Thursday, January 6, 2011

జగన్ పార్టీ పేరు నమోదుకు దరఖాస్తు * ఈసీకి అందజేసిన వైవీ సుబ్బారెడ్డి

యువనేత, కడప మాజీ ఎంపీ వైఎస్ జగన్ పెట్టబోయే కొత్త పార్టీ పేరు నమోదుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘంలో బుధవారం దరఖాస్తు దాఖలైంది. జగన్ తరఫున ఆయన ప్రతినిధి వై.వి.సుబ్బారెడ్డి ఈ దరఖాస్తును అం దజేశారు. ఈ సందర్భంగా తనను కలిసిన టీవీ చానళ్ల ప్రతినిధులతో సుబ్బారెడ్డి క్లుప్తంగా మాట్లాడారు. మహానేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును, స్ఫూర్తిని ప్రతిబింబించే విధంగా కొత్త పార్టీ పేరు ఉం టుందని ఆయన తెలిపారు. రెండు మూడు వారాల్లో ఈసీ నుంచి క్లియరెన్స్ వస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు. పార్టీ విధివిధానాలపై అడిగిన ఓ ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. పార్టీ పేరు ఈసీలో నమోదయ్యాక విధివిధానాలను వెల్లడిస్తామన్నారు. పేరు ఎలా ఉంటుందని అడిగిన ప్రశ్నలకు.. ఈసీ నుంచి క్లియరెన్స్ వచ్చినపుడు ఆ విషయం తెలుస్తుందని జవాబిచ్చారు.

జగన్ దీక్షకు మొదలైన ఏర్పాట్లు
కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు నే పథ్యంలో జగన్ 11న ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన నిరాహార దీక్షకు ఏర్పాట్లు బుధవారం ఆరంభమయ్యాయి. ఏర్పాట్లకు సంబంధించిన పలు అంశాలపై సుబ్బారెడ్డి పలువురితో సమావేశమై చర్చలు జరిపారు.

No comments:

Post a Comment