Tuesday, May 31, 2011

రైతు కన్నీరే మరణశాసనం .... * టీడీపీ, కాంగ్రెస్‌లకు వైఎస్ జగన్ హెచ్చరిక

సువర్ణ యుగంలో ప్రతి ఒక్కరికీ వైఎస్ ఉన్నారన్న భరోసా ఉండేది
వైఎస్ మరణించి రెండేళ్లవుతున్నా ప్రజలకు భరోసా ఇచ్చే నేతలే
కరువయ్యారు
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను విస్మరించి పేదల నడ్డి విరుస్తోంది
నాడు చంద్రబాబు 46 మంది
ఎమ్మెల్యేలతో వైఎస్ సువర్ణయుగంపై అవిశ్వాసం పెట్టారు
ఇప్పుడు 90 మంది ఎమ్మెల్యేలున్నా.. అవిశ్వాసం ెపెట్టనంటున్నారేం?
ఎందుకంటే అధికార కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారు కాబట్టి..
బాబూ... నిజంగా ప్రజలపై
ప్రేమే ఉంటే అవిశ్వాసం నోటీసివ్వు..
ఇచ్చి ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చెయ్!

  రైతులు, పేదల సమస్యలు కనీసం పట్టించుకోని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు.. ఆ రైతులు, పేదల కన్నీటి బొట్టే మరణ శాసనం రాస్తుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు. ‘ఇవాళ రాష్ట్రాన్ని చూస్తే అధ్వాన్న పరిస్థితిలో ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను పూర్తిగా విస్మరించి పేదవాడి నడ్డి విరిచేస్తోంది. ప్రతిపక్షమైనా మనవైపు నిలబడి పోరాడుతుందేమోనని అటువైపు ఆశగా కన్నెత్తి చూస్తే.. ఇవాళ మన ఖర్మకొద్దీ ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. పైకేమో ఇది చేతగాని ప్రభుత్వమనీ, అసమర్థ ప్రభుత్వమనీ తిడుతుం టారు. పేద వాళ్లకు మేలు చేయని ఈ అసమర్థ ప్రభుత్వం ఎందుకు ఉంచుతున్నావు..? అవిశ్వాసం పెట్టవయ్యా చంద్రబాబు నాయుడూ అంటే.. పెట్టను గాక పెట్టను అంటున్నారు.

ఒక్కటి చెప్తున్నా ఇవాళ... పేదవాడి కళ్లనుంచి వచ్చే ప్రతి కన్నీటి బొట్టు కాం గ్రెస్, టీడీపీలకు మరణ శాసనం రాస్తుంది’ అని జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. విజయనగరం జిల్లాలో మలివిడత 7 రోజుల ఓదార్పు యాత్ర సోమవారం విజయనగరం పట్టణంలో ముగి సింది. ఏడో రోజు యాత్ర ఉదయం కొమరాడ, పార్వతీపురం, బొబ్బిలి మండలాల్లోని గ్రామాల మీదుగా రాత్రి 9 గంటలకు జగన్ విజయనగరం చేరుకున్నారు. పట్టణంలోని కోట జంక్షన్‌లో ఏర్పాటు చేసిన ముగింపు సభకు జనం అంచనాలకు మించితరలివచ్చారు. అటు సింహాచలం మేడ నుంచి శంకరమఠం వరకు ఇటు మూడు లాంతర్ల జంక్షన్ నుంచి సత్యా లాడ్జి వరకు రోడ్లు జనంతో కిక్కిరిసిపోయాయి. ముగింపు సభకు భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి జగన్‌మాట్లాడారు. జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే..

అప్పుడెందుకు అవిశ్వాసం పెట్టావ్..

అయ్యా చంద్రబాబూ.. దివంగత మహానేత సువర్ణ పాలన సాగుతున్న రోజుల్లో కేవలం 46 మంది ఎమ్మెల్యేలతో అవిశ్వాసం పెట్టావు. ఆయన్ను గద్దె దింపాలని ప్రయత్నించావు. ఇవాళ మీకు 90 మంది శాసన సభ్యుల బలం ఉం ది... ఇవాళ ప్రతి రైతు సోదరుడు, ప్రతి పేదవాడు ఈ ప్రభుత్వం కూలిపోవాలని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.. ఇది చేతగాని ప్రభుత్వం అని మొసలి కన్నీళ్లు కార్చే బదులు అవిశ్వాసం పెట్టమని అడిగితే పెట్టవేం చంద్రబాబూ?.. ఎందుకు పెట్టవంటే నువ్వు ఆ అధికార కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యావు కాబట్టి.

ఈ డిమాండ్లు నెరవేర్చమని అడగండి..: చంద్రబాబు నాయుడూ నిజంగా నీకు ప్రజలపై ప్రేమే ఉంటే.. అవిశ్వాసం పెడతానని ప్రభుత్వాన్ని బెదిరించి ప్రజా సమస్యలు పరిష్కరించు. రైతులకు మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారు. మద్దతు ధర రావాలంటే కనీసం రూ.,2000 కోట్లు అవసరం. మీరు ప్రభుత్వానికి వారంరోజుల గడువిచ్చి రైతాంగానికి కావలసిన రూ.2,000 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేయండి. లేదం టే అవిశ్వాసం పెడతానని హెచ్చరించండి. ఈ రాష్ట్రంలో పేదరికం పోవాలంటే ప్రతి పేద కుటుం బంలో కనీసం ఒక్కరైనా ఉన్నత విద్య చదివి, డాక్టరో.. ఇంజనీరో.. అయితే ఆ కుటుంబంలో పేదరికం పోతుందని వైఎస్సార్ పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు పథకంపెడితే.. ఈ చేతగాని ప్రభుత్వం మూలంగా పేద విద్యార్థులు చదువులకు దూరమయ్యే అధ్వాన్న పరిస్థితి వచ్చింది.. ఆ పథకానికి బకాయిలతో కలిపి రూ.6,800 కోట్లు అవసరం పడుతుండగా ఈ చేతగాని ప్రభుత్వం కేవలం రూ.3,000 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులెత్తేసింది.

మొత్తం 6,800 కోట్లు ఇవ్వకపోతే అవిశ్వాసం పెట్టి ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తానని ఎందుకు చెప్పలేకపోతున్నారు చంద్రబాబూ? ప్రతి అక్కా, చెల్లెమ్మల మొఖాల్లో చిరునవ్వులు చూడ్డానికి వైఎస్ ప్రవేశపెట్టిన పావలా వడ్డీ పథకానికి బకాయిలతో కలిసి రూ. రెండు వేల కోట్లు కావాల్సి ఉంటే ప్రభుత్వం కేవలం రూ.400 కోట్లు ఇచ్చింది. ఇవాళ నేనడుగుతున్నా.. ఇదే చంద్రబాబు నాయుడు ఇదే సీఎంకు వారం రోజుల గడువిచ్చి ఇంకో రూ.1,600 కోట్లు ఇవ్వకపోతే మీ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతానని ఎందుకు చెప్పలేకపోతున్నారు? పైకి ఇది చేతగాని ప్రభుత ్వం అం టూ రోడ్లమీదకు వచ్చి మొసలి కన్నీళ్లు కారుస్తారు, లోపల కాంగ్రెస్ పెద్దలతో కుమ్మక్కై ఈ ప్రభుత్వం మీద అవిశ్వాసం పెట్టనుగాక పెట్టను అంటారు.

అప్పుడు భరోసా ఉండేది: ‘వైఎస్సార్ సువర్ణ పాలనలో రైతుల ధ్యాసంతా కూడా వ్యవసాయం చేయడంపైనే ఉండేది. ఈ ఏడాది కంటే వచ్చే ఏడాది ఇంకా మెరుగైన స్థాయిలో ధాన్యం ఎలా పండించాలని ఆలోచించేవారు. ఇవాళ ధాన్యం అమ్ముడుపోతుందా లేదా అని భయపడని రోజులు లేవు. వైఎస్ హయాంలో మద్దతు ధరకంటే రూ.200 ఎక్కువకే అమ్ముడుపోయిన రోజులు చూశాం. ఏ సమస్య వచ్చినా వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా.. అన్నీ ఆయనే చూసుకుంటాడన్న భరోసా ప్రతి రైతుకూ ఉండేది. ఇప్పుడు కనీస మద్దతు ధర కంటే రూ.200 తక్కువకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. వైఎస్సార్ సువర్ణ పాలనలో ప్రతి పేదవాడికీ కూడా.. ఇవాళ కాకపోతే రేపు నాకు ఓ పక్కా ఇల్లు కచ్చితంగా వస్తుందన్న భరోసా ఉండేది. ప్రతి అవ్వా ప్రతి తాతా కూడా వయసు పెరిగే కొద్దీ.. అయ్యో నేను ఎలా బతకాలీ అనే ఆలోచన నుంచి.. ఒక సంవత్సరం పెరిగితే ఏముందిలే.. అన్నీ చూసుకోడానికి మా ముఖ్యమంత్రిగా వైఎస్ ఉన్నాడన్న భరోసా ఉండేది.. ప్రతి తల్లీ అనుకునేదీ నా కొడుకు.. నా కూతురు మరో నాలుగేళ్ల తరువాత డాక్టరో.. ఇంజనీరో.. అవుతారు, ముసలి వయసులో మమ్ములను ఆదుకుంటారని. కారణం ఏమంటే వైఎస్ సీఎం స్థానంలో ఉన్నారనే భరోసా ఉండేది. విద్యార్థులకు తాను చదువు కచ్చితంగా పూర్తి చేయగలనన్న నమ్మకం ఉండేది. ఎవరికైనా ప్రమాదం జరిగితే 108 నంబర్‌కు ఫోన్ చేస్తే క్షణాల్లో అంబులెన్స్ వచ్చి మమ్మల్ని ఆసుపత్రికి తీసుకెళ్లి.. వైద్యం చేయించి బతికిస్తుందన్న భరోసా ఉండేది.

ఇప్పుడేదీ ఆ భరోసా?: జనహృదయనేత వైఎస్ మరణించి రెండేళ్లు అవుతోంది. ఇప్పుడు పేదలకు, రైతులకు మేమున్నామని భరోసా ఇచ్చే నేతలే కరువయ్యారు. పేదలు, రైతు సోదరుల సమస్యలను ఈ సర్కారు పట్టించుకున్నా.. పట్టించుకోకపోయినా, ప్రతిపక్ష స్థానంలో ఉన్న చంద్రబాబు గారు పట్టించుకున్నా.. పట్టించుకోకపోయినా, దేవుడు అనే వాడు ఉన్నాడు. పై నుంచి అన్నీ చూస్తున్నాడు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రతిపక్షం, పాలక పక్షం నాయకులకు డిపాజిట్లు కూడా దక్కకుండా ప్రజలు ఇంటికి సాగనంపుతారు. రెండు పార్టీలను బంగాళాఖాతంలో కలుపుతారు.’

1 comment: