట్టేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి పరిస్థితి అలాగే ఉంది. ప్రజల ఇబ్బందులను పక్కనబెట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు వైఎస్ జగన్ మీటింగ్‌కి ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు వెళ్తున్నారన్నదానిపైనే దృష్టి పెట్టారు. జగన్ సభలకెళ్తున్నారని కొంత మంది పెద్దలు ఏవేవో వాగారు. జగన్‌కు పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేకపోతున్నారు. పాలకులు జనాన్ని జగన్ సభలకు వెళ్లకుండా అడ్డుకోవడం మాని నిత్యావసర సరకుల ధరలు తగ్గించాలి. అలా కాకపోతే ప్రజాగ్రహం ప్రభుత్వాన్ని కాల్చి బూడిద చేస్తుంది.
- సినీ నటి రోజా
జగన్ వెంటే నడుస్తా..


యువనేత జగన్‌కు అండగా ఉంటా. ఈరోజు, రేపు, ఎల్లుండి, కాదు సంవత్సరం తర్వాత పార్టీ పెట్టినా జగన్ వెంట నడిచి వస్తాను. టెక్కలి నియోజకవర్గం పరిధిలోని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు యువనేతకు బాసటగా నిలుస్తారు. జగన్ ముఖ్యమంత్రి కావాలన్నదే నా ఆకాంక్ష.
- టెక్కలి ఎమ్మెల్యే కొర్ల భారతి

జనం గుండెల్లో వైఎస్సార్ పథకాలు


2004 నుంచి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు మా గుండెల్లో ఇంకా కదలాడుతూనే ఉన్నాయి. మహిళలకు ఆయన పెద్దపీట వేశారు. జగనన్నా.. నీవు ముందుండి నడిపిస్తే చాలు.. నీ వెంట నడిచేందుకు మేము, మా నియోజకవర్గ ప్రజలంతా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారు.
- మినతి గొమాంగో, మాజీ ఎమ్మెల్యే, కొత్తూరు

ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ


కడప ఉప ఎన్నికల్లో యువనేత జగన్ భారీ మెజార్టీతో విజయం సాధించడం తథ్యం. ప్రజల కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా ఆయన ఇప్పటి వరకు దీక్షలు చేపట్టారు. ప్రభుత్వంలో కదలిక తీసుకొచ్చారు. నా నియోజకవర్గ ప్రజలంతా జగన్ వెంట నడవడానికి పూర్తి మద్దతు తెలిపారు. వైఎస్సార్ లేని లోటు జగన్ మాత్రమే తీర్చగలరు.
- శ్రీనివాసులు, రైల్వేకోడూరు ఎమ్మెల్యే
 
అసలు సిసలైన నిరసన * వైఎస్ జగన్ దీక్షలతో ఆందోళనలకు కొత్తరూపు
నిరసన అంటే ప్రజలకు ఇబ్బందులు కలిగించడం.. నిరసన అంటే ప్రజాజీవనానికి అవరోధాలు కలిగించడం.. నిరసన అంటే అప్పటికే అవస్థలు పడుతున్న సామాన్యులను మరింత చికాకు పెట్టడం.. ఇవీ ఈనాటి రాజకీయాలు. ప్రస్తుతం అన్ని రాజకీయ పక్షాల కార్యకర్తలు అనుసరిస్తున్న పద్ధతులివే.. జన జీవనానికి ఆటంకం కలిగించి, మీడియా కెమేరాల ఎదుట పోజులిచ్చి కాసేపటికి ఎక్కడివారక్కడ చెదిరిపోవడం ఇప్పటి నిరసనల అంతస్సూత్రం. కానీ యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న దీక్షలు కొత్త ధర్మాన్ని చాటిచెబుతున్నాయి. కొత్త విధానానికి పథ నిర్దేశం చేస్తున్నాయి. అసలు సిసలైన నిరసన అంటే ఇదీ అని తేల్చిచెబుతున్నాయి. మొన్న విజయవాడలో, నిన్న ఢిల్లీలో, ఇప్పుడు విశాఖలో చేపట్టిన దీక్షలు ఎలాంటి ఆందోళనకూ దారితీయకుండా, ప్రజాజీవనానికి ఇబ్బంది కలగకుండా ప్రజల ఆవేదనను సర్కారుకు ఎలుగెత్తి చెప్పాయి.

కడుపు మాడుతున్న ఎందరో సామాన్యుల ఆక్రోశాన్ని తెలియజెప్పాయి. వర్తమాన రాజకీయ ‘ప్రమాణాలకు’ ఏమాత్రం పొసగకుండా శనివారం విశాఖలో జరిగిన ‘జన దీక్ష’... ఉద్యమాలకు, నిరసనలకు కొత్త భాష్యం చెప్పింది. లక్షల్లో తరలివచ్చిన ప్రజానీకం.. బంగాళాఖాతం తీరాన జన సముద్రం.. అయినప్పటికీ ట్రాఫిక్‌కు అంతరాయాలు లేవు. రోడ్డెక్కి నిరసనలు లేవు.. ప్రజలకు ఇబ్బందులు, చిక్కులూ అసలే లేవు. కేవలం సత్యాగ్రహం.. కేవలం ధర్మాగ్రహం.. కేవలం ప్రజాగ్రహం.. గురి తప్పని శరాఘాతంలాజననిరసన మాత్రమే అక్కడ గోచరించింది. సాగరఘోషను మించిన నిరసన హోరు వినిపించింది. అందుకే జనదీక్ష సాగరతీరం సాక్షిగా ఘనవిజయాన్ని సాధించింది. పాలకులను, వారి అనుచరులను గజగజలాడించింది.

 
అంతులేని జలనిధి అసూయ పడింది. అంతెత్తున లేచిన జన కెరటాన్ని చూసి విస్తుబోయింది. జనసంద్రం అలజడితో చిన్నబోయింది. లక్ష గొంతులు ఒకే గళం విప్పాయి. ధరలపై నిరసన స్వరం వినిపించాయి. కన్నీళ్లను తుడిచేందుకొచ్చిన యువనేతను హత్తుకున్నాయి. కష్టాలను పంచుకోవాలి... ఆనందాలను పెంచుకోవాలి... హితులు చేయాల్సిందిదే... హితం కోరేవారు చేసేదిదే... అది మహానేత వైఎస్సార్‌కే చెల్లింది. ఆ మహానేత నిష్ర్కమణతోనే ఆంధ్ర రాష్ట్రం అల్లకల్లోలమైంది. సంక్షేమం అటకెక్కింది. ధరలు పేట్రేగిపోతున్నాయి. జీవితాన్ని అల్లకల్లోలం చేసేస్తున్నాయి.

ఆంధ్ర రాష్ట్రం నాథుడు లేని రాజ్యమైంది. అప్పుడే యువ కిరణం కనిపించింది. నేనున్నానని భరోసా ఇచ్చింది. బతుకుపై నమ్మకాన్ని కలిగించింది. ఇప్పుడీ రాష్ట్రానికి ఏకైక ఉపశమనమైంది. ధరలపై జనదీక్షకు సిద్ధం చేసింది. ఆయనే యువనేత వైఎస్ జగన్మోహన రెడ్డి. అశేష జనవాహిని సాక్షిగా సాగరతీరం శనివారం చిక్కిపోయింది. ధరల దరువుకు తల్లడిల్లిపోతున్న ప్రజల్ని యువనేత అనునయిస్తుంటే ఉత్సాహపడిపోయింది. చేతకాని పాలకుల నిర్వాకంపై పేలుతున్న జన శతఘు్నలకు సాక్షిగా నిలిచింది. జనదీక్ష వేదికపై జగన్నినాదం స్వార్ధ నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. సాగర తీరమేనా... పాలక పీఠాలూ దద్దరిల్లాయి. క్షీరసాగర మథనంతో అమృత భాండం ఆవిర్భవించింది. ఇప్పుడు సముద్రతీరాన జగన్ చేసిన దీక్షాయజ్ఞం ఫలితమిస్తుంది. 
ఇది సామాన్యుడి నమ్మకం... కాదుకాదు అచంచల విశ్వాసం.