Sunday, February 20, 2011

రెండోరోజూ హోరెత్తిన ఫీజు పోరు * '' జై జగన్ '' నినాదాలతో మార్మోగిన ధర్నాచౌక్


రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన నేతలు
జగన్ దీక్షకు అందరూ మద్దతివ్వాలి: ఎమ్మెల్యే సీకే బాబు
ఫీజులివ్వకపోతే మట్టిగొట్టుకుపోతారు: ఆర్.కృష్ణయ్య



యువనేతకు మద్దతుగా వెల్లువలా తరలి వచ్చిన విద్యార్థిలోకంజైజగన్ నినాదాలతో హోరెత్తిన ధర్నాచౌక్
ఫీజు పోరుకు మరో ముగ్గురు ఎమ్మెల్యేల మద్దతు
సంఘీభావంగా రోజంతా న్యాయవాదుల నిరాహార దీక్ష
రాష్ట్రం నలుమూలల నుంచీ తరలివచ్చిన నేతలు, ప్రజలు
వైద్య పరీక్షలను సున్నితంగా తిరస్కరించిన జగన్



బాధ పెరిగితే ఆవేదనవుతుంది.. అది పెరిగి ఆగ్రహమై.. ఉద్యమమై.. ఉప్పెనై పోటెత్తుతుంది. రాష్ట్రంలో ఇప్పుడదే జరుగుతోంది.. ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలు చెల్లించని సర్కారుపై విద్యార్థి లోకం కన్నెర్ర చేస్తోంది. తమ తరఫున పోరాడుతూ ‘ఫీజు పోరు’ పేరుతో నిరాహార దీక్ష చేపట్టిన వైఎస్ జగన్‌కు సంఘీభావంగా ఉవ్వెత్తున తరలివస్తోంది. శనివారం యువనేత నిరాహారదీక్ష రెండో రోజుకు చేరగా.. ఆయనకు మద్దతుగా రాష్ట్రం నలుమూలల నుంచీ వచ్చిన విద్యార్థులు, డాక్టర్లు, లాయర్లు, యువ నాయకులు, పారిశ్రామికవేత్తలతో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్ దద్దరిల్లింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన 50 మంది న్యాయవాదులు జగన్‌కు మద్దతుగా శనివారమంతా దీక్షలో పాల్గొన్నారు.


ఐదు గంటలకే మొదలు
సంఘీభావంగా రోజంతా న్యాయవాదుల నిరాహార దీక్ష




మొదటి రోజు శుక్రవారం ఫీజు పోరుకు నిరంతరాయంగా తరలివచ్చిన విద్యార్థులు, అభిమానులను కలిసిన జగన్ రాత్రి తొమ్మిదిన్నర గంటలకు నిద్రకు ఉపక్రమించి శనివారం ఉదయం ఐదు గంటలకే మేల్కొన్నారు. దినపత్రికలను చదివిన తర్వాత ఏడు గంటల సమయంలో దీక్షావేదికపైకి చేరుకున్నారు. పదిగంటల వరకు నిరాటంకంగా తనను కలిసేందుకు వచ్చిన వారిని పలుకరించారు. ఇం దిరాపార్క్‌కు వచ్చే వాకర్స్ జగన్‌తో చేయి కలపాలని ఆత్రుత కనబరిచారు. అంతకుముందు జగన్ మాతృమూర్తి వైఎస్ విజయలక్ష్మమ్మ, సతీమణి వైఎస్ భారతి యువనేతను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా విజయమ్మ ప్రజలకు అభివాదం చేయడంతో వైఎస్సార్ అమర్హ్రే, జగన్ జిందాబాద్ అన్న నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగిపోయింది.
సర్కారుపై బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ధ్వజం
రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నిర్లక్ష్యం చేస్తే సహించం
పద్ధతి మార్చుకోకుంటే... రోశయ్యకు పట్టిన గతే కిరణ్‌కూ..
ఇప్పుడు ఫీజులు లేవంటారు... తర్వాత రేషన్‌బియ్యం, పింఛన్లకూ మొండిచేయి
                                                మట్టిగొట్టుకుపోతారు...




  ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నాశనం చేయాలని ప్రయత్నించిన ముఖ్యమంత్రులు మట్టిగొట్టుకుపోతారని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ‘ఫీజు పోరు’ దీక్షా శిబిరాన్ని శనివారం ఆయన సందర్శించి యువనేత జగన్‌కు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి కృష్ణయ్య మాట్లాడారు. రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ముట్టుకొన్న రోశయ్యకు పట్టిన గతే.. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికీ పడుతుందని జోస్యం చెప్పారు. గుడిసెలో పుట్టిన వారు కూడా ఇంజనీరింగ్, డాక్టర్ కోర్సులు చదవాలనే లక్ష్యంతో వైఎస్ రీయింబర్స్‌మెంట్ పథకం ప్రవేశపెట్టారని, ఆయన ఉన్నంతకాలం నిధులకు ఎలాంటి కొరత రాలేదని అన్నారు. ధైర్య సాహసాలతో ముందుకొచ్చి విద్యార్థుల కోసం జగన్ చేస్తున్న పోరాటానికి విద్యార్థిలోకం మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్‌లో ఆయన చేసే పోరాటాలకు వెన్నంటి ఉంటామని ప్రకటించారు.
సీఎం పదవి జాక్‌పాట్..: కాంగ్రెస్‌లో సీఎం పదవి జాక్‌పాట్‌గా మారిందని కృష్ణయ్య వ్యాఖ్యానించారు. కష్టపడినవారు, ప్రజల కష్టాలు తెలిసిన వారు ముఖ్యమంత్రిగా రావాలని ఆకాంక్షించారు. వైఎస్‌కు ప్రజల కష్టాలు తెలుసని, అందుకే పావలావడ్డీ, రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ.. ఇలా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో ఇప్పుడు 100 మంది ఎమ్మెల్యేలే మిగిలారని, వారంతా సీఎం పదవి కోసమే ఎదురుచూస్తున్నారన్నారు. మంత్రులు, సీఎం.. ఢిల్లీకి తిరి గి తిరిగి విమానయాన సంస్థల ఆదాయం పెంచడం మినహా సాధించింది ఏమీలేదని ఎద్దేవా చేశారు.


రచ్చబండకు నిధులెక్కడివి?: ముఖ్యమంత్రి ముఖం, పేరు ప్రజలకు తెలియదని.. అందుకే పోస్టర్లు, ఫ్లెక్సీల కోసం రచ్చబండలో రూ. 2,800 కోట్లు ఖర్చు చేశారని కృష్ణయ్య ఆరోపించారు. బడ్జెట్‌లో లేని రచ్చబండకు నిధులు ఇచ్చిన ప్రభుత్వం.. పేద, బడుగు విద్యార్థుల ఫీజులకు నిధులు లేవని చెప్పడానికి సిగ్గుండాలని నిలదీశారు. ఫీజులివ్వడం చేతగాని ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత ఏమాత్రం లేదన్నారు. ఇప్పుడు ఫీజులకు నిధుల్లేవంటారని, తర్వాత రేషన్ బియ్యం, పింఛన్లు కూడా లేవంటారని, ఉచిత విద్యుత్ ఇవ్వడం చేతకాదంటారని అనుమానం వ్యక్తంచేశారు. ప్రజల పన్నులు దోచుకొని తినడం తప్ప ఇప్పటి మంత్రులకు మరే మీ తెలియదని ఎద్దేవా చేశారు. వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలను కాపాడుకోవడానికి ప్రజలంతా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. బడ్జెట్ లేదంటూ కాక మ్మ కథలు చెప్పకుండా.. తక్షణం నిధులు విడుదల చేయాలని డిమాండు చేశారు. ప్రభుత్వ రాబడి 30-35% పెరిగిందని, అయినా నిధులు లేవని చెప్పడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. పేరు కు రూ. 1000 కోట్లు ఇచ్చామని ప్రభుత్వం చెబుతోం దని, నిజానికి ఇచ్చింది రూ. 150 కోట్లేనని చెప్పారు.


మెస్‌చార్జీల పెంపు ఎప్పుడు: మెస్ ఛార్జీలు పెంచడానికి వీలుగా ఫైల్ సర్క్యులేట్ చేయమని వైఎస్ ఆదేశాలు జారీ చేసిన.. కొద్ది రోజుల్లోనే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారని గుర్తుచేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మెస్ చార్జీల పెంపు ఆలోచనే సర్కారు చేయలేకపోతోందన్నారు. డిగ్రీ చదివే విద్యార్థికి నెలకు రూ.520 ఇస్తున్నారని, పూటకు రూ. 5.77తో భోజనం పెట్టడం ఎలా సాధ్యమని ప్రశ్నిం చారు. ఖైదీలు, రోగులకు ఇస్తున్న స్థాయిలో కూడా విద్యార్థులకు మెస్ చార్జీలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. వైఎస్ ఉన్నప్పుడు రోజుకొక ఉద్యోగ నియామక ప్రకటన వెలువడేదని, ఇప్పుడు వివిధ శాఖల్లో 4 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి అంటే రాజశేఖరరెడ్డి మాదిరి ఆదర్శంగా ఉండాలన్నారు. రోజుకు కనీసం వెయ్యి మందితో ప్రజా దర్బారు నిర్వహించేవారని, ప్రతి వినతిపత్రం చదివేవారని గుర్తు చేశారు. వైఎస్‌ను చూసే కాంగ్రెస్‌కు ప్రజలు పట్టం కట్టారని, కానీ ఆయన ప్రవేశపెట్టిన పథకాలను తుంగలో తొక్కిన ప్రస్తుత సర్కారు కు ప్రజామోదం లేదన్నారు. ప్రజల ఇళ్లలోనే కాదు ప్రజలందరి గుండెల్లో వైఎస్ ఉన్నారని చెప్పారు.


యువనేతతోపాటే నేతలు, అభిమానులు


శుక్రవారం రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వందలాది మంది అభిమానులు, నేతలు జగన్‌తో పాటు వేదిక వద్దనే నేలపై పడుకున్నారు. జగన్‌తోపాటు నెల్లూరు డీసీసీ మాజీ అధ్యక్షుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా జగన్ వర్గం నేతలు కొండా రాఘవరెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్ వేదికపైనే పడుకున్నారు. శనివారం వేదికపై వైఎస్ చిత్రపటానికి బదులుగా ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
దీక్షకు అందరూ మద్దతు తెలపాల్సిందే: సీకే బాబు
యువనేతను కలిసి మద్దతు ప్రకటించిన చిత్తూరు ఎమ్మెల్యే
పేద విద్యార్థులకు న్యాయం జరిగేలా వారిలో మానసిక స్థైర్యాన్ని కలిగించేందుకు యువనేత జగన్ చేపట్టిన పోరాటానికి అందరూ మద్దతు తెలపాల్సిందేనని చిత్తూరు ఎమ్మెల్యే సీకే బాబు అన్నారు. జగన్ చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపేందుకు ఆయన శనివారం దీక్షా శిబిరానికి వచ్చారు. వేదికపై చాలాసేపు కూర్చున్న ఆయన జగన్‌తో మంతనాలు జరిపారు. అనంతరం దీక్షాస్థలి నుంచి వెళ్లిపోయే సమయంలో మీడియాతో మాట్లాడుతూ విద్యా ర్థి సమస్యలను పరిష్కరించాలనే జగన్ ఈ దీక్ష చేపట్టారని, దీనికి రాజకీయాలకతీతంగా అందరూ మద్దతు పలకాలని అన్నారు. ఈ బాధ్యత నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలపైనే కాకుండా అందరిపై ఉందని వ్యాఖ్యానించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో జరిగిన ఘటనలు దురదృష్టకరమని అన్నారు.


ఏదైనా ఉంటే నేనే చెపుతా: కాంగ్రెస్ నుంచి జగన్ దూరమైన తర్వాత చిత్తూరు ఎమ్మెల్యే సీకే బాబు తొలిసారి ఆయనకు బహిరంగంగా మద్దతు ప్రకటించారు. జగన్‌వైపు వెళ్లకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సీఎం కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారట కదా అని సీకే బాబును ప్రశ్నించగా ‘నన్ను నియంత్రించే స్థాయిలో ఎవ రూ లేరు. అయినా ఒకరు నియంత్రిస్తే వినేవాడిని నేను కాదు’ అని వ్యాఖ్యానిం చారు. జగన్ వర్గంలో చేరిపోయారా అని ప్రశ్నించగా తానిప్పుడేమీ మాట్లాడనని, కొంత సమయం ఉందని, ఏదైనా ఉంటే మీడియాను పిలిచి తానే మాట్లాడతానని చెప్పారు. జగన్ గతంలో కూడా అనేక దీక్షలు చేశారు.. ఎప్పుడూ రానిది ఇప్పుడు మద్దతు ఎందుకు తెలపాల్సి వచ్చిందన్న ప్రశ్నకు తాను బయటకు వచ్చే దే తక్కువని, హైదరాబాద్‌కు చాలా తక్కువగా వస్తానని, మీడియాతో ఇంతసేపు మాట్లాడడం తన 25 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇదే ప్రథమమని సమాధానమిచ్చారు. వైఎస్ చేపట్టిన పథకాలను నిర్వీర్యం చేస్తున్నారని భావిస్తున్నారా అన్న ప్రశ్నకు మొదటిరోజే తాను వివాదాస్పద వ్యాఖ్యలు చేయదల్చుకోలేదన్నారు.
తరలివచ్చిన ప్రజాప్రతినిధులు


జగన్ చేపట్టిన దీక్షకు రెండోరోజు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. కుంజా సత్యవతి(భద్రాచలం), మేకతోటి సుచరిత(పత్తిపాడు), సి.కె.బాబు(చిత్తూరు) దీక్షాస్థలికి వచ్చి యువనేతకు మద్దతు ప్రకటించారు. తొలిరోజే మద్దతు తెలిపి దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, జయసుధ, శోభా నాగిరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, గుర్నాథరెడ్డి, గొల్ల బాబూరావు, శ్రీనివాసులుతో పాటు ఎమ్మెల్సీలు కొండా మురళి, జూపూడి ప్రభాకర్‌రావు రెండోరోజు కూడా హాజరయ్యారు. ఏపీఐఐసీ మాజీ చైర్మన్ అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యేలు జంగా కృష్ణమూర్తి, గోనె ప్రకాశరావు, బాజిరెడ్డి గోవర్దన్, రఘురామిరెడ్డి, రమేష్‌బాబు, మాజీ మంత్రి మారెప్పలతో పాటు నాయకులు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, గట్టు రామచంద్రరావు, రెహమాన్, ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి, సినీ నటి రోజా, రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం ఉపాధ్యక్షుడు పిల్లి వెంకటసత్తిరాజు, హైదరాబాద్ నగర కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి జయస్వామి, విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల, ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు పోసాని కృష్ణ మురళి, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ దేవులపల్లి అమర్, ఈబీసీ సంఘం అధ్యక్షుడు వల్లపురెడ్డి రవీంద్రరెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి పి.ప్రభాకర్, మహబూబ్‌నగర్ గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు ఆర్.రవీందర్ రెడ్డి, పీసీసీ ఎస్సీ సెల్ మాజీ కార్యదర్శి రాచమల్ల సిద్ధేశ్వర్, పీసీసీ మాజీ కార్యదర్శి కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, వైఎస్‌ఆర్ జిల్లా బద్వేల్ మాజీ ఎమ్మెల్యే డీసీ గోవిందరెడ్డి, కలసపాడు జెడ్పీటీసీ సభ్యుడు దాదన భూపాల్ రెడ్డి, బద్వేల్ యువ నాయకులు లెక్కల విజయ భాస్కర్ రెడ్డి తది తరులు దీక్షా శిబిరానికి వచ్చి మద్దతు ప్రకటించారు. బీసీ సం క్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య వెంట పలువురు బీసీ నేతలు తరలివచ్చారు. కరీంనగర్ జిల్లా నుంచి జగన్ వర్గం నాయకుడు అన్నం శశిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో నాయకులు, అభిమానులు వచ్చి జగన్‌ను కలిశారు.


జగన్‌తో కలిసి న్యాయవాదుల దీక్ష


శనివారం పలువురు న్యాయవాదులు యువనేతతో పాటు నిరాహార దీక్ష చేశారు. అయితే సాయంత్రం వారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు గాయత్రి, లింగయ్య యాదవ్, నాగిరెడ్డి, అనిత, బుచ్చిబాబు, కోటిరెడ్డి, ఆజాద్, సి.నాగేశ్వరరావు, జయరాం నాయక్ తదితరులు మాట్లాడారు. ప్రజల కష్టాలు పట్టించుకోని ప్రభుత్వం దిగిపోవాల్సిందేనని ముక్తకంఠంతో డిమాండు చేశారు.


పర్యాటకశాఖ ఉద్యోగుల సంఘీభావం


జగన్ దీక్షకు పర్యాటక శాఖ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం మద్దతు ప్రకటించింది. శనివారం వరలక్ష్మి దీక్షా ప్రాంగణానికి వచ్చిన ఉద్యోగులు జగన్‌ను కలసి సంఘీభావం తెలిపారు. యువనేతను కలిసిన వారిలో సంఘం ప్రధాన కార్యదర్శి రాజమౌళి, ఉపాధ్యక్షులు శ్రీను, ప్రకాశ్, కోశాధికారి వీరారెడ్డి తదితరులున్నారు.


ఉద్వేగంగా సాగిన వంగపండు ఉష పాటలు


‘‘చీమలన్నీ ఏకమైతే.. పాము ఒకటి ఎంతైతే, సింహాలై గర్జిద్దాం.. ప్రభుత్వాన్ని కూల్చేద్దాం, జమకు జమ.. జనదండు’’ అంటూ ప్రజా గాయకురాలు వంగపండు ఉష ప్రభుత్వ విధానాలపై గర్జించారు. ఫీజుపోరుకు మద్దతునిస్తూ ఉష తన సంఘీభావాన్ని ప్రకటించారు. ప్రభుత్వం అవలంబిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలపై పాటల రూపంలో అస్ర్తాలను సంధించారు.


నేను ఆరోగ్యంగానే ఉన్నాను: జగన్


పోలీసుల సూచన మేరకు జగన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు డాక్టర్ రవి నేతృత్వంలో గాంధీ ఆస్పత్రి వైద్య బృందం శనివారం రాత్రి 9.15 గంటలకు దీక్షా శిబిరానికి వచ్చింది. అయితే తాను ఆరోగ్యంగా ఉన్నానని, ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పి జగన్ వైద్య పరీక్షలను సున్నితంగా తిరస్కరించారు. దీంతో రేపు వస్తామంటూ వైద్య బృందం తిరిగి వెళ్లింది.
ఎప్పుడు ఎన్నికలొచ్చినా జగన్ పార్టీకి 222 సీట్లు  ఈ క్షణం ఎన్నికలు వచ్చినా జగన్ పార్టీ 222 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇతర పార్టీలకు గుణపాఠం చెప్పి జగన్‌ను సీఎం చేసేందుకు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ప్రజానీకం ఎదురుచూస్తోందన్నారు. ఫీజు పోరు దీక్షాశిబిరం వద్ద ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ఇటీవలి సర్వేల్లో జగన్ పార్టీకి 154 స్థానాలు వస్తాయని వెల్లడైందని, అయితే 154 కాకుండా 222 సీట్లు రావ డం, జగన్ సీఎం కావడం ఖాయమన్నారు. వైఎస్ వారసులం తామేనని కాంగ్రెస్ నేత లు చెప్పుకుంటున్నా వైఎస్‌కు అసలైన వారసుడు, కోహినూర్ వజ్రం జగనేనని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారన్నారు. తామే అధికారంలోకి వస్తామని టీడీపీ నేతలు అంటున్నారు కదా అని ప్రశ్నించగా చంద్రబాబుకు రాజకీయ భవిష్యత్తే లేదని నల్లపురెడ్డి కొట్టిపారేశారు. 2004, 09ల్లో ప్రజలు ఆయన్ను నమ్మలేదని, బాబు ఇక ఇంట్లో కూర్చోవాల్సిందే తప్ప సీఎం అయ్యే అవకాశమే లేదన్నారు. ఎవరు ఎన్ని డ్రామాలు వేసినా కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో జగన్, విజయమ్మ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ జగన్ పార్టీకి పోటీయే కాదని, ఆయన దరిదాపుల్లోకి కూడా ఎవరూ రానివిధంగా జయకేతనం ఎగురవేస్తామని చెప్పారు.


దేనికైనా మేం సిద్ధం:  వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదప్రజలకు సంజీవనిలా ఉపయోగపడ్డాయని, అలాంటి పథకాలను ఈ ప్రభుత్వం తుంగలో తొక్కాలని ప్రయత్నిస్తోందని నల్లపరెడ్డి ఆరోపించారు. వైఎస్ మానసపుత్రిక అయిన రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలుచేయకుండా విద్యార్థులతో పెట్టుకుంటోందని, విద్యార్థులతో చెలగాటమాడితే ఏ ప్రభుత్వమైనా కూలిపోక తప్పదని వ్యాఖ్యానించారు. రైతులు, విద్యార్థులను పట్టించుకోలేని ఈ ప్రభుత్వ మనుగడ అసాధ్యమన్నారు. ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నిస్తారా అని ప్రశ్నించగా ‘సంక్షేమ పథకాలను అమలు చేయకపోతే ప్రభుత్వం ఏ క్షణమైనా కూలిపోవచ్చు. రాష్టప్రతి పాలన కూడా వచ్చే అవకాశముంది. దేనినైనా ఎదుర్కొని ప్రజల్లోకి వెళ్లేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’ అని ఆయన అన్నారు.


జగన్ దీక్ష గర్వకారణం:అంబటి రాంబాబు
 
లక్షలాది విద్యార్థుల సమస్య పరిష్కారానికి యువనేత జగన్ అకుంఠిత దీక్షతో ఏడు రోజుల పాటు నిరాహార దీక్షకు పూనుకోవడంపట్ల తమకెంతో గర్వంగా ఉందని పీసీసీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు అన్నారు. యువ నేత దీక్షా శిబిరం వద్ద శనివారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ శుక్రవారం దీక్ష ప్రారంభించిన జగన్ మంచి నీళ్లు మాత్రమే తీసుకుంటున్నారని చెప్పారు. 24వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ జగన్ ఇదే విధంగా నిరశనను కొనసాగిస్తారని స్పష్టం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పాదయాత్ర ప్రకటించినప్పుడు కూడా దారి పొడవునా వైఎస్ నడిచే వెళతారా, లేక మధ్యలో అక్కడక్కడా వాహనంపై వెళతారా అని సామాన్య ప్రజలు ప్రశ్నించారని, ఆయన ఐదారు రోజులపాటు ఏకబిగిన నడిచినప్పుడు వైఎస్‌ది పూర్తిగా పాదయాత్రేనని వారికి అర్థమయిందని తెలిపారు.


ఇప్పుడు కూడా జగన్ ప్రతి రోజూ సాయంత్రం దీక్షను విరమించి మళ్లీ ఉదయాన్నే ప్రారంభిస్తున్నారనే అపోహలు ఉన్నాయని, అయితే ముందు ప్రకటించిన విధంగా విద్యార్థుల కోసం యువ నేత పట్టుదలతో వారం రోజులూ నిరాహార దీక్ష చేస్తారని చెప్పారు. రెండు రోజుల నిరాహార దీక్ష ఫలితంగా శనివారానికి జగన్ బరువు కొంత తగ్గారని తెలిపారు. జగన్‌కు మద్దతుగా రోజుకొక వర్గం ప్రతినిధులు దీక్షలో కూర్చుంటారని వివరించారు. శనివారం న్యాయవాదులు దీక్షలో పాల్గొన్నారని, ఆదివారం ఉస్మానియా, నాగార్జున, ఆంధ్రా విశ్వవిద్యాలయాల విద్యార్థులు కూర్చోబోతున్నారని ప్రకటించారు.


వైఎస్ పేరెత్తే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదు


మహానేత చేపట్టిన పథకాలను అమలుపర్చలేని కాంగ్రెస్ నేతలకు ఆయన పేరెత్తే హక్కు లేదు. కాంగ్రెస్ నేత లు చేసిన తప్పులకు శిక్ష అనుభవించే రోజు దగ్గర్లోనే ఉంది. వైఎస్ తమ దేవుడని చెప్పుకుంటున్న ఆ నేతలు ఆయన ద్వారా సంక్రమించిన అధికారాన్ని అనుభవిస్తున్నా రు కానీ ఆయన పథకాల అమలు బాధ్యత వారికి లేదా?- రోజా, సినీ నటి


జగన్ పోరాటంతో బడుగులకు న్యాయం


జగన్ సాహసోపేత నాయకుడు. ఆయన చేస్తున్న పోరాటం బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేస్తుంది. ప్రభుత్వంలో అధికారం వెలగబెడుతున్న బీసీ నేతలు.. బీసీ సంక్షేమాన్ని పట్టించుకోకుండా పదవులు పట్టుకొని వేలాడుతున్నారు. కావూరి, పురందేశ్వరి లాంటి నాయకులు.. విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని గురించి ఎందుకు మాట్లాడరు? విద్యార్థులు, పేదలు, బడుగుల కంటే.. వారికి పదవులే ముఖ్యం.
- తాడి శకుంతల, విజయవాడ మాజీ మేయర్

No comments:

Post a Comment