Tuesday, February 1, 2011

బంగాళాఖాతంలో కలిసే అర్హతా లేదు * సర్కారుపై యువనేత జగన్ ధ్వజం

పేదలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎంతగానో ఉపయోగపడింది
ఇల్లు, పొలం అమ్ముకునే దుస్థితి నుంచి ఆ కుటుంబాలనుకా పాడింది
కానీ ఈ ప్రభుత్వం ఆ పథకానికి నిధులే ఇవ్వట్లేదు
పేదలను పట్టించుకోని ప్రభుత్వాలు కూలిపోక తప్పదు
జగన్‌కు మద్దతు తెలిపేందుకు కదిరి నుంచి వచ్చిన ముస్లింలు


పేదల సంక్షేమాన్ని విస్మరించి ప్రభుత్వం పనిచేస్తోందని, ఇలాంటి సర్కారు బంగాళాఖాతంలో కలిసిపోవడం తథ్యమని.. కానీ ఆ సముద్రంలో కలవడానికి కూడా ఈ సర్కార్‌కు అర్హత లేదని యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. యువనేతను కలవడం కోసం మంగళవారం అనంతపురం జిల్లా కదిరి నుంచి కాంగ్రెస్‌మాజీ నేత ఎస్.ఎండీ. ఇస్మాయిల్ నేతృత్వంలో సుమారు ఐదు వేల మంది ముస్లింలు పులివెందుల వచ్చారు. వైఎస్‌ఆర్ ఆడిటోరియంలో జగన్ వారినుద్దేశించి ప్రసంగించారు. ఇంత పెద్దఎత్తున ముస్లిం సోదరులు, మహిళలు వేలాదిగా తరలి వచ్చారంటే ప్రియతమ రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో ఎలా నిలిచిపోయారో అర్థమవుతోందన్నారు.

ఆ సందర్భం.. నా కళ్లను చెమర్చింది

ముస్లింలు బాగుపడాలని, వారికి ప్రత్యేకంగా నాలుగుశాతం రిజర్వేషన్ తీసుకొచ్చి దేశంలోనే విశిష్ట గుర్తింపు తెచ్చుకున్న ఏకైక నేత వైఎస్‌ఆర్ అని జగన్ అన్నారు. దీంతో ఆడిటోరియంలోని వారంతా హర్షధ్వానాలుచేశారు. ‘సరిగ్గా ఏడాది క్రితం నేను ఒక మైనార్టీ ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్లినప్పుడు, అక్కడ జరిగిన సభలో విద్యార్థులు వేదికపై మాట్లాడుతూ.. మా నాన్న సెక్యూరిటీ గార్డు అని.. మా నాన్న సైకిల్ షాపులో పనిచేస్తాడని.. చెప్పారు. అయినప్పటికీ తమను ఇంజనీరింగ్ చదివిస్తున్నారని చెబుతూ... దీనంతటికీ కారణం వైఎస్సేనంటూ గొప్పగా చెప్పిన సందర్భం నా కళ్లను చెమర్చింది’ అంటూ భావోద్వేగంతో ప్రసంగించారు. పిల్లల చదువు కోసం పేద కుటుంబాలవారు ఇళ్లు, పొలం అమ్ముకునే దుస్థితి లేకుండా వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం ఎంతగానో ఉపయోగపడిందన్నారు.

కానీ.. ఈ ప్రభుత్వ హయాంలో

ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంటు నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని జగన్ ఆవేదన వ్యక్తంచేశారు. ఒక్క వైఎస్‌ఆర్ జిల్లాకు సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద 2010-11 బడ్జెట్‌లో *114కోట్లు ప్రతిపాదించారని, అయితే 80వేల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరాల్సిన ఈ పథకంలో ఇంతవరకు నిధులు విడుదల చేయకపోవడంతో ఒక్క విద్యార్థికి కూడా న్యాయం జరగలేదని అన్నారు. 2011-12 సంవత్సరం దగ్గర పడుతున్నా ఇంతవరకు నిధులు విడుదల చేయలేదంటే రాష్ట్ర ప్రభుత్వం తీరు ఎలా ఉందో ఇట్టే అర్థమవుతోందన్నారు.

ఒక్క రూపాయీ ఇవ్వలేదు..

‘ఇప్పటికి కూడా ఫీజు రీయింబర్స్‌మెంటు కింద ఎంతడబ్బులు ఇచ్చారని విద్యార్థులను అడిగితే ఒక్క రూపాయి కూడా రాలేదని చెప్పడం నన్ను బాధించింది’ అని జగన్ పేర్కొన్నారు. ఇలా పేద విద్యార్థులు, పేద ప్రజల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వానికి బంగాళాఖాతంలో కూడా కలిసే అర్హత లేదని విమర్శించారు. పేదలను పట్టించుకోని ప్రభుత్వానికి, పరిపాలించడానికి కూడా అర్హత లేదన్నారు. కమిషన్లు వేయడం తప్ప ముస్లిం మైనార్టీలకు ప్రభుత్వం చేసిందేమీ లేదని జగన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కదిరి నాయకులు ఎస్‌ఎండీ ఇస్మాయిల్, ఇమామ్ మౌలానా, ఇస్మాయిల్ సాహెబ్, ముఫ్తీ నిసార్ సాహెబ్ తదితరులతో పాటు కదిరి నియోజకవర్గంలోని సుమారు ఐదు వేల మంది ముస్లింలు వైఎస్ జగన్‌కు మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో ఉరవకొండ నేత విశ్వేశ్వరరెడ్డి, నంబులపూలకుంట జగదీశ్వరరెడ్డి, ముదిగుబ్బ చలమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వం కూలిపోతుంది
Jagansరాష్ర్టంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి బంగాళా ఖాతంలో కలిసే యోగ్యత కూడా లేదని కడప మాజీ ఎంపి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. పేద ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోని ఈ ప్రభుత్వం వారి ఉసురు పోసుకొని కూలిపోక తప్పదని శాపం పెట్టారు. అనంతపురం జిల్లా కదిరి నుంచి వచ్చి తనకు మద్దతు పలికిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనుద్దేశించి ఆయన మంగళవారం పులివెందులలో మాట్లాడారు. ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలి నిరంకుశంగా ప్రవర్తిస్తోందని ఆయన ఆరోపించారు. ఒక్క వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలోనే 2010-11 ఆర్థికసంవత్సరానికి సంబంధించి 114 కోట్ల రూపాయలు విద్యార్థులకు ఫీజు రీ ఎంబర్స్‌మెంట్‌ చెల్లించాల్సివుండగా ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా విడు దల చేయలేదని ఆరోపించారు.

సుమారు 80వేల మంది విద్యార్థులు దీని వల్ల లబ్ధి పొందుతారని, ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుం టోందని ఆందోళన వ్యక్తంచేశారు. తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించారని జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్ల విషయంలో గత ప్రభుత్వాలు కమిషన్లపై కమిషన్లు వేసి నాన్చుతుండే వన్నారు. అయితే ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించిన ఏకైక నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అని ఆయన చెప్పారు.

యువనేత వెంటే ఉంటా: ఇస్మాయిల్

జగన్ పార్టీ ప్రకటించగానే వందలాది మంది నాయకులు, కార్యకర్తలతో ఆ పార్టీలో చేరుతామని కదిరి నాయకుడు ఎస్‌ఎండీ ఇస్మాయిల్ ప్రకటించారు. తెలుగుదేశం మైనార్టీ సెల్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆయన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్‌లో చేరారు. వైఎస్ అకాల మరణంతో కాంగ్రెస్‌కు సైతం గుడ్‌బై చెప్పారు.

No comments:

Post a Comment