Friday, February 11, 2011

పోలవరం మీరు కట్టలేరా?

 
హరిత యాత్ర ముగింపు సభలో యువనేత జగన్ సూటి ప్రశ్న
పోలవరం కట్టకుండా సాకులెందుకు?
కేంద్రం దయపై బతుకుతున్నామా?
32 మంది ఎంపీలున్నా అడుక్కోవాలా?
పోలవరం నాలుగు జిల్లాలకేపరిమితమన్నవారు మూర్ఖులే
వెంటనే పోలవరం, ప్రాణహిత-చేవెళ్లకు టెండర్లు పిలవండి.. లేదంటే ఆందోళనే

దివంగత రాజశేఖరరెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్లిపోయాక ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టువైపు కన్నెత్తి చూడలేదు. ఎంత సేపు కేంద్ర ప్రభుత్వం ఏదో చేయాలి.. కేంద్ర ప్రభుత్వం ఏదో చేస్తేనే మనం ఈప్రాజెక్టును చేయగలుగుతాం.. చేస్తామని చెప్పి సాకులు చూపిస్తున్నారు.. కేంద్రం దయాదాక్షిణ్యాల మీద మనం బతుకుతున్నట్టుగా.. వాళ్ల దగ్గరికి పోయి కాళ్లావేళ్లా పడే పరిస్థితిలో రాష్ట్రం ఉందన్నట్టుగా చెబుతున్నారు.

మనిషి అన్నాక.. పదవిలో ఉన్నప్పుడు ఒకతీరుగా.. పదవిలో లేనప్పుడు ఒకరకంగా ఉండడం సరైన పద్ధతి కాదు. మైకులు పట్టుకుని చంద్రబాబు గారు రైతుల గురించి ప్రేమ ఒలకబోస్తూ చెప్పే మాటలను చూసి ఈ మాటలంటున్నా. 9 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఆరోజే పోలవరం కట్టి ఉంటే, కనీసం ఆలోచన చేసి ఉంటే.. ఈ సరికే ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి ఉండేది.

- హరిత యాత్ర ముగింపు సభలో జగన్

కేంద్ర ప్రభుత్వం సాయం చేయకుంటే పోలవరం ప్రాజెక్టు మీరు కట్టలేరా అంటూ రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనంపై యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్ చూపిన బాటలో ప్రాజెక్టు నిర్మించకుండా సాకులు చూపుతున్నారని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద బతుకుతున్నట్టుగా, వారి కాళ్లా వేళ్లా పడే పరిస్థితుల్లో ఉన్నట్టుగా పాలకులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులకు టెండర్లు పిలవాలని, లేదంటే కృష్ణా జలాలపై ట్రిబ్యునల్ తీర్పు నేపథ్యంలో రాష్ట్రం ఎడారిగా మారే ప్రమాదం ఉందని జగన్ ఆందోళన వ్యక్తంచేశారు. పోలవరం ప్రాజెక్టును త్వరగా నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఉభయ గోదావరి జిల్లాల్లో ‘హరిత యాత్ర’ పేరుతో జగన్ చేపట్టిన పాదయాత్ర గురువారం ప్రాజెక్టు స్థలం వద్దకు చేరడంతో ముగిసింది. నాలుగురోజుల పాటు 88 కిలోమీటర్ల మేర నడిచిన యువనేత యాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. జగన్ మాట్లాడ్డానికి నిలబడగానే సభా ప్రాంగణంలో కేరింతలు, చప్పట్లు హోరెత్తాయి. ఆ హర్షధ్వానాల మధ్య ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు. మన రాష్ట్రం నుంచి అత్యధికమంది ఎంపీలను తీసుకుంటూ కూడా రాష్ట్రానికి ఎలాంటి లబ్ధీ చేకూర్చని కాంగ్రెస్ పార్టీ దగాకోరుతనాన్ని ఎండగట్టారు. ప్రసంగం ఆయన మాటల్లోనే..

లక్షల పాదాలు కదిలొచ్చాయి..

రామయ్యపేట.. ఈ పేరు చాలా తక్కువ మంది విని ఉంటారు. మారుమూలన ఒక చిన్నగ్రామం. అయినా ఈ చిన్న గ్రామానికి ఇన్ని లక్షల పాదాలు కదిలాయి.. ఇన్ని లక్షల గుండెల చప్పుడు ఇక్కడ వినబడుతోంది.. 88 కిలోమీటర్ల మేర ఈ నడక సాగించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఆ కేంద్ర ప్రభుత్వానికీ, రెండింటికీ ఈ ప్రాజెక్టు ఎక్కడ ఉందనేది చెప్పాం. ఈ ప్రాజెక్టు అవసరం ఎంత అనేది కూడా.. నడిరోడ్డు మీద నడుచుకుంటూ వచ్చి చూపించాం. నాతో పాటు అడుగులో అడుగు వేసిన లక్షల పాదాలకు, లక్షల హృదయాలకు, ప్రతి అక్కా, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, ప్రతి అవ్వకూ, ప్రతి తాతకు చేతులు జోడించి, శిరస్సు వంచి పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా.

కృష్ణాకు నీరు తరలించకుంటే రాష్ట్రం ఎడారే..


ఇవ్వాళ ఎవరైనా ఈ పోలవరం ప్రాజెక్టు కేవలం మూడు నాలుగు జిల్లాలకు చెందిన ప్రాజెక్టే అని అనుకుంటే.. అంతకంటే మూర్ఖులు ఎవరూ ఉండరని చెబుతున్నా.. ఎత్తు ఒకసారి కృష్ణా జలాలపై వచ్చిన ట్రిబ్యునల్ తీర్పును చూడండి. ఆ తీర్పు నేపథ్యంలో పోలవరమే మనకు శరణ్యం. అలాంటి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు రాకపోతే యావత్ రాష్ట్రం ఎడారవుతుంది. ఈ ప్రాజెక్టు నుంచి కుడికాలువ ద్వారా కృష్ణా నదికి నీళ్లు అందకపోతే.. దుమ్ముగూడెం దగ్గరి నుంచి నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ దగ్గరికి తీసుకెళ్లకపోతే కృష్ణా నది మీద నిలబడి ఉన్న మొత్తం రాష్ట్రం కూడా.. అటు తెలంగాణ కానీ, ఇటు రాయలసీమ కానీ, గుంటూరు, విజయవాడ నగరాలు, పశ్చిమ గోదావరి కానీ పూర్తిగా ఎడారయ్యే పరిస్థితి వస్తుంది.

కేంద్రం చేయకపోతే.. మీరు ప్రాజెక్టు కట్టరా?


ఒక్కసారి ఆలోచన చేయండి. దివంగత నేత రాజశేఖరరెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్లిపోయాక ప్రభుత్వం ఈ ప్రాజెక్టువైపు కన్నెత్తి చూడలేదు. ఎంతసేపు కూడా కేంద్ర ప్రభుత్వం ఏదో చేయాలి.. కేంద్ర ప్రభుత్వం ఏదో చేస్తేనే మనం ఈప్రాజెక్టును చేయగలుగుతాం.. చేస్తామని చెప్పి సాకులు చూపిస్తున్నారు.. ఆ కేంద్ర ప్రభుత్వం దయాదాక్షిణ్యాల మీద మనం బతుకుతున్నట్టుగా.. వాళ్ల దగ్గరికి పోయి కాళ్లావేళ్లా పడే పరిస్థితిలో రాష్ట్రం ఉందన్నట్టుగా చెబుతున్నారు. నేనడుగుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని.. ఏం? కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయకపోతే మీరు పోలవరం ప్రాజెక్టు కట్టరా? అని అడుగుతున్నా.


ఇంతమంది ఎంపీలను పంపినా అడుక్కోవాలా?


కేంద్రానికి 32 మంది ఎంపీలను పంపాం. ఇంతమంది ఎంపీలను పంపినందుకు ఇన్నిసార్లు అడుక్కునే పరిస్థితి మాకెందుకు? ఈ ప్రాజెక్టు కోసం దివంగత నేత వైఎస్సార్ చేసినట్టుగా ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయలేకపోతోంది? ఎంపీలైతే 32 మంది మన దగ్గరి నుంచే కావాలట. పదవుల దగ్గరికి వచ్చేసరికి.. రైల్వే మంత్రి పదవి చూస్తే ఎవరో మమతాబెనర్జీ గారికో, లాలూ ప్రసాద్ యాదవ్‌గారికో మరొకరికో మరొకరికో ఇస్తారు. ఒకరేమో రైల్వేబడ్జెట్ అంతా పశ్చిమ బెంగాల్‌కు తీసుకెళతారు. ఒకరేమో బీహార్‌కు తీసుకెళతారు. ఆ రైల్వే మంత్రిత్వ శాఖ మనకే ఎందుకు దక్కకూడదూ అని అడుగుతున్నా!


గోడు చెప్పుకుందామంటే.. అపాయింట్‌మెంట్ ఇవ్వరా?


వరదలు వచ్చినప్పుడు రైతు సోదరులు వరుసగా మూడుసార్లు దెబ్బమీద దెబ్బ తగిలి దుర్భరమైన పరిస్థితుల్లో బతుకుతున్నారని ఢిల్లీ వరకు వెళితే.. ఢిల్లీలో ప్రధానితో మా గోడు చెప్పుకుందామని ప్రయత్నం చేస్తే, కనీసం ఐదు నిమిషాలపాటు అపాయింట్‌మెంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. అలాంటప్పుడు ఎందుకివ్వాలి 32 మంది ఎంపీలను ఈ కాంగ్రెస్ పార్టీకి?


ఆ శాఖ మనమే ఎందుకు తీసుకోకూడదు?


ఆ వ్యవసాయ శాఖ ఎవరో మహారాష్టక్రు చెందిన శరద్‌పవార్‌కు ఇచ్చారట. ఆ వ్యవసాయ శాఖ మనమే ఎందుకు తీసుకోకూడదు? మనవాడే ఆ స్థానంలో ఉంటే ఎప్పుడు వరదలు వచ్చినా.. ఒక్కరోజులో అక్కడికి వచ్చి ప్రజల బాగోగులు కనుక్కొని వెంటనే రిపోర్టులు రాసి, ప్రధాని వద్ద ఒత్తిడి చేసుకునేవాళ్లం కాదా? ఈ కాంగ్రెస్ పార్టీ ఎంతసేపూ కూడా మనల్ని వాడుకునే కార్యక్రమం తప్ప.. మంచి చేసే కార్యక్రమం ఎప్పుడూ చేయదు. పోలవరం ప్రాజెక్టు కావాలని గత 70 ఏళ్లుగా అడుగుతుంటే.. కొందరు ఎంపీలతో పోలవరం కావాలి అని అనిపిస్తారు. అదేపార్టీకి చెందిన మరికొందరు ఎంపీలతో మట్టుకు పోలవరం వద్దే వద్దని చెప్పిస్తారు. అసలు వద్దని చెప్పడానికి కారణాలు ఏంటి?


మనిషన్నాక ఒకే తీరులో ఉండాలి..

మనిషి అన్నాక.. పదవిలో ఉన్నప్పుడు ఒకతీరుగా.. పదవిలో లేనప్పుడు ఒకరకంగా ఉండడం సరైన పద్ధతి కానేకాదు. మనిషన్నాక ఒకే తీరులోనే, ఒకే రీతిలోనే ఉండాలి. మైకులు పట్టుకుని చంద్రబాబు గారు రైతుల గురించి ప్రేమ ఒలకబోస్తూ చెప్పే మాటలను చూసి ఈ మాటలంటున్నా. 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఆరోజే పోలవరం కట్టి ఉంటే, కనీసం ఆలోచన చేసి ఉంటే.. ఈ సరికే ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి ఉండేది. ప్రతి ఎకరాకూ సాగునీరు అందేది. ప్రతి రైతు సోదరుడి ముఖాన చిరునవ్వు కనిపిస్తూ ఉండేది. ఆ గొప్ప ఆలోచన ఆయనకు వచ్చి ఉంటే కనీసం అనుమతులైనా వచ్చేవి. కానీ ఆ సమయంలో కేంద్రంలో చక్రం తిప్పుతున్న చంద్రబాబు అనుమతులు కూడా తీసుకురాకుండా అక్కడే ప్రాజెక్టును తొక్కిపెట్టాడు అని అంటే ఒక్కసారి ఆలోచించండి చంద్రబాబు గారి నైజం గురించి!

వెంటనే మొదలుపెట్టాలి..


కేంద్ర ప్రభుత్వం సాయం చేసినా చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను మొదలుపెట్టాలి. వెంటనే టెండర్లు పిలవాలి. ఈ డిమాండ్ చేయడమే కాకుండా.. ప్రాజెక్టు కోసం రానున్న రోజుల్లో మరింత ఒత్తిడి తెచ్చేందుకు ముమ్మరంగా కార్యక్రమాలు చేపడతామని చెబుతున్నా. ఏ ఒక్కరికీ కూడా ఏ నష్టమూ జరగకూడదని చెప్పి భూమి పోయిన ప్రతి రైతుకూ వైఎస్ మళ్లీ భూమి ఇచ్చారు. పోడు భూముల రైతులకు కూడా నష్టం జరగకుండా చూశారు. ఇదే స్ఫూర్తితో ఈ పోలవరం ప్రాజెక్టువైపు అడుగులు వేయాలని చెప్పి.. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ.. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించాలని చేతులు జోడించి భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా.


వైఎస్సే దశా దిశా చూపించారు


ఈ పోలవరం ప్రాజెక్టు 1946లోనే కట్టి ఉంటే ఆవేళ 208 అడుగుల ఎత్తుతో కట్టి ఉండేవారు. సాక్షాత్తూ రాముని పాదాల దగ్గరికి నీళ్లు పోయేవి. రామపాదం అని ఆ ప్రాజెక్టును పిలిచేవాళ్లు. ఆ ప్రాజెక్టును ఆవేళ కట్టి ఉంటే భద్రాచలం స్వామి సాక్షిగా కేవలం రూ. 125 కోట్లతో ఆ ప్రాజెక్టు పూర్తయ్యేది. ఆ తరువాత అంజయ్యగారు 1982-83 సంవత్సరంలో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆ వేళ కట్టి ఉంటే రూ. 750 కోట్లతో పూర్తయ్యేది. ఈ ప్రాజెక్టు కట్టకపోతే రాష్ట్రం పూర్తిగా నాశనం అయిపోతుందన్న ఆలోచన చేసిన దివంగత నేత వైఎస్సార్ రూ. 3200 కోట్లతో తన ఐదేళ్ల కాలంలో దీన్ని ముందుకు తీసుకుపోయి దశా దిశా చూపించారు.


ప్రాజెక్టులు కట్టకూడదని చట్టముందా?


కృష్ణా జలాలపై ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు నేపథ్యంలో.. పోలవరం ప్రాజెక్టు రాకపోతే ఇక్కడి నుంచి నాగార్జునసాగర్ వరకు నీళ్లు పోకపోతే, ఆ సాగర్ మీద నీటి భారం తగ్గించకపోతే, మహబూబ్‌నగర్, నల్లగొండకే కాకుండా.. హైదరాబాద్‌కు తాగునీరు కూడా అందించలేని పరిస్థితి దాపురిస్తుంది. ఇలాంటి సమయంలో సైతం ఎందుకు మీరు తెలంగాణ ఎంపీలను సాకుగా చూపిస్తున్నారు? ఏదైనా చేయాలంటే చిత్తశుద్ధి ఉండాలి.. ధైర్యం ఉండాలి. పోలవరం ప్రాజెక్టు నిర్మించి చూపాలి. మరోపక్క ప్రాణహిత-చేవెళ్లకు నాంది పలకాలి. రెండు ప్రాజెక్టులను కూడా చేయకూడదని ఏమైనా చట్టం ఉందా?

పోటెత్తిన జనసాగరం
నాలుగు రోజులపాటు అలుపెరగకుండా నడిచిన యువనేత
మొత్తం 88 కిలోమీటర్ల మేర పాదయాత్ర
హరిత యాత్ర ముగింపు సభలో జన జోరు
ఎటుచూసినా జనమే.. ఏ నోట విన్నా జగనే


పోలవరం(పశ్చిమగోదావరి జిల్లా)-  రామయ్యపేట.. ఓ మారుమూల గ్రామం.. గురువారం మాత్రం ఓ మహా నగరాన్ని తలపించింది.. పోలవరం ప్రాజెక్టు కట్టాలంటూ యువనేత వెంట పోటెత్తిన జన సాగరాన్ని చూసి.. ఇక్కడి గోదారమ్మ సైతం చిన్నబోయింది. ఎటుచూసినా జనమే.. జనం! ఎవరి నోట విన్నా జగనే జగన్! తమ కోసం, తమ భావితరాల కోసం పోలవరం అవసరమని గుర్తించిన రైతన్నలు యువనేత అడుగులో అడుగేస్తూ కదం తొక్కారు. రాష్ట్రం ఎడారి కాకుండా ఉండాలంటే ప్రాజెక్టును వేగంగా పూర్తిచేయాల్సిందేనని తెలుసుకున్న ప్రజలు ‘హరిత యాత్ర’కు మద్దతుగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలివచ్చారు. దీంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతమైన రామయ్యపేట గ్రామం జన జోరుతో హోరెత్తిపోయింది.

ఆరు కిలోమీటర్లు.. ఐదు గంటలు


పోలవరం వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ యువనేత వైఎస్ జగన్ చేపట్టిన హరితయాత్ర గురువారం పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నిర్మాణ ప్రాంతానికి చేరడంతో ముగిసింది. ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వేలాది వాహనాలతో లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. ఇసుక వేస్తే రాలని రీతిలో రహదారులన్నీ జనమయమయ్యారు. ఉదయుం 11 గంటలకే జనం ఇక్కడికి చేరుకున్నారు. అక్కడ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంగణానికి చేరుకోవడానికి దాదాపు ఐదు గంటలు పట్టింది. ఒకేసారి వాహనాలు గ్రామంలో ప్రవేశించడంతో పాటు ప్రాంగణానికి ఒకే దారి ఉండడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయుం ఏర్పడింది. వేలాది వాహనాలు ఒకే మార్గంలో వెళ్లి రావడంతో గంటలు తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయింది. ట్రాఫిక్ దిగ్బంధం నుంచి బయుటపడేసరికి చాలా సమయం పట్టింది. జగన్ ప్రసంగాన్ని వినేందుకు, ఆయన్ను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తవు వాహనాలను సమీప ప్రాంతాల్లోని పొలాల్లోనే పార్కింగ్ చేసి పరుగులు పెట్టి ప్రాంగణానికి చేరుకున్నారు.

అనకాపల్లి ఎంపీ సబ్బం హరి, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, సినీ నటి రోజా, లక్ష్మీ పార్వతి ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని పదునెక్కిన మాటలతో విమర్శించారు. లక్ష్మీపార్వతి, రోజాలు పిట్టకథలు, పురాణాలతో ప్రస్తుత పరిస్థితులను కాంగ్రెస్‌కు అన్వయించి అందర్నీ ఆకట్టుకున్నారు. ఏడాది పాటు ఎవరెన్ని మాటలు అన్నా గొంతు నొక్కేసుకున్నామని, ఇక మాట్లాడతామని, మాట్లాడక పోతే జనం క్షమించరని ఎంపీ సబ్బంహరి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జగన్ జోలికి వస్తే 30 సంవత్సరాలపాటు కాంగ్రెస్‌ను ప్రజలు అధికారంలోకి రానీయకుండా చేస్తారని హెచ్చరించారు. మాజీ మంత్రి కొణతాల మాట్లాడుతూ ఆంధ్రుల దెబ్బకు ఢిల్లీ అబ్బా అనిపించేలా రానున్న కాలంలో దీటైన జవాబు చెప్పాలని పిలుపునిచ్చారు.


జనం ఏమంటున్నారంటే...

సభకు హాజరైన జనాన్ని ‘న్యూస్‌లైన్’ ప్రశ్నించినప్పుడు.. వారిలో ఉద్వేగం బయటపడింది. వైఎస్‌కు మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో పాలకులే పోలవరాన్ని అడ్డుకుంటున్నారంటూ వారు మండిపడ్డారు. ‘రాజకీయు కారణాలతో ప్రాజెక్టును నిలిపివేశారు. పనులు వుళ్లీ ప్రారంభించాలి’ అని గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన రైతు కంఠవునేని ప్రసాద్ డిమాండ్ చేశారు. వయుసు సహకరించకపోరుునా తాడేపల్లిగూడెం వరకు రైలులో వచ్చి అక్కడ్నుంచి ఆర్టీసీ బస్సులో, ఆటోలో వచ్చానని ఆయన తెలిపారు. ‘బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుతో కృష్ణా డె ల్టా ఎడారి కానుంది. ఈ పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టే మనకు దిక్కు. దీని సాధన కోసం జగన్ చేపట్టిన కార్యక్రమానికి కృష్ణా జిల్లా మైలవరం నుంచి వచ్చాం’ అని పలువురు యువకులు పేర్కొన్నారు.

విశాఖపట్నానికి పారిశ్రామిక, తాగునీటి అవసరాలకు ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయోగపడుతుందని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు నన్నపనేని రాజేంద్ర, బిల్డర్ వివేక్ పేర్కొన్నారు. వైఎస్ ఆశయూలు అవులు కావాలంటే జగన్ సీఎం కావాలని, అందుకే ఆయున చేపట్టిన ప్రతి ప్రజాహిత కార్యక్రవూనికి తాను విధిగా హాజరవుతున్నానని పశ్చివుగోదావరి జిల్లా భీవువరానికి చెందిన డ్వాక్రా వుహిళ యడ్ల పుష్ప చెప్పారు. వైఎస్ నిర్వహించిన మహాప్రస్థానంలో విజయవాడ నుంచి రాజమండ్రి వరకు తాను పాల్గొన్నానన్నారు. ‘ఓదార్పు యాత్ర మొట్టమెుదటిసారిగా నిర్వహించినప్పుడు జగన్ అన్నకు బాసటగా నిలిచాను. మళ్లీ ఈ రోజు పోలవరంలో నిర్వహించిన హరితయూత్రకు హాజరై అన్నకు మద్దతు తెలుపుతున్నాను’ అని పశ్చిమగోదావరి జిల్లా నరసన్నపాలేనికి చెందిన వికలాంగురాలు కాకి దుర్గ పేర్కొన్నారు.


అలుపెరగని బాటసారి..


ఏడో తేదీన తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో ప్రారంభమైన హరితయాత్ర పదో తేదీ గురువారం పోలవరం ప్రాజెక్టు సమీపంలో రామయ్యపేట గ్రామ శివారులో ముగిసింది. ఈ పాదయాత్రలో యువనేత అడుగునే లక్షల కాళ్లు అనుసరించాయి. మిట్ట మధ్యాహ్నం మండే ఎండలోనూ, రాత్రి ఎముకలు కొరికే చలిలోనూ అలుపెరగని బాటసారిలా మహోన్నత లక్ష్యంవైపు జగన్ ముందుకుసాగారు. ఈ హరిత యూత్ర రాష్ట్రంలోనే చరిత్రాత్మకఘట్టంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. యాత్ర సాగిన ప్రాంతాల్లో రైతులు, పారిశ్రామిక వేత్తలు, మహిళలు, యువకులు ఆయన పాదయాత్రకు బాసటగా నిలిచారు.


నాలుగోరోజు గురువారం ఉదయాన 8 గంటలకే గూటాల నుంచి పాదయాత్రకు ఉపక్రమించిన జగన్‌కు కొత్త పట్టిసీమ, పాత పట్టిసీమ గ్రామాల ప్రజలు అపురూపంగా స్వాగతం పలికారు. కొత్త పట్టిసీమలో గులాబీ, చేమంతి, బంతిపూలనే తివాచీగా పరిచి జగన్‌కు స్వాగతం పలికారు. ఇక్కడ మహానేత వైఎస్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. ఇక్కడి నుంచి పోలవరం మీదుగా ప్రాజెక్టు సమీపంలోకి మధ్యాహ్నం 2.20కి చేరుకున్నారు. మధ్యాహ్న భోజనం చేశాక 4.15కుజగన్ సభావేదికపైకి చేరుకున్నారు. సాయంత్రం 5.50కి ప్రసంగించారు.


పోలవరంలో స్తంభించిన ట్రాఫిక్
వరుసకట్టిన వందలకొద్దీ వాహనాలు
ఒకటే మార్గం ఉండడంతో నిలిచిపోయిన ట్రాఫిక్
కాలినడకన చేరుకున్న భద్రాచలం ఎమ్మెల్యే, ఇతరులు
12 కి.మీపైగా నడుచుకుంటూ వచ్చిన అభిమానులు
 ట్రాఫిక్ లో చిక్కుకుని ఆగిపోయిన వేలాదిమంది

  హరిత యాత్ర సభకు తరలివచ్చిన రైతులు, జగన్ అభిమానుల వాహనాలతో పోలవరం మండలంలో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. రామయ్యపేట నుంచి తాడిపూడి వరకు వాహనాలు బారులు తీరడంతో మధ్యాహ్నం 3 గంటల నుంచి ట్రాఫిక్ నిలిచిపోయింది. రాత్రి 8.30 గంటల సమయంలో కూడా అది క్లియర్ కాలేదు. రాజకీయ నాయకులు సాధారణంగా సభలు, సమావేశాలను పట్టణాలు, నగరాల్లో నిర్వహిస్తారు. ప్రాజెక్టు ఎక్కడ ఉందో, దాని ఆవశ్యకత ఏంటో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గుర్తుచేసేందుకు వైఎస్ జగన్ ప్రాజెక్టు నిర్మించే రామయ్యపేటలోనే హరిత యాత్ర ముగింపు సభ పెట్టారు. అయితే ఇది మారుమూల గ్రామం కావడం, సభా ప్రాంగణానికి ఒకటే మార్గం ఉండడం, వందలకొద్దీ వాహనాలు ఒకేసారి రావడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. వేలాది మంది సభకు చేరుకోలేకపోయారు.

రాష్ట్రం నలుమూలల నుంచీ ఉదయుం 11 గంటలకే జనం ఇక్కడికి చేరుకున్నారు. మధ్యాహ్నం సమయంలోనే ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంగణానికి చేరుకోవడానికి దాదాపు ఐదు గంటలు పట్టింది. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు వాహనం తాడిపూడి సమీపంలో చిక్కుకుపోయింది. భద్రాచలం ఎమ్మెల్యే కుంజా సత్యవతి వాహనం కృష్ణారావుపేట సమీపంలో ఆగిపోవడంతో ఆమె పోలవరానికి కాలినడకన చేరుకున్నారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి శేషారెడ్డి కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. ఏటిగట్టు, పోలవరం-జంగారెడ్డిగూడెం రోడ్డులో వాహనాలు నిలిచిపోవడంతో దాదాపు 12 కిలోమీటర్లు కాలినడకన సభాప్రాంగణానికి అభిమానులు చేరుకున్నారు. సభా ప్రాంగాణానికి ద్విచక్ర వాహనం కూడా వెళ్లలేని పరిస్థితి. కొన్ని వాహనాలు శివారు ప్రాంతాల్లోనే ఆగిపోవడంతో అభిమానులు మొక్కజొన్న తోటల్లోంచి మూడు కిలోమీటర్ల మేర నడిచివచ్చారు. జగన్ ప్రసంగాన్ని వినేందుకు, ఆయున్ను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ వాహనాలను సమీప ప్రాంతాల్లోని పొలాల్లోనే పార్కింగ్ చేసి పరుగులు పెట్టి ప్రాంగణానికి చేరుకున్నారు.

పాదయాత్ర ఇలా..
మొదటి రోజు 23 కిలోమీటర్లు
రెండో రోజు 28 కిలోమీటర్లు
మూడో రోజు 23 కిలోమీటర్లు
నాలుగో రోజు 14 కిలోమీటర్లు
మొత్తం 88 కిలోమీటర్లు పాదయాత్ర సాగింది.

 
హరితయాత్ర సభలో ఎవరేమన్నారంటే..
జగన్‌కు హాని చేస్తే జనం కాంగ్రెస్‌ను క్షమించరు

ఏడాది పాటు మా నోరు మూసుకుని ఓపిగ్గా ఉన్నాం. ఇక నుంచి మాట్లాడతాం. రాష్ట్రానికే ప్రయోజనకరమైన పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా కోసం ఏర్పాటు చేసిన ఈ వేదికపైనుంచే మాట్లాడడం మెుదలు పెడుతున్నాం. ఇప్పుడు కూడా మాట్లాడకపోతే ప్రజలు మమ్మల్ని క్షమించరు. పోలవరం విషయంలో గత ఆరునెలల కాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుంటి సాకులతో కాలయూపన చేస్తున్నాయి. ప్రధానిని రెండుసార్లు, సోనియాను రెండుసార్లు, బన్సాలీని మూడుసార్లు కలిశాం. దాటవేత ధోరణి తప్ప వారు స్పందించ లేదు. ప్రాజెక్టు కోసం కోసం రామయ్యపేటలోని చిన్న గ్రామంలో ఇంత భారీ స్థాయిలో బహిరంగ సభ ఏ రాజకీయు నాయకుడు ఇక మీదట కూడా నిర్వహించలేరు. ఒక్కడి కోసం, ఒక్కడితో నడవడానికి ఇన్ని లక్షల మంది తరలిరావడం మామూలు విషయుం కాదు. వైఎస్ చనిపోయిన తర్వాత పోలవరం ప్రాజెక్టును పాలకులు అటకెక్కించే ప్రయత్నం చేశారు. జగన్‌ను టార్గెట్ చేశారు. జగన్ ఉంటేనే కాంగ్రెస్ అని లేకపోతే ఆ పార్టీ కుక్కలు చింపిన విస్తరేనని ఆనాడే చెప్పాను. ప్రస్తుతం జగన్ ధాటికి కేంద్ర ప్రభుత్వమే వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆయనకు కీడు చేసే చర్యలకు దిగితే మరో 30 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా ప్రజలే గుణపాఠం నేర్పుతారు. గతంలో ఓసారి ప్రధాని పీవీ నరసింహారావుతో ఐదు నిమిషాల పాటు ప్రయాణించే అవకాశం దక్కింది. అప్పుడు ఆయన కీలక విషయం చెప్పారు. ఇందిరాగాంధీ హత్య అనంతరం అంత్యక్రియులు చేయకముందే రాజీవ్‌ను ప్రధానిని చేశార ని, ఇది ప్రజాస్వామ్యవ్యవస్థ అని పీవీ గర్వంగా చెప్పారు.

నేనిప్పుడు చెబుతున్నాను.. వైఎస్ చనిపోయిన సమయుంలో 155 మంది ఎమ్మెల్యేలు మద్దతు పలికిన జగన్‌ను సీఎం చేయుకుండా ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పెద్దలు ఎందుకు టార్గెట్ చేశారు. బోఫోర్స్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న రాజీవ్ గాంధీ ప్రభుత్వం తర్వాత అధికారం కోల్పోయింది. అయినా ఆయన్ను కేసు నుంచి తప్పించారు. వురి వైఎస్ చనిపోరుున సవుయుంలో మామూలు ఎంపీగా పారిశ్రామికవేత్తగా ఉన్న జగన్‌ను టార్గెట్ చేస్తూ పత్రికలు, ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగానే లేనిపోని వివుర్శలు చేయుడం తగదు.

- అనకాపల్లి ఎంపీ సబ్బం హరి

జగన్‌లో గొప్ప నాయుకత్వ లక్షణాలు


జగన్‌లో గొప్ప నాయకత్వ లక్షణాలు కనిపిస్తున్నారు. ఆయున ఏ కార్యక్రమం చేపట్టినా కార్యదీక్షతో విజయపథాన నడుస్తున్నారు. ఏ మాత్రం అనుమానం లేదు. ఆయన రానున్న కాలంలో వైఎస్ కంటే గొప్ప నాయకుడు అవుతాడు. రాష్ట్ర ప్రజల ఆశలు నెరవేర్చే తిరుగులేని శక్తిగా ఎదుగుతారు. రాజకీయపార్టీల మాచ్ ఫిక్సింగ్, కొన్ని పత్రికల రాతలు ప్రజాదరణ ఉన్న జగన్‌ను ఏ మాత్రం అడ్డుకోలేవు. రాష్ట్రంలో ఎన్నికలు మూడు నెలల్లో వచ్చినా, మూడేళ్లు పట్టినా రాబోయేది జగన్ పరిపాలనే. ఈ విషయూన్ని పాలకులు ముందుగా గుర్తిస్తే మంచిది. నాయుకుడికి కావాల్సింది ఓపిక, క్రవుశిక్షణ, ధైర్యం. అలాంటి లక్షణాలు జగన్‌లో పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే జగన్‌ను జనం తమ నాయకుడిగా గుర్తించారు.

- నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి

ప్రజలు తిరగబడతారు..

పోలవరం పూర్తి చేయకపోతే ప్రజలు తిరగబడతారు. మాట తప్పని, మడమా తిప్పని వైఎస్ ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. పోలవరం కల సాకారం చేసేందుకు జగన్ నడుంబిగించారు. జనపోటు ఢిల్లీకి తెలియూలి. ప్రాజెక్టు పూర్తయ్యే వరకు విశ్రమించకుండా పోరాడాలి.

- తెల్లం బాలరాజు, పోలవరం ఎమ్మెల్యే

నిర్లక్ష్యం చేస్తే రైతాంగం క్షమించదు


పోలవరాన్ని నిర్లక్ష్యం చేస్తే రైతాంగం క్షమించదు. గోదావరిలో వందల టీఎంసీల నీరు వృథాగా కడలిపాలవుతోంది. ఈ నదిపై చేపట్టిన అన్ని ఎత్తిపోతల పథకాలను చేపడితే రాష్ట్రం సస్యశ్యామలమతుంది. పోలవరానికి వెంటనే జాతీయు హోదా కల్పించాలి. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు వైఎస్ దేశంలోనే అద్భుతమైన ఆర్‌ఎన్‌ఆర్ ప్యాకేజీ ఇచ్చారు. పోలవరం ఎర్త్ ఫిల్ రాక్ డ్యామ్ నిర్మిస్తే డెల్టా ప్రాంతం కొట్టుకుపోతుందన్నది అవాస్తవం.

- మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్

ఆంధ్రుల దెబ్బకు ఢిల్లీ అబ్బా.. అనాలి


ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడుకునే సవుయుం వచ్చింది. ఆంధ్రుల దెబ్బకు ఢిల్లీ పెద్దలు అబ్బా.. అనాలి. కాంగ్రెస్ అధిష్టానం కాళ్లు పట్టుకుంటే సీఎం పదవి వస్తుంది. అలాంటి పరిస్థితి జగన్‌కు అవసరం లేదు. ఇప్పుడు ప్రజాదరణ కల్గిన జగన్‌ను చూస్తే కాంగ్రెస్ పెద్దలు ఉలిక్కిపడుతున్నారు. అందుకే చిరంజీవి పార్టీని విలీనం చేసుకున్నారు. రాష్ట్రంలో ఆనాడు చంద్రగ్రహణం పడితే.. ఈనాడు నవగ్రహాలు, మరో శనిగ్రహం పట్టి పీడిస్తున్నాయి.

- మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ

జగన్‌కు అండగా ఉండాలి..


యువనేత జగన్ మనకోసం రేయీ పగలూ పాదయాత్రలు, నిరాహార దీక్షలు చేపడుతున్నారు. జగన్‌కు మీరంతా అండగా ఉండాలి. వైఎస్‌ను తలచుకుంటే ఇప్పటికీ కన్నీళ్లు వస్తున్నా. రైతులకు పెద్దపీట వేయాలని వారి కళ్లల్లో ఆనందం చూడాలన్నదే ఆయన సంకల్పం. ఎన్ని కోట్లైనా జలయజ్ఞం ప్రాజెక్టులు పూర్తి చేయాలనుకున్నారు. ఎన్నో పథకాలు పెట్టారు. ఇప్పుడు వైఎస్‌ను విమర్శిస్తున్న వారందర్నీ వైఎస్ చంకనెత్తుకుని పదవులు ఇచ్చారు. ఇప్పుడు వారెవరికీ వైఎస్ పేరు తలిచే అర్హత లేదు.

- ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి

ఈ సభ పాలకులకు పిడుగుపాటు..


పోలవరంలాంటి మారుమూల ప్రాంతంలో కొండకోనల్లో జరిగే సమావేశాలు ఉద్యమాలకు, ప్రజా సమస్యల పరిష్కారానికి దిశానిర్దేశమవుతాయి. గతంలో ఇక్కడ రహస్యంగా ప్లీనరీలు జరిగేవంట. అవే ఉద్యమాలకు దిశానిర్దేశంగా ఉండేవి. ఇక్కడ ఇంత భారీ బహిరంగ సభ నిర్వహించే ధైర్యం ఎవరూ చేయలేరు. గోదావరి నినదించేలా, కొండలు గర్జించేలా సాగిన ఈ సభ పాలకులకు పిడుగుపాటుగా ఉంటుంది. జగన్‌ను దెబ్బకొట్టేందుకు అపవిత్ర కలయికలు జరుగుతున్నాయి. ఒక్కడ్ని ఎదుర్కొనేందుకు తెరమీద ఒకడు, తెర వెనుక ఒకడు ఏకమవుతున్నారు. ప్రజాదరణ ఉన్న జగన్‌ను ఏ శక్తీ అడ్డుకోలేదు.

- ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు

జనం మద్దతు జగన్‌కే: మేకా శేషుబాబు


కాంగ్రెస్‌కు వైఎస్ చేసిన సేవలను అధిష్టానం విస్మరించి ఆయన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి యత్నిస్తోందని పశ్చిమగోదావరి జెడ్పీ చెర్మన్ మేకా శేషుబాబు విమర్శించారు. దీనిని గుర్తించిన ప్రజలు జగన్‌కు అండగా నిలుస్తున్నారని, అందువల్లే తాము కూడా జగన్ బాట పట్టామని గురువారం పాలకొల్లులో చెప్పారు.


ఈ ప్రభుత్వం పోయే వరకు నడుస్తా..
ప్రజా సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కార మార్గం కనుగొనే దిశగా మహానేత వైఎస్ చేపట్టిన మహా ప్రస్థానంలో పాలు పంచుకున్నాను. పోలవరానికి జాతీయు హోదా కోసం జగన్ హరిత యాత్రలో కూడా భాగస్వామిని కావడంతో గర్వపడుతున్నాను. ప్రజల అభీష్టాన్ని నిర్వహించేలా జగన్ తిరుగులేని నాయకుడుగా ముందుకు సాగుతున్నారు. పోలవరం కోసం నడుస్తాను... ఈ ప్రభుత్వం పోయే వరకు నడుస్తాను.
- అంబటి రాంబాబు, ఏపీఐఐసీ మాజీ చైర్మన్

యువనేత జగన్ రియల్ హీరో


జగన్‌ను దెబ్బతీసేందుకు రాష్ట్రంలో రాజకీయు పార్టీలు ఏకమవుతున్న తీరును ప్రజలు చీదరించుకుంటున్నారు. పార్టీని అమ్ముకున్న రీల్ హీరో చిరంజీవి. పార్టీని వదిలి ప్రజల కోసం పనిచేస్తున్న రియల్ హీరో జగన్. కర్ణాటకలో ఆల్మట్టి, మహారాష్టల్రో బాబ్లీ ప్రాజెక్టులను నిర్మిస్తున్నా ఆపలేని దద్దమ్మలు పోలవరం కోసం హరితయాత్ర చేస్తున్న జగన్‌ను విమర్శించడం విడ్డూరంగా ఉంది. జగన్ నిర్వహిస్తున్న హరిత యాత్ర కాంగ్రెస్‌కు చలి జ్వరం రప్పిస్తుంది.
- సినీనటి రోజా

మూడేళ్ల శిశువుతో 125 ఏళ్ల వృద్ధుడి పెళ్లా..

మంచి నాయకుడి కొరత ఏర్పడినప్పుడు ప్రజలే వారికి అవసరమైన నాయకుడిని తయారు చేసుకుంటారు. తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టే నిజమైన నాయకుడు జగన్. ఆయన జనం నుంచి పుట్టిన నాయుకుడు. నా కంఠంలో ఊపిరి ఉన్నంతవరకూ ఆయునకు అండదండగా ఉంటా. మూడేళ్ల శిశువుగా ఉన్న పీఆర్పీ 125 ఏళ్ల వృద్ధుడుగా ఉన్న కాంగ్రెస్‌తో విలీనం కావడాన్ని ప్రజలు క్షమించరు.
- నందమూరి లక్ష్మీపార్వతి

జగన్ సీఎం అయితేనే పోల‘వరం’
పోలవరాన్ని 2014 నాటికి పూర్తి చేయాలన్న వైఎస్ సంకల్పాన్ని కాంగ్రెస్ సర్కారు నీరుగారుస్తోంది. ఆయన మరణం తర్వాత రెండేళ్లుగా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. జగన్ సీఎం అయితేనే ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. పోలవరం పనులను సత్వరం పూర్తి చేయకపోతే భవిష్యత్తులో కాంగ్రెస్ కు పుట్టగతులు ఉండవు.
- హరితయాత్రలో మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు
 
హరిత యాత్రలో ప్రముఖులు వీరే
 
 హరితయూత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారిలో అనకాపల్లి ఎంపీ సబ్బం హరి, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మాజీ వుంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, కొణతాల రామకృష్ణ, చేగొండి హరిరామజోగయ్యు, పెన్మెత్స సాంబశివరాజు, ఎమ్మెల్యేలు తెల్లం బాలరాజు, కుంజా సత్యవతి, ఆళ్ల నాని, ముదునూరి ప్రసాదరాజు, ఎం.బాబూరావు, ఆదినారాయుణ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, పశ్చిమగోదావరి జెడ్పీ చైర్మన్ మేకా శేషుబాబు, నెల్లూరు జెడ్పీ చైర్మన్ కాకాణి గోవ ర్ధన రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పాతపాటి సర్రాజు, చెరకువాడ శ్రీరంగనాధరాజు, బాజిరెడ్డి గోవర్ధన్, మేకా ప్రతాప్ అప్పారావు, జలీల్ ఖాన్, చల్లా వెంకట కృష్ణారెడ్డి, కట్టా సాంబయ్యు, ఎంవీ శివరావుకృష్ణారెడ్డి


ఎం.సుబ్రహ్మణ్యం, కె.నారాయణస్వామి, రవికుమార్, ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకరరావు, పుల్లా పద్మావతి, మాజీ ఎమ్మెల్సీ రెహమాన్, రోజా, లక్ష్మీపార్వతి, వైవీ సుబ్బారెడ్డి, నేదురుమల్లి పద్మనాభరెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షులు వేగిరాజు రామకృష్ణంరాజు, కొయ్యే మోషేన్ రాజు, పీసీసీ మాజీ కార్యదర్శి కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అమృతా సాగర్, నేతలు బుంగా సారథి, ఇందుకూరి రావుకృష్ణరాజు, భూమాన కరుణాకరరెడ్డి, అంబటి రాంబాబు, ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశరావు, గుంటూరు జిల్లా గ్రంథాలయు సంస్థ చైర్మన్ చిట్టా విజయు భాస్కరరెడ్డి, రాష్ట్ర మాహిళా కాంగ్రెస్ వూజీ కార్యదర్శి బొవ్మూరెడ్డి సునీత, పశ్చిమగోదావరి జిల్లా మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు కొల్లి నిర్మల కువూరి, పశ్చిమగోదావరి జిల్లా యూత్ కాంగ్రెస్ వూజీ ఉపాధ్యక్షులు కారుమంచి రమేష్, రాష్ట్ర ఎల్‌ఐడీసీ డెరైక్టర్ తలారి వెంకట్రావు, విజయవాడ మాజీ మేయుర్ తాడి శకుంతల, మేడిది జాన్సన్ తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment