Tuesday, February 22, 2011

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సిద్ధం

YSR-SMILEదివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశే ఖరరెడ్డి తనయుడు, కడప మాజీ ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సొంత పార్టీ స్థాపన ప్రక్రియ ఊపందుకుంది. ఎన్నికల సంఘం వద్ద కొత్త పార్టీ పేరు నమోదు వ్యవ హారాన్ని జగన్‌ వర్గీయులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. సోమవారం డిల్లీకి వెళ్లిన వైఎస్‌ బంధువు వైవి సుబ్బారెడ్డి, తొలుత వైఎస్‌ఆర్‌ పార్టీని నమోదు చేసిన కొలిశెట్టి శివకుమార్‌ ఎన్నికల సంఘాన్ని కలిశారు. గత వారమే దరఖాస్తు సమర్పిం చిన వీరు, సోమవారం తమ పార్టీ కమిటీ జాబితాను కూడా సమర్పించారు.

వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి జాతీయ అధ్యక్షు డిగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ (వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌) ఏర్పాటయింది. మొత్తం ఏడుగురు కమిటీ సభ్యులుగా ఈ పార్టీని ఏర్పాటుచేశారు. ఉపాధ్యక్షుడిగా కొలిశెట్టి శివకుమార్‌ ఎన్నికయ్యారు. ఈ పార్టీని తొలుత ఎన్నికల సంఘం వద్ద నమోదు చేసింది శివకుమారే కావడం గమనా ర్హం. ప్రధాన కార్యదర్శిగా బాజిరెడ్డి గోవర్దన్‌, కోశాధికారిగా ఆర్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి, సహా య కార్యదర్శిగా రహ్మాన్‌, కార్యనిర్వ హక కార్యదర్శిగా పుల్లా భాస్కర్‌, ప్రచార కార్యదర్శిగా జంగా కృష్ణమూర్తి, మహిళా విభాగం కార్యదర్శిగా కొల్లి నిర్మలాకుమారి ఎంపి కయ్యారు.

వీరిలో కిరణ్‌కుమార్‌రెడ్డి గతం లోవైఎస్‌ ఉండగా పీఎస్‌ హోదాలో ఆరోగ్య శ్రీ విభాగాన్ని పర్యవేక్షించేవారు. ఈ జాబితా ను ఎన్నికల సంఘానికి సమర్పించిన నేప థ్యంలో దానికి సంబంధించిన అనుమతి వ్యవహారాలు రెండువారాల్లో వస్తాయని ఆశిస్తున్నారు. ఇదిలాఉండగా.. ఉగాది రోజున వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని ఇడుపుల పాయలో ప్రకటించనున్నట్లు సమాచారం. నిజానికి మూడు, నాలుగు తేదీలు అనుకు న్నప్పటికీ ఏప్రిల్‌ 4న ఉగాది పర్వదినం ఉన్నందున అదేరోజు పార్టీ ప్రకటన అధికా రికంగా చేయవచ్చంటున్నారు.ఈలోగా.. జిల్లా పర్యటనలు నిర్వహించి, జిల్లా కమి టీలు ఎంపిక చేసుకునే పనిలో జగన్‌ వర్గీ యులు బిజీగా ఉన్నారు. జగన్‌ పార్టీకి చెం దిన సీనియర్‌ నేత గట్టు రామచంద్రరావు ఇప్పటికే జిల్లా పర్యటనలు చేస్తూ ఇతర పార్టీలకు చెందిన నేతలను తమ పార్టీలోకి తీసుకువచ్చే పనిలో ఉన్నారు. జిల్లా కమిటీ నాయకుల పేర్లను ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. పార్టీ ప్రకటించిన తర్వాత ఆ జాబితాను విడుదల చేయనున్నట్లు సమా చారం.

కాబోయే సీఎం జగన్‌
KOLISETTరాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాబోయే ముఖ్యమంత్రి జగ న్‌ అని వైస్సార్‌ కాంగ్రెస్‌ను నమోదు చేసి, ఇప్పుడు అదే పార్టీకి ఉపాధ్యక్షుడిగా ఉన్న కొలిశెట్టి శివకుమార్‌ స్పష్టం చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధికారంలోకి రావటం ఖాయమని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సత్తా చూపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోందని, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ కార్యకర్తలు, నేతలు అంతా వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ను అధికారికంగా ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి తమిళనాడు, బీహార్‌కంటే అధ్వానంగా మారబోతోందని జోస్యం చెప్పారు. తమ పార్టీ బడుగు బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని, అందుకు తాము ఎన్నికల సంఘానికి ఇచ్చిన కమిటీనే నిదర్శనమని శివకుమార్‌ వ్యాఖ్యానించారు.

No comments:

Post a Comment