![]() పార్టీకి మూడు రంగుల జెండా ఉంటుంది ఇడుపులపాయలో నాన్న పాదాల చెంత నేను, అమ్మ కలిసి ఆవిష్కరిస్తాం ఈ పార్టీ ఎలా ఉంటుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు ప్రతి పేదోడి మొహాన చిరునవ్వు చూసే పార్టీ అవుతుంది పార్టీ ప్రకటన కార్యక్రమం ఘనంగా నిర్వహించాలనుకున్నాం జిల్లాలో ఎన్నికల కోడ్ వల్ల అది వీలుకాలేదు కడప ఉప ఎన్నికలయ్యాక ఘనంగా సభ పెట్టుకుందాం ఎన్నికలయ్యాక ఇడుపులపాయలో రెండు రోజుల ప్లీనరీ మేధో మథనం చేసి పార్టీ విధివిధానాల రూపకల్పన మూడో రోజు అందరి సమక్షంలో వాటిని ప్రకటిస్తాం ![]() కోట్లాది మందిలో ఎన్నాళ్ల నుంచో నెలకొన్న ఉత్కంఠకు యువనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తెరదించారు. పేదల మోముల్లో చిరునవ్వులు చిందించడమే లక్ష్యంగా తాను ఏర్పాటు చేయబోయే పార్టీ పేరును ప్రకటించారు. తన తండ్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరిట ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’ని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహిని సాక్షిగా, అభిమానుల హర్షధ్వానాల మధ్య యువనేత పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. ఇన్నాళ్లూ ఇడుపులపాయలోనే పార్టీ పేరు ప్రకటిస్తారని అందరూ అనుకుంటున్న తరుణంలో.. ఇలా అనూహ్యంగా జగ్గంపేటలో ప్రకటించే సరికి అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేసింది. పార్టీకి మూడు రంగుల జెండా ఉంటుందని, దాన్ని శనివారం ఇడుపులపాయలో మహానేత వైఎస్సార్ పాదాల చెంత ఆవిష్కరిస్తామని జగన్ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా పీఆర్పీ అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, జిల్లా మహిళా రాజ్యం అధ్యక్షురాలు రొంగలి లక్ష్మి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తదితర ముఖ్యనాయకులు.. జగన్ పార్టీలో చేరుతున్నట్లు ఈ సభలో ప్రకటించారు. ‘ప్రజా పుష్కరం’గా నామకరణం చేసిన ఈ సభకు వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. సాయంత్రం 06:33 నిమిషాలకు జగన్ ప్రసంగించడానికి లేవగానే అభిమానులు చేతులు పెకైత్తి జేజేలు కొట్టారు. ఈ సందర్భంగా జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే..ప్రజా సంక్షేమ ప్రభుత్వ స్థాపన కోసం మరో సంవత్సరమో, రెండు సంవత్సరాలో జరుగబోయే పోరుబాటలో నాతోపాటు అడుగులో అడుగువేసి పోరాటం చేయడానికి ఇక్కడ ఒక్కటైన జ్యోతుల నెహ్రూ, దొరబాబు, పద్మమ్మలకు, ముఖ్యంగా జగ్గంటపే సోదరులందరికీ, అక్కా చెల్లెళ్లకు, అవ్వలకు, తాతలకు, మీ ప్రేమానురాగాలకు ఆప్యాయతలకు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరునా కృతజ్ఞతలు చెప్తున్నాను. పార్టీ తొలి కండువా నెహ్రూకే.. ఇవాళ నెహ్రూ అన్న చేరికలో ఓ ప్రత్యేకత ఉంది. అదేమిటంటే.. ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’ స్థాపించిన తర్వాత.. మొట్టమొదటి కండువా వేస్తున్నది జ్యోతుల నెహ్రూకే. తర్వాత పెండెం దొరబాబు, వాసిరెడ్డి పద్మలకే. ఈ రోజు ఇంకో ప్రత్యేకత కూడా ఉంది.. ఇక్కడే ఇంకో విషయం కూడా చెప్పాలనిపిస్తోంది.. రేపు(శనివారం) మధ్యాహ్నం 2:29 నిమిషాలకు ఇడుపులపాయలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదాల చెంతన పార్టీకి సంబంధించి మూడు రంగుల జెండాను నేను, నా తల్లి విజయలక్ష్మిగారు కలిసి ఆవిష్కరిస్తాం. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలనుకున్నా వైఎస్సార్ జిల్లాల్లో ఎన్నికల కోడ్ ఉంది.. ఎన్నికల నియమావళిని గౌరవించాలి.. కడప ఉప ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీ ఏర్పాటు కార్యక్రమాన్ని గొప్పగా వైఎస్సార్ పాదాల చెంతన జరుపుకొందాం.నేడే జగన్ పార్టీ | ||||||||
|
మహానేత మనసా వాచా ఆచరించి చూపించిన సంక్షేమ పథాన్నే జెండాగా మార్చుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
Friday, March 11, 2011
‘ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ’ * జగ్గంపేట సభ వేదికగా పార్టీ పేరు ప్రకటించిన వైఎస్ జగన్
Subscribe to:
Post Comments (Atom)






రాజకీయ అనిశ్చితితో అనాథగా మారిన రాష్ట్రానికి ఆశాకిరణంగా రాబోతున్న పార్టీ అది.. పార్టీ పేరేంటి? ఎప్పుడు? ఎక్కడ దాన్ని ప్రకటిస్తారు?.. అని జనమంతా ఎదురుచూస్తున్నారు. అయితే ఆ చరిత్రాత్మక ప్రకటనకు వేదికగా మారే అవకాశం తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట సభకు దక్కింది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం నచ్చని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ తదితరులు జగన్ పెట్టబోయే పార్టీలో చేరడానికి జగ్గంపేటలో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేశారు.
జ్యోతుల నెహ్రూ, వాసిరెడ్డి పద్మ తీసుకున్న నిర్ణయం శాస్ర్తీయమైనది. ప్రజల్లో నిరంతరం ఉండే జగన్ వెంట ఉంటామని వారు ప్రకటించారు. జగన్ పేరు చెబితేనే కొంత మంది ప్యాంట్లు తడిసిపోతున్నాయి. ఎవరొచ్చినా రాకపోయినా వైఎస్ సంక్షేమ పథకాలు అనుభవించిన వారి అండ జగన్కు ఉంటుంది. 


శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ పట్టణాల్లో పీసీసీ మాజీ కార్యదర్శి వజ్జ బాబూరావు ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి సందడి చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో పండుగ వాతావరణం కనిపించింది. కొన్నిచోట్ల యువకులు రోడ్లపైకి వచ్చి నృత్యం చేశారు. అనంతపురం జిల్లావ్యాప్తంగా బాణసంచా కాల్చి నూతన పార్టీకి స్వాగతం పలికారు. తిరుపతిలో చెవిరెడ్డి భాస్కరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ అభిమానులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కర్నూలు జిల్లాలోని ప్రధాన పట్టణాల తో పాటు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి ఇంటి వద్ద వైఎస్ అభిమానులు మిఠాయిలు పంచుకున్నారు. 
No comments:
Post a Comment