Tuesday, January 11, 2011

‘జల’దరించిన ఢిల్లీ * జగన్ జలదీక్ష. ... రాజధానిలో ప్రతిధ్వనించిన తెలుగు గళం

కృష్ణా జలాల పంపకంలో అన్యాయంపై నిరసన
అన్నపూర్ణలాంటి రాష్ట్రాన్ని ఎడారిలా మార్చొద్దంటూ కేంద్రానికి వినతి
ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ సాగిన దీక్ష
తరలివచ్చిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రముఖులు
పెద్ద ఎత్తున పాల్గొన్న స్థానిక సంస్థల ప్రతినిధులు, రైతు ప్రతినిధులు, రైతులు, మద్దతుదారులు
కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఎంపీలు, 21 మంది ఎమ్మెల్యేల హాజరు
వీరితోపాటు ఇద్దరు పీఆర్పీ ఎమ్మెల్యేలు, ఒక టీడీపీ ఎమ్మెల్యే
వివిధ కారణాలతో హాజరు కాలేకపోయిన పలువురు ఎమ్మెల్యేలు
దీక్షలో పాల్గొన్న 40 మంది మాజీ ఎమ్మెల్యేలు

ఉదయం నుంచి రాత్రిదాకా ప్రశాంతంగా సాగిన దీక్ష
జగన్ వినతితో రెండుసార్లు సమయాన్ని పొడిగించిన పోలీసులు
8.30 గంటల సమయంలో బలవంతంగా అరెస్టు చేస్తామని ప్రకటన
రైతన్నపై లాఠీ పడొద్దన్న కారణంతో అరెస్టుకు సహకరించిన యువనేత..
అరెస్టు; విడుదల... దీక్ష లక్ష్యం నెరవేరిందని ప్రకటన
నేటి మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్రానికి బయల్దేరనున్న ప్రత్యేక రైలు

న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: దేశ రాజధాని హస్తినలో.. పార్లమెంటుకు కూతవేటు దూరంలో.. తెలుగు రైతు గర్జించాడు! కృష్ణా జలాల్లో తమకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటాడు!! అన్నపూర్ణలాంటి రాష్ట్రాన్ని ఎడారి చేయొద్దని వినమ్రంగా వేడుకున్నాడు!! మంగళవారం యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద చే పట్టిన ‘జలదీక్ష’ వేదికగా తన గొంతుకను దేశానికి వినిపించాడు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, రైతు ప్రతినిధులు, రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన స్థానిక సంస్థల ప్రతినిధులు, అన్నదాతలు, అభిమానులతో ఉదయం 11 గంటలకు మొదలైన దీక్ష.. రాత్రి తొమ్మిది గంటల దాకా సాగింది. దీక్ష జరిగినంత సేపూ పలువురు ప్రజా ప్రతినిధులు ప్రసంగించారు. సాయంత్రం 5 గంటల వరకే అనుమతి ఉండడంతో పోలీసులు రంగంలోకి దిగారు. స్థలాన్ని ఖాళీ చేయాలని కోరారు. స్థానిక ఏసీపీ విజయ్ చందోల్ యువనేత జగన్‌తో చర్చలు జరిపారు. ప్రధాని అపాయింట్‌మెంట్ వచ్చే వరకు దీక్ష విరమించే ప్రశ్నే లేదని జగన్ తేల్చి చెప్పారు. దీక్ష 24 గంటలు జరుగుతుందని, అనుమతి పొడిగించాలని కోరారు.

కొంతమేర సానుకూలంగా స్పందించిన పోలీసులు.. రాత్రి 7 గంటల వరకు ఒకసారి, 8.30 గంటల వరకు మరోసారి పొడిగించారు. అయితే రాత్రి 8.30 గంటల తర్వాత.. కఠిన వైఖరి ప్రదర్శించారు. ఢిల్లీ పోలీస్ చట్టంలోని సెక్షన్-65 ప్రకారం నిరసనకారులను అరెస్టు చేస్తామని ప్రకటించారు. సహకరించకుంటే బలవంతంగా అరెస్టులు చేస్తామన్నారు. చివరికి ఒక్క రైతన్నపై కూడా లాఠీదెబ్బ పడకూడదన్న ఉద్దేశంతో యువనేత తన అరెస్టుకు సహకరించారు. దీంతో ఆసాంతం గాంధేయ పద్ధతిలో సాగిన దీక్ష 9 గంటల సమయంలో ప్రశాంతంగా ముగిసింది.

దీక్షారథానికి ఘన స్వాగతం


రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన మొత్తం 2,500 మందితో ఆదివారం మధ్యాహ్నం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయల్దేరిన ప్రత్యేక రైలు సోమవారం రాత్రి 11 గంటలకే ఢిల్లీ చేరుకోవాల్సి ఉన్నా.. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో సఫ్దర్‌జంగ్ స్టేషన్‌కు వచ్చింది. అప్పటికే మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో అక్కడ కొన్ని గంటలుగా రైలు కోసం ఎదురుచూస్తున్నారు. జగన్ రాకకు ముందే స్టేషన్‌కు వచ్చిన అభిమానులు బ్యానర్లు, ఫ్లెక్సీలతో రైలుకు ఘన స్వాగతం పలికారు. అనంతరం జగన్, ఎమ్మెల్యేలు, ప్రముఖులు, స్థానిక సంస్థల ప్రతినిధులు తమ బసప్రదేశాలకు బస్సుల్లో వెళ్లి గంట తిరిగే సరికి మళ్లీ అవే బస్సుల్లో జంతర్‌మంతర్ వద్దకు చేరుకున్నారు. ప్రత్యేక రైల్లో వచ్చినవారేగాకుండా వేరే రైళ్లలో, విమానాల్లో సొంత ఖర్చులతో వచ్చిన నాయకులు, అభిమానులు కూడా వీరికి తోడయ్యారు. వేదిక వద్ద యువనేతను కలిసేందుకు, పలకరించేందుకు మద్దతుదారులు ఎగబడ్డారు. ఈ అభిమాన ప్రవాహాన్ని ఆపడం నాయకులకు ఒకింత కష్టమైంది. పదేపదే సర్దిచెబుతూ ప్రసంగాలు కొనసాగించారు. వేదికపై స్థలం పరిమితంగా ఉండటంతో కేవలం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కొందరు ముఖ్యులకే చోటుదక్కింది.

అరెస్టుకు నేను సహకరిస్తున్నా..


రెండుసార్లు సమయాన్ని పొడిగించినా.. నేతలు దీక్ష విరమణకు ససేమిరా అనడంతో రాత్రి 8.30 గంటల సమయంలో వారందరినీ అరెస్టు చేసేందుకు పోలీసులు ఉద్యుక్తులయ్యారు. ఈ సందర్భంలో జగన్ జోక్యం చేసుకున్నారు. రైతులపై లాఠీదెబ్బలు పడకూడదని, దీక్ష ఉద్దేశం నెరవేరిందని చెప్పారు. అరెస్టుకు సహకరిస్తున్నట్లు ప్రకటించారు. ‘‘ఇప్పుడు మన ముందున్న మార్గాలు రెండు. మనం ఒకరోజు పాటు నిరాహార దీక్ష చేయాలనుకున్నాం. ఉదయం నుంచి రాత్రి వరకు చేశాం. సాయంత్ర 5 గంటల వరకే అనుమతి ఉన్నా... మరో నాలుగు గంటలు దీక్ష కొనసాగించడానికి అవకాశం కల్పించారు. అనుమతి పొడిగింపు సాధారణ అంశం కాదని, నిరసనకారుల క్రమశిక్షణ చూసి పొడిగిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. పోలీసుల గొప్పల సంగతి పక్కనబెడితే.. మనం కాదూ.. కూడదూ అని నిలబడితే పోలీసు బలగాలు దిగుతాయి. గొడవ మొదలవుతుంది. గొడవలో కొందరికైనా గాయాలవడం తప్పదు. అది నాకు సరికాదనిపిస్తోంది. మనం చేయాలనుకొన్న దీక్ష చేశాం. మన దీక్ష ఫలించింది. దీక్ష ఎందుకు చేస్తున్నాం? మనకు జరిగిన అన్యాయం ఏమిటి? అని జాతీయ చానళ్లు ఉదయం నుంచి రాత్రి దాకా చూపించాయి. మనకు అన్యాయం జరిగిందని ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకెళ్లగలిగాం. అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా ప్రధానమంత్రి కూడా తప్పు చేశారని ప్రపంచానికి చూపించాం. ఈ దశలో మనం సఫలీకృతమయ్యాం. నన్ను అరెస్టు చేసి తీసుకెళ్లినా.. మీరు రియాక్ట్ కావద్దు. అరెస్ట్‌కు నేను సహకరిస్తున్నా. మీరూ సహకరించండి’ అని రైతులు, ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. దీంతో వారు కూడా శాంతించారు. తర్వాత జగన్‌ను అరెస్టు చేయడంతో దీక్ష ప్రశాంత వాతావరణంలో ముగిసింది. అనంతరం జగన్‌ను పోలీసులు విడుదల చేశారు.

తెలు‘గోడు’ వినటానికి తీరిక లేదా? 
కష్టాలు చెప్పుకోవటానికి ప్రధాని మన్మోహన్‌సింగ్ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు: జగన్
ఆంధ్రప్రదేశ్ రైతులంటే ఇదేనా మీ ప్రేమ?
కష్టాల్లో ఉన్న రైతుకు ‘కృష్ణా’ తీర్పుతో మరో విపత్తు
గోడు వినిపించటానికి ఢిల్లీ వచ్చి దీక్ష చేయాల్సి వచ్చింది
కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు వల్ల రాష్ట్రం ఎడారిగా మారుతుంది
‘డిపెండబులిటీ’ని ఎందుకు తగ్గించారు?
మిగులు జలాలను ఎందుకు పంచారు?
కోయినా ప్రాజెక్టు సామర్థ్యం మేరకు విద్యుత్‌ను మేమే ఇస్తాం.. ఆ నీటిని రాష్ట్రానికే ఇవ్వాలి
100 టీఎంసీల సామర్థ్యానికి మించి ఉన్న ప్రాజెక్టులను ‘స్వతంత్ర నియంత్రణ’లో ఉంచాలి
ఎగువ రాష్ట్రాలకు వచ్చే ప్రతి చుక్క నీటిలోనూ ఆంధ్రప్రదేశ్‌కు వాటా ఇవ్వాల్సిందే
కృష్ణా-గోదావరి నదుల అనుసంధానంతోనే సమస్యకు శాశ్వత పరిష్కారం
పోలవరం, ప్రాణహిత, దుమ్ముగూడెం,
సుజల స్రవంతిలను జాతీయ ప్రాజెక్టులుగా చేపట్టాలి
ఢిల్లీ ‘జలదీక్ష’లో యువనేత జగన్ డిమాండ్లు


న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: రాష్ట్ర రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు, కడగండ్లను, కృష్ణా జలాల కేటాయింపులో జరిగిన అన్యాయాన్ని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు వివరించి, న్యాయం చేయాలని కోరటానికి రెండు సార్లు అపాయింట్‌మెంట్ అడిగినా స్పందన కరవయిందని యువనేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతాంగం పట్ల ప్రధానమంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి ఉన్న ప్రేమ ఎంతో, గౌరవం ఏపాటిదో.. అపాయింట్‌మెంట్ నిరాకరించటమే చెప్తోందని ఆయన పేర్కొన్నారు. తెలుగువారి గోడు వినటానికి ప్రధానికి, కేంద్రానికి తీరిక లేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద చేపట్టిన ‘జలదీక్ష’లో పాల్గొన్నవారిని ఉద్దేశించి జగన్ మాట్లాడారు.

‘‘మా గోడు వినండని చెప్పటానికి ఢిల్లీకి రావాల్సి వచ్చింది. భారీ వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ 48 గంటలు లక్ష్య దీక్ష చేశాం. వరుసగా ముంచుకొచ్చిన వరదలు, లైలా, జల్ తుపాన్లు, తర్వాత కురిసిన భారీ వర్షాల కారణంగా రైతులు పంటలు కోల్పోయారు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారు. రైతులను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మొండి చేయి చూపించింది. కష్టాలు, కడగండ్ల వల్ల 434 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. రైతులను ఆదుకుంటామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించిన తర్వాత 390 మంది రైతుల ఊపిరి ఆగిపోయింది. ఈ నేపథ్యంలో.. రైతుల గోడు వినిపించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేయటానికి ప్రధానమంత్రిని అపాయింట్‌మెంట్ అడిగితే.. ఆయన నిరాకరించారు. ప్రకృతి విపత్తుల కష్టాల నుంచి తేరుకోక ముందే.. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు రూపంలో రైతులకు మరో పెద్ద కష్టం వచ్చి పడింది. ట్రిబ్యునల్ తీర్పు వల్ల రాష్ట్ర రైతాంగానికి తీరని అన్యాయం జరుగుతోందని చెప్పటానికి ప్రధానమంత్రి అపాయింట్‌మెంట్ అడిగాం. ఇప్పటి వరకూ ప్రధాని నుంచి స్పందన రాలేదు. రైతుల పట్ల కేంద్రానికి ఉన్న ప్రేమ ఇదేనా? మా గోడు వినిపించటానికి.. ఢిల్లీకి వచ్చి దీక్ష చేయాల్సి వచ్చింది. ఇప్పటికైనా ప్రధానమంత్రి స్పందిస్తారని ఆశిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.


ట్రిబ్యునల్ తీర్పు వల్ల జరిగిన అన్యాయం, పరిష్కారాలు ఇవీ..


బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వల్ల రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని జగన్ సోదాహరణంగా వివరించారు. తాజా ట్రిబ్యునల్ తీర్పు వల్ల రాష్ట్రం ఎడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అన్యాయాన్ని సరిదిద్దటానికి అవకాశం ఉన్న మార్గాలనూ సూచించారు. ఆయన మాటల్లోనే...


కృష్ణా బేసిన్‌లో నీటి లభ్యతను గణించటానికి బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం డిపెండబులిటీని ఆధారంగా తీసుకుని తీర్పునిస్తే.. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ అందుకు భిన్నంగా 65 శాతం డిపెండబులిటీని ఆధారంగా తీసుకుని నీటి లభ్యతను పెంచి చూపించటం ద్వారా ఎగువ రాష్ట్రాలకు నికర జలాల కేటాయింపు పెరిగింది. దీని వల్ల దిగువ రాష్టమ్రైన ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుంది. డిపెండబులిటీని ఎందుకు తగ్గించారనే అంశం మీద స్పందన లేదు.


కృష్ణా బేసిన్‌కు సంబంధించిన 112 సంవత్సరాల ప్రవాహాల వివరాలు అందుబాటులో ఉన్నా.. 47 సంవత్సరాల ప్రవాహాల వివరాలనే పరిగణనలోకి తీసుకున్నారు. బచావత్ ట్రిబ్యునల్ 78 ఏళ్ల ప్రవాహాలను ఆధారంగా తీసుకుంది. తక్కువ సంవత్సరాల గణాంకాలనే తీసుకోవటం వల్ల కూడా నీటి లభ్యత పెరిగినట్లు కనిపించింది.


వరదలు, కరవు సమయాల్లో కింది రాష్ట్రాలకు అన్యాయం జరిగే అవకాశం ఉన్నందున.. మిగులు జలాల వినియోగం మీద పూర్తి స్వేచ్ఛ కింది రాష్ట్రానికే ఉండాలని బచావత్ ట్రిబ్యునల్ తీర్పులో చెప్పింది. కానీ తాజా ట్రిబ్యునల్ తీర్పులో.. మిగులు జలాలను కూడా లెక్కకట్టి పంచేశారు. 285 టీఎంసీల మిగులు జలాలు ఉన్నాయని లెక్క తేల్చి, అందులో సగమే మన రాష్ట్రానికి కేటాయించారు. మిగులు జలాలను ఎగువ రాష్ట్రాలకు ఎందుకు పంచాల్సి వచ్చింది?

కోయినా విద్యుత్ ప్రాజెక్టుకు 67 టీఎంసీల నీటిని కేటాయించారు. కోయినా విద్యుత్ ప్రాజెక్టు ఉత్పత్తి సామర్థ్యం మేరకు.. కరెంట్ మేమే ఇస్తాం. 67 టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్‌కే ఇవ్వాలి.


ఠ నాగార్జునసాగర్ కింద ఉన్న పాలేరు, మున్నేరుల్లో ప్రవహించే 47 టీఎంసీల నీటిని సముద్రంలోకి విడిచిపెట్టటం తప్ప వినియోగించుకునే అవకాశం లేదు. ఆ నీటినీ ఆంధ్రప్రదేశ్ వాటాలో కలపటం ఏం న్యాయం? అంటే.. మన కేటాయింపుల్లో 47 టీఎంసీల నీరు వినియోగించుకోవటానికి వీలుకాదు.

బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పులో పేర్కొన్న బోర్డులో.. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్టల్ర నుంచి ఒక్కొక్కరు, కేంద్ర ప్రభుత్వ అధికారులు ఇద్దరు ఉంటారు. ‘బోర్డు వేశాం. కొట్టుకు చావండి’ అనే తరహా ఆలోచనతోనే బోర్డు ఏర్పాటు చేయాలని ట్రిబ్యునల్ సిఫారసు చేసింది. కావేరీ జలాల విషయంలో ఇదే జరుగుతోంది. అక్కడ బోర్డు ఉన్నా.. కర్ణాటక, తమిళనాడుల మధ్య జగడం నిరంతరాయంగా కొనసాగుతోంది. బోర్డు వల్ల న్యాయం జరగటం ఒట్టిమాటే. తుంగభద్ర బోర్డు వల్ల మనకు నష్టమే తప్ప న్యాయం జరిగిన సందర్భాల్లేవు.


ఎగువ రాష్ట్రాల్లో 100 టీఎంసీల సామర్థ్యానికి మించి ఉన్న ప్రాజెక్టులను స్వతంత్ర సాధికార సంస్థ నియంత్రణలో ఉంచాలి.


ఖరీఫ్ సమయంలో 8-10 టీఎంసీల నీటిని కర్ణాటక విడుదల చేయాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. మా వాటా కోసం ఎవరినీ దేవురించాల్సిన అవసరం లేదు. ప్రతి చుక్కలోనూ రాష్ట్రానికి దక్కాల్సిన వాటాను పంచాల్సిందే. చుక్క నీరు ఎగువ రాష్ట్రాలకు వస్తే.. తక్షణమే అందులో రాష్ట్రానికి రావాల్సిన వాటాను విడుదల చేయాలి. ఇలా చేస్తే.. వరదల సమయాల్లో లక్షల క్యూసెక్కుల నీటిని వృధాగా విడుదల చేయాల్సిన అవసరం రాదు.


సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నా. కృష్ణా-గోదావరి అనుసంధానమే సమస్యకు శాశ్వత పరిష్కారాన్నిస్తుంది.

పోలవరం కావాలని కాంగ్రెస్‌లోనే కొంత మంది ఎంపీలు అడుగుతున్నారు. వద్దంటున్న వాళ్లూ ఉన్నారు. పోలవరంతో పాటు ప్రాణహిత-చేవెళ్లను జాతీయ ప్రాజెక్టుగా ఎందుకు చేపట్టరని ప్రశ్నిస్తున్నా. వీటితో పాటు దుమ్ముగూడెం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులను కూడా జాతీయ ప్రాజెక్టులుగా చేపట్టాలని ప్రధానికి విజ్ఞప్తి చేస్తున్నా.’’


రైతులకు న్యాయం చేయటానికి ప్రధానమంత్రి స్పందించి తమకు అపాయింట్‌మెంట్ ఇస్తారని ఆశిస్తున్నట్లు జగన్ పేర్కొన్నారు. ఆయన తన ప్రసంగంలో చేసిన డిమాండ్లు, పరిష్కార మార్గాలతో ప్రధానమంత్రికి రాసిన లేఖను ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేశారు.


బాబూ.. విశ్వసనీయతకు అర్హుడివా?


రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినే విధంగా ట్రిబ్యునల్ తీర్పు రావటానికి చంద్రబాబు తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నపుడు వెలగబెట్టిన నిర్వాకమే కారణమని జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో.. ఎన్.టి.రామారావు, చంద్రబాబు ప్రాజెక్టులకు శంకుస్థాపనల మీద శంకుస్థాపనలు చేయటం మినహా.. ఒక్క ప్రాజెక్టునూ నిర్మించకపోవటం వల్లే ప్రస్తుత పరిస్థితి తలెత్తిందని విమర్శించారు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు 2000 సంవత్సరంలో ముగుస్తుందని, కొత్త ట్రిబ్యునల్ వచ్చే సమయానికే ప్రాజెక్టులు పూర్తి చేయటం ద్వారా కృష్ణా బేసిన్‌లోని నీటి మీద హక్కు మనకు దక్కుతుందని దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి అప్పటి టీడీపీ ప్రభుత్వానికి శాసనసభలో సూచించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వెలిగొండ, హంద్రీనీవా, పులిచింతల, నెట్టెంపాడు, కల్వకుర్తి తదితర ప్రాజెక్టులను పూర్తి చేయటానికి అవకాశం ఉన్నా.. టీడీపీ సర్కారు కేవలం శంకుస్థాపనలకే పరిమితమయ్యిందని జగన్ తప్పుబట్టారు.


అధికారంలో ఉండగా వ్యవసాయం దండగ అని చెప్పిన ప్రబుద్ధుడు.. ఇప్పుడు రైతుల సంక్షేమం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. విశ్వసనీయతకు అర్హుడునని చెప్పుకుంటున్న చంద్రబాబు.. తన హయాంలో రైతులను తుపాకులతో కాల్పించటం తప్ప మరేం చేశారని జగన్ ప్రశ్నించారు. ఉచిత విద్యుత్ ఇస్తే ఆ కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని చంద్రబాబు అంటే.. వైఎస్ ముఖ్యమంత్రిగా తొలి సంతకం ఉచిత కరెంటు ఫైలు మీదే పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రైతుల రుణాలు మాఫీ చేసిన ఘనత కూడా వైఎస్‌కే దక్కుతుందన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లలో వ్యవసాయ రంగానికి చేసిన కేటాయింపులను చదివి వినిపించారు. 95-96లో రూ. 652 కోట్లతో మొదలు పెట్టి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనిచేసిన ఆఖరు సంవత్సరం (2002-03)లో గరిష్టంగా రూ.1,693 కోట్లు ఖర్చు చేశారని పేర్కొన్నారు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో 8 నెలల్లోనే రూ. 3,330 కోట్లు వ్యవసాయ రంగానికి కేటాయించారని.. ఐదేళ్లలో రూ. 40 వేల కోట్లు వ్యవసాయ రంగం మీద ఖర్చు చేశారని వివరించారు.


దీక్షలో ఎవరెవరు పాల్గొన్నారంటే...
జలదీక్షలో పాల్గొన్నవారిలో కాంగ్రెస్ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి (నెల్లూరు), సబ్బం హరి (అనకాపల్లి)తోపాటు మొత్తం 24 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు, పలువురు ప్రముఖులు ఉన్నారు. వీరితోపాటు దాదాపు 40 మంది మాజీ ఎమ్మెల్యేలు, 23 జిల్లాలకు చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు దీక్షలో కూర్చున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న 21 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో.. పిల్లి సుభాష్‌చంద్రబోస్, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, జి.శ్రీకాంత్‌రెడ్డి, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, కె.శ్రీనివాసులు, ఆదినారాయణరెడ్డి, కమలమ్మ, బి.గురునాథ్‌రెడ్డి, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, టి.బాలరాజు, జయసుధ, పాటిల్ నీరజారెడ్డి, కుంజా సత్యవతి, రేగ కాంతారావు, జి.బాబూరావు, ఆళ్ల నాని, ఎన్.శేషారెడ్డి, ఎం.సుచరిత ఉన్నారు. ఇద్దరు ప్రజారాజ్యం ఎమ్మెల్యేలు- శోభా నాగిరెడ్డి, కాటసాని రాంరెడ్డి, ఒక టీడీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డితోపాటు ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకర్‌రావు, కొండా మురళి, పుల్లా పద్మావతి ఉన్నారు. చివరి నిమిషంలో ముఖ్యమంత్రి, పీసీసీ నాయకత్వం అడ్డుపడటంతో పలువురు ఎమ్మెల్యేలు రాలేకపోయారు. ఇక దీక్షకు రావడానికి ఏర్పాట్లు చేసుకుని చివరి నిమిషంలో రాలేని వారిలో ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, కె.రాంచంద్రారెడ్డి, షాజహాన్, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఉన్నారు. ముఖ్యమైన సమావేశం ఉన్నందున ఢిల్లీ వెళ్లలేకపోతున్నానని, తాను ఎప్పటికీ జగన్ వెంటే ఉంటానని ద్వారంపూడి ప్రకటించగా, చలి జ్వరంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నందున రాంచంద్రారెడ్డి, మామ చనిపోయిన కారణంగా నల్లపురెడ్డి దీక్షకు రాలేకపోయారు.

పెద్ద సంఖ్యలో ప్రముఖులు..

ఇక ప్రముఖుల విషయానికొస్తే.. మాకినేని పెద రత్తయ్య, బాజిరెడ్డి గోవర్ధన్, వై.వి.సుబ్బారెడ్డి, భూమా నాగిరెడ్డి, కొణతాల రామకృష్ణ, లక్ష్మీపార్వతి, అంబటి రాంబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సినీనటి రోజా, పి.రవీంద్రనాథ్‌రెడ్డి, గట్టు రామచంద్రరావు, భూమన కరుణాకర్‌రెడ్డి, సినీ నటుడు విజయ్ చందర్, మూలింటి మారెప్ప, రావుల రవీంద్రనాథ్‌రెడ్డి, ఎం.ఎ.రెహ్మాన్, మేకా ప్రతాప్ అప్పారావు, ఎడ్మ కిష్టారెడ్డి, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి, సామినేని ఉదయభాను, జంగా కృష్ణమూర్తి, ఉడుముల శ్రీనివాసరెడ్డి, పెనుమత్స సాంబశివరాజు, గండి బాబ్జీ, విష్ణువర్ధన్‌రెడ్డి, లోకనాథం రాయుడు, రాజ్‌సింగ్ ఠాకూర్, జొన్నా సూర్యనారాయణ, నెల్లూరు డీసీసీ అధ్యక్షుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ మేరుగు నాగార్జున, నిజామాబాద్ డీసీఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి, యువజన నాయకులు కోటింరెడ్డి వినయ్ రెడ్డి, రాచమల్ల సిద్ధేశ్వర్, చేవూరు శ్రీధర్‌రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, మహిళా నాయకులు కొల్లి నిర్మల, అమృతాసాగర్, రైతు ప్రతినిధులు ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, చెంగల్‌రెడ్డి తదితరులున్నారు. రైల్లో వచ్చిన 2,500 మందితోపాటు ఢిల్లీలోని వివిధప్రాంతాల నుంచి స్వచ్ఛందంగా తరలివచ్చిన దాదాపు వెయ్యిమంది, రాష్ట్రం నుంచి సొంతఖర్చులతో వచ్చిన 500మంది కలిపి మొత్తమ్మీద 4 వేల మందికిపైగా దీక్షలో పాల్గొన్నారు.

జాతీయ మీడియా ఆసక్తి

జగన్ నేతృత్వంలో జరిగిన జల దీక్ష పట్ల ప్రాంతీయ మీడియాతో పాటు జాతీయ మీడియా కూడా అమిత ఆసక్తి కనపరిచింది. దీక్ష జరుగుతున్న పార్లమెంటు వీధిలో... తెలుగు చానళ్లే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రాంతీయ, జాతీయ మీడియాకు చెందిన 42 ఓబీ వ్యాన్లు కొలువు దీరాయి. పెద్ద సంఖ్యలో జాతీయ మీడియా ప్రతినిధులు దీక్షను కవర్ చే సేందుకు వచ్చారు. ఇంగ్లిష్‌లో మాట్లాడాలని జాతీయ మీడియా చేసిన విజ్ఞప్తికి జగన్ సానుకూలంగా స్పందించి, ప్రత్యేకంగా వారితో మాట్లాడారు.

పోలీసుల ప్రశంసలు

జల దీక్షను అత్యంత క్రమశిక్షణతో నిర్వహించారని పోలీసు అధికారులు సైతం ప్రశంసించారు. అందువల్లే రెండుసార్లు అనుమతి పొడిగించామని చెప్పారు. ఇంత క్రమశిక్షణతో జరిగిన కార్యక్రమాలు ఈ మధ్య కాలంలో ఇక్కడ చూడలేదని స్థానిక ఏసీపీ విజయ్ చందోల్ విలేకరులతో అన్నారు.

కరుణించిన వాతావరణం
గతవారం రోజులుగా ఢిల్లీలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. దీక్షారైలు కూడా దట్టమైన పొగమంచు, తీవ్రమైన చలి మధ్య సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్‌కు చేరింది. అయితే 10 గంటల సమయంలో క్రమంగా ఎండ రావడంతో.. చలి తీవ్రత తగ్గింది. దాదాపు వారం రోజుల తర్వాత.. మంగళవారమే చలి తీవ్రత తగ్గింది. దీంతో రైతులు, నేతలు పెద్దగా ఇబ్బంది పడకుండానే దీక్ష కొనసాగించగలిగారు.

నేటి మధ్యాహ్నం తిరుగు ప్రయాణం

బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో సప్దర్‌గంజ్ రైల్వేస్టేషన్ నుంచి ప్రత్యేక రైలు రాష్ట్రానికి బయల్దేరుతుందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ప్రకటించారు. జంతర్‌మంతర్ వద్ద దీక్షలో పాల్గొన్న వారంతా ఇదే రైలులో రాష్ట్రానికి వస్తారని తెలిపారు. అందుకు అందరూ సిద్ధంగా ఉండాలని కోరారు.

నేను జెంటిల్మన్‌ని కాబట్టే సర్కారుకు మనుగడ: జగన్
ఎమ్మెల్యేలను రాజీనామా చేయొద్దని చెప్పి కాంగ్రెస్‌కి మేలు చేస్తున్నా
వారిపై చర్యలు తీసుకోవాలనుకుంటే కాంగ్రెస్ ఇష్టం
అలా చేస్తే రాష్ట్రంలో సర్కారు కూలుతుంది
ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటే ఏనాడో చేసేవాడిని
కడప లోక్‌సభ నుంచే ఉప ఎన్నికల్లో పోటీ
జాతీయ మీడియా ప్రశ్నలకు జగన్ జవాబులు


‘‘నేను జెంటిల్మన్‌ని. అందుకే నాకు మద్దతు పలుకుతున్న ఎమ్మెల్యేలను రాజీనామా చేయవద్దని కోరుతున్నాను. వారినలా కోరటం ద్వారా నేను కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తున్నాను’’ అని యువనేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. తనను బలపరుస్తున్న ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పార్టీ చర్యలకు దిగితే.. రాష్ట్రంలో ఆ పార్టీ ప్రభుత్వం కుప్పకూలుతుందన్నారు. మంగళవారం ఢిల్లీలో జగన్ ‘జలదీక్ష’ సందర్భంగా.. తనను కలిసిన జాతీయ మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన పైవిధంగా సమాధానం చెప్పారు. ‘మీరు బలప్రదర్శన చేసి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటున్నారా?’ అని విలేకరులు అడిగినపుడు ఆయన స్పందిస్తూ.. ‘‘ప్రస్తుతం నేను కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తున్నాను. నా పక్షానున్న ఎమ్మెల్యేలు రాజీనామాలిస్తే అక్కడ ప్రభుత్వం పడిపోతుంది.

నిజానికి నేను జెంటిల్మన్‌ని కనుక నావాళ్లను రాజీనామా చేయొద్దని కోరటం ద్వారా కాంగ్రెస్‌కు మేలు చేస్తున్నాను. నేనిక్కడ ఓ విషయాన్ని స్పష్టంగా చెప్పదల్చుకున్నాను.. ప్రభుత్వాన్ని పడగొట్టాలని అనుకుంటే అది ఏనాడో చేసి ఉండేవాడిని. కానీ నేను జెంటిల్మన్‌ని అయినందున.. అక్కడ ప్రభుత్వం మనుగడ సాగి స్తోంది’’ అని చెప్పారు. ‘‘వాస్తవానికి ఈ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోదలిస్తే అది వారిష్టం.. నేను చెప్తున్నందువల్లే కాంగ్రెస్‌లో కొనసాగుతున్నామని మావాళ్లు చాలా స్పష్టంగా చెప్తున్నారు. వచ్చే 2014 ఎన్నికల్లో తాము కాంగ్రెస్ పార్టీ టికెట్లపై పోటీచేయబోమని, నా పార్టీ టిక్కెట్లపైనే పోటీచేస్తామని కూడా మావాళ్లు చెప్తున్నారు...’’ అని ఆయన వివరించారు. మరో ప్రశ్నకు బదులిస్తూ.. ఎన్‌డీఏతో కలిసే ప్రసక్తి లేదని చెప్పారు. ఉప ఎన్నికల్లో ఎక్కడినుంచి పోటీచేయనున్నారని అడగ్గా.. ‘‘కడప లోక్‌సభ స్థానం నుంచే మళ్లీ పోటీచేస్తాను’’ అని జగన్ పునరుద్ఘాటించారు. 

నే చిటికేస్తే...! సర్కార్‌ మటాష్‌...
jagan-5 
ఢిల్లీ జంతర్‌మంతర్‌ జలదీక్షతో జగన్‌ మరోసారి ఢిల్లీ నేతలకు ఇరకాటపు పరి స్థితి కల్పించారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం నాకు లేదు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు నాకు ఒక్కరోజు చాలు... కాని నేను జంటిల్‌మెన్‌ని నేనాపని చేయలేను... నాకు మద్దతు ఇస్తున్న శాసన సభ్యులు రాజీనామా చేస్తే ప్రభుత్వం కూలిపోవడం ఖాయం’’ అంటూ కడప మాజీ ఎంపీ జగన్‌ ఢిల్లీలో సంచలన ప్రకటన చేశారు. తనకు మద్దతుగా వున్న ఎమ్మెల్యేలంతా తాను ప్రారంభించబోయే రాజకీయ పార్టీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తారని ప్రకటించారు.కృష్ణా ట్రిబ్యునల్‌ తీర్పుకు నిరసనగా తన మద్దతుదారులతో జగన్‌ ఒకరోజు దీక్ష చేశారు. ఈ దీక్షలో రాష్ట్రానికి చెందిన శాసన సభ్యులు, మండలి సభ్యులు, ఇద్దరు పార్లమెంటు సభ్యులుపాల్గొన్నారు.

ఈ సందర్భంగా జగన్‌ ప్రసంగిస్తూ చంద్ర బాబు రైతుల కోసం మొసలి కన్నీరు కారుస్తున్నారని, ఆయన చేసిన నిర్వాకం కారణంగానే రాష్ట్రం అన్యాయానికి గురయిందని ధ్వజ మెత్తారు. రైతులకు ఉచితంగా కరెంటు ఇస్తానంటే కరెంటు తీగల పై బట్టలు ఆరేసుకుంటారని ఆయన ఎద్దేవా చేశారని కాని ముఖ్య మంత్రిగా వైఎస్‌ఆర్‌ బాధ్యతలు చేపట్టి ఎన్నికలలో హామీ ఇచ్చిన ట్టుగా ఉచిత కరెంటు ఇచ్చారన్నారు. చంద్రబాబు ిసీయంగా ఉన్న సమయంలో కేవలం 10 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే వైఎస్‌ఆర్‌ 40 వేల కోట్ల రూపాయలతో జలయజ్ఞం కార్యక్రమాన్ని చేపట్టారని వెల్లడించారు. సీయంగా బాధ్యతలు చేపట్టి 12 వం దల కోట్ల రూపాయల రైతురుణాలను మాఫీ చేశారన్నారు.

చంద్రబాబు హైటెక్‌ విధానాలకు ఊతమిచ్చి వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశారని తూర్పూరబోశారు. మా తండ్రిగారిని విమర్శించే నైతిక హక్కు చంద్రబాబుకు ఎక్కడుంది’’ అని ప్రశ్నించారు. మిగులు జలాలు మాకవసరం లేదని, మిగులుజలాలపై మేము ఆధారపడలేదని లేఖ రాశారని ఆరోపించారని, చంద్రబాబు ప్రాజెక్టులు నిర్మించి వుంటే ఈ లేఖ రాసే అగత్యం వుండేది కాదని స్పష్టం చేశారు. ఆ లేఖ ఇవ్వని పక్షంలో ప్రాజెక్టు నిర్మాణం జరిగేవి కావని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే మిగులు జలాలను మనం స్వేచ్చగా వాడుకోవచ్చనే ఉద్దేశ్యంతోనే లేఖ రాశారన్నారు. ఏడాదిగా వర్షాల కారణంగా రైతు వెన్నెముక విరిగిందని, ఖరీఫ్‌లో వరదల కారణంగా పంటలు మునిగిపోయాయని, తమ రాష్ట్ర రైతులకు సహాయం చేయాలని ప్రధానిని కోరేందుకు ఎన్నిమార్లు ప్రయత్నించినా ఆయన సమయం కేటాయించలేదని నిప్పులు చెరిగారు.

రాష్ట్రంలోని రైతుల విషయంలో కేంద్రం పక్షపాత ధోరణిని అవలంభించిందని ఆయన విమర్శించారు.బ్రిజేష్‌కుమార్‌ ఇచ్చిన తీర్పు కారణంగా రాష్ట్ర రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని, మా కష్టం గురించి నివేదించుకునేందుకే ఇక్కడకు వచ్చాం తప్ప, ఎవరినీ పేరుపెట్టి విమర్శించేందుకు రాలేదని ఆయన స్పష్టం చేశారు. బచావత్‌ అవార్డు ప్రకారం 75 శాతం ఉన్న జలాల వాటాను 65కు బ్రిజేష్‌ ఎందుకు తగ్గించారని ప్రశ్నించారు. నికరజలాలు అధికంగా వున్నాయనే సాకుతో 118 టిఎంసి నీళ్లు కేటాయించడం అన్యాయమన్నారు. బచావత్‌ అవార్డు కు వ్యతిరేకంగా ఎందుకు నిర్ణయం తీసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దిగువ రాష్ట్రం కనుక, వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్‌ నష్టపోతోంద ని, మిగులు జలాల మీద రాష్ట్రానికి స్వేచ్ఛ, హక్కు వుందని బచావత్‌ ప్రకటించిందన్నారు.

నీళ్లులేక అలమటిస్తున్న రైతాంగాన్ని కాదని మహారాష్టల్రో విద్యుత్‌ ప్రాజెక్టు కు 90 టిఎంసీల నీళ్లు ఇచ్చారని ఆయన విమర్శించారు. అయితే మహారాష్టక్రు కావలసిన కరెంటును మా రాష్ట్రం ఇస్తుందని, మాకు ఇవ్వవలసిన 67 టిఎంసీల నీళ్లు ఇవ్వాలని ఆయన కోరారు. పాలారు, మున్నేరు నుంచి వచ్చే 47 టిఎంసీ నీళ్లు సముద్రంలోకి కలిసిపోతున్నాయని వాటిని కూడా మిగులుజలాలకింద లెక్క కడుతున్నారన్నారు. నీటి బోర్డులు కారణంగా రాష్ట్రానికి నష్టం వాటిల్లుతోందని, ఆబోర్డులోని నిర్ణయాలపై మళ్లీ రాష్ట్రప్రభుత్వాలు న్యాయస్థానంలో సవాలు చేస్తున్నారన్నారు. ఈలోగా పుణ్యకాలం గడిచిపోతుందన్నారు. జగన్‌ దీక్షకోసం వేదికను రొటీన్‌కు భిన్నంగా ఏర్పాటు చేశారు. దీక్షలో కూర్చున్నవారందరూ బాగా కనపడే విధంగా డిజైన్‌ చేశారు.

ఢిల్లీలో గత పదిరోజులుగా పగటి ఉష్ణోగ్రతలు అతి తక్కువగా నమోదయినప్పటికీ మంగళవారం కొద్దిగా పెరిగి ఎండ వచ్చింది. దాంతో ఢిల్లీకి వచ్చిన కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం సాయంత్రం ఢిల్లీ చేరుకోవాల్సిన ప్రత్యేక రైలు మంగళవారం ఉదయం 9 గంటలకు చేరుకుంది. మాజీ ఎంఎంల్యేలు, ఎమ్మెల్యేలు, ఛోటా నాయకులు సైతం వేదిక మీదకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడ కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎన్నిమార్లు వేదిక నుంచి దిగిపొమ్మని బ్రతిమాలినా నాయకులు వేదిక నుంచి వెళ్లకపోవడంతో ఎంపీ సబ్బం హరి కలగజేసుకుని కోపంగా ‘‘మీరు మారండి’’ అంటూ విసుక్కున్నారు.జగన్‌ అభిమానులు, కార్యకర్తలు జై జగన్‌ అని రాసిన తెల్ల జెండాలతో దర్శనమిచ్చారు.జంతర్‌మంతర్‌ వద్ద సుమారు కిలోమీటరు మేరకు వైఎస్‌ఆర్‌, జగన్‌ల భారీ ఫ్లెక్స్‌లు వెలిశాయి. హిందీ, ఆంగ్లం, తెలుగు భాషల్లో రైతు రక్ష, యువత దీక్ష అని రాశారు. సబ్దర్‌జంగ్‌ రైల్వే స్టేషన్‌ నుంచి కార్యకర్తలను తరలించేందుకు 55 బస్సులను ఏర్పాటు చేశారు. జగన్‌ తొలుత జాతీయ మీడియాను ఉద్దేశించి ఆంగ్లంలో ప్రసంగించారు.

మొత్తంమీద జగన్‌ ఢిల్లీ నేతలను కదిలించారు. 24 గంటల దీక్షకు ఆయన సమాయత్తమై ఆ దిశగా కొనసాగుతుండటమే ఇందుకు నిదర్శనం. సాయంత్రం అయిదింటి వరకే అనుమతిచ్చిన జంతర్‌మంతర్‌ పోలీసులు తొలి ప్రయత్నంగా అక్కడ బలగాలను మోహరించారు. జంతర్‌మంతర్‌ ఏసీపీ స్వయంగా దీక్షా స్థలికి చేరుకుని, దీక్షను విరమింపచేసేందుకు ప్రయత్నించారు. అది సఫలం కాకపోవడంతో దీక్షా సమయాన్ని వారు గంట పొడిగించారు. అలా రెండు సార్లు గడువు పొడిగిస్తూ, చివరకు సాయంత్రం ఎనిమిదింటికల్లా ఖాళీచేసి వెళ్లిపోవాలని హుకుం జారీచేశారు.

ఈలోగా పోలీసు ఉన్నతాధికారులు హోంమంత్రిత్వశాఖతో సంప్రదింపులు జరిపారు. జగన్‌ దీక్షకు ఎలాంటి ఆటంకం కలిగించినా అది హింసకు దారితీయడం... దరిమిలా వచ్చే ప్రభుత్వ వ్యతిరేకత ప్రచారానిక కేంద్రస్థాయిలో నాయకులు సుముఖత వ్యక్తం చేసినట్లు లేదు. మొత్తంమీద పోలీసుల చర్చలతో, జగన్‌ బృందాన్ని ప్రశాంతంగా అరెస్టు చేసేందుకు మార్గం సుగమమైంది. జగన్‌ ముక్తాయింపు ప్రసంగంతో దీక్ష రాత్రి ఎనిమిది ముప్పావుకు ముగిసింది. ఢిల్లీ పోలీసు చట్టం సెక్షన్‌ 65 కింద జగన్‌ను అరెస్టు చేసి సొంత పూచి కత్తుపై ఆ తర్వాత విడుదల చేశారు.

జస్ట్‌.. జగన్‌ దయ!
jagan1 
కడప మాజీ ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ యాత్ర లక్ష్యం నెరవేరింది. కాంగ్రెస్‌ అధిష్ఠానం, ముఖ్యమంత్రి కిరణ ్‌కుమార్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ ఎమ్మెల్యేలకు గీసిన లక్ష్మణరేఖను బలవంతంగా చెరిపేసి, తన వెంట 28 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్సీలను ఢిల్లీకి తీసుకువెళ్లిన జగన్‌ కాంగ్రెస్‌పై మరోసారి నైతిక విజ యం సాధించారు. రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం పూర్తిగా తన దయా దాక్షిణ్యాలతోనే బతుకుతోందని విస్పష్టం గా చెప్పడం ద్వారా, కాంగ్రెస్‌ నాయకత్వానికి తన ప్రాధాన్య మేమిటో చెప్పారు. ఆ వ్యాఖ్య ద్వారా కాంగ్రెస్‌ అధినేత్రి సోని యాగాంధీ అహం దెబ్బతీయగలిగారు.

తనను వేధించి పార్టీ నుంచి వెళ్లిపోయేలా చేసినప్పటికీ.. కేవలం తన దయతోనే రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కారు బతుకుతోందని చెప్పి పరోక్షంగా కాంగ్రెస్‌ను రెచ్చగొట్టే వ్యూహానికి తెరలేపారు. మంగళవారం 28 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్సీలతో పాటు జడ్పీ ఛైర్మన్లు, జడ్పీటీసీల సహా కింది స్థాయి ప్రజాప్రతినిధులతో ఢిల్లీకి వెళ్లి జగన్‌ నిర్వహించిన దీక్షతో ఆయన అందరి దృష్టిని ఆకర్షించగలిగారు. ప్రధానం గా.. పార్టీ అధినేత్రి సలహాదారు అహ్మద్‌పటేల్‌, సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు డీఎస్‌ తన మద్దతుదారులయి న ఎమ్మెల్యేలను ఢిల్లీకి వెళ్లకుండా చేసిన ప్రయత్నాలను విజ యవంతంగా అధిగమించి, వారిని తన వెంట తీసుకు వెళ్లడం ద్వారా.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ నాయకత్వం గానీ, సీఎం గానీ తననేమీ చేయలేరన్న సంకేతాలు పంపించగలిగారు. అదే సమయంలో తాను కన్నెర్ర చేస్తే కిరణ్‌ సర్కారు కూలిపోతుం దన్న హెచ్చరికలను పంపించారు.

jagan 

ప్రధానంగా.. తన దయాదాక్షిణ్యాల వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో కొనసాగుతోందన్న వ్యాఖ్యలు కచ్చితంగా సోనియాగాంధీ అహం దెబ్బతీసేందుకే జగన్‌ ఆ మేరకు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు స్పష్టమవుతోంది. తన వ్యాఖ్యలతో సోనియా గాంధీ అహం దెబ్బతిని, ఒక జూనియర్‌ ఎంపీ దయ వల్ల తన పార్టీ ప్రభుత్వం మనుగడ సాగుతోందని ప్రజలు భావించే కన్నా, రాష్ర్టపతి పాలన విధించడమే ఉత్తమ మన్న ఆలోచన కలిగించడం కూడా జగన్‌ వ్యాఖ్యల వెనుక అంతరార్థంగా స్పష్టమవుతోంది. రాష్టప్రతి పాలన విధించడం ద్వారా కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని మరింత అప్రతిష్ఠ పాలు చేయ డమే జగన్‌ అసలు లక్ష్యం. జగన్‌ దయ మీద కాంగ్రెస్‌ ప్రభు త్వం ఆధారపడి బతుకుతోందన్న భావన ప్రజల్లో విస్తృతం కావడాన్ని వ్యక్తిగతంగా సోనియా కూడా జీర్ణించుకోలేరని గ్రహించిన తర్వాతే జగన్‌ ఆ విధంగా రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని అర్థమవుతూనే ఉంది.

అందలో భాగంగానే కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వాన్ని రెచ్చ గొట్టేందుకే జగన్‌ 27 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలతో ఢిల్లీకి వెళ్లినట్లు స్పష్టమవుతోంది. తన వెంట వచ్చిన ఎమ్మె ల్యేలు, ఎంపీలను దమ్ముంటే సస్పెండ్‌ చేయాలని జగన్‌ ప్రత్య క్షంగా నాయకత్వానికి సవాల్‌ విసిరారు. ప్రజాప్రతినిధులను ఢిల్లీకి తీసుకు వెళ్లి, ఢిల్లీ నాయకత్వానికే సవాల్‌ విసరడం ద్వారా రాష్ట్రంలోని యువత దృష్టిలో మరోసారి హీరోగా ము ద్ర వేసుకోవాలన్న జగన్‌ వ్యూహం ఫలించినట్లు మంగళ వా రం నాటి పరిణా మాలు స్పష్ట ం చేశాయి.మరోవైపు..

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ‘ఎమ్మెల్యే లపై పట్టులేని అసమర్థ సీఎంగా’ అధిష్ఠానం ముందు నిలప డంలో జగన్‌ విజయం సాధించారని పార్టీ వర్గాలు విశ్లేషిస్తు న్నాయి. సీఎం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎమ్మెల్యేలను ఢిల్లీకి వెళ్లకుండా నివారించడంలో విఫలమయ్యారన్న సంకేతాలు పంపించడం ద్వారా..సీఎంకు పార్టీ ఎమ్మెల్యేల లోనే పలుకు బడి లేదని, ఆయన మాట వినేవారు లేరని, చెప్పినా మాట వినకుండా జగన్‌తో వెళ్లారని క్షేత్రస్థాయిలో చర్చలకు తెర లేపాలన్న లక్ష్యం కూడా తన ఢిల్లీ యాత్రతో నెరవేరింది.
జగన్‌ దీక్షకు హాజరైన వారు వీరే

1) జయసుధ (సికింద్రాబాద్‌)
2)  గుర్నాథరెడ్డి (అనంతపురం అర్బన్‌)
3)  కమలమ్మ ( బద్వేలు)
4)  కె.శ్రీనివాసులు  (రైల్వేకోడూరు)
5)  నీరజారెడ్డి (ఆలూరు)
6)  శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి)
7)  రామచంద్రారెడ్డి (రాయదుర్గం)
8)  మేకపాటి చంద్రశేఖరరెడ్డి (ఉదయగిరి)
9)  బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు)
10) ఆళ్ల నాని (ఏలూరు)
11)  అమర్‌నాథ్‌రెడ్డి (రాజం పేట)
12) శేషారెడ్డి (అనపర్తి)
13)  కొండా సురేఖ (పరకాల)
14)  పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ (రామచంద్రాపురం)
15)  రేగా కాంతారావు (పినపాక)
16) కుంజా సత్యవతి (భద్రాచలం)
17) ఆదినారాయణరెడ్డి(జమ్మలమడుగు)
18) బాబూరావు (పాయకరావు పేట)
19) రామకృష్ణారెడ్డి (మాచర్ల)
20) శివప్రసాదరెడ్డి (దర్శి)
21) ప్రసాదరాజు (నర్సపురం)
22) బాలరాజు (పోలవరం)
23) కాటసాని రామిరెడ్డి (బనగానపల్లి పీఆర్పీ)
24) శోభా నాగిరెడ్డి (ఆళ్లగడ్డ, పీఆర్పీ)
25) నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి (టీడీపీ)-(కోవూరు)
26)  బాలనాగిరెడ్డి (మంత్రాలయం-టీడీపీ)
27)  లబ్బి వెంకటస్వామి (నందికొట్కూరు)
28)  సుచరిత (పత్తిపాడు)
ఎంపీలు
1) మేకపాటి రాజమోహన్‌రెడ్డి (నెల్లూరు)
2) సబ్బం హరి (అనకాపల్లి)
ఎమ్మెల్సీలు
1) జూపూడి ప్రభాకర్‌రావు
2) పుల్లా పద్మావతి
3) కొండా మురళి
4) కృష్ణారెడ్డి

No comments:

Post a Comment